
దీవాన మూవీ నిర్మాతలకు జాక్ పాట్!
సినీ పరిశ్రమలో కంటెంట్ను నమ్ముకుంటే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో లేటెస్ట్ మూవీ 'దీవాన' (Deewana) నిరూపించింది. సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. నమ్మకమే పెట్టుబడి అని. ఆ నమ్మకాన్ని, తమ సినిమాలోని కంటెంట్ను మాత్రమే నమ్ముకున్న దీవాన చిత్ర నిర్మాతలు మొదట కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, ఇప్పుడు ఏకంగా ఊహించని రేంజ్లో భారీ జాక్ పాట్ కొట్టారు. సాధారణంగా ఒక చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమా రూపొందుతున్నప్పుడు, నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లడం కోసం సినిమా విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ రికవరీ అయిపోయి, థియేట్రికల్ రిలీజ్ టైమ్కి టెన్షన్ తగ్గుతుందని భావిస్తారు. కానీ, దీవాన చిత్ర నిర్మాతలు మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్లారు. తమ సినిమా అవుట్పుట్ పై ఉన్న నమ్మకంతో విడుదలకు ముందు తక్కువ రేట్లకు అడిగిన ఆఫర్లను వారు సున్నితంగా తిరస్కరించారు. కంటెంట్ పక్కాగా ఉంటే థియేటర్లలో రెస్పాన్స్ చూశాక అదే డిమాండ్ వస్తుందనే మొండి ధైర్యంతో నాన్-థియేట్రికల్ రైట్స్ను అస్సలు అమ్మకుండా హోల్డ్లో పెట్టేశారు. ఇప్పుడు వారి నమ్మకం నిజమైంది. ఈ సినిమా పాజిటివ్ రివ్యూల ఇంపాక్ట్ ఇప్పుడు నాన్-థియేట్రికల్ మార్కెట్పై గట్టిగా పడింది. విడుదలకు ముందు ఈ హక్కుల కోసం పెద్దగా ఆసక్తి చూపని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లు, శాటిలైట్ ఛానెళ్లు ఇప్పుడు దీవాన రైట్స్ కోసం పోటీ పడటం విశేషం. ఈ క్రమంలోనే నిర్మాతలు ఆశించిన దానికంటే ఎక్కువగా, ఏకంగా రూ. 7 కోట్లకు పైగా భారీ ధర పలికి దీవాన నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయి బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రిస్క్ చేసి కంటెంట్ను నమ్ముకున్నందుకు నిర్మాతలకు ఒక జాక్ పాట్లా మారి లాభాల పంట పండిస్తోంది. Deewana Movie, Non Theatrical Rights, OTT Deal, TeluguOne
Jul 4, 2026 7:41PM
టెలిగ్రామ్కు కేంద్రం అల్టిమేటం.. 15 రోజుల్లో పైరసీ ఛానెల్స్ డిలీట్ చేయకపోతే బ్యాన్?
సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్(Telegram)కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న అక్రమ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్లో పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మరియు ఇతర ఆడియో-విజువల్ మెటీరియల్ను అక్రమంగా హోస్ట్ చేస్తున్న లేదా షేర్ చేస్తున్న అన్ని గ్రూపులు, ఛానెళ్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ పైరసీ కంటెంట్ను తొలగించడానికి టెలిగ్రామ్ యాజమాన్యానికి కేవలం 15 రోజుల గడువును విధించింది. ఒకవేళ ఈ 15 రోజుల వ్యవధిలో సదరు అక్రమ కంటెంట్, గ్రూపులను తొలగించడంలో విఫలమైతే, టెలిగ్రామ్ సంస్థపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు ఐ అండ్ బీ మినిస్ట్రీ ఒక సమగ్రమైన నోటీసును టెలిగ్రామ్కు జారీ చేసింది. తాము తీసుకున్న చర్యలపై రాబోయే 15 రోజుల్లోగా సమగ్రమైన 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ATR) సమర్పించాలని కోరింది. గతంలో కేవలం కొన్ని నిర్దిష్ట లింక్లను మాత్రమే బ్లాక్ చేసే విధానం ఉండేదని, అయితే ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి నేరుగా ప్లాట్ఫార్మ్ జవాబుదారీతనంపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీని, చలనచిత్ర