.webp)
Brahmamudi : బ్రహ్మముడి 1000 ఎపిసోడ్ల మైలురాయి.. ఇందు బర్త్డే పార్టీలో కిడ్నాప్ డ్రామా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1000లో..... ఇందు ఒంటరిగా కూర్చొని ప్రొద్దున లేస్తే జరగబోయే దాని గురించి టెన్షన్ పడుతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కావ్య తన పక్కకి వచ్చి కూర్చొని ఇందుకి దైర్యం చెప్తుంది. ప్రతీ యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు.. ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టనని మోటివేట్ చేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇందు పడుకొని ఉంటే రేఖ వాళ్ళు చుట్టూ చేరి హ్యాపీ బర్త్ డే అని విష్ చేస్తారు. అందరికి థాంక్స్ చెప్తుంది ఇందు. ఇన్నిరోజులు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు చూపిస్తున్నావో నాకు తెలుసని అపర్ణ అనగానే కోపంగా ఉంటే కోపం అంటారు.. ప్రేమ ఉంటే కూడా ఇలా అంటారేంటని రేఖ అంటుంది. ఇందు నువ్వు నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు.. ఫామ్ హౌస్ కి రా అని రేఖ చెప్పి వెళ్తుంది. ఇందు నువ్వు మాత్రం ఈ ఆస్తులన్నీ తన పేరున పెట్టి దీన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళని అన్యాయం చెయ్యకని అపర్ణ చెప్పి వెళ్తుంది. ఏం చేయబోతున్నావ్ అక్క అని స్వాతి అడుగుతుంది. పార్టీ లో కేక్ కట్ చేసాక నాకు నేనుగా కిడ్నాప్ అవుతాను.. నువ్వే హెల్ప్ చెయ్యాలని ఇందు అనగానే ఇప్పుడు తప్పించుకున్న తర్వాత అయిన కూడా సంతకం చెయ్యాలి కదా అని స్వాతి అనగానే నాకు కొన్ని రోజులు టైమ్ కావాలని ఇందు అంటుంది. దాంతో సరే అని స్వాతి అంటుంది. ఆ తర్వాత రేఖ ఫామ్ హౌస్ కి వెళ్లి వచ్చిన గెస్ట్ లని రిసీవ్ చేసుకుంటుంది. అక్కడికి వచ్చిన వీళ్ళందరు రేఖకి అప్పు ఇచ్చిన వాళ్ళే పార్టీలో ఆస్తులన్నీ తన పేరున అయ్యాయని వాళ్ళకి నమ్మకం కలగడానికి అందరిని పిలుస్తుంది. మరొకవైపు రాజు, లక్కీల కోసం ఐశ్వర్య వెయిట్ చేస్తుంది. వాళ్ళు వస్తారు. రాగానే మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడుతారు. ఇందుని కిడ్నాప్ చేసాక నా మీద డౌట్ వస్తుందని ఐశ్వర్య అనగానే ఇద్దరు వెయిటర్ గెటప్ లో వస్తారు. తరువాయి భాగంలో ఇందు అందంగా రెడీ అయి ఫామ్ హౌస్ కి వస్తుంది. తనని చూసి రాక్షసి అనుకున్నా కానీ అందాల రాక్షసి అని లక్కీతో రాజు అంటాడు. అనుకోకుండా అక్కడికి నందు వస్తుంది. అపర్ణని చూసి గుర్తుపట్టి నానమ్మ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 08, 2026.webp)
Karthika Deepam2 : దీపను దెబ్బతీయాలని జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మొదటి పెళ్లిరోజే చివరి రోజు అవుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -638 లో...... సుమిత్ర ఇంటి నుండి వచ్చిన దీపకి కార్తీక్ దిష్టి తీస్తాడు. ఎందుకు దిష్టి తీసావ్ రా అని కాంచన అడుగుతుంది. నువ్వే కదమ్మా కడుపుతో ఉన్నవాళ్లు బయట నుండి వస్తే తియ్యాలన్నావ్ కదా అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు అమ్మకి దిష్టి తగిలిందా అని శౌర్య అడుగుతుంది. అవునని కార్తీక్ చెప్తాడు. జ్యోత్స్న ఏదో అనే ఉంటుందని కాంచన అనుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ ఒళ్ళో దీప తల వార్చుకొని పడుకుంటుంది. ఆ జ్యోత్స్న మళ్ళీ ఏదైనా అందా బావ.. నువ్వు పార్టీలో కంగారు పడ్డావని అత్తయ్య మావయ్య అనుకుంటున్నారని దీప అడుగుతుంది. ఏమైనా అంటే ఊరుకుంటానా ఏంటని కార్తీక్ అంటాడు. నువ్వు పడుకో దీప అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి పారిజాతం ఫోన్ చేసి.. ఒరేయ్ నా మనవరాలు పడుకుందా.. దిష్టి తీసావా అని అడుగుతుంది. తీసానని కార్తీక్ చెప్తాడు. ఎవరి దిష్టి తగులుతుందో నీకు తెలుసు కదా అని కార్తీక్ అనగానే.. ఇంకెవరు ఆ జ్యోత్స్న దిష్టి అని పారిజాతం అంటుంది. దానికి పెళ్లి సంబంధం చూడరా దాని తిక్కకుదురుతుంది.. అందుకు ఏం చెయ్యమన్నా చేస్తానని పారిజాతం అంటుంది. నువ్వు ఆ మాత్రం హింట్ ఇస్తే రెచ్చిపోతానని కార్తీక్ అంటాడు. పారిజాతం ఫోన్ కట్ చేశాక జ్యోత్స్ననే అసలైన వారసురాలు అని తెలిస్తే ఏమైపోతావోనని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత దీప నిద్రలో బావ రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అని అంటుంది. గుర్తుంది మరదలా అని కార్తీక్ అంటాడు. మరొకవైపు కార్తీక్, దీపల ఫోటో చూస్తూ మీ పెళ్లిని నేనెలా మర్చిపోతానని జ్యోత్స్న అనుకుంటుంది. రేపే మీ మొదటి పెళ్లిరోజు.. చివరి పెళ్లి రోజు అని జ్యోత్స్న అనుకుటుంది. మరుసటి రోజు కార్తీక్, దీప ఇద్దరు రెడీ అయి శ్రీధర్, కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్ళ గురించి శ్రీధర్ గొప్పగా మాట్లాడతాడు. ఈ రోజు అన్నయ్య ఇంటికి వద్దని కాంచన అంటుంది. లేదమ్మా వెళ్లి త్వరగా వస్తామని కార్తీక్ అంటాడు. వద్దురా సరదాగా అందరం బయటకు అయినా వెళదామని శ్రీధర్ అంటాడు. లేదు మాస్టారు త్వరగా వస్తామని దీపని తీసుకొని కార్తీక్ వెళ్తాడు. మరొకవైపు దీప, కార్తీక్ వస్తారని గుమ్మంలో దీప జారిపడేలా నూనె పోస్తుంది జ్యోత్స్న. పారిజాతం డాన్స్ చేస్తూ పైనుండి కిందకు వస్తుంది. అప్పుడే అందరు వస్తారు కార్తీక్ ఒక్కడే ఇంట్లోకి వస్తాడు. దీప ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది. వస్తుందని కార్తీక్ చెప్తాడు. దీప గుమ్మంలో అడుగు పెట్టి నూనెపై కాలు వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 08, 2026.webp)
Illu illalu pillalu : చందు ప్రాణాలు తీయబోయి ప్రేమను బలి చేసిన భాగ్యం.. సీరియల్లో పెను సంచలనం!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -439 లో..... శ్రీవల్లి చేసిన మోసాన్ని భరించలేక చందు డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు. దాంతో ఏమైంది నువ్వు తాగి రావడం ఏంటని రామరాజు షాక్ అవుతాడు. నా భార్య వల్ల తాగానని చందు అంటే.. ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని నర్మద, ప్రేమ టెన్షన్ పడుతారు. చందుని ధీరజ్ పట్టుకుంటాడు. వాడి మనసు బాలేనట్లు ఉంది అందుకే ఇలా తాగేసి వచ్చాడని రామరాజు అంటాడు. అది చూసిన సాగర్.. చాలా బాగుంది మీకు ఇష్టమైన పెద్దకొడుకు తాగి వస్తే మనసు బాలేక అలా చేసాడని అనుకుంటారు. అదే ప్లేస్ లో ఇప్పుడు నేను ఉంటే ఆ చెంప ఈ చెంప వాయించేవాళ్ళు కానీ వాడు మీ ముద్దులా కొడుకు కదా అని సాగర్ వెటకారంగా మాట్లాడుతాడు. అరేయ్ ఏం మాట్లాడుతున్నావ్.. ఇన్ని రోజులు మనం అనే అనుకున్నాం.. ఇప్పుడు నువ్వు మీరు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావ్ ఏంటని సాగర్ పై ధీరజ్ కోప్పడతాడు. వాడు నీలాగా మోసం చేసి జాబ్ తెచ్చుకోలేదని సాగర్ పై రామరాజు కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాగర్ గదిలోకి వెళ్ళాక ఏంటి సాగర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అడుగుతుంది. అయిన సాగర్ తన మాటలు వినిపించుకోడు. మరొకవైపు ప్రేమ బాధపడుతుంది. ఆ తర్వాత భాగ్యం, ఆనందరావు, శ్రీవల్లి ముగ్గురు కలిసి ఒక రౌడీ దగ్గరికి వెళ్తారు. మీరు ఒకతనికి ఆక్సిడెంట్ చెయ్యాలని అతనికి చందు ఫోటో చూపిస్తుంది భాగ్యం. ఆ ఫోటో చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావ్ అమ్మ అని శ్రీవల్లి అడుగుతుంది. నీకేం తెలియదు చిన్న ఆక్సిడెంట్ అంతే.. దాంతో అల్లుడు గారికి నీ అవసరం ఉంటుంది కదా.. అప్పుడు నువ్వు వెళ్లి సేవలు చేస్తుంటే అల్లుడు మారిపోతాడని భాగ్యం ప్లాన్ చెప్తుంది. రౌడీకి డబ్బు కూడా ఇస్తుంది. మరొకవైపు గొడవని అత్తయ్య ఉంటే ఆపేది అని ప్రేమ, నర్మద అనుకుంటారు. అమూల్యకి కావలసినవి చేసి.. తనని కాలేజీకీ పంపిస్తారు ఇద్దరు వదినలు. తరువాయి భాగంలో భాగ్యం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎలా అంటే చందుకి ఆక్సిడెంట్ అవ్వబోతుంటే ప్రేమ తనని నెట్టుతుంది. దాంతో ప్రేమకి వెహికల్ డాష్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 08, 2026.webp)
Podharillu : మాధవ పెళ్లిచూపుల్లో మహా హంగామా.. చక్రి ప్రేమాయణం మొదలైందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -87 లో.....మాధవకి మ్యాట్రిమోనీలో సంబంధం ఒకే చేస్తుంది మహా. ఆ విషయం నారాయణకి చెప్తుంది. వాళ్ళు నెంబర్ ఇచ్చారు.. ఈ రోజు సాయంత్రం బాగుందట ఫోన్ చేసి వస్తున్నామని చెప్పండి అని నారాయణతో మహా చెప్తుంది. ఎలా మాట్లాడాలో రెహర్సల్స్ చేస్తారు. అప్పుడే మాధవ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు. అందరు తనకి విషయం చెప్పడానికి భయపడుతారు కానీ మహా మాత్రం తన మాటలతో దబాయించి పెళ్లిచూపులకి రెడీ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత అందరు పెళ్లి చూపులకి రెడీ అయి వస్తారు. మహా చీర కట్టుకొని అందంగా వస్తుంది. తనని చూసి చక్రి ఫ్లాట్ అవుతాడు. వదిన ఈ రోజు చీరలో బాగున్నారని కన్నా చెప్తాడు. నేను చెప్దామనుకునే లోపే చెప్పేసాడు అని చక్రి కుళ్ళుకుంటాడు. ఆ తర్వాత కార్ లో వెళ్తుంటే చక్రి అద్దంలో మహా ని చూస్తాడు. అది గమనించిన కేశవ, కన్నా తనని ఆటపట్టిస్తారు. ఆ తర్వాత చక్రి ఒక దగ్గర కార్ ఆపి మహాకి పూలు కొంటాడు. పెట్టుకోమని ఇవ్వగా తను వద్దని అంటుంది. తీసుకో అమ్మ అని నారాయణ, మాధవ అంటే తీసుకొని తల్లో పెట్టుకుంటుంది. దాంతో చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అమ్మాయి తండ్రి ట్రెండ్ అంటూ తన మాటలతో చిరాకు తెప్పిస్తాడు. అమ్మాయి జ్యోతి, మాధవ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఆ తర్వాత ముహూర్తం పెట్టుకుందామని అమ్మాయి వాళ్ళ నాన్న అంటారు. ఒకరి నెంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అందరు ఇంటికి వస్తారు. మహాకి హారిక ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఈ రోజు మా పెద్దికి సంబంధం చూడడానికి వెళ్ళామని మహా చెప్తుంది. నువ్వు వెళ్లడం ఏంటి.. నీ ఫ్యామిలీ ఇక్కడ ఉంది అని హారిక అంటుంది. నాకు అండగా ఉన్నవాళ్లే నా వాళ్ళు మా పెద్ది పెళ్లి అయ్యేవరకు నేను ఎక్కడికి రానని మహా చెప్తుంది. ఆ తర్వాత భోజనం చేస్తూ అందరు సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడే అమ్మాయి జ్యోతి ఫోన్ చేస్తుంది. అన్నయ్య బయటకు వెళ్లి మాట్లాడమని మాధవని బయటకు పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 08, 2026.webp)
