.webp)
ఆ తల్లుల కోరిక తీర్చిన రామ్ ప్రసాద్, నరేష్..ఓల్డేజ్ హోముల్లో వదిలేయకండి!
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉన్నట్టు కనిపించింది. ఈ ఎపిసోడ్ లో యూనివర్సల్ మామ్ గా ఉన్న అలనాటి అందాల సహజ నటి జయసుధ వచ్చింది. అలాగే ఓల్డ్ ఏజ్ నుంచి కొంతమంది తల్లులు కూడా వచ్చారు. రాగానే రాంప్రసాద్ "ఇండస్ట్రీలో చాలా చాలా పెద్ద పెద్ద హీరోలకు మదర్ గా చేశారు కదా ఒక వేళా ఫ్యూచర్ లో నేను హీరో ఐతే నాకు మదర్ గా చేస్తారా " అని అడిగాడు. దానికి జయసుధ ఎం మాట్లాడలేదు. "ఏంట్రా మదర్ గా చేయడానికి ఆలోచిస్తున్నారా " అని నరేష్ ని అడిగాడు. "నువ్వు హీరోగా చేస్తున్నావంటే ఆలోచిస్తున్నారు " అంటూ కౌంటర్ ఇచ్చాడు. "ఇక్కడ కొంతమంది మదర్స్ తల్లులు లేకుండా అక్కడ కొంతమంది బాధపడుతున్నారు. మనందరం కలిసి ఈ మదర్స్ డేని సెలెబ్రేట్ చేసుకోవాలి " అని చెప్పింది జయసుధ. ఒక తల్లి తనకు కొడుకు ఉంటే అతని బండి మీద వెళ్లాలని కోరుకునేసరికి రాంప్రసాద్ తన బైక్ మీద డ్రైవింగ్ కి తీసుకెళ్లాడు. ఇక పండు వాళ్ళ అమ్మ తనకు అమెరికా వెళ్లాలనే కోరిక ఉందని చెప్పేసరికి పండు షాకయ్యాడు. ఇంకో తల్లి ఐతే తనకు మామిడిపండు కావాలని అది కూడా చెట్టెక్కి తేవాలని ఆ చిటారు కొమ్మన ఉన్న కాయని తెంపాలని నాటీ నరేష్ ని అడిగింది. తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో ఒక సీన్ ని స్పూఫ్ గా చేశారు నరేష్, సన్నీ, బాబు వీళ్లంతా. ఫైనల్ లో రాకెట్ రాఘవ వచ్చి "చూస్తుండగానే మనిషి కాలిపోయింది. మనమే చేయలేము. బెడ్ మీద కాలిపోయి ఉంది. దగ్గరకు వెళ్లాను. అన్నం తిను అంది. దయచేసి ఉన్నోళ్లను జాగ్రత్తగా చూసుకోండయ్యా. అలా ఓల్డేజ్ హోముల్లో వదిలేయకండి" అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు.
