వైసీపీలో వైఎస్సార్ బ్రాండ్ మాయం!

దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అసలైన వారసులు ఎవరంటే కుమారుడు వైఎస్ జగన్ తో పాటు కుమార్తె షర్మిల కూడా నేనున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే, అసలైన వారసుడిగా జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన కొన్ని సంక్షేమ పనులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టాయి. వైఎస్ఆర్ పాలనపై నమ్మకం కుదిరిన వారే జగన్ కోరిన ఒక్క ఛాన్స్ నినాదానికి పడిపోయారు. ఏది ఏదైతేనేం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది వైఎస్ఆర్ కుమారుడిగానే. అందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, కట్టే ప్రతి నిర్మాణానికి ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడెప్పుడో కట్టిన వాటికి సైతం పేర్లు మార్చి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ నాలుగేళ్ళలో ఎప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లె స్థాయి కార్యకర్త నుండి సాక్షాత్తు సీఎం వరకు ఈ వేడుకలను ప్రత్యేకంగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఈ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించేవారు. ఇడుపులపాయను సుందరంగా అలంకరించి తమ నేతకు ఘన నివాళి అర్పించేవారు. కానీ, తాజాగా జులై 8న వచ్చిన వైఎస్ఆర్ జయంతిలో ఎక్కడా గతంలో స్థాయిలో జోష్ కనిపించలేదు. సాక్షాత్తూ ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్ రెడ్డే త‌న తండ్రి ఘాట్‌కు వెళ్లి పూలుచల్లి నివాళి అర్పించి అటు నుండి అటు పులివెందుల‌ ప‌ర్య‌టనకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 150 మంది ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించలేదు. రాయలసీమలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్నా చితకా సేవా కార్యక్రమాలు నిర్వహించగా   రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడా ఆ స్థాయి కార్యక్రమాలు కూడా లేవు. గ్రామాలలో అంతకు ముందు మూడేళ్లు కేక్ కటింగ్, స్వీట్లు పంచడం, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించగా ఈసారి దాదాపుగా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీలో వైఎస్ఆర్ మ్యానియా ఏమైందని సహజంగానే అనుమానాలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు, పెద్దలు కావాలనే ఈసారి వైఎస్ఆర్ జయంతిని పక్కన పెట్టారా? లేక అధిష్టానం చెప్పినా ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఆ పార్టీ శ్రేణులలోనే మొదలైంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం లేదు. అంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం ఇప్పుడు తెచ్చే పథకాలకు జగనన్న పేరు వచ్చేలా చూసుకుంటున్నారు., పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే కనిపిస్తుంది.. వినిపిస్తున్నది. బహుశా తండ్రి లెగసీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు తన సొంత ఇమేజ్ ప్రజలపై ఉండేలా చూడాలనే ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడూ అదే క్రమంలోనే వైఎస్ఆర్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా సోసోగానే చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. అయినా ఈసారి వైసిపీ ఆ పని చేయలేదు.  ఒకవైపు అధిష్టానం ఈ వేడుకలపై ఫోకస్ పెట్టకపోగా.. ఆ పార్టీలో ఇతర సమస్యల కారణంగా నేతలు కూడా మొహం చాటేసినట్లు కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత కుమ్ములాట‌లు, ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేక లైట్ తీసుకున్న వాళ్ళు కొందరు, తనకు ఈసారి టికెట్ వస్తుందనే ఆశలేని నేతలు కొందరు.. ఇలా ఎవ‌రికివారే మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న నెల్లూరు లాంటి జిల్లాలలో ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోవడం.. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తితో ఉండడం లాంటి కారణాలు కూడా  వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మమ అనిపించేయడానికి కారణంగా చెబుతున్నారు.  అయితే, అసలే ఎన్నికల సమయం కనుక కనీసం అధిష్టానం అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం చూస్తుంటే దీని వెనక వాళ్ళ ఆలోచన మరేదైనా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది.

మా నిధులు మీరెలా వాడేశారు.. జగన్‌పై కేంద్రం సీరియస్

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా తెచ్చిన అప్పులు పెరిగి ఇప్పుడు పెద్ద అనకొండలా మారిపోయాయి. రాష్ట్రంలో దెబ్బతిన్న అభివృద్ధి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకపోవడం, వైసీపీ నేతల తీరు కారణంగా పెట్టుబడులు పెట్టేవారు రాష్ట్రం వైపు చూడడమే మానేశారు. ఉన్న వాళ్ళలో కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేక పప్పు బెల్లం మాదిరి తలకి ఇంత చొప్పున చేసే పంపకాలు పెరిగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. మరో వైపు కరోనాతో దెబ్బతిన్న సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిపై భారీగా ధరల పెంపు పిడుగు పడడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉన్న ఆదాయం కూడా దిగజారిపోయింది. దీంతో ఏపీ పరిస్థితి ఆర్ధికంగా అగమ్యగోచరంగా మారిపోయింది.  ఏపీలో గత ఏడాది కాలం నుండి నెలా నెలా జీతాలకు, పెన్షన్లకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితి. గత రెండేళ్లుగా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒకటో తేదీన జీతం అందలేదు. కొందరైతే ఏ నెలకి ఆ నెల జీతం చూడడంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, బాండ్లు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, పలు దేవాలయాల ఆదాయాన్ని కూడా తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా పరిమితికి మించి అప్పులు చేసింది. ఇవి చాలవని వివిధ కార్పొరేషన్ల నిధులు, కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా తన ప్రభుత్వాన్ని నడిపేందుకు వాడుకున్నారు. అలాగా ఇప్పుడు కేంద్రం ఒక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వగా.. జగన్ ప్రభుత్వం దాన్ని సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల‌ను తక్షణమే సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.  కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించాల‌నే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ మధ్యనే అందుకోసం కేంద్రం నిధులకు కేటాయిస్తుంది. ఈ క్ర‌మంలో భాగంగా 90 శాతం నిధుల‌ను కేంద్రం ఇవ్వనుండగా 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాలి. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి, ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇస్తుండగా.. ఈ మధ్యనే పలు రాష్ట్రాలకు నిధులను జమ చేసింది. ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు మళ్లించింది. దీంతో కేంద్రం ఆగ్రహించింది.  కేంద్ర పథకానికి, పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులపై సమాచారం లేకుండా మల్లింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీసం జీవో కూడా లేకుండా రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఆ నిధులను సింగిల్‌ నోడల్‌ ఖాతాకు జ‌మ చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకసారి విడుదల చేసిన రూ.1879 కోట్లలో నుంచి రూ.639 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. నిజానికి ఈ పథకంలో భాగంగా రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా జమ చేయకపోవడం వలనే ఈ నిధులు అలా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇవ్వాల్సినని ఇవ్వకపోగా.. సమాచారం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నిధులను మళ్లించడం కేంద్రానికి కోపం తెప్పించింది.

