
Irumudi: రవితేజ 'ఇరుముడి'లో రెండు అయ్యప్ప పాటలు.. గూస్బంప్స్ గ్యారెంటీ!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సరికొత్త సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. క్లాస్ మరియు మాస్ ఎలిమెంట్స్ను సమానంగా మేళవించి సినిమాలను తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు "ఇరుముడి" (Irumudi) అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టైటిల్తోనే వైవిధ్యతను చూపించిన ఈ సినిమా, భక్తి మరియు యాక్షన్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక విలక్షణమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా బిజినెస్ పరంగానూ, క్రేజ్ పరంగానూ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. రవితేజ మార్కెట్ స్టామినాకు తగినట్లుగా శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్ను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు మ్యూజిక్ లవర్స్లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కథా నేపథ్యానికి తగ్గట్టుగా జి.వి. ప్రకాష్ ఈ సినిమా కోసం రెండు అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన అయ్యప్ప స్వామి భక్తి గీతాలను స్వరపరిచినట్లు తెలుస్తోంది. సాధారణంగానే అయ్యప్ప స్వామి పాటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరో నటిస్తున్న సినిమాలో ఈ తరహా సాంగ్స్ పడితే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. జి.వి. ప్రకాష్ కంపోజ్ చేసిన ఆ రెండు పాటల్లో "బంగారు పల్లకి" అనే సాంగ్ ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో విపరీతంగా ట్రెండ్ అవుతోందని, ఈ ట్రాక్ ప్రేక్షకులకు ఒక సరికొత్త గూస్బంప్స్ ఇచ్చే మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ను అందించబోతోందని టాక్ బలంగా వినిపిస్తోంది. రవితేజ కెరీర్లో భక్తిరస ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ రావడం చాలా అరుదు. అందుకే దర్శకుడు శివ నిర్వాణ ఈ "ఇరుముడి" చిత్రాన్ని కేవలం భక్తి చిత్రంగానే కాకుండా, రవితేజ మార్క్ కమర్షియల్ హంగులు, అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ డ్రామాతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన రోజు నుంచే ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రవితేజ మాస్ ఇమేజ్కు, శివ నిర్వాణ క్లాసిక్ టేకింగ్కు, అలాగే జి.వి. ప్రకాష్ మ్యాజికల్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లనుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు సినిమా కథాగమనంలో అత్యంత కీలకమైన సందర్భంలో వస్తాయని, ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు సంబంధించి కూడా మేకర్స్ ఇప్పటికే పక్కా ప్లానింగ్తో ఉన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ "ఇరుముడి" చిత్రాన్ని రాబోయే ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఎనర్జీకి, జి.వి. ప్రకాష్ అందించిన భక్తి గీతాల మ్యాజిక్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఈ క్రేజీ మ్యూజికల్ అప్డేట్తో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
Jun 10, 2026 12:22PM
Vijay: భారతీరాజాకి నివాళులు అర్పించిన దళపతి విజయ్.. చివరి కోరిక తీరకుండానే
లెజండ్రీ దర్శక శిఖరం భారతీరాజా(Bharathiraja)ఈ రోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈ వార్త తెలియగానే కోలీవుడ్తో పాటు మొత్తం దక్షిణ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నలభైకి పైగా అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించి, ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులని సొంతం చేసుకున్న ఈ మహోన్నత దర్శకుడి మరణం సినీ రంగానికి తీరని లోటుగా మారింది. ఇళయ దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన బిజీ షెడ్యూల్ని పక్కనబెట్టి భారతీరాజా నివాసానికి చేరుకున్నారు. విజయ్ రాకతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మరింత భావోద్వేగంగా మారింది. భారతీరాజా భౌతికకాయాన్ని చూసిన విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి.భారతీరాజా పాదాలకి నమస్కరించి, నివాళులర్పించారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే మౌనంగా ఉండిపోయిన విజయ్, ఆ తర్వాత భారతీరాజా కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజాను గట్టిగా కౌగిలించుకుని ఓదార్చారు. ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతూ, తమ కుటుంబం ఎల్లప్పుడూ తోడుంటుందని భరోసా ఇచ్చారు. Also read: Bharathiraja: భారతీరాజా అంటే... గుర్తొచ్చేది ఏంటో తెలుసా! విజయ్ మరియు భారతీరాజా మధ్య కేవలం దర్శకుడు, నటుడి బంధమే కాకుండా ఒక బలమైన కుటుంబ అనుబంధం కూడా ఉంది. విజయ్ కెరీర్ ప్రారంభంలో ఆయన తండ్రి, దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్తో భారతీరాజాకి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. విజయ్ ఎదిగిన తీరుని భారతీరాజా ఎప్పుడూ అభినందిస్తూ ఉండేవారు. 2020లో వచ్చిన ఒక సూపర్ హిట్ చిత్రంలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ పంచుకోవాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అయినప్పటికీ, విజయ్ నటనని , ఆయనకున్న 80 శాతానికి పైగా ఉన్న భారీ మాస్ ఫాలోయింగ్ను భారతీరాజా పలు ఇంటర్వ్యూలలో ప్రశంసించారు. ఒక గ్రామీణ నేపథ్య కథతో విజయ్తో సినిమా చేయాలనేది భారతీరాజా చివరి కోరికలలో ఒకటిగా ఉండేదని సినీ వర్గాలు అంటుంటాయి. భారతీరాజా భౌతికకాయానికి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Jun 10, 2026 12:15PM
Bharathiraja: భారతీరాజా అంటే... గుర్తొచ్చేది ఏంటో తెలుసా!