May 05, 2026
Brahmamudi : రాజ్ వారసుడి గుట్టు విప్పిన శృతి.. ఇందు ఆస్తి కోసం రేఖ మాస్టర్ ప్లాన్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1023లో..... రాజుని ఫాలో అవుతూ వెళ్లిన శృతి అక్కడ చలపతి, లక్ష్మి వాళ్లతో రాజు గురించి అడుగుతుంది. దాంతో వాళ్లు మాకు రాజు దొరికాడని చెప్తారు. అతను దుగ్గిరాల వారసుడు, అచ్చం మా స్వరాజ్ సర్ లాగే ఉన్నారని రాజ్ ఫోటో చూపిస్తుంది శృతి. అచ్చం రాజ్, రాజు ఒకే రకంగా ఉండడం చూసి ఇద్దరు షాక్ అవుతారు. మా సర్ వాళ్ళు ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్తుంటే వెహికల్ బ్లాస్ట్ అయింది. అందులో అందరు చనిపోయారు. ఒక బాబు ఉండొచ్చు, అతను ఇతనే స్వరాజ్ సర్ వాళ్ళ అక్క కొడుకు అని శృతి చెప్తుంది. మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి.. ఆస్తి కోసం ఇదంతా వాళ్ళ అత్త రుద్రాణి చేసిందని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంటి వారసుడు ఉన్నాడని తెలిస్తే ఆ రుద్రాణి కూతురు రేఖ బ్రతకనివ్వదని వాళ్లకి శృతి చెప్పగానే వాళ్ళు సరే అంటారు. మరొకవైపు ఐశ్వర్య, రాజు దగ్గరికి వెళ్ళి.. నా డబ్బులు ఎక్కడ అని అడుగుతుంది. లేవు.. ఖర్చు అయ్యాయని రాజు అనగానే ఐశ్వర్య, లక్కీ షాక్ అవుతారు. నువ్వు ఇలా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఐశ్వర్య అంటుంది. మనం ఏం బిజినెస్ చెయ్యలేదు, కిడ్నాప్ చేశాం.. అలా చేస్తే ఎక్కువ ప్రాబ్లమ్ నీకే ఉంటుందని రాజు అనగానే నాకేం చేయాలో తెలుసని ఐశ్వర్య కోపంగా వెళ్తుంది. ఏం చేస్తున్నావ్ రా అని లక్కీ అడుగుతాడు. నేనే ఖర్చు చేసుకున్నాను అన్నాను కదా అని రాజు అంటాడు. ఆ తర్వాత రేఖ అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఇందుని వేలిముద్ర వెయ్యమని చెప్తుంది, దాంతో ఇందు వేలిముద్ర వేస్తుంది. ఎందుకు ఇలా చేశావని ఇందుపై అపర్ణ, సుభాష్ కోప్పడతారు. నువ్వు తప్పు చేశావ్ అక్క అని స్వాతి అంటుంది. నేనేం తప్పు చెయ్యలేదు ఎందుకంటే ఆ వేలిముద్ర చెల్లదని ఇందు అనగానే సుభాష్, అపర్ణ, స్వాతి షాక్ అవుతారు. మరొకవైపు ఇందు వేలిముద్ర వేసిన పేపర్స్ ని తీసుకొని రేఖ, భూషణ్ ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్తారు. ఈ వేలిముద్ర చెల్లదని లాయర్ చెప్పగానే ఎందుకు చెల్లదు. అది ఇందునే పెట్టింది కావాలంటే మీ ముందే పెట్టిస్తామని భూషణ్ అంటాడు. నా ముందు పెట్టినా చెల్లదు ఎందుకంటే ఇందు వాళ్ళ అమ్మనాన్న వాళ్ళు చనిపోకముందు నా దగ్గరికి వచ్చి తన కూతురికి పెళ్లి అయ్యాకే తన ఆస్తులన్నీ తన పేరున మారాలని వీలునామా రాశారని లాయర్ అనగానే రేఖ, భూషణ్ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఇందుకి పెళ్లి చేయాలని రేఖ పంతులుని పిలిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 05, 2026.webp)
