
Godhavari : అడవిలో చిక్కుకున్న సూర్య, జాను.. ఇంటివేళాన్ని దొరబాబు ఆపగలడా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -47 లో.... వేళంపాటలో జానూ వాళ్ళ ఇంటిని కాపాడుకోవడానికి నందు నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వస్తుంది. వేళం ఆపండి అని చెప్తుంది. వేళం ఆగాలంటే కోర్ట్ నుంచి స్టే తీసుకొని రావాలి అప్పుడే వేళం ఆగుతుందని మేనేజర్ చెప్తాడు. లాయర్ ఆల్రెడీ స్టే ఆర్డర్ తీసుకొని వస్తున్నాడని జానూ చెప్తుంది. లాయర్ వచ్చే కార్ ట్రబుల్ ఇస్తుంది. ఏ వెహికల్ అటువైపుగా రాకుండా సింహాద్రి మనుషులు ఉంటారు. లాయర్ ని తీసుకొని రావడానికి సూర్య, జానూ వెళ్తారు. లాయర్ ని తీసుకొని వస్తుంటే రౌడీలు రాంగ్ రూట్ కి డైవర్షన్ పెడతారు. దాంతో అడవిలోకి వెళ్తారు. వాళ్ళ ముందే ఒక ఆటో డైవర్షన్ వస్తుంది అందులో ఒకావిడ పురిటినొప్పులతో బాధపడుతుంటే జానూ తనకి సాయంగా ఉంటుంది. ఇక లాయర్ ని వేళం దగ్గరికి తీసుకెళ్ళమని సూర్యని పంపిస్తుంది. వాళ్ళు ఎలాగైనా వేళం దగ్గరికి రాకుండా చెయ్యాలని సింహాద్రి అడుగడుగనా అడ్డుపడుతాడు. మరొకవైపు పురిటి నొప్పులు పడుతుంటే అక్కడ వెళ్లేందుకు దారి లేకపోవడంతో జానూ ప్రసవం చెయ్యడానికి అన్ని సిద్ధం చేస్తుంది. మరొకవైపు వేళంలో అందరు సింహాద్రి మనుషులుంటారు. ఒక్కొక్కరుగా వేళం పాడుతుంటే అప్పుడే ఒకతను ఎంట్రీ ఇస్తాడు నా పేరు దొరబాబు అని చెప్పి వేళం పాట పాడుతాడు. మీ అక్క జానూ పంపించింది. వాళ్ళు వచ్చేవరకు నన్ను పాట పాడమని ఎక్కడ వేళం ఆగకుండా చూసుకోమని చెప్పిందని నందు తో దొరబాబు చెప్తాడు. తరువాయి భాగంలో వేళం పాట దొరబాబు ఎక్కువగా పాడుతాడు. అయినా ఇంకా సూర్య వాళ్ళు రాకపోయేసరికి అందరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 11:00AM.webp)
Brahmamudi : ఇందూ కోసం కన్నవారిని కాదనుకున్న రాజ్.. తండ్రి చలపతి ఎమోషనల్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1075 లో.. రాజు దుగ్గిరాల ఇంట్లో ఉంటే ఆ రేఖ ఏమైనా చేస్తుందేమోనని చలపతి బయపడి తమతో వచ్చేయని అంటాడు. నేను రాలేను నాన్న అని రాజు చెప్తాడు. నువ్వు మారిపోయావురా ఈ ఆస్తులు చూసి కన్నవారిని మర్చిపోయావని రాజుతో చెప్తూ చలపతి ఎమోషనల్ అవుతాడు. నీకు మేం ముఖ్యమా ఆ అమ్మాయి ముఖ్యమా.. మాతో వచ్చేయ్ అని చలపతి అనగానే రానని రాజు తెగేసి చెప్తాడు. నువ్వు ఏంటో పూర్తిగా అర్థం అయింది.. నీ వాళ్ళు నీకు లేరు అని చలపతి అంటాడు. ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూస్తే బాగనపించింది కానీ ఇప్పుడు నా కొడుకుని నా ఇంటికి దూరం చేసావని ఇందుతో చలపతి అంటాడు. దాంతో ఇందు బాధపడుతుంది. చలపతి, లక్ష్మీ ఇంటికి వెళ్తారు. ఎందుకు అండి వాడితో అంత కఠినంగా మాట్లాడారని లక్ష్మీ అడుగుతుంది. అలా మాట్లాడితే అయిన వాడు వస్తాడనుకున్నాను కానీ రాలేదు.. వాడు లేకపోతే మనం ఎలా ఉండగలం లక్ష్మీ అని చలపతి బాధపడుతాడు. ఏ అండా లేని ఆ కుటుంబానికి అండ కావాలని ఆ దేవుడే పంపించి ఉండొచ్చు కదా అని లక్ష్మీ అంటుంది. మరొకవైపు మనం అనుకున్నది ఏంటి.. అయింది ఏంటి.. ఆ రాజు గాడు వెళ్తాడనుకుంటే ఇలా అయింది ఏంటని భ్రమరాంబ అంటుంది. ఇంకేముంది ఇక మెల్లిగా ఆస్తులు మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇరవై అయిదు ఏళ్లుగా ఎదరుచూస్తున్నామని భూషణ్ అంటాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. వాడు వెళ్ళలేదు కానీ ఇందు ఎమోషనల్ ఫూల్.. వాడి నాన్న మాటలకి అదే వాడిని పంపిస్తుంది. ఒక వేళ పంపించకున్నా సరే మనకి ఛాన్స్ దొరికిందని వాళ్లతో రేఖ అంటుంది. మరొకవైపు ఎందుకు ఇలా చేసావ్ రాజు వెళ్లి ఉండాల్సిందని ఇందు అనగానే నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావ్ కదా అని రాజు అంటాడు. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వెళ్ళు అని ఇందు అంటుంది. నేను వెళ్ళను.. నీకు తోడుగా ఉండడం నా బాధ్యత అని రాజు అంటాడు. తరువాయి భాగంలో నువ్వు ఈ డబ్బు కోసమే కదా ఉంటుంది.. ఇదిగో తీసుకొని వెళ్ళు అని ఇందు అనగానే మన మధ్య ఏ బంధం లేదా అని రాజు అంటాడు. దాంతో ఇందు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 10:56AM.webp)
Karthika Deepam2 : జ్యోత్స్నకు సూరజ్ అదిరిపోయే మైండ్ గేమ్..
