విడాకులు తీసుకున్నా రిలేషన్ కొనసాగుతోంది: జి.వి.ప్రకాష్.!
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ ప్రకాష్ కుమార్, తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు స్వరాలు అందించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన, మ్యూజిక్ డైరెక్టర్గానే కాకుండా హీరోగా కూడా వరుస ప్రాజెక్ట్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం జీవీ ప్రకాష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. విడిపోయినా కూతురి కోసం ఎంతో మెచ్యూర్డ్గా కో-పేరెంటింగ్ చేస్తున్నారని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు విడిపోవడం ఎందుకంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా జీవీ ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. [GV Prakash Kumar, Saindhavi Divorce, GV Prakash Wife, Tamil Music Director, Entertainment News Telugu]
Aug 31, 2026 8:25PMసందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!
ఎస్ఆర్డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేట’. సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని సోమవారం (ఆగస్ట్ 31) నాడు ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాలకు కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందజేయగా.. కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో.. హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ రోజు మా కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన నాగబాబు గారికి, ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ అనేది చిరంజీవి గారి టైటిల్. మాఈ కథకి ఈ టైటిల్ యాప్ట్గా ఉంటుంది. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. కేఎస్ రవి కుమార్ మాట్లాడుతూ .. ‘డైరెక్టర్ అశోక్ గారు ‘వేట’ కథని నాకు కాల్లో వివరించారు. కథ నాకు అద్బుతంగా అనిపించింది. అందరూ కొత్త వాళ్లు కలిసి పని చేస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో ఊర్లో పెద రాయుడు టైపు పాత్ర నాది. నా కారెక్టర్ నాకు నచ్చింది. జెన్ జీ ఆడియెన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ మూవీ బిగ్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ .. ‘‘వేట’ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారికి, ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. ఇదే నా మొదటి సినిమా. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవి కుమార్ గారు అంగీకరించారు. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు. నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ .. ‘‘ఈటీవీ విన్తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్. సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్నారు. కేఎస్ రవి కుమార్ మా సినిమాలో గొప్ప పాత్రను పోషించనున్నారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న కల్కి రాజా గారికి థాంక్స్. మాకోసం వచ్చిన నాగబాబు గారు, సాయి రాజేష్ గారు, మెహర్ రమేష్ గారు, వీఎన్ ఆదిత్య గారు, ఎస్కేఎన్ గారికి థాంక్స్. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ చిత్రంలానే ఇది కూడా ఓ గ్రామీణ కథ. అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఉంటుంది’ అని అన్నారు. సాత్విక మాట్లాడుతూ .. ‘‘మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘వేట’ సినిమా నా కెరీర్లో గొప్ప ప్రారంభంగా మారుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
Aug 31, 2026 8:04PMవిడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.!
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ నాయకత్వంలో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనియన్లో చిచ్చుపెట్టేందుకు చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన సుమలత, ఫిల్మ్ ఫెడరేషన్ వైఖరిని అలాగే రఘు మాస్టర్ వర్గం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు. తమ అసోసియేషన్కు ఏ నిబంధన ప్రకారం ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తోందో సూటిగా ప్రశ్నించారు. అసోసియేషన్ను రెండు ముక్కలు చేయాలని ఎవరు చూసినా, అలాంటి వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కొడతామంటూ చాలా ఘాటుగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన అడ్ హాక్ కమిటీ సమావేశం ఎంతమాత్రం చెల్లదని సుమలత స్పష్టం చేశారు. ఆ కమిటీలో ఉన్న కొందరు సభ్యులు గతంలో అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినవారేనని ఆమె ఆరోపించారు. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ యూనియన్ను ముక్రాజ్ మాస్టర్ ఎంతో శ్రమించి స్థాపించారని, ఎవడో ఒక ఫ్రాడ్ చేసిన వ్యక్తి వచ్చి అడ్ హాక్ కమిటీ వేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. గతంలో తమ అసోసియేషన్ తరఫున నిర్వహించిన ఉపఎన్నికలు చట్టబద్ధంగానే జరిగాయని ఆమె సమర్థించుకున్నారు. 500 మంది ఉన్న యూనియన్లో 114 మంది ఓటు వేసినా అది ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియే అవుతుందని, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి మాత్రమే తాము ముందుకు వెళ్తున్నామని వివరించారు. లీగల్గా తమ కమిటీకే అన్ని అధికారాలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఇటీవలే ఫెడరేషన్ సహాయ నిరాకరణ, జానీ మాస్టర్ సస్పెన్షన్ పొడిగింపు వార్తల మధ్య రఘు మాస్టర్ కు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఫెడరేషన్ తీరు మారకపోతే తాము కూడా ప్రత్యమ్నాయ చర్యలకు వెనుకడమని సుమలత తేల్చిచెప్పారు. డ్యాన్సర్ల ప్రయోజనాలు కాపాడేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామని సుమలత స్పష్టం చేయడంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు ఫెడరేషన్ మద్దతుతో రఘు మాస్టర్ వర్గం ముందుకు వెళ్తుంటే, మరోవైపు సుమలత చట్టపరమైన హెచ్చరికలతో తిరుగుబాటు చేయడం వల్ల ఈ అసోసియేషన్ సంక్షోభం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. [Sumalatha Jani, Jani Master Wife, TFTDDA Dispute, Raghu Master Dancers Union, Tollywood Film Federation]
Aug 31, 2026 7:52PM
ఒకే ఒక్క ఛాన్స్: ఆ స్టార్ హీరో పక్కన ఓకే అయ్యిందా!
భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. Also Read: రీ రిలీజ్ బాక్సాఫీస్ సునామీ: వామ్మో అడ్వాన్స్ బుకింగ్ లో అన్ని కోట్లా! ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. [ Bhagyashri Borse , Ram Charan, Sukumar, Akhil Akkineni, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Aug 31, 2026 7:42PMసాయికుమార్కు డూప్గా నటించిన కన్నడ సూపర్స్టార్.. అసలు కథ ఇదే.!
సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ఉండే స్నేహసంబంధాలు, ఒకరికొకరు చూపించే మద్దతు ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా తోటి నటులకు కష్టకాలంలో లేదా అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు స్టార్ హీరోలు సైతం ముందుకెళ్లి సహాయం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు సాయికుమార్ వెల్లడించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ తన కోసం ఏకంగా బాడీ డబుల్గా ఎలా మారారో ఆయన స్వయంగా పంచుకున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సాయికుమార్, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో తాను, శివరాజ్ కుమార్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశామని, దాన్ని రెండు భాషల్లో వేర్వేరుగా తెరకెక్కించారని తెలిపారు. కన్నడలో శివన్న హీరోగా నటించగా, తెలుగు వెర్షన్లో సాయికుమార్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఘటన తమ బంధాన్ని మరింత బలపడేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. మురుడేశ్వర్లో ఒక భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో సాయికుమార్కు అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆవేశంగా చేస్తున్న ఒక షాట్లో ఆయన కింద పడిపోవడంతో ముక్కుకు తీవ్ర గాయమై రక్తం వచ్చింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకుని తిరిగి లొకేషన్కు చేరుకున్నారు. ఆయన పరిస్థితిని చూసి శివరాజ్ కుమార్ ఎంతో ఆందోళన చెందారు. అయితే ఆ సమయంలో నిర్మాత అందుబాటులో లేకపోవడంతో దర్శకుడు షూటింగ్ ఆపడానికి ఇష్టపడలేదు. సినిమాలో విలన్గా నటిస్తున్న ఆశిష్ విద్యార్థిని సాయికుమార్ కొట్టే ఒక కీలకమైన క్లోజప్ షాట్ తీయాల్సి ఉంది. ఆ షాట్ కథకు చాలా ముఖ్యమని ఫైట్ మాస్టర్ రామ్ శెట్టి చెప్పినా, ముఖానికి ఉన్న గాయం కారణంగా సాయికుమార్ ఆ షాట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. తన పరిస్థితిని అర్థం చేసుకున్న కన్నడ సూపర్స్టార్ శివన్న, తన స్టార్డమ్ను పక్కన పెట్టి మరీ ఆ ఒక్క షాట్ కోసం స్వయంగా సాయికుమార్కు బాడీ డబుల్గా నటించేందుకు ముందుకు వచ్చారు. ఆ చిన్న షాట్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయిందని సాయికుమార్ గుర్తుచేసుకున్నారు. ఆ షాట్ చేసింది తాను కాదని, శివన్నే స్వయంగా ఆ సాహసం చేశారని చెబుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తోటి నటుడి కోసం అంత పెద్ద స్టార్ తన బాడీ డబుల్గా మారడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని సాయికుమార్ కొనియాడారు. ప్రస్తుతం ఈ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు శివన్న సింప్లిసిటీని తెగ ప్రశంసిస్తున్నారు. [Sai Kumar, Shiva Rajkumar, Body Double, Tollywood Kannada Cinema, Kurmavatar]
Aug 31, 2026 7:29PM