Karthika Deepam2 : కాంచన ఆగ్రహానికి బలైపోయిన కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -661 లో.. కార్తీక్ ఇంటికి రాగానే ఏంటి రా ఎక్కడికి వెళ్ళావని కాంచన అడుగుతుంది. రాగానే నిలబెట్టి అడగాలా అత్తయ్య అని దీప అంటుంది. నాన్న ఒంట్లో బాలేదు అందుకే టెస్ట్ ల కోసం హాస్పిటల్ కి వెళ్ళాను అని కార్తీక్ అనగానే కాంచన కంగారుపడుతుంది నువ్వేం టెన్షన్ పడకు అమ్మ.. నాన్న బాగున్నాడు ఇప్పుడే ఇంట్లో డ్రాప్ చేసి వస్తున్నానని కార్తీక్ అంటాడు. నువ్వు ముందు భోజనం చెయ్ అని కార్తీక్ అంటాడు.. ఆకలిగా లేదని కాంచన అంటుంది. ఎందుకు అమ్మ.. నాన్నపై అంత ప్రేమ పెట్టుకొని దూరం పెడుతున్నావని కార్తీక్ అనగానే ప్లేట్ తీసుకొని భోజనం చేస్తుంది. దీప ప్లేట్ లో కర్రీ వెయ్ నటించే పనిలో పడి కర్రీ వేసుకోలేదని కార్తీక్ అంటాడు. మరుసటిరోజు కాంచన హాల్లో కూర్చొని ఉంటుంది. కార్తీక్ వస్తాడు.. దగ్గరికి రారా అని కాంచన అంటుంది. కార్తీక్ దగ్గరికి రాగానే చెంప చెల్లుమనిపిస్తుంది. కాంచన. మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని నాతో ఎందుకు చెప్పలేదని కాంచన కోప్పడతుంది. ఇప్పుడే కావేరి ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పింది.. మా నాన్న కూడా మా అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినట్లు చెప్పలేదు.. అలా చెయ్యాలనుకున్నావా అని కార్తీక్ పై కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత మనం హాస్పిటల్ కి వెళ్ళాలని కార్తీక్ అంటాడు. మరి మీ నాన్న ఎలా వస్తాడని కాంచన అనగానే కాశీకి కార్తీక్ ఫోన్ చేసి నాన్నని హాస్పిటల్ కీ తీసుకొని రా అని అంటాడు. దాంతో శ్రీధర్ ని తీసుకొని కాశీ హాస్పిటల్ కి వెళ్తుంటే.. నేను తోడుగా వస్తానని స్వప్న వెళ్తుంది. ఆ తర్వాత శ్రీధర్ కి డాక్టర్ చెకప్ చేసి బయటకు వస్తాడు. తన హార్ట్ వీక్ ఉంది ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ వస్తే బ్రతకడు.. తను టెన్షన్ పడొద్దు.. ప్రశాంతంగా ఉండేలా చెయ్యాలని డాక్టర్ చెప్తాడు. దాంతో కాంచన షాక్ అవుతుంది. అయన ఆరోగ్యం మీ చేతిలో ఉందని డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత పారిజాతం హాల్లో కూర్చొని ఉండగా జ్యోత్స్న వస్తుంది. నిన్న కొట్టిన దెబ్బకి తగ్గినట్లు ఉందని పారిజాతం అంటుంది. బావ నిన్ను వాళ్ళు ఆడే ఆటలో అరటిపండు చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. అరటిపండు ఆరోగ్యానికి మంచిది అని పారిజాతం అంటుంది. అప్పుడే దీప వస్తుంది. బావ ఎక్కడ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఏదో చెప్పబోతుంటే.. ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తావని జ్యోత్స్న కోప్పడుతుంది. దీప నువ్వు వెళ్ళు అని పారిజాతం అంటుంది. దీప బంగారం అని కావాలనే జ్యోత్స్న ముందు పారిజాతం అంటుంది. నీకు ఆ దీప ఏం మందు పెట్టిందో ఏమో అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 05, 2026.webp)