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2'). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -713 లో...... జ్యోత్స్న, సూరజ్ స్కూటీపై ఆఫీస్ కి వస్తారు. సూరజ్ కి అప్పోజిట్ గా జ్యోత్స్న కూర్చొని ఉంటుంది. దారిలో వెళ్ళేవాళ్లందరు వాళ్ళిద్దరిని చూసి ఏంటి కొత్తగా పెళ్లి గా అయిందా ఇద్దరికి పడట్లేదా మంచి లాయర్ ఉన్నాడు.. నెంబర్ ఇవ్వమంటారా అని అంటుంటే జ్యోత్స్న అతనిపై కోప్పడుతుంది. మరి సరిగ్గా కూర్చోవచ్చు కదా అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత కాసేపటికి దాహంగా ఉంది స్కూటీ ఆపమని జ్యోత్స్న చెప్తుంది. దాంతో సూరజ్ స్కూటీ ఆపి వాటర్ తీసుకొని రావడానికి వెళ్తాడు. వచ్చేలోపు జ్యోత్స్న టైర్ పంచర్ చేస్తుంది. సూరజ్ వచ్చి తనకి వాటర్ ఇచ్చి ఇరవై రూపాయలు అయింది.. అన్ని రాసుకుంటాను.. శాలరీ వచ్చాక ఇవ్వాలని సూరజ్ అంటాడు. స్కూటీ చూసేసరికి పంచర్ అయి ఉంటుంది. దాంతో త్వరగా వెళ్లు టైమ్ కి వెళ్ళాలని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న కూర్చొని ఉంటే సూరజ్ స్కూటీ తోసుకుంటు వస్తాడు. మరొకవైపు ఇంకా సూరజ్, జ్యోత్స్న రాలేదని దీప అంటుంది. అది బ్రదర్ ని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఏమో అని కార్తీక్ అంటాడు. మరొకవైపు స్కూటీ తోసుకుంటూ ఆఫీస్ వరకు వస్తాడు సూరజ్. వచ్చాక నీ కష్టం ఉంచుకోనని అయిదు వందల నోటు తీసి ఇస్తుంది జ్యోత్స్న. ఏంటి షాక్ అయ్యావా.. డబ్బులు లేవు.. అంది ఎలా ఇచ్చాను అనుకుంటున్నావా అన్ని అర్థమవుతాయి కదా అని జ్యోత్స్న వెళ్తుంటే తన బ్యాగ్ నుంచి లిప్ స్టిక్ కిందపడుతుంది. అది చూసి సూరజ్ తీసుకొని నీకు ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసనుకుంటాడు. జ్యోత్స్న లోపలికి వెళ్లి దీపతో మాట్లాడుతుంది. సూరజ్ కూడా వచ్చి మాట్లాడి వెళ్తుంటే సూరజ్ షర్ట్ పైన లిప్స్ స్టాంప్ చూసి ఏంటి బ్రదర్ మ్యాటర్ అంత దూరం పోయిందా అని కార్తీక్ అంటాడు. ఏంటి జ్యోత్స్న అది అని కార్తీక్ ఆటపట్టిస్తుంటే అది ఎలా వచ్చిందని జ్యోత్స్న షాక్ అవుతుంది. సూరజ్ సిగ్గుపడుతాడు. దాంతో జ్యోత్స్నని ఇంకా కార్తీక్ ఆటపట్టిస్తాడు. సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్లి రివెంజ్ కదా అని అంటుంది. భలే కనిపెట్టావని లిప్ స్టిక్ ఇంకా అయిదువందలు ఇస్తాడు. ఆ తర్వాత దక్షిణామూర్తి వచ్చి జ్యోత్స్న ఎందుకు బయట కూర్చొని ఉందని అంటాడు. దీప అసిస్టెంట్ జ్యోత్స్న అనగానే నా మనవరాలిని అసిస్టెంట్ చేసింది ఎవరని దక్షిణామూర్తి అంటుంటే శివన్నారాయణ వస్తాడు. దక్షిణామూర్తిని క్యాబిన్ కి తీసుకొని వెళ్లి మాట్లాడతాడు. ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. నీ ప్రతీ రెస్టారెంట్ ముందు నాదొక బ్రాంచ్ ఏర్పాట్లు చేస్తున్నానని దక్షిణామూర్తి చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో వాడు ఎందుకు అలా అన్నాడు. నా ఆఫీస్ లో వాడి మనిషి ఎవరైనా ఉన్నారా అని శివన్నారాయణ అనుకుంటాడు. అప్పుడే దక్షిణామూర్తి వెళ్తు బయట సూరజ్ తో మాట్లాడడం శివన్నారాయణ చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 10:54AM
Illu illalu pillalu : బయటపడ్డ వల్లి అబార్షన్ డ్రామా.. ప్రేమను ప్రాణాలతో కాపాడిన ధీరజ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -514 లో.....వల్లికి అబార్షన్ అయిందని చెప్పిన హాస్పిటల్ కి నర్మద వెళ్తుంది. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీ హాస్పిటల్ లో గైనకాలజిస్టు మెరుపుతీగ డాక్టర్ ని కలవాలని అడుగుతుంది. అలాంటి డాక్టర్ ఎవరు లేరని డాక్టర్ చెప్తాడు. లేదు సర్ ఆ రోజు మాకు తెలిసిన ఆవిడకి ఆక్సిడెంట్ అయింది ఇక్కడికి తీసుకొని వస్తే అబార్షన్ అయిందని అన్నారని నర్మద చెప్తుంది. అసలు మొన్న హాస్పిటల్ లో డాక్టర్ లు ఎవరు లేరు క్యాంప్ కి వెళ్ళామని డాక్టర్ చెప్తాడు. ప్లీజ్ ఒక్కసారి కనుక్కోండి అని నర్మద రిక్వెస్ట్ చేస్తుంది. సరే అమ్మ ఇదేదో ప్లాన్ ప్రకారం జరిగినట్లు ఉంది.. మీరు కూడా కనుక్కోండి అని డాక్టర్ చెప్తాడు. సరే అని నర్మద వెళ్తుంది. అక్కడే హాస్పిటల్ లో మెరుపుతీగ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తుంది. మరొక వైపు ప్రేమని ఎలాగైనా సొంతం చేసుకోవాలని రాజా పుష్పం ట్రై చేస్తాడు. ప్రోగ్రాం లో తన పర్ఫామెన్స్ లాస్ట్ కి వచ్చేలా సెటిల్ చేస్తాడు. డోర్ దగ్గరికి వచ్చి డోర్ తియ్యమని అంటాడు. మరొకవైపు ప్రేమ ఇంకా ఇంటికి రాలేదని ధీరజ్ టెన్షన్ పడుతాడు. అప్పుడే నర్మద వచ్చి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం చెప్పాలనుకుంటుంది కానీ ప్రేమ రాలేదన్న టెన్షన్ లో ధీరజ్ ఉంటాడు. ప్రేమ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళిందని ధీరజ్ చెప్తాడు. వద్దన్న ఎందుకు వెళ్ళిందని నర్మద అంటుంది. అప్పుడే రామరాజు వచ్చి ఏమైందని అడుగుతాడు. ప్రేమ ఇంకా రాలేదని తెలిసి వెళ్లి దగ్గరుండి తీసుకొని రా అని రామరాజు చెప్తాడు. మరొకవైపు రాజాపుష్పం లైట్ ఆఫ్ చేస్తాడు. దాంతో ప్రేమ బయటకు వస్తుంది. మళ్ళీ లైట్ ఆన్ చేస్తాడు. అతను దగ్గరికి వస్తుంటే ప్రేమ భయపడుతుంది. ఫోన్ లాక్కొని వెళ్లి మళ్ళీ డోర్ వేసుకుంటుంది. ధీరజ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఆ తర్వాత డోర్ పగులగొట్టి రాజా పుష్పం లోపలికి వెళ్తాడు. ప్రేమ భయపడుతుంది. అప్పుడే ధీరజ్ వచ్చి రాజాపుష్పాన్ని కొట్టి ప్రేమని సేవ్ చేస్తాడు. ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 10:51AM.webp)