పరిశ్రమను, బ్రాడ్కాస్టర్లను, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్లను, నిర్మాతలు, పంపిణీదారులను పైరసీ మహమ్మారి నుండి రక్షించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఓటీటీ ప్లాట్ఫార్మ్ల నుండి, కంటెంట్ ఓనర్ల నుండి వచ్చిన లెక్కలేనన్ని ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, పైరసీకి అడ్డాగా మారిన సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానెళ్లను ప్రాథమికంగా గుర్తించడం గమనార్హం. భారతీయ చట్టాల ప్రకారం కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదని, అది కాపీరైట్ యాక్ట్ 1957 & సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద శిక్షార్హమైన క్రిమినల్ నేరమని కేంద్రం గుర్తుచేసింది. ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం టెలిగ్రామ్ ఒక మధ్యవర్తి ప్లాట్ఫార్మ్ అయినందున, తన నెట్వర్క్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ షేర్ కాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత సదరు సంస్థదే అని పేర్కొంది. ప్రభుత్వం లేదా కంటెంట్ ఓనర్లు వచ్చి ప్రతీ లింక్ను చూపించే వరకు వేచి చూడకుండా, టెలిగ్రామ్ తన అంతర్గత వ్యవస్థలను బలోపేతం చేసుకుని అక్రమ కంటెంట్ను ప్రోయాక్టివ్గా గుర్తించి తొలగించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎగ్జామ్ పేపర్ లీకేజీల వ్యవహారంలో గత నెలలోనే టెలిగ్రామ్ యాక్సెస్పై తాత్కాలిక ఆంక్షలు విధించిన కేంద్రం, ఇప్పుడు పైరసీ విషయంలో మళ్లీ నోటీసులు ఇవ్వడం డిజిటల్ రంగంలో సంచలనంగా మారింది. Telegram, Piracy, Central Government, Notice, TeluguOne
Jul 4, 2026 7:29PM
నాగబంధం మేకర్స్ సంచలన నిర్ణయం.. ఏకంగా 20 నిమిషాల రన్టైమ్ కట్!
టాలీవుడ్లో మైథలాజికల్ అడ్వెంచర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోనే భారీ అంచనాలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ విజువల్ వండర్ చిత్రం 'నాగబంధం' (Nagabandham). విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సోషియో మైథలాజికల్ ఫాంటసీ డ్రామాను దర్శకుడు అభిషేక్ నామా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, జూలై 3న థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి విభిన్నమైన స్పందన లభించింది. సినిమాలోని గ్రాండియర్, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసిన ప్రధానమైన ఫిర్యాదు ఒక్కటే. అది ఈ సినిమా నిడివి. నాగబంధం సినిమాను మొదట ఏకంగా 185 నిమిషాల (3 గంటల 5 నిమిషాలు) సుదీర్ఘమైన రన్టైమ్తో థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమాలోని కొన్ని సాగదీత సీన్లు, నెమ్మదించిన కథనం కారణంగా ప్రేక్షకులు కొంత అసహనానికి గురయ్యారు. ఈ ఫీడ్బ్యాక్ను గమనించిన మేకర్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమాకు వస్తున్న ప్రేక్షకుల రివ్యూలను గౌరవిస్తూ, సినిమాలోని రన్టైమ్ను ఏకంగా 20 నిమిషాల పాటు తగ్గించారు. ఈ ట్రిమ్మింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నాగబంధం సరికొత్త నిడివి ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) మాత్రమే. ఈ 20 నిమిషాల అనవసరమైన సాగదీత సీన్లను తొలగించడం వల్ల సినిమా కథనం ఇప్పుడు మరింత వేగంగా, ఆసక్తికరంగా మారిందని ఇండస్ట్రీ టాక్. ఈ మార్పుల తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Jul 4, 2026 7:17PM
స్టేజ్ పైనే ఏడ్చేసిన 'రావు బహదూర్' హీరోయిన్.!