రీ రిలీజ్ బాక్సాఫీస్ సునామీ: వామ్మో అడ్వాన్స్ బుకింగ్ లో అన్ని కోట్లా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజంటే(సెప్టెంబర్ 2 ) రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులకి పండుగ రోజు. కొంత మంది అభిమానులైతే ఆ రోజున తాము చేసే పనికి సెలవు పెట్టి ఏ ఏ ఏరియాల్లో పవన్ పుట్టిన రోజు జరుపుతున్నారో, చేసే మంచి పనులు ఏంటో చూడటం తరాల నుంచి ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం పవన్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా అభిమానులు భావించే 'పంజా' సెప్టెంబర్ 2 నే థియేటర్స్ లో అడుగుపెడుతుంది ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. కేవలం ముందస్తు బుకింగ్స్ ద్వారానే ఇండియా గ్రాస్ ఏకంగా 1.56 కోట్లని దాటేసి పవన్ కళ్యాణ్ మానియాను ప్రపంచానికి చాటిచెప్పింది. బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళితే, విడుదల రోజున ప్రదర్శించబడే షోల కోసం ఇప్పటివరకు భారతదేశంలో 1,15,161 కి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 141 నగరాల్లో 304 థియేటర్లలో 662 షోలకు గాను ముందస్తు బుకింగ్స్ నిర్వహించగా, ఏకంగా 40.2% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇందులో ఇప్పటికే 86 షోలు హౌస్ఫుల్ కాగా, 91 కి పైగా షోలు ఫాస్ట్ ఫిలింగ్ మోడ్లో బుక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ₹80.13 లక్షల గ్రాస్ వసూలై 51.3% వాటాను నమోదు చేయగా, ఆంధ్రప్రదేశ్లో ₹64.38 లక్షల అడ్వాన్స్ గ్రాస్ నమోదు కావడం విశేషం. నగరాల పరంగా చూస్తే, హైదరాబాదులోనే 116 షోలలో 44,805 టిక్కెట్లు అమ్ముడై అత్యధికంగా 65.26 లక్షల వసూళ్లు సాధించాయి. అలాగే వైజాగ్ 11.58 లక్షలు, విజయవాడ 10.67 లక్షలు, కర్ణాటకలోని బెంగళూరులో 10.66 లక్షల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లతో పవన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. Also Read: గోల గోల చేస్తున్నారుగా: యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ రికార్డు ఇదే డిసెంబర్ 9, 2011న విడుదలైన పంజా 33 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ₹40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ తర్వాతి కాలంలో టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకుంది. ఆర్కా మీడియా వర్క్స్, సంఘమిత్ర ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డం లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసాయి. అంతేకాకుండా యువన్ శంకర్ రాజా అందించిన సమర్థవంతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బిజిఎమ్, అడివి శేష్ విలనిజం, సారా జాన్ డియాస్, అంజలీ లావానియా గ్లామర్ పంజాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అప్పట్లో థియేటర్లలో దక్కని విజయాన్ని ఇప్పుడు ఈ 4K రీ-రిలీజ్తో పవర్ స్టార్ అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నడ మేకర్ విష్ణువర్ధన్ దర్శకుడు. Pawan Kalyan, Panjaa Re Release, Box Office Collection, Vishnu vardhan, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood
Aug 31, 2026 7:11PM
గోల్డ్ స్పాట్: 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' డైరెక్టర్ కథ.. నోస్టాల్జిక్ ఫీల్తో ఫస్ట్ లుక్.!