Illu illalu pillalu : వల్లికి చుక్కలు చూపించిన ప్రేమ.. ఊహించని నిర్ణయంతో షాకిచ్చిన సాగర్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -462 లో.. బ్యాంకు ముందున్న ప్రేమని తీసుకొని వెళ్ళడానికి ధీరజ్ వస్తాడు. ఏంటి ఇక్కడున్నావ్.. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఏదో ల్యాండ్ మార్క్ కోసం ఇది చెప్పానని ప్రేమ అంటుంది. మీ ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిందా అని ధీరజ్ అడుగుతాడు. రేపు ప్రొద్దున కాల్ చేయమందని ప్రేమ అంటుంది. ఇద్దరు అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇంటికి వస్తారు. ప్రేమ, ధీరజ్, నర్మద ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటే వల్లి ఓర్వలేకపోతుంది వెంటనే బెల్ కొట్టి నాకు ఆకలిగా ఉంది మిరపకాయ బజ్జీలు చెయ్యమని చెప్తుంది. దాంతో వెంటనే ప్రేమ, నర్మద చేస్తారు. నా బట్టలు ప్రేమ నువ్వు ఉతుకమని వల్లి చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక వల్లి చెప్పినట్లు చేస్తారు. ఆ తర్వాత అలసిపోయి కూర్చొని ఉంటారు. అప్పుడే ధీరజ్ వచ్చి వదిన మీతో ఆడుకుంటుంది. మీరు కూడా తనకి పనులు చేస్తూ ఆడుకోండి అని ధీరజ్ చెప్పగానే ప్రేమ, నర్మద కిచెన్ లోకి వెళ్లి కాకరకాయ జ్యూస్ తీసుకొని వచ్చి ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. వద్దని వల్లి అంటుంటే వేదవతిని పిలుస్తారు. వేదవతి దగ్గర ఉండి మరి శ్రీవల్లికి జ్యూస్ తాగిస్తుంది. మిమ్మల్ని ఆడుకోవాలనుకుంటే నన్నే ఆడుకుంటారా అని వల్లి అనుకుంటుంది. మరొకవైపు సాగర్ ఎండలో సైట్ దగ్గర ఉంటాడు. అప్పుడే తన మావయ్య వచ్చి.మ నిన్న ఆస్తుల గురించి మళ్ళీ డిస్కషన్ జరిగిందా అని అడుగుతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రామరాజు, తిరుపతి ఆగి.. ఇంత ఎండలో కష్టపడుతున్నావు.. నీకు మిల్ లో పనిచేసుకోమని చెప్పాను.. అది వదిలేసి ఇలా చేస్తున్నావని రామరాజు అంటాడు. అక్కడ నుండి రామరాజు వెళ్ళాక.. చూసావా మీ నాన్న ఎలా మాట్లాడుతున్నాడో.. నువ్వు త్వరగా ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేయ్ అని సాగర్ తో శ్రీనివాసరావు చెప్తాడు. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తారు. సాగర్ మాత్రం బ్యాగ్ తో హాల్లోకి వస్తాడు. ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానని సాగర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 05, 2026.webp)
Podharillu : కన్నాని చితక్కొట్టిన మహా.. మాధవ పాదాలపై పడి క్షమాపణలు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -106 లో.......కన్నా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని అందరు వెతుకుతారు. కన్నా ఒక దగ్గర ఏడుస్తూ కన్పిస్తాడు. చక్రి చూసి మాధవకి చెప్తాడు. కన్నాని చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు. చూసిన వెంటనే ఇప్పటికి వరకు తను అనుభవించిన బాధతో కుప్పకూలుతాడు. కన్నా దగ్గరికి చక్రి వెళ్తాడు. ఎందుకు ఇలా చేసావ్ రా.. ఆ ఇల్లు ఇప్పుడు నచ్చడం లేదా.. మమ్మల్ని ఇలా విడిచి ఎలా వెళ్ళాలనిపించిందని చక్రి అడుగుతాడు. పాపం పెద్ద అన్నయ్య.. నువ్వు కనపడకుంటే ఏమైపోతాడనుకున్నావ్ రా.. తల్లి ఒడిలో నుండి తప్పిపోయిన బిడ్డ లాగా ఏడుస్తున్నాఅని చక్రి చెప్తాడు. అన్నయ్య ఎక్కడ అని కన్నా అడుగుతాడు. దూరానున్న మాధవని చూసి కన్నా వెళ్లి తనని హగ్ చేసుకొని ఏడుస్తాడు. నిన్ను ప్రాణంగా పెంచాను కదరా అని మాధవ ఏడుస్తాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వస్తాడు. కన్నా కన్పించాడా అని మహా అడుగుతుంది. వాడు ఎక్కడికి వెళ్తాడు.. వస్తాడని నారాయణ అంటాడు. మరొకవైపు మహాకి చక్రి ఫోన్ చేసి కన్నా దొరికాడని చెప్తాడు. కేశవకి ఫోన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత కేశవ ఇంటికి వస్తాడు. కాసేపటికి కన్నాని తీసుకొని చక్రి, మాధవ వస్తారు. కన్నాని చూసి కేశవ ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఈ నిజం చెప్పావని నారాయణని కన్నా కోప్పడతాడు. మహా వచ్చి కన్నా చెంప చెల్లుమనిపిస్తుంది. నువ్వే కదరా ఒక స్త్రీ గురించి తన కాలర్ పట్టుకొని తప్పుగా మాట్లాడావ్... నిన్ను పెద్ది బిడ్డలాగా పెంచాడు.. తనని ఎలా బాధపెట్టాలనిపించింది రా అని మాధవ గురించి కన్నాకి మహా గొప్పగా చెప్తుంది. నువ్వు చేసిన తప్పుకి పెద్ది కాళ్లపై పడి క్షమించమని అడుగమని మహా అనగానే కన్నా అలాగే మాధవ కాళ్లపై పడి క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత కన్నా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడోనని మాధవ తన కాలికి, కన్నా కాలికి టవల్ కడుతాడు. అది చూసి నేను ఎక్కడకు వెళ్ళను అన్నయ్య అని చెప్తాడు. సరే అది ఉండనివ్వు.. అప్పుడే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావని కన్నా అంటాడు. మరుసటి రోజు కన్నాని ఆ మూడ్ నుండి బయటకు రప్పించడానికి కన్నాని తీసుకొని మహా బయటకు వస్తుంది. అక్కడ జరిగింది మర్చిపోమని కన్నాకి చెప్తుంది. తరువాయి భాగంలో అందరు ఒక ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 05, 2026.webp)
Jayam serial : ప్రమీల మంచి మనసు చూసి మారిన విశ్వ.. భాను భార్య అని తెలిసి సారీ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -260 లో...... రుద్రకి గంగ ఫోన్ చేసి సర్ నేను గుడికి వచ్చాను. బాక్సింగ్ ప్రాక్టీస్ కి ఇటు నుండే వస్తానని గంగ అనగానే నాకు చిరాకుగా ఉంది ఫోన్ కట్ చెయ్.. పెద్దనాన్నతో మాట్లాడాలని రుద్ర అనగానే పెద్దోరు కూడా ఇక్కడే ఉన్నారని గంగ అంటుంది. సరే వస్తున్నానని రుద్ర అంటాడు. ఏంటి గంగా.. సుధాని ఒక్కదాన్నే వదిలేసి వచ్చావ్.. ఈ ప్రసాదం తనకి ఇవ్వమని పెద్దసారు అంటాడు. గంగ ప్రసాదం తీసుకొని సుధా దగ్గరికి వెళ్తుంది. ఆగు చెయ్ కడుక్కొని వస్తానని సుధా వెళ్తుంటే తను కిందపడబోతుంది అప్పుడే పెద్దసారు వచ్చి పట్టుకుంటాడు. అన్నయ్య అని తనని హగ్ చేసుకొని సుధా ఎమోషనల్ అవుతుంది. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటు ఎమోషనల్ అవుతారు. అదంతా గంగ చూసి షాక్ అవుతుంది. సుధానే పెద్దసారు చెల్లి అని తనకి అర్థమవుతుంది. అన్నాచెల్లెలు ఇద్దరు తమ కష్టసుఖాలు చెప్పుకుంటారు. అప్పుడే రుద్ర కోపంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆ విశ్వగారు ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే.. మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని రుద్ర అడుగుతాడు. మిమ్మల్ని ఆయన ఏం అన్నాడు అన్నయ్య అని సుధా అనగానే రుద్ర షాక్ అవుతాడు. అన్నయ్యనా అని రుద్ర అనగానే అవును సర్ ఆవిడా పెద్దోరు