Jayam serial : ఇంటి ఆడపడుచు సుధా రీఎంట్రీ.. ఇషిక, వీరుల కుట్రలు ఫలిస్తాయా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -237 లో.....పెద్దసారు తన చెల్లి గురించి శకుంతలతో అంటుంటే శకుంతల కోప్పడుతుంది. అది గంగ వింటుంది. విని రుద్రకి వెళ్లి చెప్తుంది. పెద్దసారు వాళ్ళ చెల్లి లేదనుకుంట.. ఆ టాపిక్ తీస్తేనే మీ పెద్దమ్మ కోప్పడుతుంది. తను ఉంటే ఎక్కడున్నా మళ్ళీ ఇద్దరిని కలిపేవాళ్ళం.. అప్పుడు కుటుంబం సంతోషంగా ఉండేదని రుద్రతో గంగ అంటుంది. పెద్దనాన్న అసలు ఈ విషయం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు.. అయన చెప్పకుండా మనం దీని గురించి తెల్సుకుంటే పెద్దనాన్నకి తెలిస్తే ఫీల్ అవుతాడని గంగతో రుద్ర అంటాడు. ఆ తర్వాత పెద్దసారు చెల్లి సుధా తన భర్త విశ్వనాథ్ బాక్సింగ్ ఛాంపియన్.. సుధా దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. మళ్ళీ ఈ ఊరుకి ఎందుకు వచ్చేలా చేసావ్.. నా వాళ్ళకి దూరం అయ్యాను.. నా కూతురు నాకు దూరం అయిందని ఏడుస్తుంటే విశ్వనాథ్ వచ్చి కోప్పడతాడు. నువ్వు ఇలా బాధపడొద్దని ముందే చెప్పానని కోప్పడతాడు. ఆ తర్వాత గంగ, రంగా టిఫిన్ చేస్తుంటే ఇందుమతి వచ్చి.. రాశి ఫలాలు బాగున్నాయని చెప్తుంది. తన దగ్గర ఫోన్ తీసుకొని రాశి ఫలాలు రంగా చదువుతాడు. అప్పుడే రాఘవ, సూర్య ఆఫీస్ కీ వెళ్తుంటే ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని పెద్దసారు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇజ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని గంగని ఎదురు రమ్మని చెప్తాడు పెద్దసారు. ఆ తర్వాత రుద్ర వచ్చి వాళ్ళకి అల్ ది బెస్ట్ చెప్తాడు. ఇంట్లో అందరు ఎవరిపనులకి వారు వెళ్ళిపోతారు. ప్రమీలని రుద్ర సూపర్ మార్కెట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మక్కమ్ ని పిలిచి కార్తీక్ గురించి అడుగుతాడు. కాసేపటికి కార్తీక్ వస్తాడు. కార్తీక్ తో రుద్ర మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విశ్వనాథ్ ని రుద్ర అకాడమీలో కలిసి మాట్లాడుతాడు. నీ బాక్సింగ్ కి నేను పెద్ద ఫ్యాన్ అని రుద్రతో విశ్వనాథ్ అంటాడు. మరొకవైపు గంగ స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ సుధాకి సంబందించిన జ్ఞాపకాలు ఉంటాయి. అప్పుడే శకుంతల వచ్చి. నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావని కోప్పడుతుంది. ఆ తర్వాత సుధా ఫోటోని ఇషిక తీసుకొని వెళ్లి వీరుకి చూపిస్తుంది. ఈవిడే అనుకుంటా ఈ ఇంటికి ఆడపడుచు అని ఇషిక అంటుంది. అన్నీ కనుక్కుంటానని వీరు అంటాడు. నీకు హెల్ప్ చేస్తాను కానీ నువ్వు ఏం చెయ్యట్లేదని ఇషిక అనగానే.. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను ఇషిక.. మీ అయన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని అందరు అనుకుంటున్నారు కానీ అది జరగదని వీరు అనగానే ఇషిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 08, 2026.webp)
రేయ్ రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా!?
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి వచ్చాడు. ఇందులో ఇంద్ర మూవీ సీన్స్ స్పూఫ్ గా చేశారు. పదేళ్ల తరువాతా కాశీలో అనేసరికి ఆది చిరంజీవి గెటప్ లో వచ్చారు. "రేయ్ ఎవరో కాశీకి వస్తున్నారు కృష్ణ రామ అనుకుంటా " అని ఆది నాటీ నరేష్ తో అన్నాడు. అక్కడికి అందంగా నడుచుకుంటూ వచ్చిన రష్మీ ఆది మాట వినేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె కోపం తీర్చడానికి "అంతగా నచ్చావమ్మో అనసూయమ్మో " అనే సాంగ్ పాడాడు. అంతే రష్మీ కి కోపం వచ్చేసింది. హే ఎలా అనుకుంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆదికి అర్ధమయ్యింది. "రేయ్ రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా " అన్నాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఆల్రెడీ అనసూయ హోస్టింగ్ మానేసి చాలా ఏళ్ళే ఐపోయింది. జబర్దస్త్ లో అనసూయ తర్వాత రష్మీ వచ్చింది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చేస్తోంది. ఇక ఇప్పుడు అనసూయ మీద ఉన్న పాట వేసి రష్మిని హర్ట్ చేసాడు ఆది. ఇక రష్మీ ఇందులో మామిడికాయ పచ్చడి పట్టి అందరికీ రుచి చూపించింది. ఇక ఆది , పృద్వి , టేస్టీ తేజ వంటి వాళ్లంతా తిని వామ్మో అంటూ ఆపసోపాలు పడ్డారు.