సినిమా అనే పదానికి సరికొత్త వయసుని, వన్నెని తెచ్చిన దర్శకుడు భారతిరాజా(Bharathiraja)ముఖ్యంగా తమిళ సినిమా చరిత్రలో సరికొత్త విప్లవానికి తెరతీసిన లెజెండరీ. గత కొంతకాలంగా వయోభారం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సినిమాని నాలుగు గోడల స్టూడియో సెట్ల నుంచి బయటకు తీసుకువచ్చి, పచ్చని పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ సంస్కృతిని వెండితెరకి పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఇంటర్ క్యాస్ట్ ప్రేమలకి కూడా ఆద్యుడు. ప్రెజెంట్ ఆ ఫార్ములాతో ఇండియా వైడ్ గా ఎవరు సినిమాని తెరకెక్కించినా, భారతి రాజా ఎప్పుడో తెరకెక్కించాడని గుర్తు చేసుకుంటారు. అందుకే సినీ లోకం ఎంతో గౌరవంగా ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శకుల శిఖరం) అని పిలుచుకుంటుంది. ఆయన మరణవార్త తెలియగానే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను విషాద ఛాయలు అలముకున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు భారతీరాజా నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. భారతీరాజా సినీ ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. 1977లో వచ్చిన '16 వాయతినిలే' (తెలుగులో 'పదహారేళ్ళ వయసు') చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా, సూపర్ స్టార్ రజనీకాంత్ విలన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులని సృష్టించడమే కాకుండా, తమిళ సినిమా గమనాన్నే మార్చేసింది. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన కెరీర్ లో 40 కి పైగా చిత్రాలని అద్భుతంగా తెరకెక్కించారు. కిళక్కే పోగుం రైల్, సికప్పు రోజాక్కళ్, అలైగళ్ ఓయ్వతిల్లై, ముదల్ మరియాదై వంటి క్లాసిక్ చిత్రాలు ఆయన కలం నుండి జాలువారినవే. కేవలం దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా కూడా ఆయన రాణించారు. Also read: Balakrishna: ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే..పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్ ఇటీవల ధనుష్ నటించిన బ్లాక్బస్టర్ సినిమా 'తిరుచిత్రాంబలం' (తెరు) మరియు 'మహారాజ' చిత్రాలలో ఆయన నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మోహన్లాల్ సరసన నటించిన 'తుడరుమ్' ఆయన చివరి స్క్రీన్ అప్పీయరెన్స్ కాగా, ఇంకా విడుదల కాని 'పులవర్' చిత్రం నటుడిగా ఆయనకు చివరి సినిమా కానుంది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తన కెరీర్ లో 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు ఒక నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం. అయితే, గత కొద్ది కాలంగా భారతీరాజా వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. మార్చి 2025 లో ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. కుమారుడి మరణం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప దార్శనికుడిని కోల్పోయింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన అమర చిత్రాలు తరతరాల సినీ ప్రేమికులని అలరిస్తూనే ఉంటాయి. తెలుగులో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక మూవీకి ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డుని గెలుచుకుంది. బాలకృష్ణ నుంచి వచ్చిన మంగమ్మగారి మనవడుకి కథని, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ప్లేని అందించారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో జన్మించిన భారతీరాజా వయసు 84 సంవత్సరాలు.
Jun 10, 2026 11:53AM
Balakrishna: ఈ రోజు బాలకృష్ణ బర్త్ డే..పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
ఈ రోజు ఆంధ్రా అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, యువరత్న,నటసింహ, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, హిందూపురం ఏంఎల్ఏ బాలకృష్ణ పుట్టినరోజు. అభిమానులకి పండుగరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల వేదికగా బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తన ట్వీట్ లో 'వెండితెరపై పవర్ఫుల్ నటనతో అలరిస్తూ, రాజకీయాల్లో హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ ప్రజాసేవలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా ఉంటూ, వేలాది మంది పేద క్యాన్సర్ రోగులకి ఉచితంగా, రాయితీలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ ఆపన్నహస్తంగా నిలవడం అభినందనీయం. సినిమాలకే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన బాలయ్య బాబు, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇరువురి అభిమానులని అలరిస్తుంది. Also read: Peddi: నష్టాల దిశగా నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకు మించి?