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur) ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాధించిన విజయానందాన్ని పంచుకోవడానికి చిత్ర యూనిట్ శనివారం ఒక సక్సెస్ మీట్ ను నిర్వహించింది. అయితే, ఈ సక్సెస్ మీట్లో ఒక ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన మలయాళ బ్యూటీ దీపా థామస్ (Deepa Thomas) వేదికపై మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. దర్శకుడు వెంకటేష్ మహా తన సుదీర్ఘమైన 5 ఏళ్ల కెరీర్ శ్రమను ధారపోసి ఈ వినూత్నమైన కథను సిద్ధం చేశారు. కేవలం కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, 169 నిమిషాల నిడివితో సమాజంలోని వర్ణవివక్ష, వంశపారపర్య అహంకారం, మానసిక ఘర్షణలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇంతటి భారీ ప్రాజెక్ట్లో ఒక మలయాళ అమ్మాయికి ఇంతటి బలమైన, ఎమోషనల్ ప్రాధాన్యత ఉన్న రేణుక పాత్రను ఇవ్వడంపై దీపా థామస్ సక్సెస్ ఈవెంట్లో తన మనసు విప్పింది. ఒక తెలుగు సినిమాలో తనకు దక్కిన గుర్తింపును చూసి, ప్రేక్షకులు తన నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లను ప్రస్తావిస్తూ ఆమె ఆనందబాష్పాలు రాల్చింది. సక్సెస్ మీట్ వేదికపై దీపా థామస్ మాట్లాడుతూ.. "మహేష్ బాబు గారి GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో, వెంకటేష్ మహా గారి దర్శకత్వంలో నటించడం నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఒక పరభాషా నటినైనా తెలుగు ప్రేక్షకులు నన్ను తమ సొంత అమ్మాయిలా ఆదరిస్తున్నారు. థియేటర్ల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దీపా థామస్ ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Rao Bahadur, Satyadev, Deepa Thomas, Venkatesh Maha, Mahesh Babu
Jul 4, 2026 6:59PM.webp)
Maa inti Bangaram: మా ఇంటి బంగారం కలెక్షన్స్ అసలు లెక్కలు ఇవే.. మరి సాయిపల్లవి చేసి ఉంటే
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి సరికొత్త నిర్వచనం చెబుతూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం'. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్లో గత 17 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం సమంత వన్-ఉమెన్ షోతోనే థియేటర్లు హౌస్ఫుల్ కావడం విశేషం. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం దేశీయంగా 5.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అదేవిధంగా ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ. 6.20 కోట్లు, మరియు ఓవర్సీస్ మార్కెట్లలో రూ. 4.50 కోట్ల గ్రాస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఏకంగా రూ. 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో డబుల్ డిజిట్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. ఈ ఓపెనింగ్స్ చూశాక సమంత స్టార్ పవర్ ఏంటో మరోసారి స్పష్టమైంది. కేవలం ఒకే ఒక్క వారంలోనే ఈ చిత్రం . 35 కోట్ల నెట్ కలెక్షన్లు దాటి లాంగ్ రన్లో తిరుగులేని విధంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల భారీ వసూళ్లను సాధించి, 100 కోట్ల క్లబ్కు అత్యంత చేరువలో నిలిచింది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘ఫీమేల్ లీడ్’ (మహిళా ప్రధాన) చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డును లిఖించింది. 2009లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం సాధించిన రూ. 70 కోట్ల వరల్డ్వైడ్ గ్రాస్ రికార్డును సమంత 17 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది. మహానటి, రుద్రమదేవి వంటి చిత్రాలు ఉన్నప్పటికీ, వాటిలో భారీ తారాగణం మద్దతు ఉంది. కానీ పూర్తి సోలో ఫీమేల్ లీడ్గా సమంత సాధించిన ఈ ఘనత టాలీవుడ్లో సరికొత్త చరిత్ర. Also read: Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు స్వర్ణ/ఝాన్సీగా సమంత నటన, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. సంతోష్ నారాయణన్ అందించిన ఎలెక్ట్రిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి మరియు శ్రీముఖి కీలక పాత్రల్లో నటించగా, సమంత స్వయంగా తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గర్భవతిగా ఉన్న సమయంలోనే సమంత ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ బ్లాక్స్ షూట్ చేశారనే విషయం తెలిసి అభిమానులు ఆమె డెడికేషన్కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా వసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.ఇక ఈ మూవీ తొలుత సాయి పల్లవి చేయాల్సింది. కానీ సాయిపల్లవి బిజీగా ఉండటంతో సమంత చేసింది. ఈ విషయాన్నీ సమంత నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
Jul 4, 2026 5:19PM
Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన స్టార్ హీరోల మార్కెట్, ఇప్పుడు గ్లోబల్ స్థాయికి విస్తరించింది. అయితే భారీ క్రేజ్తో పాటే బాక్సాఫీస్ వద్ద రిస్క్ కూడా అంతకంతకు పెరుగుతోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములా సినిమాలని పక్కనబెట్టి, మన ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్తో పీరియాడిక్ బ్యాక్డ్రాప్, సోషియో ఫ్యాంటసీ వంటి అత్యంత రిస్కీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా మారుతున్నాయి, ఏయే హీరోలు ఎంతెంత బడ్జెట్తో రిస్క్ చేస్తున్నారనే విశ్లేషణ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రిస్కీ గేమ్ లో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. కల్కి లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న 'ఫౌజీ' ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలని మోస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సీతారామం' లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో మెప్పించిన హను రాఘవపూడి, ఇంతటి భారీ పాన్ ఇండియా యాక్షన్ వార్ డ్రామాను హ్యాండిల్ చేయడం ఇదే మొదటిసారి. 1930 - 1940 కాలం నాటి బ్రిటిష్ ఇండియా, ప్రీ, ఇండిపెండెన్స్ యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ పీరియడ్ ఎలిమెంట్స్ నేటి మాస్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, భారీ బడ్జెట్ రికవరీ ఎలా సాధ్యమవుతుంది అనేది ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద ప్రశ్న. హిట్ మాత్రమే సరిపోదు, ఏకంగా 1000 కోట్ల క్లబ్ను టార్గెట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్లోకి వస్తుంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్లో ఎన్నడూ లేనంత పెద్ద సోషియో ఫ్యాంటసీ రిస్క్కి సిద్ధమయ్యారు. అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర' పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సహజంగానే సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగి, బడ్జెట్ దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్కు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి గత లేటెస్ట్ సినిమాల మార్కెట్ మరియు బాక్సాఫీస్ రికార్డులను గమనిస్తే, ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం సాధారణ విషయం కాదు. కేవలం తెలుగు మార్కెట్ పైనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తేనే బయ్యర్లు లాభాల బాట పడతారు. Also read: fauzi: ఫౌజీ సెట్స్లో మరోసారి ఘోర ప్రమాదం.. వరుస ప్రమాదాలకి ఇదే కారణమా! టాలీవుడ్లో కేవలం ఈ ఇద్దరే కాదు, రాబోయే సెకండాఫ్లో విజయ్ దేవరకొండ తన రణబలి మూవీతో, నిఖిల్ స్వయంభు మూవీతో తమ మార్కెట్ ని మించిన బడ్జెట్ తో వస్తున్నారు. ఇలా మొత్తం 6 పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటి మొత్తం బడ్జెట్ దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఉండడం గమనార్హం. పీరియాడిక్ సినిమాలకు భారీ విజువల్స్, ఎక్కువ రన్టైమ్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు అవసరమవుతాయి. దీంతో ఒక్కో ప్రాజెక్ట్ పై నిర్మాతలకు, బయ్యర్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా వందల కోట్ల నష్టాలు తప్పవు. అయితే, కంటెంట్ బలంగా ఉండి, ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తే టాలీవుడ్ మార్కెట్ స్థాయికి 2000 కోట్లు పెద్ద విషయం కాదని గత రికార్డులు నిరూపించాయి. మరి మన స్టార్ హీరోలు, స్టార్ హీరో స్టేటస్ రేసులో ఉన్న వాళ్ళు తీసుకున్న ఈ భారీ రిస్క్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, టాలీవుడ్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.
Jul 4, 2026 4:58PM
fauzi: ఫౌజీ సెట్స్లో మరోసారి ఘోర ప్రమాదం.. వరుస ప్రమాదాలకి ఇదే కారణమా!
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సీతారామం ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. శుక్రవారం జూలై 3న అంటే నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం సెట్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది . ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు వీడియోలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ తగలబడటంతో పొగ పైకి రావడం కనిపించింది. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో సెట్స్లో టెంట్లు, షూటింగ్ కోసం తీసుకు వచ్చిన ఎక్విప్మెంట్ కొంత డ్యామేజ్ అయ్యిందని, స్వల్ప నష్టం వచ్చిందని టాక్. అయితే... ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా అనే కామెంట్స్ ని పలువురు సినీ శ్రేయోభిలాషులు చేస్తున్నారు. Also read: Sing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే! డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ ఉండవచ్చని టాక్. ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని చెప్తున్నారు. ప్రభాస్ తో ఇమాన్వి జత కడుతుండగా పాన్ ఇండియా స్థాయిలో పేరున్న యాక్టర్స్ ఫౌజీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
Jul 4, 2026 4:33PM
అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ ఆ సినిమాకు రీమేకా? సీక్రెట్ బయటపెట్టిన కీర్తి సురేష్!
విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి బ్లాక్బస్టర్ హిట్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఐదో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా '#VenkyAnil5' అని, అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరోగా నటిస్తుండటంతో '#NKRAR2' అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పుకారు విపరీతంగా షేర్ అవుతోంది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న 'గురువాయూర్ అంబలనాదయిల్' (Guruvayoor Ambalanadayil) చిత్రానికి ఇది రీమేక్ అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. మలయాళంలో పెళ్లి బ్యాక్డ్రాప్లో సాగే హిలేరియస్ కామెడీ డ్రామా కావడం, అనిల్ రావిపూడి కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అద్భుతంగా తెరకెక్కించగలగడంతో ఈ రీమేక్ వార్తలను అభిమానులు సైతం నిజమేనని నమ్మడం ప్రారంభించారు. ఈ పుకార్లపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిపారు. అయితే, ఈ రూమర్లకు తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టారు. నెట్టింట వైరల్ అవుతున్న ఒక మీమ్కు కీర్తి సురేష్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా స్పందించారు. ఆ మీమ్లో 'గురువాయూర్ అంబలనాదయిల్ సినిమాకు వెంకీ-అనిల్ చిత్రం రీమేక్ అంట' అని రాసి ఉన్న పోస్ట్కు, కీర్తి సురేష్ తన అఫీషియల్ ఐడీ నుండి నేరుగా కామెంట్ చేశారు. "నో ఇట్స్ నాట్" (No it’s not ! 😂) అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేస్తూ ఆమె క్లారిటీ ఇచ్చారు. దీని ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ముమ్మాటికీ అవాస్తవమని, ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా రీమేక్ కాదు, ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా అని తేలిపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి ఒరిజినల్ కథతో, తనదైన శైలి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్తో స్వయంగా రాసుకున్నారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jul 4, 2026 4:32PM
సోనీతో సమంత.. బిగ్ అనౌన్స్మెంట్.!
ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సమంత (Samantha) ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇదే ఉత్సాహంతో సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ తమిళ్ తో చేతులు కలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా సోనీ లివ్ తమిళ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాల్ని వివరాలను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఒక వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు అంటూ సమంత విజయవంతంగా దూసుకెళ్తున్నారు. ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం, పాత్ బ్రేకింగ్ నిర్ణయాల్ని తీసుకోవడం సమంతకు అలవాటే. ఈ క్రమంలోనే సమంత ఈ కొత్త ప్రాజెక్ట్కి ఓకే చెప్పారు. తమిళ్లో సోనీ లివ్లో సమంత చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా తక్కువ వివరాలు వెల్లడించినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు మాత్రం దీని గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఇదొక డిఫరెంట్ టాక్ షో అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా, సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. అందుకే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాంటిది ఇప్పుడు సోనీ లివ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. టాక్ షో కాబట్టే, ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. https://www.instagram.com/p/DaVPn__x7oF/
Jul 4, 2026 4:17PM
Sing Geetham: సింగ్ గీతం ఓటీటీ రిలీజ్, థియేటర్ వెర్షన్ కంటే వెరీ డిఫరెంట్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ఎన్నో అద్భుతమైన సృజనాత్మకతతో కూడిన సినిమాలని తెరకెక్కించి తెలుగు సినిమా మురిసిపోయేలా చేసిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆ కోవలోనే గత నెల జూన్ 12 న వచ్చిన తాజా చిత్రం 'సింగ్ గీతం'. మూవీ బాగుందనే పేరు వచ్చినప్పటకి కొత్త వాళ్ళు కాకుండా నోటెడ్ కాస్టింగ్ అయితే విజయం యొక్క రూపం ఇంకోలా ఉండేదనే అభిప్రాయం మూవీ చూసిన వాళ్ళ దగ్గర్నుంచి వ్యక్తమయ్యింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్క్రీన్పై అలరించడానికి సిద్ధమైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా జులై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ వెర్షన్ పై నాగ్అశ్విన్ గతంలో మాట్లాడుతు 'డిజిటల్ స్ట్రీమింగ్కి ముందు బిగ్ సర్ప్రైజ్ ఉంటుంది. థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్గా . క్లైమాక్స్లో గ్రాఫిక్ వర్క్స్ని మరింత మెరుగు పరిచేందుకు టీం ప్లాన్ చేస్తుంది. ఫ్యూచర్లో 'సింగ్ గీతం'ని డిజిటల్ వేదికగా ఎప్పటికీ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. సింగ్ గీతం కథాంశం ఎంతో ఆసక్తికరంగా, పర్యావరణ స్పృహని పెంపొందించే విధంగా ఉంటుంది. కుబేరపురం అనే ఒక గనుల గ్రామంలో కార్పొరేట్ అత్యాశ కారణంగా పర్యావరణం పూర్తిగా నాశనమవుతుంది. అక్కడ మిగిలిన ఒకే ఒక్క పవిత్రమైన చెట్టుపై గౌరీ (అహల్య బమ్రూ) అనే యువతి నివసిస్తూ ఉంటుంది. తన తండ్రి వారసత్వంగా వదిలిన బంగారు గనుల కోసం వెతుకుతూ ప్రతాప్ (అయాన్) అనే యువకుడు ఆ గ్రామానికి వస్తాడు. అక్కడ గౌరీని చూసి ప్రేమలో పడతాడు. అయితే, అత్యాశతో కూడిన ఒక వ్యాపార సామ్రాజ్యం ఆ చివరి పవిత్ర వృక్షాన్ని కూల్చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ గ్రామానికి ఒక వింత శాపం తగులుతుంది. ఆ శాపం వల్ల గ్రామ ప్రజలందరూ సాధారణంగా మాట్లాడే శక్తిని కోల్పోతారు. వారు తమ మనసులోని ప్రతి భావాన్ని, కోపాన్ని, ఆనందాన్ని కేవలం పాటల ద్వారా మాత్రమే వ్యక్తపరచాల్సి వస్తుంది. Also read: sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది డైలాగుల స్థానంలో కేవలం పాటలతోనే సినిమాని నడిపించడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ప్రయోగం. 94 ఏళ్ల వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు వర్చువల్ మానిటర్ ద్వారా తన ఇంటి నుంచే రిమోట్ పద్ధతిలో దాదాపు 77 నుండి 78 పనిదినాల్లో షూటింగ్ని పూర్తి చేయడం విశేషం. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు మూవీకి ప్రాణంగా నిలిచాయి. కేవలం 2 గంటల 17 నిమిషాల నిడివి గల ఈ క్లీన్ యూ (U) సర్టిఫైడ్ చిత్రం, ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. యువ నటీనటులు అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి అద్భుత నటనను కనబర్చగా, నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్, విజయ్ దేవరకొండ ప్రత్యేక అతిథి క్యారెక్టర్స్ లో మెరిశారు.
Jul 4, 2026 4:05PM
sreeleela: శ్రీలీలకి కాబోయే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిందోచ్.. అధికారకంగా తనే చెప్పింది
షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన శ్రీలీల(Sreeleela)తెలుగులో తన స్పీడ్ ని కొంచం తగ్గించినా బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తు బిజీగా ఉంది. ఎనర్జిటిక్ డ్యాన్స్ లకి పెట్టింది పేరైన శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి, ప్రేమ, కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి ఓపెన్గా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీలీల మాట్లాడుతు ఇప్పటివరకు నాకైతే ఎవరూ ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే నా చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన 'అమ్మమ్మ వైబ్స్' ఉంటాయని నా స్నేహితులు చెబుతుంటారు. నేను కోప్పడితే అందరూ సీరియస్గా తీసుకోకుండా నవ్వుతారని, బహుశా అందుకే ఇప్పటివరకు తనతో ఎవరూ అంతగా సింక్ అవ్వలే దేమో. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నాకు కాబోయే భర్త లుక్స్ పరంగా చాలా అందంగా, గ్లామరస్గా లేకపోయినా పర్వాలేదు. బాహ్య సౌందర్యం కంటే మనసు అందం ముఖ్యమని నమ్ముతాను. నా లైఫ్ పార్ట్నర్లో ఖచ్చితంగా మూడు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. మొదటిది.. అతను నన్ను ఎంతో బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే బంధం బలంగా ఉంటుంది. రెండవది.. ప్రొఫెషన్ సినీ కెరీర్కి నాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాలి. మూడవది.. అన్నింటికంటే ముఖ్యంగా అతను చాలా నిజాయితీగా ఉండాలి. నాతో ఎంతో సరదాగా, జోవియల్గా సమయాన్ని గడపాలని చెప్పుకొచ్చింది. ఈ సమాజంలో కేవలం పైపైన కనిపించే ఆడంబరాలు, అందాల కంటే.. నమ్మకం, నిజాయితీ, పరస్పర అవగాహన వంటి విలువలే ఒక వైవాహిక బంధాన్ని వంద శాతం విజయవంతం చేస్తాయని శ్రీలీల తన రిలేషన్షిప్ అడ్వైజ్ ద్వారా స్పష్టం చేసింది. . నెటిజన్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శ్రీలీలకి కాబోయే మొగుడు నిజంగా అదృష్టవంతుడే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Jul 4, 2026 3:33PM
అల్లు అర్జున్ వదిలేస్తే బ్లాక్బస్టరే.. ఎన్టీఆర్కు మళ్ళీ లక్కీ ఛాన్స్.!