చెల్లి మీ మేనత్త అని గంగ అనగానే.. రుద్ర హ్యాపీగా ఫీల్ అవుతు మేడం అంటాడు. మేడం కాదు అత్తయ్య అను అని సుధా అనగానే అత్తయ్య అని రుద్ర అంటాడు. సుధా దగ్గరికి తీసుకుంటుంది. అప్పుడే శకుంతల, ఇషిక, రావడం రంగా చూసి వాళ్లకు చెప్తాడు. దాంతో శకుంతల కోప్పడుతుందని సుధా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. శకుంతల వచ్చి నాకు చెప్పకుండా వచ్చారని పెద్దసారుపై కోప్పడుతుంది. మరొకవైపు పైడిరాజు కార్ ని సూపర్ మార్కెట్ ముందు ఆపుతాడు. ఏంటి ఇక్కడ అపావు అని విశ్వ అడుగుతాడు. అమ్మగారు ఈ సరుకులు తీసుకొని రమ్మన్నారని పైడిరాజు అంటాడు. నువ్వు వెళ్ళు నేను రానని తనకి కార్డు ఇస్తాడు విశ్వ. లోపలికి వెళ్లి ప్రమీలకి లిస్ట్ ఇస్తాడు.. తను అన్ని తీసుకొని వచ్చి బిల్ పే చేసేటప్పుడు కార్డు పని చేయదు. దాంతో ఆ విషయం విశ్వ దగ్గరికి వెళ్లి చెప్తాడు. విశ్వ కోపంగా లోపలికి వస్తాడు. తను ట్రై చేస్తాడు పేమెంట్ అవ్వదు.. తర్వాత ఇవ్వండి అని ప్రమీల అంటుంది. నువ్వు ఎవరు అని విశ్వ అడుగుతాడు. విజయేంద్ర ప్రతాప్ కోడలు అని ప్రమీల అనగానే అంటే భాను భార్య.... ఈ అమ్మాయి చాలా మంచి మనిషిలాగా ఉంది.. విజయేంద్ర ప్రతాప్ తప్పు చేస్తే నేను భాను గురించి తప్పుగా మాట్లాడాను అని విశ్వ అనుకొని ఐ యమ్ సారీ అని అంటాడు. ప్రమీలకి ఏం అర్థం కాదు కార్డు పని చెయ్యడం లేదని కోపంగా మాట్లాడినందుకు సారీ చెప్పాడేమో అని ప్రమీల అనుకుటుంది. ప్రమీల వంక విశ్వ జాలిగా చూస్తాడు. తరువాయి భాగంలో రుద్ర, గంగ కలిసి పెద్దసారు, శకుంతలల షష్ఠిపూర్తి చెయ్యాలని అనుకుంటారు. ఫంక్షన్ కి సుధాని పిలవాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 05, 2026‘బ్యాచ్మేట్స్’ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ ప్రారంభం – ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు
కాలేజ్ ఫన్, ఫ్రెండ్షిప్, యూత్ ఎమోషన్స్ కలగలిపిన ఎంటర్టైనర్ ‘బ్యాచ్మేట్స్’ ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లు విడుదల అవుతాయి. ‘బ్యాచ్మేట్స్’ కథ సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ అనే నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. కాలేజ్ లైఫ్లోకి కొత్తగా అడుగుపెట్టిన వీరి ప్రయాణంలో జరిగే సరదా సంఘటనలు, క్యాంపస్ ఫ్రెండ్షిప్స్, క్రష్లు ఇలా యూత్ లైఫ్లోని అన్ని కలర్స్ ను ఈ సిరీస్ హాస్యభరితంగా, సహజంగా చూపించారు. వైవిధ్యమైన కాలేజ్ నేపథ్యంలో సాగుతున్న ఈ కథ, స్నేహం విలువను, చిన్న చిన్న జ్ఞాపకాలను, యువతలో ఉండే ఉత్సాహాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కొత్త సంబంధాలు, అనుకోని సమస్యలు, సరదా క్షణాలు – ఇవన్నీ కలిసి సిద్, స్యామీ, మిల్కీ, గోల్డీ జీవితాన్ని మరింత కలర్ ఫుల్ చేస్తాయి. లైట్ హార్ట్ టోన్, ఎంగేజింగ్ స్టోరీటెల్లింగ్, రిలేటబుల్ క్యారెక్టర్స్తో ‘బ్యాచ్మేట్స్’ ప్రతి ఒక్కరినీ తమ కాలేజ్ రోజులు గుర్తు చేసుకునేలా చేస్తుంది.‘బ్యాచ్మేట్స్’ ఇప్పుడు జియోహాట్స్టార్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లను మిస్ అవ్వకండి.