Apr 07, 2026.webp)
14 ఏళ్ళ రిలేషన్ షిప్...నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్నా, అరుస్తున్నా
సర్కార్ లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ తో పాటు విష్ణు ప్రియా కూడా హోస్ట్ చేయడానికి వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి "పాపం ప్రతాప్ "మూవీ టీమ్ నుంచి తిరువీర్, ప్రసాద్ బెహ్రా, స్నేహ, రవి వచ్చారు. ఈ ప్రోమో లాస్ట్ లో సుధీర్ అందరితో కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడాడు. "ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి తొలి ప్రేమ ఏంటి " అంటూ సుధీర్ అడిగాడు. వెంటనే తిరువీర్ "మీ ఫస్ట్ లవ్ ఏంటి మీరు చెప్పండి " అన్నాడు. "14 ఏళ్ళ రిలేషన్ షిప్ కదా ఎందుకు బ్రేక్ అయ్యింది " అంటూ విష్ణు ప్రియా కూడా చాలా హృదయ విదారకంగా అడిగింది. "తాను వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. నాకు తెలిసి ఈ విషయం ఏంటి ఇదంతా అని అడిగాను. అప్పుడు ఆమె నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. నెక్లెస్ రోడ్ లో పరిగెడుతున్నా, అరుస్తున్నా ఏంటేంటో చేస్తున్నా" అనేసరికి అందరూ మొహాలు డల్ గా ఐపోయాయి. ఇక విష్ణు ప్రియా సుధీర్ కి కో - హోస్ట్ గా రాబోతోంది. వీళ్ళిద్దరూ కామెడీ టైమింగ్ కానీ, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో వీళ్ళను మించిన వాళ్ళు ప్రస్తుతం లేరు. ఇక వీళ్ళ కాంబో మీద నెటిజన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. తెగ మెసేజెస్ పెట్టి పోవే - పోరా వైబ్ ఉండబోతోంది. ప్రతీ సర్కార్ సీజన్ కి వీళ్ళిద్దరినే కంటిన్యూ చేయండి. ఇక ఈ షో సూపర్ హిట్ జోడి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Apr 07, 2026.webp)
పాపులర్ ఉత్తమ జోడీగా అవార్డు రానందుకు అలిగిన బాలు - శ్రీముఖి
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ సండే ప్రోమో వచ్చేసింది. పరివార్ అవార్డ్స్ సక్సెస్ పార్టీ పేరుతో ఈ షో రాబోతోంది. ఇక ఇందులో కార్తీక దీపం 2 లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి పరివార్ అవార్డు తీసుకుని వచ్చింది. "ఈ ఇద్దరు అన్నయ్యలకు అవార్డు రాలేదు వాళ్లకు ఏమన్నా చెప్తావా " అంటూ శ్రీముఖి అవినాష్, హరిని చూపిస్తూ చెప్పింది. "ఇప్పటినుంచైనా బాగా చెయ్యండి అన్నయ్యలు. బాగా చేస్తే మీకు కూడా అవార్డ్స్ వస్తాయి " అని చెప్పింది. " నా మొహమే చూసి చెప్తున్నావ్ ఎం హరికి చెప్పవా " అని అడిగాడు అవినాష్. "వాడికి చెప్పినా వేస్ట్ అని చెప్పలేదు " అంటూ వెనక నుంచి మానస్ కోరస్ ఇచ్చాడు. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. శ్రీముఖి వెంటనే "ఆయన ఉత్తమ నాన్న అవార్డు ఇవ్వడమేంట్రా " అని అడిగింది. "ఉత్తమ నాన్న కాదు ఉత్తమ తాత అంటూ హరి ఇంకొంచెం ఎక్కువ చేసాడు. "మనం ఇంత చిన్న వయసులో అంత నన్నలా యాక్ట్ చేసినందుకు ఇచ్చారు " అని అవార్డు ఇచ్చారు అంటూ ప్రభాకర్ చెప్పేసరికి "ఏ వయసులో " అంటూ అవినాష్ మధ్యలో అడ్డుపడ్డాడు. ఇంతలో బాలు వచ్చాడు. అంతే ఇద్దరూ కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక శ్రీముఖి తెగ సిగ్గుపడిపోతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. "అవార్డు ఇచ్చినప్పుడు బాగుందా ఇప్పుడు శ్రీముఖిని ఎత్తుకున్నప్పుడు బాగుందా " అంటూ హరి అడిగాడు. "ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి నాకు ఈ అవార్డు గొప్ప " అని బాలు అనేసరికి శ్రీముఖి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనకే బాలు వెళ్లి శ్రీముఖి సారీ నేను కొంచెం అలిగి ఉన్నాను అన్నాడు. నువ్వెందుకు అలిగావ్ అని శ్రీముఖి అడిగింది. పాపులర్ జోడి అవార్డు సీరియల్ లో బాలు - మీనాకు వచ్చింది. బాలు - శ్రీముఖికి రాలేదని అందుకే అన్నాడు. అంతే శ్రీముఖి నవ్వేసి బాలుతో స్టేజి మీదకు వచ్చేసింది. "ఇదో తింగరిది ఏది చెప్తే అది నమ్మేస్తది " అంటూ వెనక నుంచి హరి శ్రీముఖిని అనేశాడు.
Apr 07, 2026.webp)
వరుణ్ కాలేజ్ లోనే అలా చేసావ్..అదే గర్ల్స్ కాలేజీలో చేర్పిస్తే ఎం చేసేదానివో!