విజయకృష్ణ లింగమనేని సమర్పణలో ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త సినిమా టైటిల్ ను తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి "గోల్డ్ స్పాట్" టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరకి వెళ్లడం, అటువైపు నుంచి పెద్దవాళ్లుగా అంతే సంతోషంగా తిరిగి రావడం చూపించారు. బాల్య స్నేహితులు పెద్దయ్యాక తాము ఆటపాటలతో సంతోషంగా గడిపిన ప్రదేశాలను, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నోస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తూ ఆకట్టుకుంటోంది. [Gold Spot, First Look, Telugu Cinema, Telugu Film News, Telugu News]
Aug 31, 2026 7:11PM‘ధర్మస్థల నియోజకవర్గం’ గొప్ప సినిమా అవుతుంది - వి.వి.వినాయక్
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ముఖ్య అతిథిగా ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. చంద్రబోస్ గారు కాల్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడంటూ ఆయన చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాసినట్లు చంద్రబోస్ గారు నాతో అన్నారు. ఈ సినిమా గొప్ప సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన అంతగా చెప్పిన తర్వాత నాకు కూడా ఇది గొప్ప సినిమా అవుతుందని అనిపించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అందరికీ మంచి పేరు తీసుకురావాలి. నా మొదటి సినిమా ఆదిలో ఫస్ట్ పాట రాసింది చంద్రబోస్ గారే. డైరెక్టర్ జ్ఞాన ప్రభ మొదటి సినిమాకు కూడా చంద్రబోస్ గారే లిరిక్స్ రాశారు. ఈ సినిమా కూడా ఆది అంత ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు. లిరిక్ రైటర్ గా నాకు చాలా సంతృప్తిని, సంతోషాన్ని కలుగజేసిన చిత్రమిది. రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ చిత్రానికే పాటలు రాశాను. అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలను దర్శకుడు జ్ఞానప్రభ క్రియేట్ చేశారు. ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఈ పాటలకు మహవీర్ మంచి ట్యూన్స్ చేశాడు. వాటిలో న్యాయం చేయరా దేవుడా, ధర్మో రక్షతి రక్షిత:, ఆరంభం, కొడుకో కొడుకో, కాలం ..ఇలా ఐదు పాటలు ఆకట్టుకుంటాయి. ప్రతి ఒక్కరిలో ఒక మహా మానవుడు, ఒక అల్పమానవుడు ఉంటాడు. సమాజంలో మహా మానవుడిని మంచి ఎవరూ ఎదగలేరు. అల్ప మానవుడిని మించి దిగజారలేరు. ఆ మహా మానవుడికి, అల్పమానవుడికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ కథాంశం. ఆ సంఘర్షణలో ఎవరు గెలిచారు అనేది డైరెక్టర్ జ్ఞాన ప్రభ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా ఇష్టంతో కష్టపడి పనిచేశారు. వారందరికీ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా. అన్నారు. నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ - ప్రొడ్యూసర్ భాస్కర్ గారు నాగ సినిమాకు మేనేజర్ గా వర్క్ చేశారు అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ పరిచయంతో ఆయన ప్రొడ్యూసర్ గా చేస్తున్న సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు. కొత్త దర్శకులు కథ బాగా చెప్పినా అది రూపొందించడంలో ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు. కానీ జ్ఞాన ప్రభ మంచి కథను అంతే బాగా తెరకెక్కించారు. ఈ రోజు యువత చూడాల్సిన చిత్రమిది. డ్రగ్స్ గురించి ఇప్పుడు జరుగుతున్నవి ముందే ఊహించి ఈ సినిమాలో తెరకెక్కించాడు జ్ఞాన ప్రభ. ఆయన మరెన్నో మంచి చిత్రాలు రూపొందించాలి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. అన్నారు. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ - సత్యప్రకాష్ తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. వాళ్ల అబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ జ్ఞాన ప్రభ ఈ సినిమాలో నాకొక పవర్ పుల్ రోల్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ లో పర్ ఫార్మ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ సినిమాలో ఫన్ ఉంది, మెసేజ్ ఉంది, ఇప్పటి యూత్ కు చెప్పాల్సిన మంచి ఉంది. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ ఏలేందర్ మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఎంతో టిపికల్ గా అనిపించింది. ప్రతి పాట కథను ముందుకు తీసుకెళ్లేలా ఉంది. అలాంటి మంచి సందర్భాలు కథలో కుదరడం సంతోషాన్నిచ్చింది. కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యం అందిచారు. సినిమాలోని పాటలన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మూవీ కూడా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అన్నారు. ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ మాట్లాడుతూ - మా సినిమా సెప్టెంబర్ 4న పీవీఆర్, ఐనాక్స్ ద్వారా రిలీజ్ కు వస్తోంది. మా టీమ్ అంతా సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఆఫీస్ లో ఎంత డిస్కస్ చేసుకున్నా, షూటింగ్ లొకేషన్ లో మాత్రం చాలా క్లారిటీగా వర్క్ చేశాం. మా డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు ఒక్క వర్కింగ్ డే కూడా పెరగకుండా సినిమా కంప్లీట్ చేశాడు. నేను మేనేజర్ గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు జ్ఞాన ప్రభ లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడు దొరకడం సంతోషంగా ఉంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు. డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ - కథ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కంప్లీట్ సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి థ్యాంక్స్. నా టీమ్ లోని టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ నాకు మోరల్ సపోర్ట్ గా నిలిచారు. వారి వల్లే ఇలాంటి మంచి సినిమా చేయగలిగాను. వితిక గారితో సహా అందరు ఉదయం ఆరు గంటలకే సెట్ లో ఉండేవారు. ఏ సౌకర్యాలు డిమాండ్ చేయకుండా సినిమాలో నటించారు. ఇలాంటి టీమ్ దొరకడం నా అదృష్టం. సినిమా అంటే సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా ఏ ఇబ్బంది రాకుండా నా టీమ్ అండగా నిలుస్తున్నారు. ఒక యదార్థ ఘటన నేపథ్యంగా ఫిక్షనల్ స్టోరీతో మంచి మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్ ఉండేలా ఈ సినిమాను రూపొందించాను. సెప్టెంబర్ 4న థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
Aug 31, 2026 7:05PM
గోల గోల చేస్తున్నారుగా: యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ రికార్డు ఇదే
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం యూట్యూబ్ లో తన అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ నుంచి రిలీజ్ చేసిన తన సెకండ్ సింగిల్ 'యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల' సాంగ్ తో యూ ట్యూబ్ లో సరికొత్త సునామీ సృష్టిస్తున్నాడు. మొన్న శనివారం విడుదలవ్వగా కేవలం 24 గంటల వ్యవధిలోనే యూట్యూబ్లో ఏకంగా 30 మిలియన్లకి (3 కోట్లు) పైగా డిజిటల్ వ్యూస్ కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. దీంతో యూట్యూబ్ ఆల్ ఇండియా మ్యూజిక్ ట్రెండింగ్ కేటగిరీలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఈ సాంగ్ ప్రస్తుతం 36 మిలియన్ల వ్యూస్ తో 3 కోట్ల అరవై లక్షలు) రికార్డులే హద్దుగా దూసుకుకెళ్తుంది. పాటలో నాని వేసిన ఎనర్జిటిక్ మాస్ హుక్ స్టెప్పులు, మాస్ మూవ్మెంట్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో వైరల్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ రీ క్రియేషన్స్ రాబడుతున్నాయి. Also Read: Toxic: టాక్సిక్ పుణ్యం: యష్ ఇమేజ్ దెబ్బతిందా! తెలంగాణ నేటివిటీని, ఆటిట్యూడ్ ప్రతిబింబించే అత్యంత ప్రజాదరణ పొందిన 'యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల..' అనే జానపద బాణీ ఆధారంగా ఈ మాస్ ట్రాక్ను డిజైన్ చేశారు. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ తనదైన శైలిలో కసి, పౌరుషం, గ్రామీణ మూలాలు ఉట్టిపడేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ జానపద బాణీకి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ మోడ్రన్ డీజే ఎలక్ట్రానిక్ బీట్స్ను జత చేసి, శ్రోతలను ఊపేసేలా హై-వోల్టేజ్ డ్యాన్స్ నంబర్గా తీర్చిదిద్దారు. నానితో కీర్తి సురేష్ రేపు థియేటర్స్ లో రచ్చ చేయనుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. [ Yesha Nagula Katta, Telangana, Nani, Keerthi Suresh, The Pardise, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood ]
Aug 31, 2026 6:43PM
కొత్త అధ్యాయం: కుమారుడు గౌతమ్కు మహేష్ బర్త్డే విషెస్.. సర్ప్రైజ్ రాబోతోందా.?
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. "హ్యాపీ 20 GG!! నువ్వు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నావు. నీ కలలను ధైర్యంతో సాధించు. నిన్ను చూస్తుంటే ప్రతిరోజూ గర్వంగా ఉంటుంది" అంటూ మహేష్ బాబు రాసుకొచ్చిన లవ్లీ క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్కి మహేష్ బాబు తన కొడుకు గౌతమ్తో కలిసి నడుస్తున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను జత చేశారు. ఇద్దరూ ప్రశాంతమైన వాతావరణంలో, అందమైన ప్రకృతి ఒడిలో వెనకనుంచి కలసి నడుచుకుంటూ వెళ్తున్న ఈ పిక్ బ్యూటిఫుల్ గా ఉంది. https://x.com/urstrulyMahesh/status/2094301391330357745 గౌతమ్ తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా ఎంతో ప్రేమగా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రత్యేక పోస్ట్ చేశారు. "నిన్ను నా కుమారుడిగా చెప్పుకోవడం నాకు ఎంతో గర్వకారణం. నీ కలలు, లక్ష్యాలన్నీ నువ్వు సాధించాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను." నమ్రత రాసుకొచ్చారు. గౌతమ్ కూడా త్వరలోనే తన తండ్రిలాగే టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఎక్కువగా స్టార్ కిడ్స్ 20-25 ఏళ్ళ మధ్య హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పుడు గౌతమ్ కి 20 ఏళ్ళు రావడంతో.. ఫ్యాన్స్ కూడా ఈ ఘట్టమనేని వారసుడి ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. https://www.instagram.com/p/Dcsr-nLJNjy/ [Mahesh Babu, Twitter, Gautam Ghattamaneni, Birthday, Namrata Shirodkar, Instagram, Telugu Film News, Telugu News]
Aug 31, 2026 6:34PMషాలిని పాండే వీడియో కలకలం: సోషల్ మీడియాలో ఫైర్ అయిన ‘అర్జున్రెడ్డి’ బ్యూటీ.!