పొత్తులపై జనసేన నేతల నోటికి పవన్ తాళం

ఏపీ రాజకీయాలలో అత్యంత హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ, జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహీ విజయయాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవగా.. దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు  పవన్ స్పష్టత ఇచ్చారు. పవన్ వారాహీ యాత్రలో తనను సీఎంను చేయాలని కోరడం.. అభిమానులు సీఎం నినాదాలు, మీరు తలచుకుంటే సీఎం అవుతానని, మీరు తనని సీఎం చేయాలని మాట్లాడడం, పలుచోట్ల అభ్యర్థులకు టికెట్ల హామీ ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కు తగ్గినట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ చానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని.. ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడంతో పొత్తు అంశం వెనక్కు వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండడంతో టీడీపీ సానుభూతిపరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే  పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా.. ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు, పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ.. సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దని కోరారట. అంతే కాదు,  పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ, పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దని.. ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట. పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. లోతుగా అధ్యయనం చేశాకనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ సంయమనం పాటించాలని చెప్పారట. అయితే, టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావడంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీచేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈ లోగా టీడీపీ-జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్ళకి తాళం వేసినట్లు భావించాల్సి వస్తుంది.

రణరంగం తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి vs కేతిరెడ్డి

తాడిపత్రిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు బజారుకెక్కి బూతులతో విరుచుకుపడే స్థాయికి చేరింది. ఏడాది క్రితం వేసిన చీనీ తోట మూడేళ్ళకు కాపుకు రావాల్సి ఉండగా   ఏడాదికే కాపు రాక నష్టపోయినట్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 13.89 లక్షల పంట బీమా కొట్టేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు చీనీ తోటలను పరిశీలించేందుకు కేతిరెడ్డి తోటకు వెళ్తానంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.  ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ వచ్చిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని.. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాదు పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.. ఆ పదవే ఇప్పుడు లేకపోతే జేసీని ఇంటిలో నుంచి బయటకి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పేవాడినని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వాడిని ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. కాగా, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆరోపణల పర్వం తాడిపత్రి పట్టణమంతా వ్యాపించింది. టీడీపీ, వైసీపీ వర్గాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలోని మిగతా టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు చినీ తోటకి కాపలా ఉన్నారు. దీంతో ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనేలా వాతావరణం మారిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏది ఏమైనా జేసీ వర్గం చీనీ తోటకి వెళ్లి సందర్శించి అసలు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలని చూస్తుంటే ఎమ్మెల్యే వర్గం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. అయితే, నిజానికి జేసీ ఆరోపించిన దానిలో నిజం లేకపోతే ఎమ్మెల్యే కేతిరెడ్డి భయపడాల్సిన పనిలేదు. మీడియాతో సహా ఓ హార్టికల్చర్ అధికారిని తీసుకుని చీనీ తోటకి వెళ్లి చూసుకుంటే అసలు నిజం తేలిపోతుంది. నిజంగానే పంట పెట్టి మూడేళ్లయినా కాపు లేక నష్టపోయి ఉంటే ఆరోపణలు చేసిన జేసీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. కానీ, అదేమీ లేకుండా అసలు తోటకి వెళ్లే వారిని అడ్డుకోవడం.. ఇలా వాడు వీడు అంటూ చెప్పుతో కొడతా అంటూ బూతులు లంకించుకోవడం చూస్తుంటే జేసీ ఆరోపణలే నిజమా అన్న భావన కలుగుతున్నది. ఓ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడంతో మరోసారి వైసీపీ నైజం ఇదేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మంత్రుల దగ్గర నుండి మహిళా ఎమ్మల్యేల వరకూ ఈ బూతు పురాణంలో చెడ్డపేరు తెచ్చుకోగా కేతిరెడ్డి వారి జాబితాలోనే చేరి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నారు. ఇక  తాడిపత్రిలో ఈ హీటెక్కిన రాజకీయం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

పవన్ కోరిన రూట్ మ్యాప్ పురందేశ్వరి ఇస్తారా?

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ మరోసారి అధికారం దక్కిచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే..  ప్రజలలో  పెరిగిన జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా  మార్చుకునేందుకు  ప్రతిపక్షాలు ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పాదయాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టగా.. బీజేపీ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో ఎన్నికల రోహిణీకార్తె వేడిని మించిపోయింది.  అయితే, ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అంశం ఏదైనా ఉందంటే అది పొత్తులే. ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకూ రాజకీయం ఒకలా ఉంటే ఒక్కసారి పొత్తులపై స్పష్టత వస్తే  ఆ తర్వాత ఉండే మజానే వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా.. సింగల్ గానే పోటీకి దిగుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే  బీజేపీ-జనసేన అధికారికంగానే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో ఉన్నా ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇప్పటంలో జనసేన సమావేశం.. ఆ తర్వాత ప్రభుత్వం కక్షసాధింపుతో ప్రజల ఇళ్లను ధ్వంసం చేయడం.. మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేపట్టడం అందరూ చూసిందే. కాగా  అప్పుడు అక్కడ జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని ఎదురుచూస్తున్నానని.. అది తనకు ఇస్తే ఏపీలో వైసీపీని గద్దె దించుతామని  స్పష్టం చేశారు. దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా సోము వీర్రాజు కౌంటర్ అయితే ఇచ్చారు కానీ పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మాత్రం  ఇవ్వలేదు.  ఇవ్వకుండానే ఆయన బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇ  మాజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న ఎన్నికలలో పొత్తులపై కూడా చర్చించారని అంటున్నారు. ఇక  ఆమె ఢిల్లీ నుంచి విజయవాడ  వచ్చి ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కనుక ఎలాగూ ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు ఆమెకి ఘనస్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధ్యక్షురాలిగా ఆమె తన వర్గాన్ని కూడా సిద్ధం చేసుకోవడం కామనే. ఎలాగూ అధిష్టానం చెప్పే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే  ఇప్పుడు పవన్ కి పురందేశ్వరి రోడ్ మ్యాప్ ఇస్తారా? ఈ రోడ్ మ్యాప్ బీజేపీకి నచ్చినట్లుగా ఉంటుందా లేక పవన్ కోరుకుంటున్నట్లుగా ఉంటుందా?  అన్నదే ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొదలైన దగ్గర నుండి ఎటు చూసినా దారులు వేరుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు టీడీపీ పేరు లేకుండా ఇదే మాట   ప్రకటించేశారు.  బీజేపీ మాత్రం ఆ విషయంలో  ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకుముందున్న అధ్యక్షుడైతే   టీడీపీని ప్రధాన శత్రువుగా చూసే వారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు? సోము వీర్రాజు టైంలో జనసేనతో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు తొలగిపోతుందా?.. జనసేన బీజేపీ కలసి తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయా అన్నది చూడాలి.

కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థల దృష్టి .. ప్రధాని

నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగం అందరూ ఊహించినట్లుగానే సాగింది. బీఆర్ఎస్ తో రహస్య మైత్రి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ మోడీ తన ప్రసంగంలో బీఆర్ఎస్ అవినీతిపై విమర్శల వర్షం కురిపించారు. తద్వారా ఆ విమర్శలన్నీ అవాస్తవాలని చెప్పడానికి ప్రయత్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని దనుమాడారు. ఆయన కుటుంబ అవినీతిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని చెప్పారు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లను బీజేపీ తుడిచిపెట్టేయడం ఖాయమని జోస్యం చెప్పారు. జనసంఘ్ కాలం నుంచే వరంగల్ బీజేపీకి కంచుకోట అని చెప్పిన మోడీ.. దేశ వ్యాప్తంగా బీజేపీకి రెండు సీట్లు ఉన్న సమయంలో వాటిలో ఒకటి గెలిచింది హన్మకొండ నుంచే అని గుర్తు చేశారు. కేంద్రంలోని తన సర్కార్ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నామని చెప్పిన ప్రధాని.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే తమ లక్ష్యమని స్పస్టం చేశారు. గతంత కేంద్రం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందనీ, అయితే రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు నాలుగే నలుగన్న ఆయన వాటిలో ఒకటి పొద్దున్న  నుంచి సాయంత్రం వరకూ మోడీని తిట్టడం, మరోటి కుటుంబం పార్టీని పెంచి పోషించడమేనని మోడీ అన్నారు. ఇక మూడోది తెలంగాణ ఆర్ధిక సుస్థిరతను నాశనం చేయడం చివరిగా నాలుగోది రాష్ట్రాన్ని అవినీతి ఊబిలో కూరుకుపోయేలా చేయడమని వివరించారు. కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ అని విమర్శించిన మోడీ..  తెలంగాణలో అవినీతి  ఆరోపణలు ఒక్క ప్రాజెక్టైనా ఉందా అని ప్రశ్నించారు. సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కోసం ఒప్పందాలు జరుగుతాయనీ, అయితే  ఇప్పుడు  తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు అవినీతి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.    ఏ ప్రయోజనాల కోసం రాష్ట్రం ఏర్పడిందో.. ఆ ప్రయోజనాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధించకుండా చేసిందని మోడీ విమర్శించారు.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.   

టీడీపీ-బీజేపీ పొత్తు పొడిచేనా?

ఒకవైపు బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని చూస్తున్నది. నిన్న మొన్నటి వరకూ కేంద్రంలో మూడో సారి అధికారంపై బీజేపీలో ఉన్న ధీమా  ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తుగా ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా అవునని చెప్పలేదు.. లేదని చెప్పలేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది. అదలా ఉండగానే  మాజీ మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేశారు. దీంతో ఈ పొత్తు కుదురుతుందా లేదా అని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పురందేశ్వరికి టీడీపీతో కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడితో కానీ ఎలాంటి సత్సంబంధాలు లేవన్నది తెలిసిందే. అందుకే ఆమె తెలుగుదేశం ను వీడి కాంగ్రెస ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో టీడీపీతో పొత్తు ఆశలు ఉన్నట్లయితే ఆమెని పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఎంపిక అయ్యేవారా  అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాదు అసలు టీడీపీతో పొత్తు అనే అంశాన్ని పక్కన పెట్టేందుకే పురందేశ్వరిని ఫోకస్ లోకి తీసుకొచ్చారని.. ఇటు జనసేనకు సైతం టీడీపీతో పొత్తు లేదనే సంకేతాలను ఇచ్చేందుకే పురందేశ్వరిని ఎంపిక చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే నిజమై టీడీపీ-బీజేపీ పొత్తు లేకపోతే ఎన్టీఆర్ వారసురాలు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఢీ కొనాల్సి వస్తుంది. అందుకు పురందేశ్వరి సిద్ధమయ్యే పార్టీ పగ్గాలు అందుకుంటే రాష్ట్రంలో ఫ్యామిలీ పొలిటికల్ వార్ చూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకవేళ పొత్తుకి సిద్ధమైతే పురందేశ్వరి, చంద్రబాబు పలు చోట్ల వేదికలు  పంచుకోవాలి.. కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తున్నది. అయితే  దగ్గుబాటి ,నారా కుటుంబాల మధ్య అప్పుడు ఉన్నంత వైరం ఇప్పుడు లేదు. కాలంతో పాటు ఈ కుటుంబాల మధ్య దూరం కూడా తగ్గింది. ఆ మధ్య ఓ కుటుంబ వేడుకలో రెండు కుటుంబాలు కలిసి మెలిసి మెలిగిన ఫోటోలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. కనుక రాజకీయం రాజకీయమే.. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే కనుక ఏమైనా జరగవచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది.  మరోవైపు బీజేపీ పెద్దలు జగన్ మోహన్ రెడ్డితో కూడా సత్సంబంధాలను వదులుకోవడం లేదు. నిజంగా టీడీపీతో పొత్తు ఆశలు ఉంటే బీజేపీ ఇప్పటికే వైసీపీతో రహస్య బంధాన్ని తెగదెంపులు చేసుకునేది. కానీ, ఇప్పటికీ అదే సీక్రెట్ లైన్ మైంటైన్ చేసింది. ఈ మధ్యనే సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ ఏమో తనకి సహకరిస్తే రాబోయే తన ప్రభుత్వంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం కల్పిస్తానని ఆఫర్లు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఏపీలో పొత్తు ఆలోచన చేస్తోందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే బీజేపీ నేతృత్వంలో ఈ నెల 18న  ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.  ఈ సమావేశానికి బీజేపీ తన పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని జాతీయ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నది. అందులో భాగంగానే టీడీపీకి సైతం ఆహ్వానం పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ ఆహ్వానం అందిన విషయాన్ని టీడీపీ ఇంకా ధృవీకరించలేదు. ఏది ఏమైనా ఈ సమావేశం తర్వాత కానీ ఏపీలో బీజేపీ-టీడీపీల అడుగులు ఎలా ఉండబోతున్నాయో తెలియదు.

జగనన్న సురక్ష.. ఎందుకీ శిక్ష

ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా ఆదరాబాదరా కార్యక్రమాలు, పథకాలను ప్రకటించేయడం.. క్షేత్ర స్థాయిలో వాటి అమలును పట్టించుకోకపోవడం జగన్ సర్కార్ కు పరిపాటిగా మారిపోయింది. రాబోయే ఎన్నికలే తమ ప్రభుత్వానికి రక్షణ కవచాలుగా  ఉపయోగపడతాయన్న భావనతో ఏపీ సర్కార్ తీసుకువచ్చిన  జగనన్న సురక్ష కార్యక్రమం కూడా అదే కోవలోకి చేరిపోయింది. ఆ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన సచివాలయ ఉద్యోగులే ఏమిటీ శిక్ష అని విసుగు చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థ జగన్ మానస పుత్రిక అన్న సంగతి విదితమే. ఆ  గ్రామ, వార్డు సచివాలయ  ఉద్యోగులే  జగనన్న సురక్ష కార్యక్రమం పట్ల అనాసక్తిగా ఉన్నారు. అది తమకొక శిక్షగా భావిస్తున్నారు.   ఈ కార్యక్రమం కింద అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా అందజేస్తామన్న ప్రభుత్వం అయితే ఆర్భాటంగా ప్రకటించేసింది. అయితే  క్షేత్రస్థాయిలో  మాత్రం ఈ పథకం పేరుతో  స్టేషనరీ దుర్వినియోగం తప్ప మరేం జరగడం లేదని జనం విమర్శిస్తున్నారు.  ఎవరికి ఏ సర్టిఫికెట్ అవసరమో అది మాత్రమే.. ఆ అవసరం అయిన వారికి ఉచితంగా అందజేయాలి. అయితే క్షేత్ర స్థాయిలో  ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏమిటి? అన్నది ఎవరికీ అర్ధం కాకుండా జరుగుతోంది. వాలంటీర్లు  ఇష్టారీతిగా దరఖాస్తులను తెచ్చి సచివాలయ ఉద్యోగులకు అందజేయడం.. క్షేత్ర స్థాయి పరిశీలనలో అవన్నీ నకిలీవనో, అవసరం లేకపోయినా ఏదో పని చేస్తున్నామని అనిపించుకోవడానికి తెచ్చిన దరఖాస్తులుగా తేలడం.. పై అధికారులు మాత్రం సచివాలయ ఉద్యోగులపై ఇదేంటి? అదేంటి? ఇంకా దరఖాస్తుల మేరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదా అంటూ ఒత్తిడి తేవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో జగనన్న సురక్ష కార్యక్రమం కాదు కానీ ఇదే మాకో శిక్షగా మారిపోయిందని సచివాలయ సిబ్బంది తలలు కొట్టుకుంటున్నారు.   వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరిద్దామన్నా వారు వినే పరిస్థితిలో లేకుండా ఎంత సేపూ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావడమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికైనా జిల్లా కలెక్టర్  జగనన్న సురక్ష పథకం పేర క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతును పరిశీలింది.. అవసరమైన వారి నుంచే వాలంటీర్లు దరఖాస్తులను స్వీకరించి తమకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. 

పురంధేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆ  తరువాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను  కాపాడతానంటూ దగ్గుబాటి పురందేశ్వరి ట్విట్ చేశారు. ఆ ట్వీట్ పై ఏపీలో విస్తృత చర్చ మొదలైంది. అటు సామాజిక మాధ్యమంలోనూ.. ఇటు ప్రింట్, ఎలక్ట్రినిక్ మీడియాలోనూ కూడా పురందేశ్వరి కాపాడే రాష్ట్ర ప్రయోజనాలేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కానీ.. ఆ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కానీ...  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు  ఏం చేశారు? ఏం సాధించారన్నది అందరికీ తెలిసిందే. వారి వల్ల రాష్ట్రానికి వీసమెత్తు ప్రయోజనం చేకూరలేదన్నది ఆంధ్రుల భావన. అలాంటి వేళ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి చేపట్టనుండడం... రాష్ట్రప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తాననడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014లోనే అటు రాష్ట్ర విభజన, ఇటు ఎన్నికలు కాస్తా అటు ఇటుగా జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టింది. నవ్యంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ఏర్పాటు కోసం అన్వేషణ.. ఆ క్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తూళ్లురు ప్రాంతాన్ని ఎంపిక చేసి.. అక్కడి 29 గ్రామాల రైతులను ఒప్పించడం.. భూమిని సమీకరించడం.. మరోవైపు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకోవడం చకచకా జరిగి పోయాయి.  అంతలోనే విభజన బిల్లులో ముందుగా స్పష్టం చేసిన అంశాల్లో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అలాగే పలు అంశాల్లో మోదీ ప్రభుత్వం తిరకాసు పెట్టింది. వాటికి సైతం చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకొని.. ముందుకు సాగుతోన్నారు. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలు  వచ్చాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు.. వైసీపీ అధినేత  జగన్‌కు పట్టం కట్టారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొన్ని రోజులకే.. అధికార వీకేంద్రీకరణ కోసమంటూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకీ తీసుకొచ్చారు.  దీంతో రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన అలజడి మొదలైంది. ఆ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కి.. ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు చేపట్టారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం.. తన పట్టు వీడలేదు. అలా జగనన్న నాలుగేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని అడిగినా.. పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎప్పటికి పూర్తి అవుతాయి అని అడిగినా.. అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్లుగా మూడు రాజధానులు  సమాధానంతో పరిపుచ్చారు. సరే.. కార్యనిర్వాహక రాజధాని విశాఖ ,  న్యాయ రాజధాని కర్నూలులో ఎప్పటి నుంచి పనులు ప్రారంభమవుతాయన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.   మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షరాలిగా  పురందేశ్వరి బాధ్యతలు చేపట్టనున్నారు.  రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని అంటున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటమంటే..  నవ్యంధ్రకు ఏకైక రాజధాని అమరావతి  సాధిస్తారా? అలాగే విభజన బిల్లులో స్పష్టం చేసిన అన్ని అంశాలు అమలు అయ్యే విధంగా.. అవసరమైతే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలపై ఒత్తిడి తీసుకు వస్తారా? అలా రాష్ట్రాభివృద్ధి కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. పురందేశ్వరీ తన వంతు ప్రయత్నాలు చేసి నవ్యంధ్ర రాష్ట్రాభివృద్ధిలో తనదైన శైలిలో బలమైన  ముద్రలు వేస్తారా? అనే ప్రశ్నలు సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

స్పీడ్ న్యూస్ 1

1.టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అల్లూరులో లోకేశ్ కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 2.ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీయేతర రాష్ట్రాలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. శుక్రవారం ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ లలో పర్యటించిన ప్రధాని.. శనివారం ఉదయం తెలంగాణలోని వరంగల్ కు చేరుకున్నారు. ప్రముఖ భధ్రకాళీ దేవాలయంలో ప్రధాని ప్రార్థనలు చేశారు.  3.రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఆదిపురుష్' చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన రోజు నుంచి సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.  4.స్టార్ కపుల్ నయన తార - విఘ్నేశ్ శివన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆస్తి వివాదానికి సంబంధించి పోలీసులను ఆశ్రయించిన విఘ్నేశ్ శివన్   స్వంత  బాబాయిలు నయనతార పేరును కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 7.టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకునే లక్ష్మిపై కొందరు మహిళలు తాజాగా దాడి చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో అయిదుగురు మహిళలు ఒక్కసారిగా వచ్చి ఆమెపై దాడికి దిగారు. 8.సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి రైతులను కలుసుకున్నారు. పొలంలో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. 9.పంచాయతీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్‌లో మరోమారు హింస చెలరేగింది. నలుగురు టీఎంసీ కార్యకర్తలు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. 10.దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ టెర్రరిజం.. బాబు ట్వీట్

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?  రోజుకో ఘోరం, పూటకో దారుణం జరుగుతోంది. వాటి వెనుక అధికార పార్టీ లేదా ప్రభుత్వం  ఉంటోంది.  అంటే  రాష్ట్రంలో ప్రభుత్వమే టెర్రర్ సృష్టిస్తోంది. రోడ్డు కావాలని అడిగిన కానిస్టుబుల్ సస్పెండ్ అవుతాడు. పెన్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన మహిళపై కేసు పెడతారు. బకాయిలు చెల్లించమని అడిగిన వ్యాపారులపై వైసీపీ మూకలు దాడులు చేస్తారు. ఈ పరిస్థితుల్లో జనం ఏం చేయాలి? ఏం కావలి. రాష్ట్రం నుంచి పారిపోతేనే బెటర్ అనుకునే పరిస్థితులలోకి జనాన్ని నెట్టేసింది జగన్ సైకో పాలనకు చరమగీతం పాడాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పురనరుద్ధరణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి. ఇదీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాదులు, సామాన్య ప్రజానీకం ముక్త కంఠంతో చెబుతున్న మాట. అవే మాటలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు.   బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడి..బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు.   రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి కేసు పెట్టారు.  సస్పెండ్ చేశారు.  అంతా నా ఇష్టం అడిగేదెవడురా అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందని చంద్రబాబు ఆ ట్వీట్ లో మండిపడ్డారు. అయితే ఈ జగన్ అరాచక పాలన మరెంతో కాలం సాగదనీ, శిశుపాలుడి వంద తప్పులులా జగన్ పాపాలు కూడా పండాయనీ, వచ్చే ఎన్నికలలో జనం గట్టి గుణపాఠం చెప్పడం తథ్యమనీ చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య కేసులో స్వయంగా జగన్  సంబధీకులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ, అవినాష్ రెడ్డిని కాపాడేందుకు స్వయంగా సీఎం తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో ఆయనకు సంబంధమ వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? వంటి వాటినన్నిటినీ పక్కన పెడితే అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా?  అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇందుకు వైసీపీ గూండాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   రాష్ట్రంలో ఎక్కడ ఏ దారుణం జరగినా, దళితులపై మహిళలపై అఘాయిత్యాలు జరిగినా వాటి వెనుక ఉంటున్నది మాత్రం వైసీపీ వారేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ టెర్రరిజానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. వీటన్నిటినీ ప్రస్తావిస్తూ చంద్రబాబు తాజాగా చేసిన ట్వీట్ లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీ తెలంగాణ పర్యటన.. బీజేపీలో కనిపించని జోష్!