Podharillu : విక్కీ ఎంట్రీతో చక్రిలో మొదలైన అసూయ.. శైలు, కేశవల ప్రేమకు తండ్రి బ్రేక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -150 లో...... చక్రి, మహా ఇంటికి వస్తారు. చక్రి డల్ గా ఉంటాడు. ఏమైందని మాధవ అడుగుతాడు. ఏం లేదు అన్నయ్య తలనొప్పిగా ఉందని చక్రి అంటాడు. ఆ తర్వాత శైలు ఇంటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. కాలేజీకి నాన్న అని శైలు అబద్ధం చెప్తుంది. ఇప్పుడు అడిగితే భయం పోతుందని కేశవ గురించి అడుగకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రాత్రి చక్రి పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రా అసలు భోజనం కూడా చేయలేదని మాధవ అడుగుతాడు. ఏం లేదని చక్రి అంటాడు. బయటకు వెళ్లారు కదా ఏదో జరిగే ఉంటుంది చెప్పు అని కేశవ అడుగుతాడు. రెస్టారెంట్ కి వెళదాం అంది హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ విడాకులు తీసుకుందామని అంటుందని చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను ఎలాగైనా తనలో మార్పు వచ్చేలా చేస్తాను. తన నోటితో తనే వచ్చే వాలింటైన్ డే రోజు ఐ లవ్ యు చెప్పేలా చేస్తానని చక్రి అనగానే కన్నా, కేశవ నవ్వుకుంటారు. మరుసటిరోజు ఇల్లు చూడడానికి మహా ఆఫీస్ వాళ్ళు వస్తున్నారని మాధవ వాళ్ళు అంత క్లీన్ చేస్తారు. అప్పుడే విక్కీ, దివ్య వస్తారు. విక్కీ ని చూసి వీడేంటి ఇంత స్మార్ట్ గా ఉన్నాడని చక్రి అనుకుంటాడు. విక్కి ఇల్లు చూసి బాగుందని చెప్తాడు. మహాని లక్కీ అని విక్కీ పిలుస్తుంటే చక్రికి కోపం వస్తుంది. ఆ రోజు ఆఫీస్ కి వచ్చి గొడవ చేసింది ఇతనే కదా.. నీకు ఏమవుతాడని మహాని విక్కీ అడుగుతాడు. దాంతో తను నాకు కజిన్ అని మహా చెప్తుంది. ఆ తర్వాత కన్నా, కేశవ నవ్వుకుంటారు. చక్రి ఫీల్ అవుతుంటే అత్తకొడుకులని కూడా కజిన్ అంటారని కన్నా చెప్పగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత విక్కీ, దివ్య, మహా వెళ్తారు. ఆ తర్వాత శైలు, కేశవ మాట్లాడుకుంటుంటే వాళ్ళ నాన్న చూస్తాడు. నువ్వు కాలేజీకి అని వెళ్లి చేస్తున్నా పని ఇదా అని శైలుని కొడతాడు. నువ్వు ప్రేమించడానికి ఈ మెకానిక్ గాడే దొరికాడా అని శైలు ని వాళ్ళ నాన్న తిడుతాడు. నన్ను ఏమైనా అనండి.. తనని ఏం అనకండి నేనే ప్రేమించానని శైలు చెప్తుంది. మీరు ఇంటికి వెళ్ళండి నేను వస్తానని శైలు చెప్తుంది. కేశవ సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో నేను, చక్రి లాయర్ దగ్గరికి వెళ్తున్నాం..విడాకులు తీసుకోవడానికి అని మాధవ వాళ్ళకి మహా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 10:49AM.webp)
Jayam serial : గంగకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్న విశ్వనాథ్.. జయ దొంగతనం దొరికిపోయిందా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -311 లో..... రుద్రని చూడడానికి సుధా వెళ్తుంది. నా అల్లుడికి దిష్టి తగిలిందని సుధా దిష్టి తీస్తుంది. ఆవిడ వచ్చి తీసేవరకు ఇక్కడ ఎవరు తియ్యరు మరి అని శకుంతల కోపంగా మాట్లాడుతుంది నువ్వు ఎలా వచ్చావని పెద్దసారు అడుగుతాడు. ఆయన తీసుకొని వచ్చారు.. బయట ఉన్నారని సుధా చెప్పగానే బయట ఉండడమేంటి.. నేను వెళ్లి తీసుకొని వస్తానని పెద్దసారు గంగ రాఘవ వెళ్తారు. వాళ్ళని చూసి విశ్వ కార్ దిగుతాడు. ఏంటి విశ్వ లోపలకు రాలేదంటాడు పెద్దసారు. సుధా వస్తే వెళ్ళిపోతామని వర్క్ ఉందని విశ్వ అనగానే లోపలికి రండి అని పెద్దసారు తీసుకొని వెళ్తాడు. ఏం రుద్ర ఎలా ఉన్నావ్.. ఎలా జరిగిందని రుద్రతో విశ్వ మాట్లాడతాడు. రుద్ర ఎలా జరిగిందో చెప్తాడు. ఎవరో కావాలనే ఇదంతా చేశారు సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని విశ్వ అంటాడు. ఇదేంటి ఈయన అన్ని ఎంక్వైరీ చేస్తున్నాడని ఇషిక, వీరు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత నువ్వు నన్ను సేవ్ చేసావ్ కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినవన్ని నేను చూసుకుంటానని విశ్వ అనగానే అది కాదు మావయ్య మీరు గంగకి ట్రైనింగ్ ఇవ్వండి.. నేను దాని గురించి చూసుకుంటానని రుద్ర అంటాడు. గంగ నువ్వు అదృష్టవంతురాలివి.. మా ఆయన నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు.. ఆయన ట్రైనింగ్ అంటే డిసిప్లైన్ గా ఉండాలి.. లేదంటే ఆయన ఒప్పుకోరు. అంతేకదండి.. రేపటి నుండి ఏ టైమ్ కి రావాలో చెప్పండి అని విశ్వని కన్విన్స్ చేసేలా సుధా మాట్లాడుతుంది. ఆ తర్వాత పెద్దసారు రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. దాంతో విశ్వ ఒప్పుకుంటాడు. మరొకవైపు విశ్వ, సుధాకి సంబంధించిన ఆస్తులు, నగలు, డాక్యుమెంట్లు అన్నీ కూడా జయ చూసి మురిసిపోతుంది. అప్పుడే గంగ, రుద్ర, రంగా వస్తారు. దాంతో జయ భయపడుతుంది. అవన్నీ ఎందుకు తీసావని జయని వాళ్ళు అడుగుతారు. ఇక జయ కంగారుపడుతుంది. అదే సమయంలో విశ్వ, సుధా వస్తారు. జయ అవన్నీ ఎందుకు తీసిందో అడిగాను.. అలా అడిగితే తను ఫీల్ అవుతుందని విశ్వతో రుద్ర అంటాడు. నా ఇల్లు నా ఇష్టం అన్నట్లు జయ అంటుంది. అవి తియ్యాల్సిన అవసరం ఏంటని విశ్వ అడుగుతాడు. నా చిన్నప్పటి ఫోటో గురించి వెతికానని జయ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 4, 2026 10:42AM.webp)
ప్రభాకర్ అన్నయ్య పెళ్లి గుట్టు విప్పిన తమ్ముడు!