Jun 10, 2026 11:21AM
Peddi: నష్టాల దిశగా నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకు మించి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన వన్ మాన్ షో పెద్ది(Peddi)తో సందడి చేస్తున్నాడు. సందడి చేస్తుండటమే కాకుండా కధాంశంతో పాటు కొన్ని క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ద కనపర్చలేదనే మాటలు వస్తున్నా చరణ్ మాత్రం తన ఒంటి చేత్తో పెద్దిని ముందుకు నడిపిస్తున్నాడు. పెద్ది రిలీజ్ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తున్నప్పటికీ, నాన్, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లలో మాత్రం ఊహించని విధంగా తీవ్ర నిరాశజనకమైన లెక్కల్లో ఉంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ మరియు విదేశీ మార్కెట్లలో భారీ నష్టాల దిశగా అడుగులు వేస్తునట్టుగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఫస్ట్ వీకెండ్ ముగిసేనాటికి 'పెద్ది' చిత్రం హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడింది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన పెద్ది నాలుగు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లని సురక్షితమైన లాభాల జోన్లోకి తీసుకెళ్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్, బోర్డర్ దాటితే మాత్రం పూర్తిగా చతికిలపడింది. ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఆశించిన స్థాయిలో కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. Also read: Janhvi kapoor: జాన్వీకపూర్కి మరో భారీ మూవీలో ఛాన్స్.. సినిమానే కాబట్టి భయపడకండి ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ చరణ్ కెరీర్లోనే అత్యధిక రేట్స్ పలికాయి. నార్త్ అమెరికాలోనే ఏకంగా 7 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఐదో రోజు నాటికి ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదో రోజు విదేశాలలో కేవలం కోటి మాత్రమే వసూలు చేయడంతో, ఓవర్సీస్ మొత్తం గ్రాస్ 47 కోట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో విదేశీ మార్కెట్లలో బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు అసాధ్యమని, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. ఫైనల్ గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల అండతో పెద్ది గట్టెక్కినప్పటికీ, నాన్, తెలుగు, ఓవర్సీస్ బయ్యర్లకు మాత్రం షాక్ ఇచ్చిందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
Jun 10, 2026 10:54AM
Janhvi kapoor: జాన్వీకపూర్కి మరో భారీ మూవీలో ఛాన్స్.. సినిమానే కాబట్టి భయపడకండి
జాన్వీకపూర్(Janhvi kapoor)ప్రస్తుతం పెద్దితో కలిసి థియేటర్స్ లో సందడి చేస్తుంది. సందడి చేస్తుండటమే కాదు గత ఏడాది 'దేవర'తో విజయాన్ని అందుకున్న జాన్వీ ఇప్పుడు పెద్దితో కూడా విజయాన్ని అందుకుంది. దీంతో తన అప్ కమింగ్ తెలుగు ప్రాజెక్ట్స్ న్యూస్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 'తుంబాడ్' వంటిభయానక చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాహి అనిల్ బర్వే దర్శకత్వంలో జాన్వీ ఒక సరికొత్త హారర్ డ్రామాలో నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. జాన్వీ తన ప్రీవియస్ చిత్రాలైన గుంజన్ సక్సేనా', 'మిలీ', 'గుడ్లక్ జెర్రీ' వంటి విభిన్న కథాంశాలతో గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా నటిగా తనలోని ప్రతిభని నిరూపించుకుంది. ఇప్పుడు రాహి అనిల్ బర్వే కాంబినేషన్లో రాబోతున్న మూవీ కేవలం ఒక సాధారణ దెయ్యం కథలా కాకుండా, సరికొత్త క్రియేచర్ బేస్డ్ భయానక చిత్రంగా (జీవి-ఆధారిత భయానక కథ) రూపొందనుందని సమాచారం. ఈ సినిమాని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'జియో స్టూడియోస్' అత్యంత భారీ బడ్జెట్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం జాన్వీతో జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని ఇన్సైడ్ టాక్. బాలీవుడ్లో కమర్షియల్ హిట్లు లేకపోయినా విభిన్నమైన సబ్జెక్టులని ఎంచుకునే జాన్వీ, ఈ క్రియేచర్ హారర్ మూవీలో చేస్తే కెరీర్కి మైలురాయిగా మారుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ హారర్ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Jun 10, 2026 10:29AM
దర్శకుడు భారతీరాజా మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ శైలితో, అద్భుతమైన కథాంశాలతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సీనియర్ దర్శకులు భారతీరాజా (Bharathiraja) కన్నుమూశారనే వార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అపార సినీ నష్టాన్ని జీర్ణించుకోలేక ఇటు ఇండస్ట్రీ వర్గాలు, అటు అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారతీరాజా మృతి పట్ల భావోద్వేగంతో స్పందించారు. భారతీరాజా గారు ఇకలేరనే చేదు వార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఒక భావోద్వేగ ప్రకటనను విడుదల చేశారు. తమిళ, తెలుగు చలనచిత్ర రంగాలు రెండింటిపైనా భారతీరాజా గారు వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని ఆయన కొనియాడారు. సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేసే భారతీరాజా మేకింగ్ స్టైల్ గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెండితెరపై స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో, పల్లెటూరి ప్రజల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయన శైలి అత్యంత ప్రత్యేకమైనదని కొనియాడారు. కేవలం పల్లెటూరి వాతావరణమే కాకుండా, మానవ ప్రేమానుబంధాలను మరియు టీనేజ్ వయసులో ఉండే సహజమైన ఆకర్షణలను తెరపై అత్యంత సున్నితంగా, అందంగా