నెక్స్ట్ వీక్ ఆట షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ నిహారిక వాళ్ళ అమ్మ పద్మ వచ్చారు. "నాకు చాలా నచ్చుతుంది ఎవరైనా మీ అమ్మలా ఉన్నవని చెపితే ఎందుకంటే మా అమ్మ చాలా అందమైన అమ్మాయి" అని చెప్పింది. ఇక సుధీర్ వాళ్ళ అమ్మతో చిట్ చాట్ చేసాడు. "ఇంట్లో డామినేషన్ ఎవరు వరుణ్ గారా నిహారిక గారా. చిన్నప్పుడు వరుణ్ గారిని బాగా కొట్టేదంట కదా " అని అడిగాడు. నిహారికనే డామినేషన్.. చిన్నప్పుడు వరుణ్ ని బాగా కొట్టేది అని చెప్పారు. "చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ మా అన్నకే సపోర్ట్ చేసింది నాకెప్పుడూ సపోర్ట్ చేయలేదు " అంది నిహారిక. "నువ్వు మీ నాన్న ఒకటి కాదమ్మా " అన్నారు నిహారిక వాళ్ళ అమ్మ . "స్కూల్ ఎగ్గొట్టడాలు లేకపోతె కాలేజీలు " అని సుధీర్ అడిగేసరికి "బోర్డు మీద టీచర్ ఎం రాసినా రాసుకునేది కాదు రెండో రోజు నేను వెళ్లి అన్నీ నోట్సులు నేను రాసుకుని వచ్చేదాన్ని వరుణ్ ఉన్న కాలేజీ నుంచే ఎగ్గొట్టి బయటకు వెళ్లేదానివి అదే ఇంకా గర్ల్స్ కాలేజీ లో చేర్పిస్తే ఇంకేం చేసేదానివో" అనేసరికి నిహారిక సైలెంట్ గ తలదించుకుని కూర్చుంది. "నీహారిక గారు వంట చేస్తారా అండి " అని సుధీర్ అడిగాడు. "నిహారిక వంట చేస్తది కానీ ఆ తర్వాత మనం కిచెన్ లోకి వెళ్లాం అంటే సర్దుకోలేక చచ్చిపోవాలి." అనేసారు నిహారిక వాళ్ళ అమ్మ ."ఏవండీ కన్ను ఏమీ అనొద్దు అని చెప్పండి. ఏదైనా స్వీర్ వార్నింగ్ ఇవ్వండి" అని అడిగాడు సుధీర్. "నిన్ను అంటేనే బాగుంటుంది " అని ఆవిడ అనేసరికి అందరూ నవ్వేశారు. ఆ తర్వాత నిహారిక వాళ్ళ అమ్మ గుసగుసలాడుకున్నారు. "ఈ రెండు గంటలకు నా రెమ్యూనరేషన్ ఇస్తే వెళ్ళిపోతాను అంటోంది " అని వాళ్ళ అమ్మ అన్న విషయాన్ని చెప్పేసింది నిహారిక.
Apr 07, 2026.webp)
బ్రహ్మముడి నేటి ఎపిసోడ్: ఇందుని మార్చేందుకు అపర్ణ మాస్టర్ ప్లాన్.. రేఖ కుట్రలు ఫలిస్తాయా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -999 లో..... కావ్య ఎక్కడ సంతకం పెడుతుందోనని సుభాష్, అపర్ణ టెన్షన్ పడతారు. ఇందు వాళ్ళ అమ్మ కావ్య కూడా చాలా మొండిగా ఉండేది. ఎవరు ఏం చెప్పినా తను అనుకుందే చేస్తుంది. ఇప్పుడు ఇందు కూడా అలాగే తయారైందని సుభాష్, అపర్ణ అనుకుంటారు. ఇందుని మనం ఒప్పించలేం కానీ వాళ్ళ అమ్మ ఒప్పిస్తుందని అపర్ణ అనగానే వాళ్ళ అమ్మ లేదు కదా అని సుభాష్ అంటాడు. గతంలో కళ్యాణ్ తన వదిన కావ్య గురించి ఒక పుస్తకం రాసాడని.. గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది అపర్ణ. గతంలో కావ్య తన గొప్పతనన్ని వివరిస్తూ కళ్యాణ్ ఒక బుక్ రాస్తాడు. ఆ పుస్తకాన్ని అపర్ణ తీసుకొని వచ్చి ఇందుకి ఇస్తుంది. ఇదేంటి నానమ్మ అని ఇందు అడుగుతుంది. ఇది మీ అమ్మ గురించి మీ బాబాయ్ కళ్యాణ్ రాసిన పుస్తకం.. అప్పుడు మీ అమ్మ అంటే ఏంటో తెలుస్తుందని ఇందు చేతికి అపర్ణ బుక్ ఇస్తుంది. మరొక వైపు రాహుల్, రుద్రాణి ఫోటో దగ్గరికి రేఖ వెళ్లి రేపటితో మీరు కన్న కల నిజమవుతుంది కానీ మీరు లేరని అనుకుంటూ రేఖ బాధపడుతుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి రేపు పార్టీ అంటున్నావ్.. అంతమందిలో ఆ ఇందు మనం సంతకం పెట్టమంటే పెడుతుందా అని భ్రమరాంబ అడుగుతుంది. ఆ అపర్ణ వెనకాల ఉండి ఏదో నడిపిస్తుందని భ్రమరాంబ అంటుంది. ఇందు వాళ్ళ అమ్మ లాగే బంధాలు బంధుత్వాలు అంటూ ఎమోషనల్ అవుతుంది. ఈ ఇద్దరు ముసలి ప్రాణాలు మన చేతిలో ఉన్నంతవరకు ఇందు ధైర్యం చెయ్యదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఈ ఇందుకి ధైర్యం లేదు. అలాగే తోడు కావాలి. అది లేదు.. అలాంటప్పుడు ఏం చేస్తుంది. మనం చెప్పింది చెయ్యక తప్పదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
Podharillu:మాధవ పెళ్లి సంబంధం ఫిక్స్. పొదరిల్లు సీరియల్లో ఊహించని మలుపు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -86 లో..... శైలు తన ఫోన్ కేశవ దగ్గర నుండి తీసుకొని రీల్స్ చేస్తుంది. ప్లీజ్ రోజుకు రెండు రీల్స్ చేసి ఇస్తాను ఫోన్ ఇస్తారా అని కేశవని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఆ టార్చర్ వద్దు బాబోయ్.. నువ్వు నీ ఫోన్ తీసుకోమని కేశవ అంటాడు. మరి నా దగ్గర డబ్బు లేదని శైలు అంటుంది. సరే ఉన్నప్పుడు ఇవ్వమని కేశవ అంటాడు. నేను పారిపోతే అని శైలు అనగానే మీ నాన్న నెంబర్ సేవ్ చేసానని కేశవ అంటాడు. థాంక్స్ అని శైలు హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కేశవ, చక్రి, కన్నా, మహా నలుగురు కూర్చొని మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ ఫొటోస్ పెడతారు. అప్పుడే మాధవ వచ్చి ఏంటి నలుగురు ఒక దగ్గర కూర్చొని ఉన్నారు.. అంటే ఏదో చేస్తున్నారని అర్థం అని మాధవ అంటాడు. ఏం లేదు పెద్ది.. నీకు మంచి సంబంధం కోసం మ్యాట్రీమోనిలో సంబంధం చూస్తున్నామని మహా చెప్పగానే అదంతా ఎందుకని మాధవ అంటాడు. అంటే నువ్వు ఇంకా గాయత్రిని మర్చిపోలేదు అన్నమాట అని చక్రి అంటాడు. అదేం లేదు మర్చిపోయానని మాధవ అంటాడు. ఇక చేసేదేమీ లేక సరే మీ ఇష్టం అని మాధవ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత నారాయణ డ్రింక్ చెయ్యడానికి మందు తెచ్చుకుంటాడు. వద్దు ట్యాబ్లెట్ వేసుకోవాలని మహా ఆపుతుంది. కేశవ వాళ్ళని పిలిచి మందు సేసా లాక్కోమని చెప్తుంది మహా. ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చి ఒక సంబంధం ఒకే అంటారు. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మాధవ మాత్రం గాయత్రిని గుర్తుచేసుకుంటాడు. మరుసటి రోజు మహాని ఇంప్రెస్ చెయ్యడానికి చక్రి స్నానం చెయ్యకుండానే పూజ చేస్తాడు. అప్పుడే కేశవ, కన్నా వచ్చి చక్రిని ఆటపట్టిస్తారు. వాడు స్నానం చెయ్యకుండా పూజ చేశాడని కేశవ అనగానే మహా కోప్పడుతుంది. ఆ తర్వాత మాధవ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతారు. చక్రి వాళ్ళతో ఫోన్ మాట్లాడితే అందరి గురించి ఎలా బిల్డప్ ఇస్తాడోనని మహా ఇమిటేట్ చేస్తుంది. ఆ తర్వాత మహా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మంచి రోజు చూసుకొని రమ్మని వాళ్ళు చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ విషయం నారాయణకి చెప్పడానికి తనని లోపలికి పిలుస్తారు. నాకెందుకు చెప్పడం మీరు ఉండగా అంటూ అతను వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
Karthika Deepam2: తండ్రి అని చూడకుండా దాస్ను అవమానించిన జ్యోత్స్న.. షాక్లో కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -637 లో.....జ్యోత్స్న నిజస్వరూపం పూర్తిగా దాస్, కార్తీక్ కి తెలిసిపోతుంది. నేను నీ కూతురు అని తెలిసినప్పటి నుండి ఒక జత బట్టలు అయినా కొన్నావా.. కొనలేదు.. ఎందుకు అంటే నాకు బట్టలు కొనాలంటే నువ్వు జేబులు తడుముకోవాలి.. ఛీ అని జ్యోత్స్న అనగానే దాస్ కోపంగా జ్యోత్స్న అని అంటాడు. నేను ఊసింది నీ మీద కాదు.. మన బతుకుల మీద..... నానమ్మ పిల్లల్ని మార్చేసిందని నీకు తెలుసు.. అయినా నువ్వు సైలెంట్ గా ఉన్నావ్.. ఎందుకంటే నీ కూతురు రాణిలాగా బ్రతకడం నీక్కూడ ఇష్టమే కానీ ఇప్పుడు ఏదో మారిపోయి నిజం చెప్తానని వచ్చేసావ్. ఇప్పుడు శౌర్య నా కూతురు అంటూ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తానంటే శౌర్య వెళ్తుందా.. వెళ్ళదు ఎందుకంటే బావ చూసుకున్నంత బాగా తనని ఇంకెవరు చూసుకోలేరు.. నేను కూడా అంతే దశరథ్, సుమిత్ర కూతురు నేనే.. ఈ ఆస్తులకి వారసురాలిని నేనే అని జ్యోత్స్న అంటుంది. ఇప్పుడే వెళ్లి అందరికి నిజం చెప్పేస్తానని దాస్ అంటాడు. నువ్వు వెళ్తే ఈ మేడ మీద నుండి దూకేస్తానని జ్యోత్స్న అంటుంది. అప్పుడు నిజం తెలిసి మా అమ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత మా డాడీ.. తాత.. ఎవరు ఉండరు అని జ్యోత్స్న అంటుంది.. నా కూతురిని చుస్తే భయంగా ఉందిరా అని కార్తీక్ తో దాస్ అంటాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి మావయ్య అని కార్తీక్ అతన్ని పంపిస్తాడు. మరొక వైపు దీప, శ్రీధర్, కాంచన ఇంటికి వెళ్తారు. కార్తీక్ ఎందుకో పార్టీలో టెన్షన్ గా కనపడ్డాడు అని కాంచన, శ్రీధర్ అనుకుంటారు. ఏమైందని దీపని అడుగుతారు. నిజంగానే బావకి జ్యోత్స్న ఏదో గురించి తెలిసినట్లు ఉందని దీప అనుకుంటుంది. నాకేం తెలియదని దీప అనగానే మీరు ఏం చెప్తారు.. ఏం చెప్పరని కాంచన కోప్పడుతుంది. మరొకవైపు దాస్ వెళ్ళిపోయాక కార్తీక్ తో జ్యోత్స్న మాట్లాడుతుంది. నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకోమని కార్తీక్ అంటాడు. సరే ఒక పని చెయ్ బావ.. నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటానని జ్యోత్స్న అంటుంది. ఏంటది అని కార్తీక్ అడుగుతాడు. నన్ను పెళ్లి చేసుకోమని జ్యోత్స్న అనగానే నాకు ఆల్రెడీ పెళ్లి అయిందని కార్తీక్ అంటాడు. ఆల్రెడీ పెళ్లి అయిన దీపనే పెళ్లి చేసుకున్నావ్ కదా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఎలా అయితే దీపని నీ భార్య అని ఫీల్ అవుతున్నావో నేను కూడా ఈ ఆస్తులకి వారసురాలిని అని ఫీల్ అవుతున్నానని జ్యోత్స్న అంటుంది. నిజం ఒప్పుకోమని కార్తీక్ అనగానే ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. నీ నోటితో నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తానని జ్యోత్స్నతో కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి మాట్లాడుతుంటే సుమిత్ర, దశరత్, శివన్నారాయణ వస్తారు. ఎందుకు అత్తయ్య ఎప్పుడు జ్యోత్స్నని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని సుమిత్ర అంటుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి దీపకి దిష్టి తీస్తాడు. ఏంట్రా అలా తీస్తున్నావని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: ప్రేమపై ధీరజ్ ఆగ్రహం.. వల్లి నిజం బయటపెట్టనున్న చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-438లో.. ధీరజ్ తో ప్రేమ మట్లాడుతుంది. అరెయ్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ రా.. అమూల్య విషయంలో నాకేం పాపం తెలియదురా.. ఇది నా కుటుంబం.. నా కుటుంబానికి నేను ప్రాణం పోయినా ద్రోహం చేయనురా అని ధీరజ్ ప్రేమ అంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదురా.. నా మనసులో నిజంగానే స్వచ్చమైన ప్రేమ ఉంది రా అని ప్రేమ అనగానే ఆపుతావా నీ నాటకాలు అని ధీరజ్ అంటాడు. నువ్వేం చెప్పినా నమ్మడానికి నేను పాత ధీరజ్ ని కాదు.. నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు అని ప్రేమతో ధీరజ్ అంటాడు. మోసం కాదురా నిజం.. నా మీద నీకు ప్రేమ కలగడానికి ముందే నేను నిన్ను ప్రేమించాను కానీ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదురా.. నువ్వు ప్రపోజ్ చేసాక. నాలో ఉన్న ప్రేమని నీకు చెప్పకుండా దాచడం నా వల్ల కాలేదు.. అప్పుడే ఈ గొడవ జరిగింది.. అందుకే ఇప్పుడు చెప్తున్నా..