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సిబ్లింగ్స్ స్పెషల్ గా రాబోతోంది. ఈటీవీ ప్రభాకర్ తో వాళ్ళ అన్నయ్య సీతారాములు, కావ్య - కేసరి, హరి తేజ - హరి నిత్యా, ఆషికా - అమోఘ్, ప్రియాంక జైన్ -జెనిల్ ఇమ్మానుయేల్ - డేనియల్ అందరూ వచ్చారు. ఇక శ్రీముఖి "ఇప్పటి వరకు మీకు జరిగిన అన్యాయాలు ఏమన్నా ఉంటె నాకు చెప్పండి " అంది. వెంటనే కావ్య వచ్చి కోర్ట్ బోనులో నిలబడి "నేను కాలేజ్ ఫ్రెండ్స్ తో ఒకసారి బంక్ కొట్టి నార్మల్ గా సెల్ఫీస్ దిగుతాం కదా అది మా అమ్మకు చెప్పేసింది. " అంది . "అమ్మకు చూపించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ప్రైవసీ ఫొటోస్ ని పైరసీ చేసింది." అన్నాడు ఇమ్మానుయేల్. "అమ్మకు చూపించడం తప్పా జడ్జెస్ " అని హరి అడిగాడు. "ప్రభాకర్ గారు మీ అన్న మీద ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా " అని అడిగింది శ్రీముఖి. "ఆయన 10 వ తరగతిలోనే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. నేను పిజి తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా నాన్నతో కలిసి కొట్టాడు నన్ను " అని చెప్పాడు ప్రభాకర్. "పనిష్మెంట్ ఏంటో తెలుసా చిన్నప్పుడు ఎలా కొట్టావో ఇప్పుడు ప్రభాకర్ ని అలాగే కొట్టు " అంటూ వాళ్ళ అన్నకు చెప్పింది . "10 వ తరగతికి పెళ్లయ్యింది అంటే ఎలా కొడతారూ నేను ఊహించగలను " అంటూ ఇమ్మానుయేల్ ని సీతారాములని ఆటపట్టించాడు. " తర్వాత ఇమ్మానుయేల్ మీద వాళ్ళ అన్న డేనియల్ కంప్లైంట్ ఇచ్చాడు. "5 నుంచి హాస్టల్ లో జాయిన్ అయ్యి 10 వ తరగతిలో లవ్ చేసాడు." అని చెప్పాడు. ఇమ్మానుయేల్ కి కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తే చెప్పండి అన్న శ్రీముఖి వెంటనే ఓవర్ రూల్డ్ అనేసింది. ఇక ప్రియాంక జైన్ తన తమ్ముడు జెనిల్ ని ఆడపిల్లల తయారు చేసింది. ఇక ఆషిక తన తమ్ముడు అమోఘ్ గురించి చెప్పింది. చిన్నప్పుడు డాన్స్ కాంపిటీషన్ ఉంటే చిన్న మినీ స్కర్ట్ వేసి ఐటెం గర్ల్ లా రెడీ చేసాను అని చెప్పింది. వెంటనే హరి అతన్ని ఐటెం గర్ల్ లా ఊహించుకుని షాకయ్యాడు.
Jul 3, 2026 3:10PM.webp)
Godhavari : భువన అహంకారానికి జాను స్ట్రాంగ్ కౌంటర్.. ఇల్లు వేలం వేయకుండా సూర్య మాస్టర్ ప్లాన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-46 లో..... మా అమ్మ డబ్బు ఇస్తుందని జానూని సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కానీ జానూని భువన అవమానిస్తుంది. అమ్మ నువ్వు తప్పకుండా సాయం చేస్తావని తీసుకొని వచ్చానని సూర్య అనగానే వాళ్ళకి అప్పు ఇస్తే ఎలా తీరుస్తారు. ఎవరికి జాబ్ లేదు కదా అని భువన అంటుంది. డబ్బు అడగడానికి వచ్చాను అడుక్కోవడానికి కాదని జానూ అంటుంటే.. ఏయ్ అని భువన కోప్పడుతుంది. వేలు దింపు నాకు కోపం వస్తే నీకంటే వందరెట్లు క్రాక్ దాన్ని అని జానూ అంటుంది. చూసావా సూర్య.. మీ అమ్మ అసలు స్వరూపమని జానూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అమ్మ అని సూర్య అంటాడు. ఆ తర్వాత జానూ ఇంటికి వస్తుంది. సింహాద్రి తప్పక సాయం చేస్తాడనుకున్నా కానీ చెయ్యకపోవడం ఏంటని పెద్దావిడ అంటుంది. ఇప్పటికైనా అర్ధం అయిందా ఎవరు ఎలాంటి వారో అని శాంతి అంటుంది. మురళి తన ఇంటిపత్రాలు తీసుకొని వెళ్లి డబ్బు తీసుకొని రావాలని అనుకుంటాడు. దాంతో శాంతి చూసి వాళ్ళ కోసం ఇల్లు అమ్మాలనుకున్నావా అని కోప్పడుతుంది. మా కోసం మీరు ఇంటిని అమ్మొద్దని జానూ చెప్తుంది. ఇదంతా ఆ నందు వల్లే దాన్ని ప్రేమించి దానికోసం ఇదంతా అని శాంతి కోప్పడుతుంది. నేను ఏం మీ కొడుకుని చేసుకుంటానని అన్లేదని నందు అంటుంది. శాంతికి, నందు ఇద్దరికి గొడవ అవుతుంది. నందుని శాంతి కొడుతుంది. నందు మళ్ళీ తిరిగి కొట్టబోతుంటే జానూ ఆపుతుంది. నీకు సిగ్గు ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవే అని శాంతి అంటుంది. దాంతో బ్యాగ్ తో నందు బయటకు వస్తుంది తనకి జాను నచ్చజెప్పుతుంది. చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పెరిగాం.. ఆ మాత్రం మనల్ని అనలేదా అని జానూ నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత మనం ఇంటిని కాపాడుకోవాలంటే అక్క నీ నగలు ఇవ్వాలి.. నీకు మళ్ళీ ఆ నగలు తీసుకొని వచ్చి ఇస్తానని జానూ అనగానే నందు నగలు తీసుకొని వచ్చి ఇస్తుంది. తరువాయి భాగంలో వేలం దగ్గరికి జానూ డబ్బు తీసుకొని వస్తుంది. దాంతో సింహాద్రి షాక్ అవుతాడు. ఇప్పుడు వేలం ఆగదని అక్కడ వాళ్ళు అంటారు. దాంతో సూర్య కోర్ట్ నుంచి స్టే తీసుకొని వస్తామని అంటాడు. జానూ లాయర్ ని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:31PM.webp)
Brahmamudi : ఇందుతో రాజు బంధంపై తండ్రి చలపతి ఆగ్రహం
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1074 లో..... ఇందు ఐరన్ చేస్తుంటే రాజు వచ్చి ఈ షర్ట్ ఐరన్ చెయ్ అంటాడు. ఏంటి ఏదో సొంత పెళ్ళాన్ని అడిగినట్లు అడుగుతున్నావని ఇందు అనగానే ఇప్పుడు చేస్తావా చేయవా అని రాజు అంటాడు. చెయ్యనని ఇందు చెప్తుంది. సరే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్లి చెప్తాననగానే అవసరం లేదు చేస్తానులే అని ఇందు అంటుంది. ఇందు కావాలనే రాజు షర్ట్ ని కాల్చేస్తుంది. అది రాజు చూసి నా షర్ట్ నే అలా చేస్తావా.. నీకు ఐరన్ బాక్స్ తో వాత పెడతానని రాజు అంటాడు. దాంతో ఇందు పరుగెడుతుంది. ఇందు వెనకాలే రాజు పరుగెడుతాడు. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇందు హాల్లోకి వెళ్తుంది. తన వెనకాలే రాజు కూడా వెళ్తాడు. వాళ్ళు అలా సరదాగా ఉండడం చూసి.. ఉండండి.. ఉండండి ఇంకా కాసేపే మీ నవ్వులు అని భ్రమరాంబతో రేఖ అంటుంది. అప్పుడే చలపతి, లక్ష్మీ ఎంట్రీ ఇస్తారు. ఇందు, రాజు క్లోజ్ గా ఉండడం చూసి వాళ్లు షాక్ అవుతారు. మీరు ఏంటి ఇక్కడ అని రాజు అడుగుతాడు. అది సరే కానీ నువ్వు ఏంటి ఇక్కడ.. ఇందు తో కలిసి బిజినెస్ చేస్తున్నానన్నావ్ .. ఇందు బిజినెస్ పార్టనరా లైఫ్ పార్టనరా అని చలపతి అడుగుతాడు. దాంతో రాజు, ఇందు షాక్ అవుతారు. అంకుల్ అని ఇందు ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆగమ్మ.. ఇది తండ్రీకొడుకులకి మధ్య సాగుతుందని చలపతి అంటాడు. నువ్వు ఇందుని పెళ్లి చేసుకున్నావా అని చలపతి అడుగుతాడు. చేసుకున్నానని రాజు చెప్తాడు. జరిగిందేదో జరిగింది విడాకులు ఇవ్వమని రాజుతో చలపతి అంటాడు. అదేంటి అలా అంటారని అపర్ణ అంటుంది. గతంలో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా ఆక్సిడెంట్ లో అందరు చనిపోయారు కానీ బయట వేరే అంటున్నారు. మీ గొప్పింటోళ్ల ఇంటికి నా కొడుకు అల్లుడిగా వద్దని చలపతి అంటాడు. రాజు చెయ్ పట్టుకొని చలపతి తీసుకొని వెళ్తుంటే రాజు రానని అంటాడు. నా భార్యని వదిలిరానని రాజు చెప్తాడు. రేఖ మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంటే.. ఆపు రేఖ అని అపర్ణ అంటుంది. దాంతో చలపతి లక్ష్మీకి తనే రేఖ అని అర్థమవుతుంది. గతంలో రేఖ గురించి శృతి చెప్పింది గుర్తుచేసుకొని.. నువ్వు ఇక్కడ వద్దురా అని అంటాడు. నీకు మేం కావాలో ఇందు కావాలో తేల్చుకోమని చలపతి అంటాడు. తరువాయి భాగంలో రాజు పేరెంట్స్ వెళ్ళిపోతారు. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుందని రాజుతో ఇందు అనగానే ఈ బంధం వదిలివెళ్ళనని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:27PM.webp)
Karthika Deepam2 : జ్యోత్స్నకు సూరజ్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్.. కార్తీక్ నా భర్త అంటూ దీప వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -712 లో.... జ్యోత్స్న, దీప, కార్తీక్ కలిసి ఆఫీస్ లో భోజనం చేస్తుంటారు. జ్యోత్స్న స్పూన్ కింద పడిపోతే కార్తీక్ స్పూన్ తీసుకొని జ్యోత్స్న తింటుంటే ఆగవే అని దీప అంటుంది. ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడే సూరజ్ వస్తాడు. అది నీ స్పూన్ తీసుకుందని దీప అంటుంది. నా బావ నా ఇష్టం అని జ్యోత్స్న అనగానే కార్తీక్ ఇప్పుడు నా భర్త అని దీప అంటుంది. పుట్టకముందే బావ నా భర్త అయ్యాడు. ఇప్పుడు అంటే ఇలా కానీ కాలేజీ డేస్ ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరం తిన్నామని జ్యోత్స్న చెప్తుంది. అది చిన్నప్పుడు.. ఇప్పుడు కాదని దీప కోప్పడుతుంది. నీకు ఇదివరకే చెప్పాను బావని ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న అనగానే దీప కోప్పడుతుంది. వదిలేయ్ దీప అని కార్తీక్ అంటాడు. రా బ్రో అని సూరజ్ ని పిలుస్తాడు. సూరజ్ అదంతా వింటాడు. సూరజ్ రాగానే జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూరజ్ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. నీకోసం ఎవరు రారు.. మొహమాటం ఎందుకు.. ఇద్దరం వెళ్ళేది ఇంటికే అని జ్యోత్స్నతో సూరజ్ అనగానే జ్యోత్స్న స్కూటీ ఎక్కుతుంది. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్ళాక స్కూటీ ఆపి జ్యోత్స్నని దిగమంటాడు. పెళ్ళైన మగాడిపై ఇష్టమేంటి అసహ్యంగా అని కోప్పడుతాడు. నీకేంట్రా అని జ్యోత్స్న అనగానే నేను నీ మొగుడిని అని సూరజ్ అంటాడు. నువ్వు ఎలా మొగుడివి అవుతావని జ్యోత్స్న అంటుంది. మరి కార్తీక్ ఎలా నీకు మొగుడు అవుతాడు. తాళి కడితేనే మొగుడు అవుతాడు. ఊహించుకుంటే కాదు నీ ఊహ కరెక్ట్ అయితే నువ్వు నా పెళ్ళామని నేను ఉహించుకుంటున్నా.. ఇది కరెక్ట్ అవుతుందని జ్యోత్స్నతో సూరజ్ అంటాడు. ఇక ఇద్దరికి గొడవ జరుగుతుంది. మరొకవైపు శౌర్య ప్రోగ్రెస్ కార్డ్ చూసి మార్కులు తక్కువ వచ్చాయని కార్తీక్ అంటాడు. నాకు ఇంటి దగ్గర చెప్పేవారు ఎవరు అని శౌర్య అనగానే దీనికి సొల్యూషన్ ఆలోచించాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నకి సూరజ్ వాయిస్ మెసేజ్ పంపుతాడు. ఇకనైనా మారు అని అదంతా పారిజాతం వింటుంది. వాడితో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తుందని అంటుంది. వాడు నాకు సైటు కొడుతున్నాడు.. అందుకే బావ అంటే నాకు ఇష్టమని తెలిసి అలా బెహేవ్ చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ నువ్వు పెళ్లి చేసుకోవడం.. చేసుకోవే అని పారిజాతం అంటుంది. మరొకవైపు శౌర్యా స్కూల్ నుంచి ఆఫీస్ కి వస్తుంది. అక్కడే తనకి ట్యూషన్ అని కార్తీక్ చెప్తాడు. అది బెస్ట్ దానికి అని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:25PM.webp)
Illu illalu pillalu : శ్రీవల్లి ఫేక్ ప్రెగ్నెన్సీ బండారం బద్దలు.. రాజపుష్పం వలలో చిక్కిన ప్రేమ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -513 లో..... వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపెట్టడానికి డాక్టర్ దగ్గరికి నర్మద వెళ్తుంది. ఫేక్ రిపోర్ట్స్ ఆ రోజు మీరు వల్లికి ఇచ్చారు.. గుర్తువచ్చిందా అని నర్మద అడుగుతుంది. దాంతో డాక్టర్ టెన్షన్ పడుతూ నాకేం తెలియదని అంటుంది. మీరు ఇప్పుడు ఎందుకు అబద్దం చెప్పారో చెప్పకపోతే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తానని నర్మద బెదిరిస్తుంది. దాంతో వల్లి వాళ్ళ అమ్మగారు నా కూతురు కాపురం కాపాడమని రిక్వెస్ట్ చేస్తే అబద్దం చెప్పానని డాక్టర్ చెప్తుంది. ఈ విషయం అందరి ముందు చెప్పమని నర్మద అనగానే ప్లీజ్ నన్ను వదిలెయ్యండి.. నా హాస్పిటల్ పేరు పోతుందని డాక్టర్ రిక్వెస్ట్ చెయ్యడంతో నర్మద వెళ్తుంది. మరొకవైపు ప్రేమ డ్యాన్స్ కోసం