చూపించడంలో భారతీరాజా ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. కమర్షియల్ హంగుల కంటే కథలోని ఎమోషన్నే నమ్ముకుని ఆయన తీసిన సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారతీరాజా సృష్టించిన అద్భుతాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారతీరాజా తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన క్లాసిక్ ప్రేమకావ్యం ‘సీతాకోకచిలుక’ సినిమాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రం విడుదలై ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ప్రతి ఒక్కరూ చూడదగ్గ ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఆనాటి కాలంలో ‘సీతాకోకచిలుక’ చిత్రంలోని మధురమైన పాటలు, గుండెలను పిండేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించాయో, నేటికీ ఆ మ్యాజిక్ అలాగే ఉందని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీగా నిలిచిపోవడానికి భారతీరాజా అద్భుత విజనే కారణమన్నారు. అంతేకాకుండా, తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో భారతీరాజా రూపొందించిన ‘ఆరాధన’ చిత్రం గురించి పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. చిరంజీవి గారిలోని సరికొత్త నటుడిని బయటకు తీస్తూ భారతీరాజా గారు మలిచిన ఆ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందిందని, ఇప్పటికీ ఆ సాంగ్ వింటే సంగీత ప్రియులు పరవశించిపోతారని గుర్తుచేశారు. ఒకవైపు సున్నితమైన ప్రేమకథలు, భావోద్వేగపూరితమైన సెంటిమెంట్ కథలను తెరకెక్కిస్తూనే, మరోవైపు ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టిన ఘనత భారతీరాజా గారికే దక్కుతుందని ప్రశంసించారు. వర్సటాలిటీకి ఆయన నిలువెత్తు రూపమని, ఆయన మరణం సినిమా రంగానికి తీరని లోటని చెప్తూ, భారతీరాజా గారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. https://x.com/PawanKalyan/status/2064553849286009076
Jun 10, 2026 10:14AM
Peddi: పెద్ది ఆరు రోజుల కలెక్షన్స్.. 200 కోట్ల క్లబ్లో చేరుతుందా?
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా "పెద్ది" (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో, ఒక అణగారిన వర్గానికి చెందిన యువకుడు ఆటల ద్వారా తన జాతి గొంతుకను ఎలా వినిపించాడనే ఎమోషనల్ పాయింట్తో వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకుల గుండెలను హత్తుకుంది. థియేటర్లలో మెగా మాస్ జాతరను చూపిస్తూ వీకెండ్లో భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, వీక్డేస్లో కూడా తన జోరును కొనసాగిస్తూ సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుండటంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల రచ్చ గట్టిగానే నడుస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రయాణాన్ని పరిశీలిస్తే, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే నంబర్స్ కనిపిస్తున్నాయి. రిలీజ్కు ముందే క్రేజ్ క్రియేట్ చేసిన పెద్ది, కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఏకంగా 18.50 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో 51 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించి రామ్ చరణ్ గ్లోబల్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఆ తర్వాత రెండవ రోజు శుక్రవారం 26.90 కోట్లు, మూడవ రోజు శనివారం 28.85 కోట్లు, నాల్గవ రోజు ఆదివారం 31.90 కోట్ల రూపాయలతో మొదటి వీకెండ్లోనే 157.15 కోట్ల రూపాయల అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేసింది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ గట్టి పట్టు సాధించి ఐదో రోజు 12.05 కోట్ల రూపాయలను ఖాతాలో వేసుకుంది. ఇక అత్యంత కీలకమైన ఆరవ రోజు కూడా పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరమైన ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,500 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం, ఆరవ రోజున 9.65 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఐదో రోజుతో పోలిస్తే కలెక్షన్లలో 19.9 శాతం స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, మంగళవారం రోజున ఈ స్థాయి హోల్డ్ సాధించడం విశేషం. లాంగ్వేజ్ వైజ్ చూసుకుంటే ఆరవ రోజు వచ్చిన 9.65 కోట్లలో కేవలం తెలుగు వెర్షన్ నుండే అత్యధికంగా 7.75 కోట్ల రూపాయలు రావడం గమనార్హం. అలాగే హిందీ వెర్షన్ 1.65 కోట్లు, తమిళ్ వెర్షన్ 15 లక్షల రూపాయల సహకారాన్ని అందించాయి. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నాడు 27.12 శాతం అక్యుపెన్సీ నమోదు కాగా, ఈవెనింగ్ మరియు నైట్ షోలకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ ఆరవ రోజు వసూళ్లతో కలిపి, భారతదేశం అంతటా పెద్ది సాధించిన మొత్తం నెట్ కలెక్షన్లు 179.35 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో అతి త్వరలోనే ఈ చిత్రం ఇండియాలో 200 కోట్ల నెట్ క్లబ్లోకి అధికారికంగా అడుగుపెట్టేందుకు కేవలం 20 కోట్ల దూరంలో నిలిచింది. దేశీయంగా ఈ సినిమా సాధించిన గ్రాస్ కలెక్షన్లు ప్రస్తుతం 213.23 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లోనూ పెద్ది తన హవాను కొనసాగిస్తోంది. ఆరవ రోజున అంతర్జాతీయ మార్కెట్ నుండి మరో 1 కోటి రూపాయలను రాబట్టడంతో, ఓవర్సీస్ మొత్తం గ్రాస్ వసూళ్లు 48 కోట్ల రూపాయలకు చేరాయి. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వసూళ్లను కలుపుకుంటే, పెద్ది చిత్రం కేవలం 6 రోజుల్లోనే ఏకంగా 261.23 కోట్ల రూపాయల భారీ వరల్డ్వైడ్ గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటేసి సరికొత్త ప్రభంజనం సృష్టించింది.