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీలో ఎలాంటి హడావుడీ కనిపించడం లేదు. నిన్న మొన్నటి దాకా ఎన్నికలు జరగడమే తరువాయి.. అధికారంలోకి వచ్చేది మేమో అన్న స్థాయిలో హంగామా చేసిన తెలంగాణ బీజేపీ నేతలలో ఒక్క సారిగా నిశ్శబ్దం ఆవరించింది. కొత్తగా పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ గా నియమితులైన ఈటల, మాజీ అధ్యక్షుడు బండి ఏదో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మోడీ పర్యటనను సక్సెస్ చేయాలని పిలుపునిస్తున్నారే కానీ పార్టీ క్యాడర్ లో మాత్రం ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు. కర్నాటక ఎన్నికల ఫలితానికి తోడు.. తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన పేరుతో హైకమాండ్ ఇటీవల చేసిన మార్పులు తోడు కావడంతో బీజేపీ క్యాడర్ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. మొదటి నుంచీ పార్టీలోనే కొనసాగుతూ.. రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు, ఉత్సాహం తీసుకువచ్చేలా వరుస కార్యక్రమాలతో బీఆర్ఎస్ ను బెంబేలెత్తించిన బండికి అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికి.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన ఈటలకు ప్రమోషన్ ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అలాగే గతంలో రెండు సార్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసినా పార్టీ ఎదుగుదల విషయంలో పెద్దగా ప్రభావం చూపని కిషన్ రెడ్డికి మళ్లీ పార్టీ పగ్గాలు ఇవ్వడంపై కార్యకర్తలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.   అన్నిటికీ మించి బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందనడానికి ఈ మార్పులు దోహదం చేశాయన్న భావన పార్టీలో అత్యధికుల్లో ఏర్పడిందని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలనూ, ఆ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తరచూ విమర్శలతో విరుచుకుపడి.. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు దోహదపడిన బండి సంజయ్ ను అర్ధంతరంగా తప్పించడం పట్ల మెజారిటీ కార్యకర్తలలో అసంతృప్తి నెలకొంది. అలాగే లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ కుమార్తె కవితకు ఆయాచితంగా దక్కుతున్న ఊరటపైనా బీజేపీ శ్రేణుల్లో పై స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం కేసులో  కవిత వినా అందరూ అరెస్టయ్యారు. కవితను ఈడీ, సీబీఐలు విచారించాయి. ఈడీ అయితే ఏకంగా ఆమె ఫోన్లనూ స్వాధీనం చేసుకుంది. చార్జిషీట్లలో ఆమె పేరూ ప్రస్తావించింది. అంతే అక్కడితో కవిత విషయంలో ఈడీ, సీబీఐలు  సైలెంట్ అయిపోయాయి. మరో వైపు ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లో మగ్గుతున్నారు.  ఆ కారణంగానే బీఆర్ఎస్, బీజేపీల మధ్య లాలూచీ ఉందా అన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనకు వచ్చి వరంగల్ లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయన వరంగల్ సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగే అవకాశాలున్నాయి. ఆయన ఎంత ఘాటుగా బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలు గుప్పించినా ప్రజలు మాత్రం విశ్వసించే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

హిందుపురంలో బాలయ్య విజయం నల్లేరుమీద బండి నడకే

ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని లేదు.. ఏపీలోని   175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి మొదలైన అసమ్మతి గళం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకూ వ్యాపించింది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైసీపీ కూర్చున్న కొమ్మను నరుక్కునే కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని అత్యంత కీలకమైన హిందూపురం అసెంబ్లీ సెగ్మంట్లో వైసీపీ వర్గపోరు తార స్థాయికి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుస్తూ వస్తున్న బాలకృష్ణను ఈ సారి ఎలాగైనా ఓడించాలన్నది సీఎం జగన్ టాస్క్ గా పెట్టుకున్నారు. అయితే నియోజకవర్గంలోని క్షేత్ర స్థాయి పరిస్థితులు మాత్రం జగన్ టాస్క్ నెరవేరేందుకు ఎంత మాత్రం అనుకూలంగా లేవు. హిందుపురం ఇన్ జార్జీ, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఇక్బాల్ కు నియోజవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోంది. ఆ వ్యతిరేకత సొంత వైసీపీ నుంచే కావడంతో నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీనికి తోడు ఇక్బాల్  వ్యతిరేక వర్గం ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించింది.  పార్టీ ఇన్ చార్జి తీరును గర్హిస్తూ నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్బాల్ వ్యతిరేక వర్గం వినతి పత్రం కూడా సమర్పించింది. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడకుండా ఉండాలంటే ఈ హిందూపురం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ నుంచి పోటీ చేయడమొక్కటే మార్గమని ఇక్బాల్ వ్యతిరేక వర్గం వారు గట్టిగా చెబుతున్నారు. తమ డిమాండ్ జగన్ చెవికి చేరే వరకూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని అంటున్నారు.   నియోజకవర్గంలో  నవీన్ నిశ్చల్, ఇక్బాల్ ల మధ్య వర్గపోరు  తీవ్రంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్బాల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  ఆయన ఓటమికి వర్గపోరే కారణమని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా ఇక్బాలే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరో సారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.  దీంతో నవీన్ నిశ్చల్ వర్గీయులు ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అందుకు ప్రతిగా  ఇక్బాల్ వర్గం కూడా ప్రతి చర్యలు మొదలు పెట్టింది. దీంతో హిందూపురం నియోజకవర్గంలో నిత్యం వైసీపీ వర్గ పోరు విపక్షాలకు ఆనందాన్ని కలిగిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు తోడు వైసీపీలో విభేదాలు హిందుపురంలో వైసీపీని నామమాత్రంగా మార్చేశాయని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇక్కడ నందమూరి బాలకృష్ణ విజయాన్ని నల్లేరుమీద బండినడకగా మార్చేస్తాయని చెబుతున్నారు. ఇక్బాల్ స్థానంలో మరో ఇన్ చార్జిని నియమించి వైసీపీ అధిష్ఠానం నష్ట నివారణకు చర్యలు చేపట్టినా.. ఇప్పటికే ఆలస్యమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