రెడీ అవుతుంది. రాజపుష్పం తన దగ్గరికి వచ్చి డ్యాన్స్ రెహర్సల్ చేద్దామని తనకి దగ్గరగా వస్తాడు. ఒరేయ్ ఏం చేస్తున్నావ్రా అని ప్రేమ కోప్పడుతుంది. ప్రేమ ఫోన్ అతను తీసుకుంటాడు. డోర్ వేసుకుంటుంది. నువ్వు బయటకు రావాలంటే డోర్ తియ్యాలని రాజపుష్పం అంటాడు. మరొకవైపు ధీరజ్ ఫుడ్ డెలివరీ కోసం వెళ్తాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసింది ప్రేమ ఫ్రెండ్. నువ్వు ఏంటి ఇక్కడ మీ అమ్మకి సీరియస్ అన్నావని ధీరజ్ అడుగుతాడు. తను టెన్షన్ పడుతుంటే ప్రేమ ఎక్కడ అని అడుగుతాడు. ప్రేమ డ్యాన్స్ కాంపిటేషన్ కి వెళ్ళిందని తను చెప్తుంది. దాంతో ప్రేమకి ధీరజ్ ఫోన్ చేస్తాడు. రాజ పుష్పం లిప్ట్ చేసి ఫోన్ మ్యూట్ లో పెడతాడు. అతను కిటికీ దగ్గరికి వెళ్లి మీ అయన ఫోన్ చేసాడు. నువ్వు ఎంత అరిచినా వినపడదని రాజపుష్పం అంటాడు.ఏంటి ప్రేమ ఎక్కడున్నావని ధీరజ్ అంటాడు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అని ధీరజ్ ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు వేదవతి దగ్గరికి నర్మద వచ్చి వల్లి ప్రెగ్నెంట్ అబద్ధం డాక్టర్ నాకు చెప్పిందని చెప్తుంది. నువ్వు చేస్తుంది చాలు.. ఆపు.. చేసింది తప్పు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నావా అని నర్మద మాటలు వేదవతి నమ్మదు. అబార్షన్ అయిందని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు విషయం బయటపెట్టొచ్చని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:22PM.webp)
Podharillu : విడాకులు అడిగిన మహా.. కూతురి గుట్టు తెలుసుకున్న శైలు తండ్రి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -149 లో.....శైలుతో కేశవ చాటింగ్ చేస్తుంటే.. మహా, చక్రి వస్తారు. అమ్మాయి ఫోన్ లో మాట్లాడినప్పుడు మాటలు విన్నాను చాలా మంచిది వదులుకోకని కేశవతో మహా చెప్తుంది. ఒకసారి ఫోన్ ఇవ్వరా ఏం చాటింగ్ చేసావోనని చక్రి అనగానే ఇవ్వండి అని మహా కూడా ఇవ్వమని అడుగుతుంది. కేశవ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్తాడు. మహా నవ్వుకుంటుంది. ఆ తర్వాత ఆఫీస్ లో విక్కీ అందరిని పిలిచి మన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాం.. ప్రాజెక్ట్స్ కోసం పాతకాలం ఇల్లు కావాలి.. ఎవరికి అయినా తెలిస్తే చెప్పండి అని విక్కీ అంటాడు. అందరు నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉందని మహా చెప్తుంది. సరే రేపు ఒకసారి వెళదామని విక్కీ అంటాడు. ఆ తర్వాత శైలు తన ఫ్రెండ్ కీర్తికి ఫోన్ చేసి నేను కేశవతో బయటకు వెళ్తున్నాను.. మా అమ్మ అడిగితే నేను నీతో ఉన్నానని చెప్పని చెప్తుంది. ఆ తర్వాత శైలు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురికి పెళ్లి సంబంధం వచ్చిందని తన భార్యకి చెప్తాడు. మీరు ఎప్పుడు నీ కూతురికి చేస్తారు.. ఇప్పుడు ఎవరిని నమ్మలేం.. ప్రేమ అంటూ తిరుగుతున్నారని శైలు అమ్మ వరాలు అంటుంది. నా కూతురు అలా ఏం కాదని అతను అంటాడు. మరొకవైపు కేశవ అందంగా ముస్తాబవుతుంటే కన్నా, మాధవ ఆటపట్టిస్తారు. మరొకవైపు మహా విక్కీ దివ్య మాట్లాడుకుంటుంటే మహాకి హారిక ఫోన్ చేసి కలుద్దామని అంటుంది. దాంతో విక్కీ పర్మిషన్ తీసుకొని మహా వెళ్తుంది. ఆ తర్వాత హారికని మహా కలుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటావని అడుగుతుంది. అందరు ఆ ఇంటికి శాపం ఉందనుకుంటున్నారు. అందుకే ఉండాల్సి వస్తుంది. పెద్దికి పెళ్లి చేస్తే ఒక అమ్మాయి ఇంట్లో ఉంటుంది. నేను బయటకు వచ్చేస్తానని మహా చెప్తుంది. అందరు నిన్ను చక్రి భార్య అని ఫిక్స్ కాకముందే ఇంట్లో నుంచి వచ్చేయ్ విడాకులు తీసుకోమని హారిక సలహా ఇస్తుంది. ఆ తర్వాత మహా నడుచుకుంటూ వస్తుంటే.. చక్రి వస్తాడు. అలా కేఫ్ లో కూర్చొని మాట్లాడుకుందామని మహా అనగానే చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు కేశవ, శైలు కలుసుకుంటారు. ఇద్దరు బైక్ పై వెళ్తారు. కేశవని శైలు హగ్ చేసుకొని కూర్చొని వెళ్తుంది. అలా వెళ్లడం శైలు వాళ్ళ నాన్న చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చూడు ఎలా వెళ్తుందో వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎంత బాధపడుతారని శైలు వాళ్ళ నాన్నతో పక్కనున్న అతను అంటాడు. దాంతో అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మనం విడాకులు తీసుకుందాం.. రేపు లాయర్ దగ్గరికి వెళ్లి మ్యూచువల్ డైవర్స్ అప్లై చేద్దాం సంతకం పెట్టండి అని మహా అనగానే చక్రి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో విక్కీ, దివ్య కలిసి వింటేజ్ హౌస్ అయిన నారాయణ ఇల్లు చూడడానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:20PM.webp)
Jayam serial : రుద్రపై వీరు ప్రాణాంతక దాడి.. ఇషికను ట్రాప్ చేసిన వైనం!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310 లో.....