ఐ లవ్ యూ రా ధీరజ్ అని చెప్తూ లవ్ బర్డ్స్ ని ఇస్తుంది. కానీ ధీరజ్ ఆ బొమ్మని విసిరేస్తాడు. అది విరిగిపోతుంది. ఇక ప్రేమ ఆ పగిలిన బొమ్మని తీస్తుంటే తన చేతికి గాయమై రక్తం కారుతుంది. అప్పుడే అటుగా నర్మద వస్తుంది. ప్రేమకి గాయం తగిలింది చూసి, వచ్చే రక్తం చూసి.. ఏంటి ధీరజ్ ఇలా చేస్తున్నావని నర్మద నిలదీస్తుంది. దాంతో ధీరజ్ అక్కడినుండి వెళ్ళిపోతాడు. ప్రేమని నర్మద ఓదారుస్తుంది. మరోవైపు శ్రీవల్లి జరిగినది తలుచుకొని బాధపడుతుంది. అదే సమయంలో ఆనందరావు కోసం మిర్చీ బజ్జీలు చేస్తుంది భాగ్యం. ఇక ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. అది చూసి శ్రీవల్లి ఓర్వలేకపోతుంది. ఇక ఒక చీపురుకట్ట తీసుకొచ్చి ఇద్దరిని చెడామడా బాదుతుంది. ఎందుకు కొడుతున్నావని భాగ్యం అడుగుతుంది. నా కాపురం కూల్చేసి ఇక్కడ మీరు సరసాలు ఆడుతున్నారా అని ఫైర్ అవుతుంది శ్రీవల్లి. నిన్ను పదిరోజుల్లో ఆ ఇంట్లోకి పంపిస్తానని చెప్పాను కదా.. సరే రేపే నిన్ను మీ అత్త వారింట్లో దింపొస్తానని శ్రీవల్లికి భాగ్యం మాటిస్తుంది. దాంతో తను కూల్ అవుతుంది. ఇక రాత్రివేళ చందు బాగా తాగేసి బండి తోసుకుంటూ వస్తాడు. మా నాన్నని మోసం చేశావే.. ఈరోజు నీ గురించి చెప్పేస్తానని చందు అనుకుంటాడు. ఇక చందు ఇంటికి రాగానే ధీరజ్, తిరుపతి, సాగర్, నర్మద, ప్రేమ, అమూల్య అందరు వస్తారు. ఇక నాన్న.. నాన్న అంటూ రామరాజుని పిలుస్తాడు చందు. కాసేపటికి రామరాజు బయటకి వస్తాడు. ఏమైందిరా అని రామరాజు అడుగగా నేనే లైట్ గా తాగేసి బైక్ పడేసానని తిరుపతి అబద్ధం చెప్తాడు. నాన్న బండి నేనే పడేసానని చందు అంటాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు. వల్లి గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని చందు అంటాడు. ఏంట్రా తాగేసి వచ్చావా అని రామరాజు అడుగుతాడు. మరోవైపు నర్మద, ప్రేమ అసలు విషయం కవర్ చేయడానికి పదండి బావ.. తినేసి పడుకోండి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామని అంటారు. లేదు నేను తాగి రావడానికి కారణం వల్లీనే అని చందు అంటాడు. అదేంట్రా అని రామరాజు అంటాడు. అసలు నిజమేంటంటే అని చందు చెప్పబోతుంటే.. అదేం లేదు మామయ్య.. వల్లీ అక్క ఇంటికెళ్ళాక ఫోన్ చేయలేదంట అని నర్మద చెప్తుంది. ఇక ధీరజ్ , తిరుపతి ఇద్దరు కవర్ చేసి చందుని లోపలికి తీసుకెళ్తుంటే సూపర్.. సూపర్ అంటు ఇక్కడ ఒక పెద్ద సెంటిమెంట్ డ్రామా జరుగుతుందని సాగర్ క్లాప్స్ కొడతాడు. అది విని.. ఏంటి సాగర్ అని నర్మద అడుగుతుంది. పెద్దకొడుకు తాగేసి వచ్చాడు కాబట్టి ఏం అనడం లేదు.. అదే పని నేను చేస్తే ఏదో దేశద్రోహం చేసినవాడిని చూసినట్టుగా చూసి నా చెంపచెల్లుమనిపిస్తాడు ఈయన అని రామరాజుతో సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026.webp)
Jayam serial : సూర్య సక్సెస్లో రుద్ర మాస్టర్ ప్లాన్.. ఇషికకు గట్టి కౌంటర్ ఇచ్చిన బావ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -236 లో..... అందరు హాల్లో ఉండగా చాలా హ్యాపీగా రాఘవ, సూర్య ఇంటికి వస్తారు. పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసాను పెద్దనాన్న అని గుడ్ న్యూస్ అందరికి చెప్తాడు సూర్య. దాంతో అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూర్య ఈరోజు ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఒక తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని రాఘవ చెప్తాడు. థాంక్స్ రుద్ర.. నీ వల్లే ఇదంతా అసలు ఆ ప్రాజెక్ట్ రావడానికి కారణం నువ్వే.. దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ చేసావో నాకు తెలుసు.. వాడు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా నువ్వు ప్రిపేర్ చేసిందేనని రాఘవ అనగానే అందరూ షాక్ అవుతారు. అవునా అని పెద్దసారు అంటాడు. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించారు కానీ ప్రతీ దాంట్లో సాయంగా ఉంటున్నాడని రుద్ర గురించి రాఘవ పొగుడుతాడు. నాకు తెలుసు రుద్ర ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తాడని పెద్దసారు అంటాడు. నాకు ఈ కుటుంబం సంతోషంగా ఉండడం కావాలి దానికోసం ఏదైనా చేస్తానని రుద్ర అంటాడు. ఇషిక ఇప్పటికైనా అర్థం అయిందా సూర్య స్టామినా.. హాఫ్ నాలెడ్జ్ అన్నావ్ కదా.. ఎప్పుడు కూడా భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు. తనకి సపోర్ట్ గా ఉండాలని రుద్ర అనగానే తప్పకుండా బావగారు అని ఇషిక అంటుంది. మరి సూర్యకి కంగ్రాట్స్ చెప్పమని గంగ అనగానే కంగ్రాట్స్ సూర్య అని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత ఇంత గుడ్ న్యూస్ చెప్పావ్ కదా.. ఈ రోజు పాయసం చేస్తానని గంగ అంటుంది. ఆ తర్వాత వీరు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే ఇషిక వెళ్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా అని ఇషిక అంటుంది. అవసరం ఉన్నప్పుడు చెప్తాను..... కంగ్రాట్స్ ఫర్ యువర్ హస్బెండ్ సక్సెస్ అని వీరు అంటాడు. తన సక్సెస్ తనది.. నాది కాదు.. బిజినెస్ మొత్తం నా గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటే ఇలా జరిగింది ఏంటని ఇషిక డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 07, 2026
కార్తీక దీపం సీరియల్ హీరోని నేను కాదు.. కార్తీక్ నాకు కలిసొచ్చింది!