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎదుగుతున్నప్పటికీ, దాని వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో కొందరు చేస్తున్న అకృత్యాలు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్లో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న కథానాయిక షాలిని పాండే కూడా ఈ డీప్ఫేక్ సంస్కృతికి బాధితురాలిగా మారారు. ఆన్లైన్ లో తన రూపంతో వైరల్ అవుతున్న ఒక ఫేక్ ఏఐ వీడియోపై షాలిని పాండే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వీడియో పూర్తిగా కల్పితమని, అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను ఈ విధంగా మహిళలను, సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేయడం తీవ్రంగా కలచివేస్తోందని ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తీవ్రమైన వేధింపుల కిందకే వస్తాయని, సాంకేతికతను దుర్వినియోగం చేసే అలవాటు సమాజంలో సాధారణ విషయంగా మారకూడదని షాలిని ఘాటుగా హెచ్చరించారు. తన పేరుతో ప్రచారంలో ఉన్న సదరు వీడియోను ఎవరూ డౌన్లోడ్ చేయవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ఆమె అభిమానులకు, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వీడియోను సోషల్ మీడియాలో చూస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని, ఆ వీడియోకు మరింత ప్రాచుర్యం కల్పించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇంటర్నెట్ వాడుకరులు ప్రవర్తించే విధానమే ఇలాంటి అనైతిక చర్యలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తన ప్రకటనలో గుర్తుచేశారు. https://www.instagram.com/p/DcsvwcTPkwK/ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఘన విజయం అందుకున్న షాలిని పాండే, ఆ తర్వాత 'మహానటి', '118' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆపై బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ భామ 'జయేశ్భాయ్ జోర్దార్', 'మహారాజ్' వంటి ప్రముఖ ప్రాజెక్ట్లతో హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో రష్మిక మందన్న, ఆలియా భట్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు నటీమణులు కూడా ఇలాంటి డీప్ఫేక్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షాలిని పాండేకి ఎదురైన ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పలువురు నెటిజన్లు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్నాలజీ నిపుణులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న షాలిని, ఈ సమస్యపై ధైర్యంగా స్పందించి అవగాహన కల్పించడాన్ని పలువురు అభినందిస్తున్నారు. [Shalini Pandey, Shalini Pandey Fake AI Video, Deepfake Abuse, Arjun Reddy Heroine, Entertainment News Telugu]
Aug 31, 2026 6:18PM
ఇది మన అందరి కథ: సితారతో శ్రీవిష్ణు.. బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీ.!
సామజవరగమన, సింగిల్ వంటి ఎంటర్టైనర్స్ తో యూత్ కి చేరువైన శ్రీ విష్ణు.. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం 'కామ్రేడ్ కళ్యాణ్'తో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక చేస్తున్నారు. సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నం.39 గా ఇది తెరకెక్కుతోంది. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ గ్లింప్స్ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో రూపొందుతున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, కథ ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సహజమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది. "చిన్నప్పుడు స్కూల్లో మనం చాలా కలలు కంటాం.. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని. ఆ తర్వాత మన నాన్న స్థోమత మేరకు ఒక మామూలు కాలేజ్ లో చదువుకుంటాం. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం చేయడం మొదలుపెడతాం. నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉంటాం. కానీ, ఈ ప్రయాణంలో మనం ఏమవ్వాలనేది మర్చిపోతాం. ఇది మన అందరి కథ" అంటూ వాయిస్ ఓవర్ తో సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పిస్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువతకు కనెక్ట్ అయ్యే కథాంశం, సహజమైన భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన కథనంతో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నం.39 ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా “ఇది మన అందరి కథ” అనే భావనను అందించనుంది. [Sree Vishnu, Sithara Entertainments, Production No 39 Glimpse, Naga Vamsi, Telugu Film News, Telugu News]
Aug 31, 2026 6:02PM
Toxic: టాక్సిక్ పుణ్యం: యష్ ఇమేజ్ దెబ్బతిందా!
ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే గాని హీరోగా ఫుల్ పాపులారిటీ సంపాదించడనే నానుడి సినీ ప్రేమికుల్లో ఉంది. అందుకు రాకింగ్ స్టార్ యష్ ఒక ఉదాహరణ. ప్రెజెంట్ టాక్సిక్ తో హల్ చల్ చేస్తున్నాడు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో చాలా థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఆ ఇందులో ఏముంది, హిట్టు, ప్లాపు కామన్ అని అనుకోవచ్చు. కానీ ఒక వర్గం ప్రజలు, ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ సోషల్ మీడియా వేదికగా యష్ పై విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతు సినిమా అనేది అందరు కలిసి చూసేలా ఉంటేనే విజయం సాధించడంతో పాటు నిర్మాతలకి కనకవర్షాన్ని కురిపిస్తుంది. కానీ టాక్సిక్ ఒక తండ్రి, కూతురు, అన్నా చెల్లెల్లు కలిసి చూడలేని విధంగా అర్ధం పర్థం లేని హై లెవెల్ రొమాన్స్ సీన్స్ తో నింపేశారు. పవిత్రమైన ప్రేమని నింపుకునే ప్రేమికులు కూడా ఆ సన్నివేశాలని చూడలేరు. శృంగారం అనేది పవిత్రమైన భావనతో కూడిన కడలి లాంటిదనే విషయాన్నీ మర్చిపోవడం దౌర్బాగ్యం. సెన్సార్ వాళ్ళు' A ' సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా అసలు ఇలాంటి సినిమాలు ముందు ముందు రాకుండా చూడాలని వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. Also Read: కలెక్షన్స్ సునామీ: 17 రోజులకి ఎంతంటే! సినిమాని సినిమాగానే చూడాలని టాక్సిక్ ని సమర్ధించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రస్తుతం టాక్సిక్ వరల్డ్ వైడ్ గా 285 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గర ఉందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి . [Toxic, Yash, Kaira Adwani, Tara Sutariya, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Aug 31, 2026 6:01PM
కలెక్షన్స్ సునామీ: 17 రోజులకి ఎంతంటే!
కరుప్పు( వీరభద్రుడు) ఇచ్చిన 'జోష్' తో సూర్య ఈ నెల 14 న 'విశ్వనాథ్ అండ్ సన్స్' తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సూర్యతో పాటు హీరోయిన్ మమితా భైజు పెర్ ఫార్మెన్స్, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభ, సితార 'నాగవంశీ' నిర్మాణ విలువలు 'విశ్వనాథ్ అండ్ సన్స్ ని హిట్ తీరాలకి చేర్చింది. తాజాగా ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్లో అధికారికంగా అడుగుపెట్టింది. 17వ రోజున తమిళ వెర్షన్ 1.35 కోట్ల నెట్ రాబట్టగా, తెలుగు వెర్షన్ సైతం 1.20 కోట్ల నెట్ వసూళ్లని రాబట్టడం గమనార్హం. దీంతో సూర్యకి ఉన్న తెలుగు మార్కెట్ స్టామినా పవర్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోను హవా కంటిన్యూ అవుతుంది. 17వ రోజున విదేశాల్లో దాదాపు .50 లక్షల గ్రాస్ రాబట్టడంతో, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు 63.20 కోట్లకు చేరుకున్నాయి. ఈ విధంగా ఇండియా గ్రాస్ 134.30 కోట్లతో వరల్డ్ వైడ్ గా 200 కోట్లు దాటింది. విడుదలైన మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ 25% కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ లెక్కన లాంగ్ రన్లో విశ్వనాథ్ అండ్ సన్స్ మరిన్ని కొత్త రికార్డులని తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తు వస్తున్నారు. Also read: మాజీ బిఆర్ఎస్ ఎంపీ: చిరంజీవి చేతుల మీదుగా 'సీడ్ గణేశ’ప్రచారానికి శ్రీకారం! [ Viswanath And Sons, 17 Days Collections, Suriya, Mamitha Bhaiju, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Aug 31, 2026 5:12PM
పీ పీ డుమ్ డుమ్: కీరవాణి కోడలు కాబోతున్న కావ్య కళ్యాణ్రామ్.!