సినిమా పరిశ్రమలో ఒకరి వద్దనుకున్న కథ మరొకరి లక్కీ ఛాన్స్గా మారడం చాలా సహజం. అయితే టాలీవుడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వదిలేసుకున్న సినిమాలు వేరే హీరోల వద్దకు వెళ్తే అవి కచ్చితంగా బ్లాక్బస్టర్లుగా మారుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు కథ చెప్పినప్పుడు నచ్చకపోవడమో, లేక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ దర్శకుడి మునుపటి సినిమా రిజల్ట్ను బట్టి హ్యాండ్ ఇవ్వడమో బన్నీ స్టైల్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అనౌన్స్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ మూవీ 'గాడ్ ఆఫ్ వార్' (God of War) వెనుక కూడా ఇలాంటి ఆసక్తికరమైన కథ ఒకటి నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొదట అల్లు అర్జున్ ఖాతాలోనే ఉంది. కానీ సమీకరణాలు మారి తారక్ చేతికి చేరడంతో, బన్నీ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా ఇండస్ట్రీ షేక్ చేయడం ఖాయమని నందమూరి అభిమానులు ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు. గతంలోకి వెళ్తే అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'బొమ్మరిల్లు', '100% లవ్', 'టెంపర్' వంటి సూపర్ హిట్ చిత్రాల కథలు మొదట అల్లు అర్జున్ దగ్గరికే వెళ్లాయి. అప్పట్లో బిజీ షెడ్యూల్స్ కారణంగా బన్నీ ఈ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సినిమాలు వేరే హీరోలతో తెరకెక్కి ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనమంతా చూశాం. ఈ సెంటిమెంట్ కేవలం కథల దశలోనే కాదు, ఏకంగా అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద ప్రాజెక్టుల విషయంలోనూ రిపీట్ కావడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో 'AA 21' అంటూ ఒక భారీ చిత్రాన్ని ప్రకటించాడు. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. తర్వాత ఆ కథ కాస్తా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లింది. అలా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'దేవర' చిత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లతో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఇదే సీన్ డైరెక్టర్ త్రివిక్రమ్ విషయంలోనూ రిపీట్ అయింది. అల్లు అర్జున్కు 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' వంటి హ్యాట్రిక్ బ్లాక్బస్టర్ హిట్స్ గురూజీతో ఐకాన్ స్టార్ తన నాల్గవ సినిమాను అనౌన్స్ చేశాడు. అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. కానీ త్రివిక్రమ్ మునుపటి చిత్రం 'గుంటూరు కారం' ఆశించిన విజయం సాధించకపోవడం, మరోవైపు 'పుష్ప' సిరీస్తో అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో, త్రివిక్రమ్కు పాన్ ఇండియా మార్కెట్ హ్యాండ్లింగ్ అనుభవం లేదనే నెపంతో బన్నీ ఈ ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టాడనే ప్రచారం సాగింది. చివరకు ఆ పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్' ఇప్పుడు ఎన్టీఆర్ గూటికి చేరింది. బన్నీ వదిలేసిన గత ఐదారు సినిమాలు, అలాగే కొరటాల 'దేవర' హిస్టరీని చూస్తుంటే, త్రివిక్రమ్-తారక్ కాంబోలో రాబోతున్న ఈ 'గాడ్ ఆఫ్ వార్' కూడా బాక్సాఫీస్ను ఊచకోత కోయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. Allu Arjun, Jr NTR, Koratala Siva, Trivikram Srinivas, God Of War
Jul 4, 2026 3:14PM
Sridevi: 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి కీలక ప్రకటన.. నా పేరుతో అవి నడుపుతున్నారు
'కోర్ట్' మూవీతో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ శ్రీదేవి. ప్రీవియస్ మూవీ బ్యాండ్ మేళం తో కూడా సత్తా చాటిన శ్రీదేవి ప్రస్తుతం టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.తాజాగా డిజిటల్ మోసంపై స్పందిస్తూ తన అభిమానులని. నెటిజన్లని అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ప్రపంచంలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలు మరియు డిజిటల్ అవకతవకలపై శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కీలకమైన ప్రకటనని విడుదల చేశారు. కొంతమంది కేటుగాళ్లు నా అనుమతి లేకుండా, నాపేరు, ఫొటోలు, గుర్తింపుని అక్రమంగా వాడుకుంటూ కొన్ని నకిలీ యూట్యూబ్ ఛానెళ్ల ని నడుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ మోసగించే ప్రమాదం ఉంది. ఆ యూట్యూబ్ ఛానెళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు.ఎవరైనా సరే యూట్యూబ్లో తన పేరుతో ఉన్న ఛానెళ్లని చూస్తే, వాటిని తన అధికారిక ఛానెళ్లుగా భావించి మోసపోవద్దు. అవన్నీ నూటికి నూరు శాతం నకిలీవి. ఎలాంటి వివరాలైన నా ఇనిస్టా పేజీ నుంచి వచ్చాయని తెలిపింది. also read: Mohanlal: క్షమాబిక్ష పథకంలో మోహన్ లాల్ పేరు..ఇక కథ ముగిసినట్టేనా!