వీరు మోసం చేసాడని ఇషిక కోపంగా ఉంటుంది. ఇషిక దగ్గరికి వీరు వెళ్తాడు. నువ్వు నాతో ఏం మాట్లాడకు బ్రో.. నువ్వు ఇంత మోసం చేస్తావని అసలు ఊహించలేదని ఇషిక అంటుంది. నీకు మోసం జరిగింది అంటున్నావ్ మరి నాకు జరిగిన మోసాన్ని ఎవరికి చెప్పమంటావని వీరు తన ఫోన్ లో ఉన్న వీడియోని చూపిస్తాడు. అందులో గంగ, రంగా ఫారెనర్స్ గా వచ్చి గెటప్ చేంజ్ చేస్తున్నా వీడియోని చూపిస్తాడు. చూసావా ఇషిక ఎలా ట్రాప్ చేసారోనని వీరు అంటాడు. అదంతా కావాలనే రుద్ర స్కెచ్ వేసి చేయించాడని వీరు చెప్తాడు. మరొక వైపు వీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకోని బ్యాగ్ తీసుకొని వస్తాడు. అందరు తనపై కోపంగా ఉంటారు. బ్రో అసలు ఏం తప్పు చెయ్యలేదు.. వాళ్ళు కావాలనే ఇదంతా చేశారు.. వీరు బ్రో తన షేర్ అమ్ముకొని నాకు నష్టం వచ్చిన డబ్బు ఇచ్చాడు కావాలంటే డబ్బు క్రెడిట్ అయినట్టు మెసేజ్ చూడండి అని ఇషిక అంటుంది. నాకు మీరు తప్ప ఎవరు లేరు కానీ మీరే నన్ను ద్రోహం చేశారు అంటుంటే ఏం చెయ్యాలని వీరు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడే ప్రీతీ కళ్ళు తిరిగిపడిపోతుంది.. బ్రో వదినని లోపలికి తీసుకొని వెళ్ళమని ఇషిక అంటుంది. చూసావా వాడు ఎలా మార్చాడో అని రంగా, గంగ అనుకుంటారు. ఈ విషయం వెంటనే బావకి చెప్పాలని రంగా అంటాడు. ఆ విషయం వెంటనే రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు. నువ్వు అదంతా వదిలేయ్ ముందు కాంపిటేషన్ గురించి ఫోకస్ చెయ్ అని గంగకి రుద్ర చెప్తాడు. మరొకవైపు ఆ రుద్ర ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసాడు.. వాడిని బ్రతనివ్వనని వీరు అంటాడు. ఆ తర్వాత రుద్ర వస్తుంటే వీరు ఆక్సిడెంట్ చేయిస్తాడు. రుద్ర చేతికి గాయమవుతుంది. ఇంటికి వస్తాడు. అందరు తన చుట్టూ ఉండి మాట్లాడుతుంటారు. గుళ్లో నుంచి బొట్టు తెచ్చాను రుద్రకి పెట్టు గంగ.. తనకి ఏ స్ట్రెస్ ఇవ్వకండి అని శకుంతల పాజిటివ్ గా మాట్లాడుతుంటే రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక మరుసటి రోజు ఉదయం పైడిరాజు, లక్ష్మీ లేరని విశ్వతో సుధా అంటుంది. ఓహ్. నీకు అసలు విషయం తెలియదు కదా.. అందుకే ఇంత కూల్ గా మాట్లాడుతున్నావని విశ్వ అంటాడు. ఏం అయిందని సుధా అడుగగా నీ మేనల్లుడికి నిన్న రాత్రి యాక్సిడెంట్ జరిగిందని విశ్వ చెప్తాడు. దాంతో సుధా కంగారుపడుతుంది. వెంటనే సుధా బాధపడుతూ ఇంటికి వెళ్ళొస్తానని విశ్వని అడిగితే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు విశ్వ. సుధా లోపలికి వెళ్లి రుద్రతో మాట్లాడుతుంది. అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదని పెద్దసారుతో చెప్తూ అలుగుతుంది సుధా. తర్వాత పెద్దసారు సారీ చెప్పి రిక్వెస్ట్ చేశాక. మామూలు అవుతుంది. ఇక దిష్టితీయాలని గంగని మిరపకాయలు తెమ్మంటుంది సుధా. ఆవిడగారు వచ్చి దిష్టి తీస్తే తప్ప రుద్ర మాములు అవ్వడా అని శకుంతల అంటుంది. పెద్దమ్మ.. అత్తమ్మని అలా అనకండి అని ప్రీతి అనగానే నీ శ్రీమంతానికి పిలవమ్మన్నావ్.. పిలిచాను అంతే కానీ నాకు సలహాలు ఇవ్వొద్దని శకుంతల అంటుంది. దాంతో ప్రీతి సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 3, 2026 12:16PM.webp)
Godhavari : జానూ ఆశలపై నీళ్లు చల్లిన సింహాద్రి
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో.. జానూ, సూర్య, నందు, మురళి లాయర్ దగ్గరికి వెళ్తారు. మా నాన్న తరుపున ఉన్న ఒకే ఒక జ్ఞాపకం.. మా ఇల్లు.. దాన్ని వదులుకోము లాయర్ గారు.. ప్లీజ్ మాకు హెల్ప్ చెయ్యండి అని లాయర్ ని జానూ రిక్వెస్ట్ చేస్తుంది. మీరు బ్యాంకుకి లోన్ డబ్బు కడితే వేళం ఆపొచ్చని లాయర్ చెప్తాడు. మనకి డబ్బు సింహాద్రి అంకుల్ ఇస్తాడని నందు చెప్తుంది. దాంతో జానూ, సూర్య ఇద్దరు కలిసి సింహాద్రి ఇంటికి వెళ్తారు. ఆ విషయాలన్నీ సింహాద్రి మనిషి సింహాద్రికి ఫోన్ చేసి చెప్తాడు. జానూ, సూర్య రావడం గమనించిన సింహాద్రి తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ.. కోటి రూపాయలు నష్టం తెస్తావా.. ఇప్పుడు నా ఫ్రెండ్ కుటుంబానికి ఎలా సాయం చెయ్యాలంటూ యాక్టింగ్ చేస్తాడు. అంకుల్ మీరు మాకు డబ్బు ఇస్తారా అని జానూ అడుగుతుంది. ఇప్పుడు ఒకతన్ని నమ్మితే.. కోటి రూపాయలు నష్టం వచ్చింది సారీ అమ్మ ఏం చెయ్యలేక పోతున్నానని శంకర్ ఫోటో దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు. జానూ, సూర్య డిస్సపాయింట్ గా బయటకు వస్తారు. మా అమ్మని అడుగు ఇస్తుందని సూర్య అంటాడు. ఇద్దరు వాళ్ళ ఇంటికి బయల్దేరతారు. ఆ మాటలు సింహాద్రి విని సూర్య లాయర్ తో గొడవపడుతున్న వీడియోని భువనకి పంపిస్తాడు. చెల్లెమ్మ అల్లుడు చెయ్ జారిపోతున్నాడు వాడు ఆ జానూ మాయలో ఉన్నాడు. అందరు ఏమనుకుంటారని తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. ఆ తర్వాత జానూని తీసుకొని సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. తుఫాన్ ని కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. తుఫాన్ అందరికి కప్ లో తీసుకొని వస్తాడు. మేమ్ తాగే కాస్ట్లీ వాటిలో జానూకీ ఇస్తావా అని తుఫాన్ పై భువన కోప్పడుతుంది. తర్వాత స్టీల్ గ్లాస్ లో జానూకి తీసుకొని వస్తాడు. దాంతో జానూ బాధపడుతుంది. తరువాయి భాగంలో మన ఇంటిని సొంతం చేసుకోవాలంటే అక్క నీకోసం నాన్న చేయించిన బంగారం అమ్మి డబ్బు తీసుకొని రావాలి.. అది నీ చేతుల్లోనే ఉందని నందుతో జానూ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 2, 2026 10:49AM.webp)
Brahmamudi : రాజుకు ఊహించని షాక్ ఇచ్చిన రేఖ.. ఇందు కోసం కన్నవారిని ఎదురించిన రాజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1073 లో.... రాజు దగ్గరికి ఇందు స్వీట్ పట్టుకొని వస్తుంది. ఇందు రావడం రాజు ఉహ అనుకొని తన పని తను చేసుకుంటాడు. రాజు అని ఇందు పిలుస్తున్నా కూడా అది నా ఉహే అనుకుంటాడు. నేను నిజంగానే వచ్చానని ఇందు అనగానే అయితే ఒకసారి కూర్చో , నిల్చొ అని చెప్తాడు. ఇందు చెప్పినట్లు చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఉహే నువ్వు ఎందుకు నేను చెప్పినట్లు చేస్తావని రాజు అంటడు. ఒకసారి గిల్లు అనగానే ఇందు గిల్లుతుంది. అబ్బా నిజంగానే వచ్చావా అని రాజు అంటాడు. ఇదిగో స్వీట్ అని రాజుకి ఇందు తిన్పిస్తుంది. తనకి తినిపించిన స్వీట్ లో నుంచి ఇందు తింటుంది. అది చూసి రాజు ఆశ్చర్యంగా చూస్తాడు. నీ వల్లే ఇదంతా నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటానని మాటివ్వమని రాజుని ఇందు అడుగుతుంది. మరొకవైపు రేఖ దగ్గరికి ఐశ్వర్య వెళ్లి.. మీరు నేను చెప్పింది నమ్మి ఉంటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఐశ్వర్య అంటుంది. వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు ఆంటీ.. వాళ్ళ పేరెంట్స్ ని ఇంతవరకు ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు.. ఎవరిని వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళలేదని రేఖకి డౌట్ వచ్చేలా ఐశ్వర్య మాట్లాడుతుంది. మరొకవైపు నేను అనుకున్నది పూర్తి అయ్యేవరకు మన ముందు ఎవరున్నా నీకు సపోర్ట్ చేస్తానని ఇందుకి రాజు మాటిస్తాడు. మరొకవైపు వెంకీ ఫుడ్ డెలివరీకి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే రాజు వాళ్ళ నాన్న చలపతి ఎవరికైతే అప్పు ఉన్నాడో అతని దగ్గరికి రేఖ వెళ్తుంది. అతనితో అన్ని విషయాలు చెప్పి చలపతి ఇంటికి పంపిస్తుంది. అతన్ని చలపతి చూడగానే మీ అన్నకి తర్వాత ఇస్తానని చెప్పాను కదా అని చలపతి అంటాడు. మీ వాడు గొప్పింటికి అల్లుడు అయ్యాడు. ఆ విషయాలు దాచి మమ్మల్ని మోసం చేస్తున్నావని అతను అనగానే మీరు ఏం అంటున్నారని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. మీ రాజు దుగ్గిరాల ఇంటి వారసురాలు ఇందుని పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయ్యాడని అతను చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. మీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నాను.. నా డబ్బు నాకూ ఇవ్వాలని అతను చెప్పేసి వెళ్ళిపోతాడు. అతను రేఖ దగ్గరికి వెళ్లి.. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి పని చేశారు.. నా డబ్బు నేను వసూల్ చేసుకుంటానని అతను అంటాడు. ఆ తర్వాత రాజు అక్కడ ఉండడం ఏంటి? వాడికి అక్కడ ప్రమాదం.. వెంటనే వెళ్లి తీసుకొని రావాలని చలపతి, లక్ష్మీ అనుకుంటారు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి చలపతి, లక్ష్మీ వెళ్లి రాజుని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. రాజు రానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 2, 2026 10:46AM.webp)
Karthika Deepam2 : దీప చేతికి పగ్గాలు.. జ్యోత్స్న అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసిన శివన్నారాయణ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '(Karthika Deepam2'). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -711 లో..... జ్యోత్స్నకి శివన్నారాయణ పనిష్మెంట్ ఇస్తాడు. అదేంటంటే ఒక పేపర్ లో జ్యోత్స్న చేయవలిసిన పనులు రాస్తాడు. అవి కార్తీక్ ని చదవమని శివన్నారాయణ చెప్తాడు. కార్తీక్ చదవడం మొదలుపెడతాడు. జ్యోత్స్న D.A గా ఉండాలి. అంటే దీప అసిస్టెంట్, ఆఫీస్ కి దీప కంటే ముందు రావాలి.. దీప ఇంటికి వెళ్లాకే జ్యోత్స్న వెళ్ళాలి. తనకి కార్ సౌకర్యం ఉండదు.. ఇంకా తను కంపెనీ నుంచి ఎలాంటి డబ్బు వాడుకోవడానికి వీలు లేదు.. తన అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయబడుతాయి. తనకి శాలరీ వస్తుంది. అందులో నుంచి తన ఖర్చులకి వాడుకోవాలి.. జ్యోత్స్న శాలరీ కూడా దీప డిసైడ్ చేస్తుందని కార్తీక్ చదువుతాడు. అదంతా విని జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. అవన్నీ అవసరమా అని శివన్నారాయణని పారిజాతం అడుగుతుంది. ఒకప్పుడు రాజులు తమ పిల్లలని అడవులకి పంపించేవాళ్ళు.. వాళ్ళు సొంతజీవితం అంటే ఏంటో తెలుసుకోవాలని.. మళ్ళీ తీరిగి వచ్చి రాజు కుర్చీలో కూర్చునేవాళ్ళని శివన్నారాయణ చెప్తాడు. దీప జీవితంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు రాజు కుర్చీలో కూర్చుందని కార్తీక్ అనుకుంటాడు. నచ్చితే చెయ్యొచ్చు.. సంతకం పెట్టొచ్చు లేదా వెళ్లిపోవచ్చని శివన్నారాయణ అంటుంటే జ్యోత్స్న అన్ని కండిషన్స్ కి ఒప్పుకుని సంతకం పెడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి సూరజ్ వచ్చి మాట్లాడతాడు. నువ్వు శివన్నారాయణ గారికి మనవరాలు అన్న ట్యాగ్ తీసేస్తే.. నీ పొజిషన్ ఇది అని సూరజ్ అంటుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత దీప రూమ్ ముందు జ్యోత్స్నకి ఒక క్యాబిన్ వేస్తారు. నువ్వు ఇక్కడే కూర్చోవాలి. దీప ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని కార్తీక్ చెప్తాడు. దీప సరదాగా బెల్ నొక్కుగానే జ్యోత్స్న వెళ్తుంది. ఏంటని జ్యోత్స్న అడుగగా పని చేస్తుందో లేదో టెస్ట్ చేశానని దీప అంటుంది. ఆ తర్వాత కార్తీక్ కూడా బెల్ నొక్కుతాడు.. టెస్ట్ చేసానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత క్లర్క్ వచ్చి దీపకి కాఫీ ఇచ్చి మేడమ్ అంటాడు. జ్యోత్స్న ఒక్కటి తక్కువ అయింది అర్థం అయిందా అని అడుగుతుంది. అర్థం అయింది మేడమ్ అని జ్యోత్స్న అంటుంది. అదంతా చూస్తున్న పారిజాతానికి జ్యోత్స్న పరిస్థితి చూసి ప్రాణంపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత దీప, జ్యోత్స్న, కార్తీక్ కలిసి భోజనం చేస్తారు. కర్రీ వేసుకో జ్యోత్స్న.. తినే దగ్గర అందరూ సమానమే అని దీప అంటుంది. దీప తాళి చూసి అది నీ మెడలో ఉంది కాబట్టి నువ్వు సీఈఓ అయ్యావ్.. అదే నా మెడలో ఉండి ఉంటే చైర్మన్ అయ్యేదాన్ని అని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న స్పూన్ కిందపడుతుంది. వెంటనే కార్తీక్ స్పూన్ ని జ్యోత్స్న తీసుకొని తింటుంటే ఆగవే అని దీప అంటుంది. అప్పుడే సూరజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jul 2, 2026 10:44AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com







.webp)