Jun 10, 2026 10:01AM
Bharathi Raja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత.. మరణం వెనుక అసలు కారణం అదేనా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. అద్భుతమైన కథాంశాలతో, గ్రామీణ నేపథ్య చిత్రాలతో భారతీయ సినిమా రంగాన్ని ఒక కొత్త మలుపు తిప్పిన లెజెండరీ దర్శకుడు, అద్భుత నటుడు భారతీరాజా (Bharathi Raja) బుధవారం ఉదయం కన్నుమూశారు. 1942లో జన్మించిన ఆయన వయసు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, జూన్ 10 ఉదయం పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే తమిళ, తెలుగు సినీ పరిశ్రమలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. భారతీ రాజా గారి వ్యక్తిగత జీవితంలో గత ఏడాది జరిగిన ఒక పెద్ద విషాదం ఆయన్ను మానసికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. గతేడాది ఆయన కుమారుడు మనోజ్ హఠాన్మరణం చెందడం భారతీ రాజాను తీవ్రంగా కలచివేసింది. పుత్రశోకాన్ని దిగమింగుకోలేక, ఆ వేదనతోనే ఆయన కేవలం రెండు మూడు నెలల్లోనే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆ సమయంలో పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరి సుమారు నెల రోజుల పాటు సుదీర్ఘంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. కేవలం మూడు నెలల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ఆయన, అక్కడే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నారు. అయితే దురదృష్టవశాత్తూ బుధవారం ఉదయం సడన్గా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూనే ఆయన ప్రాణాలు విడిచారు. భారతీ రాజా అంటే కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినిమా రంగానికి ఎందరో గొప్ప నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఒక అద్భుతమైన పరిశ్రమ. నాటి కాలంలో సమాజంలో ఉన్న వర్ణ వివక్షను, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదురొడ్డి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని లిఖించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించే గొప్ప దర్శకుడిగా ఎదిగారు. ముఖ్యంగా ఆయన ఎక్కువ తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించగా, అందులో మెజారిటీ సినిమాలు తెలుగులోకి రీమేక్ అయ్యి ఘనవిజయాలు సాధించాయి. కేవలం రీమేక్లకే పరిమితం కాకుండా తెలుగులో నేరుగా 'కొత్త జీవితాలు', 'సీతాకోక చిలుక', 'ఆరాధన', 'జమదగ్ని' వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించి, ఇక్కడి తెలుగు ప్రేక్షకుల గుండెల్లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమకు నటీనటులను పరిచయం చేయడంలో ఆయన శైలి అద్వితీయం. నాటి తరం స్టార్ హీరోయిన్లు మరియు నటులైన రాధ, రాధిక, రేవతి, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి ఎందరో మేటి కళాకారులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత భారతీరాజాదే. కేవలం నటులనే కాదు, నేడు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న ఎంతో మంది ఆయన శిష్యులే. వారిలో తెలుగు సినిమా రంగంలో తన మార్క్ సృష్టించిన సీనియర్ దర్శకుడు వంశీ కూడా ఒకరు కావడం విశేషం. వయసు పైబడిన తర్వాత దర్శకత్వ బాధ్యతల నుండి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయనలోని నటుడు మాత్రం విశ్రమించలేదు. పలు చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి నటుడిగానూ మెప్పించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'తుడరుం' చిత్రంలో ఆయన చివరిసారిగా ఒక కీలక పాత్రలో నటించి అలరించారు. సినిమాను ప్రాణంగా ప్రేమించిన ఒక మహా దర్శకుడి ప్రస్థానం ముగిసినా, ఆయన అందించిన దృశ్యకావ్యాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.
Jun 10, 2026 8:44AMఇలా బ్రేకప్ అన్నారు.. అలా కలిసిపోయారు..తిరుమల శ్రీవారి చెంత ప్రత్యక్షమైన క్రేజీ జంట!