బుల్లితెర మీద కార్తీక దీపం సీరియల్ ఆడియన్స్ ని ఎంతలా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిందో అందరికీ తెలుసు. ఇందులో నటించిన నిరుపమ్ అలియాస్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు పేరు ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఐతే నిరుపమ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఐతే కార్తీక దీపం సీరియల్ కి ఫస్ట్ ఛాయస్ కార్తిక్ కాదట. ఐతే అప్పటికే కుంకుమ అనే సీరియల్ చేస్తున్నాడట నిరుపమ్. "ఆ ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్. ఈ కార్తీక దీపం ప్రొడ్యూసర్ కి ఆల్రెడీ మూగమనసులు అనే సీరియల్ చేసాను. ఐతే కార్తీక దీపం సీరియల్ తీస్తున్నారని తెలిసింది. కానీ అప్పటికే మా టీవిలో ఉన్నా కానీ ఆ సీరియల్ కి కూడా నన్నే పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి నన్ను అడగలేదు కానీ ఈ సీరియల్ గురించి డిస్కస్ చేశారు. ఎవరైనా హీరోలుంటే చెప్పండి అని అడిగారు. నేను కూడా ఇద్దరినీ పంపించా. వాళ్లకు స్క్రీన్ టెస్టులు ఆడిషన్స్ చేశారు. కానీ ఎవరూ సెలెక్ట్ కాకపోతున్నప్పుడు నా పేరు మళ్ళీ వచ్చింది. కుంకుమ పువ్వులో చేస్తున్నా కూడా కార్తీక దీపం సీరియల్ కి సూట్ అవుతాడని చెప్పి ఒప్పించారు దాంతో నేను అనుకోకుండా ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. చంద్రముఖిలో నా పేరు కార్తీక కార్తీక దీపంలో కూడా నా పేరు కార్తీక్ . బయట ఎవరైనా కార్తీక్ అనే పిలుస్తారు ఆ పేరే సూటయ్యింది అంటారు. ఎందుకో ఆ పేరే కలిసొచ్చింది. మలయాళంలో ఈ సీరియల్ బాగా సక్సెస్ అయ్యింది. ఐతే అందులో నాలుగు తెలుపు అమ్మాయిలు అనే కాన్సెప్ట్ తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు రాసుకున్నాం. సినిమా సెలబ్రిటీస్ కూడా ఈ సీరియల్ మీద పోస్టులు పెట్టడం వలన కూడా ఈ సీరియల్ బాగా వైరల్ అయింది. లక్ష్మి మంచి, వెన్నెల కిషోర్ వంటి సెలబ్రిటీస్ కూడా వాళ్ళ మూవీస్ లో ఈ సీరియల్ డైలాగ్స్ ని చెప్పేసరికి కూడా ఈ సీరియల్ ఆడియన్స్ లోకి బాగా వెళ్ళింది.
Apr 06, 2026
కిల్లర్ వయసెంతో తెలుసా...
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి రోల్ లో నటించిన జ్యోతి పూర్వజ్ గురించి తెలియని వారుండరు. అందమైన తల్లిగా ఆ సీరియల్ లో నటించి ఎంతోమందిని మెప్పించింది. అలాంటి జ్యోతి పూర్వజ్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో "ప్రశ్నలు అడగండి...రైట్ క్వశ్చన్స్ కె ఆన్సర్ ఇస్తా " అని చెప్పింది. దాంతో చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. "నీ పేరేంటి" "డోనాల్డ్ ట్రంప్". "పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు నటిస్తున్నారు.. ఆయనలో నచ్చింది ఏంటి" "వచ్చే ఏడాది. మంచి మనిషి", "ఛాన్స్ వస్తే హాలీవుడ్ కి వెళ్తారా బాలీవుడ్ కా" "హాలీవుడ్ కి ", "ఇంతకు మీ వయసెంత" "ఇదిగో పాన్ కార్డు చూసుకోండి 1994 జులై". "కిల్లర్ మూవీలో కాకుండా ఇంకా ఎందులో నటిస్తున్నారు" "ఏ మాస్టర్ పీస్ తెలుగులో, కన్నడలో హల్కా డాన్ ..ఈ ఏడాది విడుదలవుతున్నాయి ". "మహేష్ బాబు గారి గురించి ఒక్కమాటలో" "చాలా హై ఎనర్జీ నటుడు " "శ్రద్దా కపూర్ కంటే క్యూట్ గా మలైకా కంటే హాట్ గా ఉంటారు ". "అల్లు అర్జున్ గురించి " " బెస్ట్ పెర్ఫార్మర్" "యాక్టర్ ప్రభాస్ గురించి "క్యూట్" " ధనుష్ సర్ గురించి ఒక్క మాటలో" "పెర్ఫార్మర్" "తారక్ అన్న గురించి " "టైగర్" "రామ్ చరణ్ సర్ గురించి" "హార్డ్ వర్కింగ్ పెర్ఫార్మర్, పర్ఫెక్షనిస్ట్" "కిచ్చ సుదీప్ సర్ గురించి" "స్టైలిష్, పవర్ఫుల్ పెర్ఫార్మర్" " చిరంజీవి సర్ గురించి" "ది మైటీ మెగాస్టార్ ..మంచి మనసున్న వ్యక్తి" అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు టకాటకా ఆన్సర్స్ ని తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది.
Apr 06, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