టాలీవుడ్లో మరో లవ్ స్టోరీ అఫీషియల్ అయింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త నిజమేనని తేలిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు, సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, 'బలగం' ఫేమ్ నటి కావ్య కళ్యాణ్రామ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా కాలభైరవ షేర్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో వీళ్లిద్దరి రిలేషన్షిప్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. కావ్యతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ, గుండెల్లోని భావాలన్నింటినీ ఒక పోయెటిక్ అండ్ మెలోడియస్ నోట్లా రాసుకొచ్చారు కాలభైరవ . "కావ్య బాబు.. నీతో గడిపే ప్రతి క్షణం పర్వతాల మధ్య కూర్చుని ప్రశాంతమైన నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లు ఉంటుంది" అంటూ ఎంతో రోమాంటిక్గా తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాదు.. నీతో కలిసి ఏ పని చేసినా అదొక ముగింపు లేని సుదీర్ఘమైన వెకేషన్లా అనిపిస్తుందని, చలికాలంలో పొద్దున్నే తాగే హాట్ కాఫీలా నీతో సంభాషణలు హాయినిస్తాయని చెప్పారు. "నాలో కలుగుతున్న ఈ మధురానుభూతికి ఇన్నాళ్లూ పేరు పెట్టలేకపోయాను.. కానీ మన ప్రయాణంలో నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే.. ఇది 'సొంత ఇల్లు' అనే భావన. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఒక కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు, సొంత ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపించింది. ఇక ఆ ఇంటిని వదిలి నేనెప్పుడూ బయటకు వెళ్లలేదు" అంటూ కాలభైరవ రాసిన ఆ పదాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. ఎం.ఎం. కీరవాణి వారసుడిగా టాలీవుడ్లో సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ.. అటు 'గంగోత్రి'లో బాలనటిగా నటించి, ఆ తర్వాత 'మసూద', 'బలగం' సినిమాలతో హీరోయిన్గా మెప్పించిన కావ్య కళ్యాణ్రామ్తో ఏడడుగులు వేయబోతుండటం విశేషం. వీళ్ల జంట నిజంగానే ఎంతో చూడముచ్చటగా ఉందంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. https://www.instagram.com/p/DcsymQIgbQN/ [Kaala Bhairava, Kaavya Kalyanram, Relationship, Love Story, Wedding, MM Keeravani, Telugu Film News, Telugu News]
Aug 31, 2026 5:09PM
మాజీ బిఆర్ఎస్ ఎంపీ: చిరంజీవి చేతుల మీదుగా 'సీడ్ గణేశ’ప్రచారానికి శ్రీకారం!
వినాయక చవితి(సెప్టెంబర్ 14 ) మరికొన్ని రోజుల్లో రాబోతున్న విషయం తెలిసిందే . దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం లాగానే పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. రెండు రోజుల నుంచే లారీల్లో, ఆటోల్లో అయితే లంబోదరుడి విగ్రహాలు తన నివాస స్థలానికి బయలుదేరుతున్నాయి. అయితే, ఈ వేడుకల వెనుక పర్యావరణానికి జరుగుతున్న తీవ్ర విఘాతం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల విపరీతమైన వాడకం వల్ల మన నీటి వనరులు కలుషితమై జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ మాజీ ఎంపీ, కె సి ఆర్ తోడల్లుడు కొడుకు జే సంతోష్ కుమార్ పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకల కోసం ‘సీడ్ గణేశ’ (విత్తన గణపతి) ప్రచారాన్ని రూపొందించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు కెమికల్స్ తో కూడిన విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో నా మిత్రుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్ధాలతో, విత్తనాలతో సీడ్ గణేష్ విగ్రహాలని రూపొందించారు. 'వినాయకుడి పూజ ముగిసిన తర్వాత నీటి వనరుల్లో కాకుండా ఇళ్లలోనే విగ్రహ నిమజ్జనం చేసుకోవాలి. నా విత్తన గణపతులను సహజసిద్ధమైన మట్టి, కోకో పీట్, కొబ్బరి పీచులతో తయారు చేయడంతో పాటు, వాటిలో వేప మరియు చింత వంటి దేశవాళీ వృక్షాల విత్తనాలను అమర్చడం విశేషం. పూజ అనంతరం ఇంట్లోనే కుండీలో నీటిని చల్లి నిమజ్జనం చేయడం వల్ల ఆ విగ్రహం కరిగి, అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. "స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే ఒక మొక్క రూపంలో మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ప్రతీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులని నింపాలని చిరంజీవి చెప్పుకొచ్చాడు. Also Read: 'ప్రేమ' కి క్యాన్సర్ అంటూ ప్రచారం.. 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్ 2018లో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 19.60 కోట్లకు పైగా మొక్కలు నాటడం గమనార్హం. ‘ఒక్కరు 3 మొక్కలు నాటాలి, వాటిని 3 ఏళ్ల పాటు సంరక్షించాలి, అలాగే మరొక ముగ్గురిని నాటమని నామినేట్ చేయాలి’ అనే సరళమైన 3x3x3 సూత్రంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఇక 2020 కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రారంభమైన ‘సీడ్ గణేశ’ వినూత్న ప్రచారం ద్వారా ప్రతీ సీజన్లోనూ ఉచితంగా సుమారు 1.5 లక్షల మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేయడం విశేషం. [ Chiranjeevi, Seed Ganesha, Green India , TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Aug 31, 2026 4:43PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com