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ వార్త హాట్ టాపిక్గా మారుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నిత్యం నెట్టింట సంచలనం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) వ్యక్తిగత జీవితం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కినప్పటి నుంచి ఈ హీరో పేరు మీడియాలో మారుమోగుతోంది. తాజాగా ఈ వివాదంలో మరో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. జయం రవితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్, తాజాగా ఆయనేతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీరిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే వీరిద్దరి బంధానికి బ్రేక్ పడిందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో షాక్ ఇచ్చాయి. నిరంతర సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, అందుకే జయం రవితో ఉన్న రిలేషన్ను ముగించుకుని చెన్నై నగరాన్ని కూడా వదిలి వెళ్ళిపోతున్నట్లు కెనీషా స్వయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే ఇద్దరూ కలిసి ఇలా క్లోజ్గా కనిపించడంతో, వీరి మధ్య బ్రేకప్ కాలేదని, అంతా సవ్యంగానే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన సమయం నుంచే బెంగళూరుకు చెందిన సింగర్ కెనీషా పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్లే విడాకుల వరకు పరిస్థితి వచ్చిందని తమిళ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రవి మోహన్ స్టూడియోస్’లో కెనీషాను బిజినెస్ పార్ట్నర్గా చేర్చుకోవడం ద్వారా జయం రవి ఈ రూమర్స్కు మరింత బలాన్ని చేకూర్చారు. ఈ వ్యక్తిగత వివాదాలు ఒకవైపు నడుస్తున్నప్పటికీ, జయం రవి తన సినీ కెరీర్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఆయన బిజీగా గడుపుతున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నేతృత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ చిత్రంలో జయం రవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. దాంతో పాటు ‘కరాటే బాబు’, ‘పరాశక్తి’ వంటి చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు జయం రవి అభిమానులు ఈ తిరుమల వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే, హీరోగా జయం రవి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు. ఏదేమైనా బ్రేకప్ రూమర్స్ నడుమ ఈ జంట కలిసిన తీరు కోలీవుడ్ సర్కిల్స్లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ తిరుమల పర్యటన అనంతరం, జయం రవి తన తదుపరి చిత్రాల షూటింగ్స్లో పాల్గొననున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాతో పాటు ఆయన నటిస్తున్న ఇతర ప్రాజెక్ట్ల అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Jun 9, 2026 9:31PMIMDbలో అదిరిపోయే రేటింగ్.. అబ్బాయిలు తప్పక చూడాల్సిన సినిమా!
డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే సినీ ప్రియుల కోసం ప్రతి వారం ఓటీటీ ప్లాట్ఫామ్లపై సరికొత్త చిత్రాలు సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల డిజిటల్ స్క్రీన్పైకి వచ్చిన ఒక విలక్షణ రొమాంటిక్ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. థియేట్రికల్ రిలీజ్ సమయంలో పెద్దగా సంచలనాలు సృష్టించలేకపోయినప్పటికీ, ప్రస్తుతం ఓటీటీ వేదికగా ఈ చిత్రం భారీ వ్యూస్తో దూసుకుపోతోంది. రత్న కుమార్ దర్శకత్వంలో యువ నటుడు విధు, టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘29’. ఒక స్వచ్ఛమైన, ప్రాక్టికల్ ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు, ముఖ్యంగా యువత ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. 30 ఏళ్లకు చేరువవుతున్న సత్య అనే ఓ సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. తన కెరీర్ పట్ల స్పష్టత లేకపోవడం, భవిష్యత్తు గురించి ఆందోళనలు, సమాజం మరియు కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లతో అతడు మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటాడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అతని జీవితంలోకి విజీ (ప్రీతి అస్రాని) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారి మధ్య చిగురించిన ప్రేమ, సత్యలోని అభద్రతాభావం వల్ల ఎలాంటి మలుపులు తిరిగిందనేది దర్శకుడు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. సినిమాలోని చాలా సన్నివేశాలు నేటి తరం యువత రియల్ లైఫ్కు ఎంతో కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కేవలం ఒక రొమాంటిక్ డ్రామాగానే కాకుండా, మారుతున్న కాలంలో బంధాల మధ్య వచ్చే ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ను చాలా సహజంగా చూపించారు. ఈ చిత్రంలో బాలు మహేంద్రన్, అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఈ సినిమాకు ఓటీటీలో లభిస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. IMDbలో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రేటింగ్ దక్కడం విశేషం. ముఖ్యంగా కెరీర్ మరియు ప్రేమ మధ్య నలిగిపోయే ప్రతి అబ్బాయి ఖచ్చితంగా చూడాల్సిన క్లాసిక్ ఫిల్మ్ ఇదంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ లిస్ట్లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు వ్యూస్ సాధించేలా కనిపిస్తోంది. థియేటర్లలో మంచి చిత్రాలను మిస్ అయ్యామని ఫీలయ్యే ఓటీటీ ప్రియులకు, ఈ వీకెండ్లో చూసేందుకు ‘29’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
Jun 9, 2026 9:04PM
ది పారడైజ్ మళ్లీ వాయిదా? ఆ హీరో సినిమా వల్లనేనా!
నేచురల్ స్టార్ నాని(Nani),శ్రీకాంత్ ఓదెల(Srikanth Odhela)కాంబోలో తెరకెక్కుతున్న'ది పారడైజ్(The Paradise)పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సదరు అంచనాల స్థాయి ఎంత అంటే పారడైస్ తో తెలుగు చిత్ర సీమలో నాని సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తాడు అనేంతలా. అభిమానులు అంతలా నమ్మకం పెట్టుకోవడానికి కారణం ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో పాటు యూ ట్యూబ్ లో వస్తున్న రికార్డు వ్యూస్. పారడైజ్ ని మొదట ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో షూటింగ్ ఆలస్యం కావడం, రామ్ చరణ్ 'పెద్ది' కూడా ఆ సమయంలోనే వస్తుందని డేట్ అనౌన్స్ చెయ్యడంతో ఆగస్టు 21 కి వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని, మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న 'ఇరుముడి'ని కూడా అదే తేదీన అంటే, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'ఇరుముడి' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీస్ సంస్థకు, 'ది పారడైజ్' నిర్మాతలైన ఎస్ఎల్వీ సినిమాస్కు మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు క్లాష్ అయ్యే అవకాశాలు ఉండవని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రవితేజ రేసులోకి రావడంతో నాని ఆగస్టు స్లాట్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయమైనట్లే అని అంటున్నారు. also read: Toxic: టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా? 'పారడైజ్' ఇప్పటికే 100 రోజులకి పైగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ, ఇంకా సెకండ్ హాఫ్కి సంబంధించిన ఒక మేజర్ పోర్షన్ షూటింగ్ బాకీ ఉందట. ఈ పెండింగ్ షూటింగ్తో పాటు విజువల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకి, ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులకి చాలా ఎక్కువ సమయం పట్టేలా ఉందని అంటున్నారు. సెప్టెంబర్ నెలలో వినాయక చవితి కానుకగా రావచ్చని టాక్.