Jul 4, 2026 1:10PM
Mohanlal: క్షమాబిక్ష పథకంలో మోహన్ లాల్ పేరు..ఇక కథ ముగిసినట్టేనా!
మలయాళ మెగాస్టార్ అనే టాగ్ లైన్ కి తగ్గట్టుగానే యువ హీరోలకి పోటీ ఇస్తూ మోహన్ లాల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. 14 ఏళ్లుగా మోహన్ లాల్ పై ఉన్న ఏనుగు దంతాల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మోహన్ లాల్ కేరళ అటవీ శాఖ ప్రవేశపెట్టిన వన్ టైమ్ క్షమాభిక్ష పథకంని ఆశ్రయించారు. ఈ ప్రత్యేక పథకం ద్వారా తన వద్ద ఉన్న వన్యప్రాణి వస్తువులను అధికారికంగా ప్రకటించి, చట్టపరమైన రక్షణ పొందాలని ఆయన భావిస్తున్నారు. ఈ వివాదం 2011 డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఆ సమయంలో కొచ్చిలోని థేవరాలో ఉన్న మోహన్లాల్ నివాసంపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఊహించని విధంగా 2 జతల ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విలువైన విగ్రహాలు బయటపడ్డాయి. వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం, ముందస్తు అనుమతి లేదా యాజమాన్య పత్రాలు లేకుండా ఇలాంటి వస్తువులని ఉంచుకోవడం తీవ్రమైన నేరం. దీని ఆధారంగా 2012లో కేరళ అటవీ శాఖ మోహన్లాల్ మరియు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అప్పటి నుండి ఈ వ్యవహారం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. also read: Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్న బండ్ల గణేష్ గతంలో ఈ కేసును ఉపసంహరించుకోవాలని కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని పెరుంబావూర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు మోహన్ లాల్ కి అనుకూలంగా ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ పత్రాలని సైతం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అయితే వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 40(4) ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న ఇలాంటి వస్తువులను స్వచ్ఛందంగా డిక్లేర్ చేయడానికి ప్రభుత్వం ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిని బేస్ చేసుకుని కేరళ అటవీ శాఖ ఈ వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్ని తీసుకురావడంతో మోహన్లాల్ కొచ్చి నివాసంలో ఉన్న ఏనుగు దంతాలను అటవీ శాఖ అధికారుల వద్ద డిక్లేర్ చేశారు.
Jul 4, 2026 12:52PM
తిరుపతిలో 'లెనిన్' గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్' (LENIN) సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ రేపు అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది. తిరుపతిలోని ప్రముఖ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ కు వేదిక కానుంది. రేపు సాయంత్రం 5:00 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక పవర్ఫుల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జునతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మాస్ యాక్షన్ డ్రామాను మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అఖిల్ నటనను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఆయన ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'లెనిన్' మూవీ జూలై 10న గ్రాండ్గా విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 10 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో రేపు సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబోయే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను మరింత స్కై హైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. https://x.com/AnnapurnaStdios/status/2073285993197879368
Jul 4, 2026 12:33PM
Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్న బండ్ల గణేష్
-బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు -నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారంటు వేదన -సుప్రీంకోర్టుకి సైతం వెళ్తానంటూ ట్వీట్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh)కి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్లో ఉన్న ఆయన కుటుంబానికి చెందిన విలువైన నివాస ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. గణేష్ ఆస్థి విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, బ్యాంకు రికవరీ చర్యలని కూడా హైకోర్టు పునరుద్ధరించింది. ఈ పరిణామం టాలీవుడ్తో పాటు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్థి వేలం వివాదంపై గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్ లో బ్యాంకు వాళ్ళు అన్యాయంగా, లోపాయికారి ఒప్పందంతో నా ఆస్తిని తక్కువ ధరకి విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022 లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. డిఆర్ టిలో నాకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. కానీ హైకోర్టులో వ్యతిరేకతీర్పు రావడం బాధాకరం. నాకు న్యాయవ్యవస్థలపై ఇంకా నమ్మకం ఉంది. కాబట్టి సుప్రీం కోర్టుని ఆశ్రయించి నాకున్న హక్కుల ద్వారా న్యాయం సాధిస్తాననే నమ్మకం నాకుందని ట్వీట్ లో పేర్కొన్నాడు. Also read: Trisha: త్రిష పోస్ట్ వైరల్.. ఆ విధమైన తపన తగ్గిపోయింది గణేష్ ఇటీవల వరంగల్ లోని హనుమకొండకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, ఆరోగ్య అవసరాల కోసం పది లక్షలు అందించిన విషయం తెలిసిందే.
Jul 4, 2026 12:23PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com