నిన్నటి వరకూ జగన్.. ఇప్పుడు అవినాష్.. వైనాట్ 175

వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకి 175కి 175 సీట్లు ఖాయమని సీఎం   జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ముఖ్యమంత్రి  జగన్‌నే ఆదరిస్తున్నారని చెప్పారు.    గురువారం (జూన్ 6) పులివెందుల బాకరాపురం సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఎన్ని మాయ మాటలు చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారంటూ సోదరుడిపై అవినాష్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. సీఎం జగన్‌ను ఎవరు ఏమీ చేయలేరన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలే.. ఆయన్నిమరోసారి ముఖ్యమంత్రి చేస్తాయని   అవినాష్ రెడ్డి క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.  అయితే అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై   నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గత ఎన్నికల వేళ.. మీ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారని... ఆ హత్య కేసులో మీరు, మీ తండ్రి  భాస్కరరెడ్డిలు  రోపణలు ఎదుర్కొంటున్నారని.. అయితే తెరచాటు రాజకీయం చేసి.. మిమ్మల్ని రక్షిస్తోంది ఎవరో.. ప్రతీ ఒక్కరికి తెలిసిన బహిరంగ రహస్యమేనని వారు పేర్కొంటున్నారు.  వివేకా హత్య కేసుకు ముగింపు చెప్పకుండా.. దోషులు ఎవరో అధికారికంగా ప్రకటించకుండా.. వారికి శిక్షలు పడకుండా.. మీరు ఎన్నికలకు వెళ్లితే జరిగే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ముందుగా వాటికి సిద్దంగా ఉండాలని కడప ఎంపీ   అవినాష్ రెడ్డికి నెటిజన్లు హితవు పలుకుతున్నారు.   హత్య కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి.. అప్రూవర్‌గా మారి సీబీఐ ఏదుట హత్య జరిగిన తీరు తెన్నుల నాటి నుంచి నిన్న మొన్నటి వరకు అంటే.. మీ తల్లిగారి అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మీరు అక్కడే ఉండిపోవడం... ఆ సమయంలో సీబీఐ, మీరు ఆడిన దొంగా.. పోలీస్ ఆట మాత్రం.. చాలా రసవత్తరంగా సాగిందంటూ వైయస్ అవినాష్ రెడ్డిపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.    మరోవైపు 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి, వైయస్ వివేకా హత్యల వెనుక నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉందంటూ నాటి ప్రతిపక్ష నేత   జగన్.. స్వయంగా ఆరోపణలు  గుప్పించారని.. అలా ఆ ఎన్నికల్లో గెలిచిన మీరు.. ఈ కేసులో నిజా నిజాలు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేని స్థితిలో ఉండిపోవడం నిజంగా సిగ్గు చేటని అంటున్నారు.  మరి ఈ కేసులో దోషులు ఎవరో తేలకుండా..  ఎన్నికలకు వెళ్లితే.. మీకు, మీ పార్టీకే నష్టమని... ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివేకా హత్య కేసు దర్యాప్తునకు ముగింపు పలకాలని వారు సూచిస్తున్నారు. ఈ హత్య కేసులో దోషులు ఎవరో తేలి... వారికి కఠిన శిక్ష పడితే..  వరుసగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై   జగన్ కూర్చుంటారని వారు ఢంకా భజాయించి మరీ చెబుతుండడం విశేషం.   ఇక గత ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. రాష్ట్ర ప్రజలే కాదు.. వైయస్ జగన్ తల్లి, సోదరి వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల తదితరులంతా ఒక్కటై   జగన్ వెంటే అడుగులో అడుగు వేసి నడిచారని.. కానీ నేడు వారంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో మీ కోసం, మీ పార్టీ కోసం ఐ ప్యాక్‌ తప్ప రంగంలోకి దిగేవారు ఎవరు ఉన్నారంటూ   అవినాష్‌రెడ్డిని నెటిజన్లు సూటిగా ప్రశ్నస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడకే అవుతోందా? అనేది ఒక్క సారి మనస్సాక్షిని అడగాలంటూ   కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నెటిజన్లు సూచిస్తున్నారు. అయినా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండి.. సొంత బాబాయి హత్య కేసు... నేటికి తెలకపోవడం చూస్తుంటే.. మీ గొయ్యి మీరే తవ్వుకొన్నట్లుగా ఉందనే ఓ చర్చ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. ఈ విషయాన్ని కాస్త శ్రద్ద పెట్టి పరిశీలించాలంటూ  నెటిజన్లు సూచిస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ మళ్లీ కాంగ్రెస్ కే.. పీపుల్స్ సర్వే వెల్లడి

ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎలా చూసినా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ అని చెప్ప వచ్చు. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలే ఛత్తీస్ గఢ్ లో మరోసారి అధికార పగ్గాలు అందుకునేది హస్తం పార్టీయే అని తేలింది. మూడ్ ఆఫ్ ఛత్తీస్ గఢ్ పేరిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వే మేరకు కాంగ్రెస్ పార్టీ 53 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, బీజేపీ 20 నుంచి 27 స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందన్నది సర్వే ఫలితం. 90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో  అధికారం చేజిక్కించుకోవడానికి కావలసిన స్థానాలు 46. ఆ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.  2018 ఎన్నికల్లో 43.03 ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈ సారి   46 శాతం ఓట్లు దక్కించుకుంటుందని  సర్వే పేర్కొంది. 2018 ఎన్నికల్లో 33 శాతం ఓట్లు పొందిన బీజేపీ ఈ సారి కొంత మెరుగు పడి 5 శాతం అధిక ఓట్లతో 38 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. 2018  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలు గెల్చుకుంది. అయితే ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం  బీజేపీ ఛత్తీస్ గఢ్ లో మరో సారి అధికారానికి దూరమయ్యే పరిస్థితులే ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. వరుసగా రెండో సారి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్‌ అధికారం చేపడుతుందని సర్వే తేల్చింది.   ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల్‌ పాలనపై ప్రజల్లో సానుకూలత ఉండడమే కారణమని పేర్కొంది. బీజేపీ జాతీయత, హిందుత్వ అంశాలకు ప్రత్యామ్నాయంగా సీఎం భూపేష్‌ ఛత్తీస్‌గఢ్‌ ఆత్మ గౌరవం అంశంలో భాగంగా ‘ఛత్తీస్‌గఢ్‌ మాతారి’, ‘గదో నవా ఛత్తీస్‌గఢ్‌’ వంటి నినాదాలు ప్రజలను ఆకర్షించాయని సర్వే తేల్చింది.   ప్రభుత్వం స్థానిక పండుగలకు గుర్తింపు ఇచ్చి సెలవులు ప్రకటించడం, ఛత్తీస్‌గఢ్‌ ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం, రాష్ట్ర గీతం ‘‘అర్ప`పైరి కి ధర్‌’’ ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేశాయి. అన్నిటికీ మించి  2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు  బెన్‌ ములాఖత్  పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్‌ విజయానికి దోహదపడుతున్నాయని సర్వే పేర్కొంది. 