Jun 9, 2026 6:50PMప్రేక్షకులకు నిరాశ.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 'సింగ్ గీతం' రిలీజ్ వాయిదా?
టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన మైలురాయి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 94 ఏళ్ల వయసులో కూడా సరికొత్త ప్రయోగాలతో నేటి తరం సరిహద్దులను బ్రేక్ చేస్తున్న ఈ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ తెరకెక్కించిన సరికొత్త చిత్రం 'సింగ్ గీతం'. 'ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ ఫాంటసీ'గా అత్యంత భారీ అంచనాలతో జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ సడన్గా వాయిదా పడింది. ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సినీ అభిమానులకు ఈ వార్త తీవ్ర నిరాశను మిగిల్చింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేవలం పాటలు, సంగీతమే ప్రధానంగా.. ఎలాంటి మాటలు లేకుండా ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో సింగీతం శ్రీనివాసరావు ఈ వయసులో చేసిన ప్రయోగం చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఇటీవలే సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ కూడా సాధించిన ఈ చిత్రం, ఆఖరి నిమిషంలో థియేట్రికల్ విడుదలను వాయిదా వేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజానికి గత కొద్దిరోజులుగా చిత్రబృందం ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్లో నిర్వహించింది. చెన్నైలో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ విచ్చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, రీసెంట్గా విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిన్నపాటి సాంకేతిక కారణాలు లేదా గ్రాఫిక్స్ పనుల్లో మరింత క్వాలిటీ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. సింగీతం శ్రీనివాసరావు గతంలో 'ఆదిత్య 369', 'పుష్పక విమానం', 'భైరవద్వీపం' వంటి కల్ట్ క్లాసిక్స్ అందించి ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన మెగాఫోన్ పట్టి రూపొందించిన ఈ 'సింగ్ గీతం'లో ప్రతాప్ అనే యువకుడి చుట్టూ తిరిగే కథను చాలా విజువల్ వండర్గా చూపించబోతున్నారు. సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే నిర్మాతలు జూన్ 11 విడుదల తేదీని వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. ఒకరోజు ఆలస్యంగా అంటే జూన్ 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం.
Jun 9, 2026 6:25PM
Toxic: టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
రాకింగ్ స్టార్ యష్(Yash)అభిమానులు, మూవీ లవర్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ టాక్సిక్.. ఏప్రిల్ 10 న రిలీజ్ కావాల్సిన మూవీ.. మరి ఎవరి దిష్టి తగిలిందో గాని మార్చి 19 అన్నారు. ఆ డేట్ కూడా మారి జూన్ 4 కి వాయిదాపడింది.అది కూడా లేదు. దీంతో యష్ ఫ్యాన్స్ , మూవీ ఫ్యాన్స్ బాధకి అంతే లేకుండా పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందో అని ఒకటే వేదన. తాజాగా కన్నడ సీమ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, 'టాక్సిక్' చిత్ర డిజిటల్ రైట్స్ (OTT Rights) కోసం నిర్మాతలు ఆశిస్తున్న రేటుకి , ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేస్తున్న అమౌంట్కి సింక్ కుదరడం లేదు. మేకర్స్ అడుగుతున్న భారీ బడ్జెట్ రేట్లలో ఓటీటీ కంపెనీలు కేవలం 30 నుండి 40 శాతమే ఆఫర్ చేస్తున్నాయట. సాధారణంగా ఇలాంటి క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టులకు షూటింగ్ దశలోనే వందల కోట్ల ఓటీటీ డీల్స్ క్లోజ్ అవుతాయి. కానీ 'టాక్సిక్' విషయంలో ఈ డిజిటల్ బిజినెస్ డీల్స్ ఇంకా తేలక పోవడంతోనే రిలీజ్ డేట్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓటీటీ టెన్షన్ ఇంకా సాల్వ్ కాకపోవడం వల్లే ప్రమోషన్స్ కూడా ముందుకు సాగడం లేదు. మరోవైపు, సినిమా వాయిదా పడటంపై యష్ క్లారిటీ ఇస్తూ, లాస్ వేగాస్లో జరిగిన ప్రతిష్టాత్మక 'సినిమాకాన్' (CinemaCon) ఈవెంట్లో 'టాక్సిక్' గ్లింప్స్కు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ సినిమా గ్లోబల్ వేదికపై ఎదుగుతున్న తరుణంలో, సినిమాని మరింత విస్తృతంగా, సరైన అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. Also read: Dhanush: ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు.. తెలుగు డైరెక్టర్కి హీరో ధనుష్ రిక్వెస్ట్! ప్రస్తుతానికి సినిమా అవుట్ పుట్ కంప్లీట్ అయిందని, ఎలాంటి మేజర్ రీషూట్స్ జరగడం లేదని మేకర్స్ పుకార్లను కొట్టిపారేశారు. నిజానికి జూన్ రిలీజ్ పక్కా అనుకుని హీరో యష్ గత ఏప్రిల్లోనే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు . కానీ ఈ బిజినెస్ మరియు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు పబ్లిసిటీని పూర్తిగా పక్కనబెట్టి, డైరెక్టర్తో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారు. ఒకవేళ రాబోయే ఆగస్టు లేదా దసరా సీజన్ నాటికైనా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యి 'టాక్సిక్' థియేటర్లలోకి రాకపోతే.. ఈ ప్రాజెక్ట్ ఏకంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Jun 9, 2026 6:23PM
నేరుగా ఓటీటీలోకి వస్తున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి 'మ్యాజిక్' మూవీ!