పవన్ పై పర్సనల్ అటాక్ .. లీగల్ యాక్షన్ కు జనసేన రెడీ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ విజయ యాత్ర ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఆయన క్రేజ్ పెరిగింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పవన్ ఎండగడుతూ వారాహీ యాత్ర కొనసాగగా.. వైసీపీ ఉక్కిరి బిక్కిరై కౌంటర్ అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పుకోలేని స్థితిలోవైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం మొదలు పెట్టారు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే స్కూల్ పిల్లల ముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన లేవనెత్తగా.. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే బాటలో పవన్ పై వ్యక్తిగత దాడి మొదలు పెట్టారు. అది మరీ శృతి మించి పవన్ ఇప్పుడు మరోసారి భార్యకు దూరంగా ఉంటున్నాడని.. ఈమెకు కూడా విడాకులు ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దాడికి దిగిన వారిపై ఇప్పుడు జనసేన చర్యలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారంపై, జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది.. చిందిస్తోంది. వారిపై లీగల్ యాక్షన్ తీసుకొనేందుకు సైతం సిద్ధమైంది. పవన్ వ్యక్తిగత జీవితంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వైసీపీ నేతలపై జనసేన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. వైసీపీకి చెందిన నాయకుల సోషల్ మీడియా అకౌంట్లు, దుష్ప్రచారం చేస్తున్న కార్యకర్తలతోపాటు, ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న యూ ట్యూబ్ ఛాన్సల్, పలు మీడియా సంస్థలపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్లు జనసేన  ప్రకటించింది.  జనసేన  లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ పేరుతో జనసేన పార్టీ విడుదల చేసిన   ప్రెస్ నోట్ లో ఏఏ ఛానెల్స్, ఏఏ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా చర్యలు తీసుకోబోతుందో ప్రకటించింది. ఈ లిస్టులో ప్రముఖ వెబ్ పోర్టల్స్ ఉన్నాయి.  వైసీపీ నేతల విషయానికి వస్తే ఆ పార్టీ అధికార ప్రతినిథి నాగార్జున యాదవ్,  వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న అనితా రెడ్డి తదితరులు ఈ లిస్టులో ఉన్నారు. ఏపీ పారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిజిటల్ డైరెక్టర్, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి దేవేంద్ర రెడ్డి, గుర్రంపాటి తదితరులకు కూడా లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు జనసేన ప్రకటన ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినెవాతో విడాకులు తీసుకున్నారంటూ మొదలు పెట్టిన ఈ ప్రచారానికి, వైసీపీ మద్దతుదారులు, వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్స్ తీవ్రంగా ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ అసత్య ప్రచార  దాడి శృతి మించి కొనసాగుతుండటం,   ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులతో ఒకరకంగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండటంతో  ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న జనసేన ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, నేర పూరిత కుట్ర.. తదితర సెక్షన్ల కింద చట్ట పరమైన చర్యలకు సంసిద్ధమవుతోంది. అయితే, అధికార పార్టీపై లీగల్ యాక్షన్ కి సిద్దమవుతున్న జనసేన ఈ అంశంలో ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నదో తెలియదు కానీ.. సోషల్ మీడియా కట్టడికి మన దగ్గర స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. ఈ క్రమంలో వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న వైసీపీపై న్యాయపోరాటం అంటే అంత సులభం కాదు. మరి జనసేన ధీమా ఏంటో చూడాల్సి ఉంది. కాగా, ఒకసారి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత సదరు సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లకు ఇబ్బందులు తప్పదు. మరి వైసీపీ అనుకూల వర్గం ఈ ఇబ్బందుల నుండి ఎలా బయటపడతారన్నది కూడా చూడాల్సి ఉంది.

ఎన్నికలే టార్గెట్.. బీజేపీకి జగన్ బంపర్ ఆఫర్లు?

ఏపీలో రానున్న ఎన్నికలు వైసీపీకి చావో రేవో అన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే.. జగన్ పాలనను ఏపీ ప్రజలు మెచ్చినట్లు రెఫరెండం. జగన్ ఆశించినట్లుగానే మూడు రాజధానులకు ప్రజలు కూడా సిద్ధమేనని వైసీపీ బల్ల గుద్ది చెప్పుకోవచ్చు. ఐదేళ్ల కాలంలో జగన్ తీసుకొచ్చిన పథకాలు మహా గొప్పవిగా ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అదే ఓడితే జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశాం.. ఇక చాలు పొమ్మని సాగనంపినట్లే. భవిష్యత్ లో కూడా మరో చాన్స్ అని అడిగే అవకాశం మూసుకుపోయినట్లే. మూడు రాజధానుల నిర్ణయం నుండి తన పాలనలో తీసుకొచ్చిన విధానాలు, తన పనితీరు వంటివాటినన్నిటినీ  ఏపీ ప్రజలు తిరస్కరించినట్లే లెక్క. అందుకే ఈసారి మాయ చేసి.. మంత్రమేసి అయినా మళ్ళీ అధికారం దక్కించుకోవాలని సీఎం జగన్ ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికలకు కేంద్రం సాయం కోసం జగన్ తాపత్రయపడుతున్నారు. తాజాగా సీఎం జగన్ రెండు రోజులు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జగన్ బీజేపీ పెద్దలను కలిసి పలు విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధుల మంజూరు నుండి విభజన హామీల వరకు ఈ భేటీలో చర్చించినట్లు ఏపీలో వైసీపీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే, జగన్ ఢిల్లీ టూర్ వెనక వేరే కారణం ఉందని రాజకీయ వర్గాలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నాయి. రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రం సాయాన్ని కోరిన సీఎం జగన్.. ఈ పర్యటనలో బీజేపీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికలలో తనకు సాయం చేస్తే.. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని బీజేపీకి జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.  రానున్న ఎన్నికలలో ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా ఖరారైంది. అప్పుడప్పుడూ పొత్తు ఉంటుందా అనేలా అనుమానాలు కలిగిస్తున్నా.. రెండు పార్టీలు పొత్తుకు సుముఖంగానే ఉన్నటు ఆ రెండు పార్టీల నేతలే సన్నిహితులతో చెప్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ సమస్యలపై కలిసే కదం తొక్కుతున్నాయి. అయితే.. టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిసి కూటమి అవుతుందా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. నిజానికి ఏపీలో బీజేపీ ఓట్లు లేవు. సీట్లు వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. కానీ కేంద్రంలో అధికారం ఉంది కనుక అంతో ఇంతో సాయంగా ఉంటుందనే టీడీపీ-జనసేనలు బీజేపీని కలుపుకుపోవాలని  భావిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే వారిని కలుపుకుపోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.  అయితే  ఏపీలో బీజేపీ స్నేహం టీడీపీతోనా? వైసీపీతోనా అన్నదే తేలాల్సి ఉంది. బీజేపీ పొత్తు సస్పెన్స్ కొనసాగుతుండగానే ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ బీజేపీ పెద్దల ముందు భారీ ప్రతిపాదనలే  పెట్టినట్టు తెలుస్తుంది. గత ఐదేళ్లుగా వైసీపీ బీజేపీతో రహస్య చెలిమి చేస్తూనే.. కేంద్రం తీసుకొనే ప్రతి నిర్ణయానికి ప్రత్యక్షంగా  మద్దతు ఇస్తూ వస్తున్నది. ఇకపై కూడా కేంద్రం తనకు మద్దతుగా ఉండాలని కోరిన జగన్.. అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం.  వైసీపీ-బీజేపీ ప్రత్యక్ష పొత్తు లేకుండా.. బీజేపీ ఒంటరిగానే పోటీచేయాలని.. రాష్ట్రంలో బీజేపీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా.. కేంద్రం తనకు అండగా ఉండి మళ్ళీ గలిపిస్తే.. తన ప్రభుత్వంలో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఇస్తామని జగన్ ఆశ చూపినట్లు చెప్తున్నారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ కలిపి పార్లమెంటులో ఇప్పుడు వైసీపీకి 46 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. టీడీపీ-వైసీపీలలో రానున్న ఎన్నికలలో ఎవరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారో చెప్పలేం. కనుక ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని వ‌దులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉండే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా  అసలు ఓట్లే లేని రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కుతాయన్న ఆశ ఒకటి. 2014 ఎన్నికలలో ఇదే విధంగా  తెలుగుదేశం బీజేపీకి మంత్రిపదవులు ఇచ్చింది. పొత్తులో భాగంగా నాలుగు అసెంబ్లీ సీట్లను కూడా అప్పట్లో బీజేపీ గెలుచుకుంది.   ఎన్నికల తర్వాత జగన్ అడ్డం తిరుగుతారా అంటే ఆయన జుట్టు ఇప్పుడు ఉణ్నట్లుగానే అప్పుడు కూడా కేంద్రం చేతిలోనే ఉంటుంది.   ఇన్ని ప్లస్సు పాయింట్లు ఉన్న అవకాశాన్ని బీజేపీ వదులుకుతుంటుందా అని పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకలో అధికారంలో ఉండీ, అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నా విజయం సాధించలేకపోయిన బీజేపీ.. ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీని నమ్ముకుని ముందుకు అడుగేస్తుందా అన్న అనుమానాలను సైతం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ జగన్ ఆఫర్ లను అంగీకరించి.. రాష్ట్రంలో జగన్ పార్టీ ఓడిపోతే అప్పుడు పరువు మంటగలిసిపోతుందన్న భయం కూడా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోందంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలలో కూడా ఫలితం అటూ ఇటైతే రెంటికీ చెడ్డ రేవడలా పరిస్థితి మారిపోతుందన్న జంకు కూడా బీజేపీలో కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ ఏపీ విషయంలో ఎటూ తేల్చుకోలేని డైలమాలో ఉందంటున్నారు. 

వచ్చిందమ్మా వీరనారి..!

వాసిరెడ్డి పద్మ.. తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ప్రస్తుతం.. ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం (జూలై 5) మహిళ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. వాసిరెడ్డి పద్మ ఈ సదస్సులో  సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న వారిని రోడ్డుపైకి లాగి తంతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడి, అసభ్యకర యుద్దానికి సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ప్రతీ శుక్రవారం మహిళల ఆత్మగౌరవ దినోత్సవంగా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎవరినైనా లక్ష్యంగా చేయాలనుకుంటే వారి కుటుంబంలోని మహిళలను బయటకు లాగి ఆశ్లీల చిత్రాలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని వివరించారు. బయట సమాజంలో ఇలా మాట్లాడితే రోడ్డుపైనే తంతారని చెప్పారు. న్యాయవ్యవస్థ, పోలీసులు ఈ సమస్య తీవ్రతను గుర్తించాలని సూచించారు.  మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టాలంటేనే భయపడే రోజులు రావాలని వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా అసభ్యకర పోస్టులు పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులను హత్యా నేరం కంటే తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. అయితే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించ లేదని చెప్పారు.   అయితే వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తనదైన శైలిలో స్పందించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత నిద్రలేచిన మహిళా కమిషన్.. వాసిరెడ్డి పద్మ అంటూ వ్యంగ్యంగా అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై దాడి అనేది ఆమెకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తి చూపితే సోషల్ మీడియాలో మహిళల వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేస్తున్నారో వాసిరెడ్డికి పద్మకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల్లోని మహిళలను టార్గెట్‌గా చేసుకొని సమాజం సిగ్గుపడేలా ఎవరు పోస్టులు పెడుతున్నారో ఈ చైర్ పర్సన్‌కు అవగాహన లేదా అంటూ చురకలంటించారు. సోషల్ మీడియలో కూలీలను పెట్టి మరీ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారంటూ అధికార జగన్ పార్టీపై సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు.  మరోవైపు వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై  నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ఓ మహిళ కమిషన్ ఉందని.. తామకు ఈ నాలుగేళ్లలో ఇప్పటి వరకు తెలియదని వ్యంగ్యంగా అన్నారు. గత నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బండ బూతులు మాట్లాడారని.. ప్రతిపక్ష పార్టీల అధినేతలను వారి ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. అటు మీడియాలో .. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చెలరేగిపోయారని.. నేటికీ సోషల్ మీడియాలో వారిని మానసికంగా దెబ్బ తీసేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా సాక్షిగా ఆడిస్తున్న తాంత్రిక యుద్ధ తంత్రం నీచంగా.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోనే విధంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేనని.. మరి అప్పుడు స్పందించని ఈ మహిళా కమిషన్..? తాజాగా తెరపైకి వచ్చి.. అసభ్యకర యుద్ధానికి ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలు బాధితులవుతున్నారంటూ  పేర్కొంటున్నారని.. దీనిని ఎలా చూడాల్సి ఉందని నెటిజన్లు ప్రశ్నించారు.   ఇంత కాలం.. వివిధ పార్టీల్లోని మహిళలు, ఆ పార్టీల అధినేతల ఫ్యామిలీలను టార్గెట్‌గా చేసుకొని.. సాగించిన ఈ యుద్ధంతో.. సదరు పార్టీల అధినేతల ఫ్యామిల్లోని స్త్రీల మనస్సులు ఎంతగా కలత చెంది కల్లోలంగా మారాయో.. ఓ  మహిళగా మీకు అర్థం కాలేదా? కనీసం ఓ మానవత్వం ఉన్న మనిషి అయినా.. ఆ నాడే మీరు.. మీ పెద్దరికాన్ని నిలుపుకున్నట్లుగా .. ఫ్యాన్ పార్టీలోని ప్రజా ప్రతినిదులను, లక్షలాది రూపాయిలు వెచ్చించి.. ప్రత్యర్ధి పార్టీలపై నిప్పు లేకుండానే పొగలు సృష్టించే సోషల్ మీడియా వింగ్‌ను సమావేశ పరిచి.. ప్రతిపక్ష పార్టీల అధినేతలే మన టార్గెట్.. అంతేకానీ వారి ఫ్యామిలీలు కాదు.. వారి జోలికి వెళ్లకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడడండంటూ ఓ పెద్దరికంతో కూడిన ఓ సలహా, ఓ సూచన నాడే మీరు చేసి ఉంటే.. నేడు.. మీరు .. ఇలా సీఎం కుటుంబంలోని మహిళలు బాధితులుగా మారుతున్నారంటూ.. ఇటువంటి సదస్సు ఏర్పాటు చేయడం.. ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారంలా మహిళలను గౌరవించే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటివి ఉండేవి కావని నెటిజన్లు ఈ సందర్బంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన.. నాటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాసిరెడ్డి పద్మ.. పవర్ పుల్ మహిళ కమిషన్ చైర్మన్ గిరి దక్కగానే.. మబ్బుల చాటుకు వెళ్లిన చంద్రుడిలా మారిపోయారని నెటిజన్లు  సెటైర్లు వేస్తున్నారు. అధికారం కోసం.. రాజకీయ పార్టీల నడుమ జరుగుతోన్న యుద్దానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని.. అసభ్యకర కథనాలకు వండి వారుస్తున్న సంగతి మీకు తెలినిది కాదనీ.. అందుకే ఈ సదస్సుకు రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదని.. వాటిని ఆహ్వానించి ఉంటే.. అధికార పార్టీ రంగు  బట్టబయలు అయి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా.. రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న ఈ యుద్దంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలను పిలవడం ఎంత వరకు సబబు అని నెటిజన్లు ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మను ప్రశ్నిస్తున్నారు.  సోషల్ మీడియో జరుగుతోన్న ఈ వ్యవహారంతో తమకు, తమ ప్రభుత్వానికి ఏ మాత్రం బంధం, అనుబంధం, సంబంధం లేదని.. ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వడం కోసం.. వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు ఈ వీరనారి వాసిరెడ్డి పద్మ.. ఐ ప్యాక్ అదేశంతో ఈ సదస్సు నిర్వహించినట్లుగా అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.