'జెర్సీ' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త మ్యూజికల్ డ్రామా 'మ్యాజిక్' (Magic). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాలేజ్ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయాలనుకునే నలుగురు టీనేజర్ల కథాంశంతో, పూర్తి వైవిధ్యమైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో సారా అర్జున్, ఆకాష్ శ్రీనివాస్, అన్మోల్ కజాని, సిద్ధార్థ్ తనుకు ప్రధాన పాత్రలు పోషించారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చడం విశేషం. అయితే, థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, 'మ్యాజిక్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. థియేట్రికల్ రన్ కంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారానే ఈ తరహా మ్యూజికల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలకు గ్లోబల్ ఆడియన్స్ నుండి లభించే రెస్పాన్స్ అద్భుతంగా ఉంటుందని భావించిన మేకర్స్, ఈ ఓటీటీ డీల్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్ అందించిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, గిరీష్ గంగాధరన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. గౌతమ్ తిన్ననూరి నుండి వస్తున్న పూర్తి క్లాసిక్ అండ్ హార్ట్ టచింగ్ మ్యూజికల్ ఫిల్మ్ కావడంతో 'మ్యాజిక్' పై ఓటీటీ ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. హృదయానికి హత్తుకునేలా సాగే టీనేజ్ ఎమోషన్స్, నీలగిరి కొండల అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన విజువల్స్ ఈ సినిమాలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ మ్యాజికల్ డ్రామాను డిజిటల్ స్క్రీన్స్ పై వీక్షించేందుకు యూత్ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా అధికారిక ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. మరి ఓటీటీ వేదికగా రాబోతున్న ఈ 'మ్యాజిక్' డిజిటల్ ఆడియన్స్ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Jun 9, 2026 5:42PM
Dhanush: ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు.. తెలుగు డైరెక్టర్కి హీరో ధనుష్ రిక్వెస్ట్!
స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు శివ ఒక కథని ధనుష్ కి వినిపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. పక్కా రూరల్ గ్రామీణ నేపథ్యంతో కూడిన హై వోల్టేజ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ని శివ సిద్ధం చేశారట. ఇందులో ఉండే మాస్ ఎలివేషన్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ధనుష్కి నచ్చేశాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కథ విన్న వెంటనే ధనుష్ ఓకే చెప్పాడని, ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా పెద్ద ప్రాజెక్టులు, ప్యాన్ ఇండియా కమిట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ పూర్తి కావడానికి కనీసం కొంత సమయం పట్టేలా ఉంది. ఈ లోపు సదరు కథ మరెవరికీ ఇవ్వద్దని, తన కోసమే హోల్డ్లో పెట్టాల్సిందిగా ధనుష్ ప్రత్యేకంగా డైరెక్టర్ శివని రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా కోలీవుడ్ నుంచి గట్టి సమాచారం వినిపిస్తోంది. జనవరి 2027 నుండి ధనుష్ డేట్స్ కేటాయించేందుకు అంగీకరించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఒక ఏడాది ముందే ఈ క్రేజీ కాంబో లాక్ అయిందన్నమాట. Also read: పట్నం బ్రతుకులు .. ఏం మిస్ అయ్యామో తెలిస్తే ఏడుపు ఆగదు టాలీవుడ్లో వరుసగా వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. మైత్రీ సంస్థ ప్రస్తుతం కోలీవుడ్లోనూ తన జెండా ఎగరేయాలని చూస్తోంది. అందులో భాగంగానే ధనుష్, సిరుతై శివ లాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ని సెట్ చేసినట్లు టాక్. అయితే ఇప్పటి టి వరకు ఈ ప్రాజెక్ట్పై డైరెక్టర్ నుంచి గానీ, ఇటు హీరో లేదా నిర్మాణ సంస్థ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త హల్చల్ చేస్తోంది. శివ తెలుగులో దరువు, శంఖం, శౌర్యం చిత్రాలకి దర్శకత్వం వహించాడు.
Jun 9, 2026 5:37PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com