May 04, 2026
సుధీర్ ని అంకుల్ అనేసిన అనన్య... విజయవాడ అమ్మాయిలంతా సింగల్ గా ఉన్నారు
సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సోషల్ మీడియాలో వీడియోస్, రీల్స్, ప్రొమోషన్స్, కొలాబరేషన్స్ చేసే స్రవంతీ పేపకాయల , అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ తో మంచి హిట్ అందుకున్న అనన్య శర్మ , టిక్ టాక్ భాను, క్రిస్టెన్ రవళి వచ్చారు. ముందుగా స్టేజి మీదకు స్రవంతీ పేపకాయల వచ్చింది. "బాబోయ్ ఏంటి లైట్ లతో తెగ కొట్టేత్తన్నారు. మీతో మాట్లాడాలా లైట్ లను లెక్కెట్టుకుంటూ కూర్చోవాలా " అంటూ గోదారి యాసలో మాట్లాడేసరికి సుధీర్ నవ్వేసాడు. "ఏ ఊరు మనది" అని అడిగాడు. "సామాల్కోట్ దగ్గర మేడపాడు" అని చెప్పింది. నాకెందుకో మీరిక్కడ ఉంటే కాసేపు చూడాలనుంది" అన్నాడు సుధీర్. "నన్ను నించోబెట్టి ఇంకెంతమందిని నిల్చోబెడతావక్కడ " అంటూ విష్ణు సుధీర్ ని గసిరేసింది. విష్ణు ప్రియా కూడా గోదారి యాసలో మాట్లాడేసరికి "మీది కూడా మేడపాడేనా" అని అడిగాడు. "చెప్పులు ఇక్కడ పెడతాను దొబ్బేయరు కదా " అని సుధీర్ ని అడిగింది శ్రవంతి. "చూడు నీవల్ల ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో" అంటూ సుధీర్ విష్ణు ప్రియను అనేసరికి "నాకు ఆ పిల్ల మీద కాదు మీ మీదనే డౌట్" అనేసరికి విష్ణు నవ్వేసింది. తర్వాత అనన్య శర్మ వచ్చింది. "వెబ్ సిరీస్ లో మీకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకున్నారు కదా మరి రియల్ లైఫ్ లో" అని సుధీర్ ఆమెను అడిగాడు. "లేదు ఏజ్ ఈజ్ ఏ జస్ట్ ఏ నంబర్ " అంది. వెంటనే స్రవంతి "అయన్నీ నమ్మావంటే కన్నాలేసుకుని బతకాలి నీ ప్యాంటు లాగే" అనేసింది. "ప్రాబ్లమ్ ఏమీ లేదు అని అంటున్నారు అంతేకదా " అని సుధీర్ అనేసరికి. "అలాంటి వాళ్ళు మీకెవరన్నా తెలిస్తే నాకు చెప్పండి అంకుల్" అనేసింది. అంతే సుధీర్ షాకైపోయాడు. తర్వాత టిక్ టాక్ భాను వచ్చింది. "మాది విజయవాడే మీది విజయవాడే మనది విజయవాడే . అందం అంటే విజయవాడ. విజయవాడలో అమ్మాయిలు ఎలా ఉన్నారు " అని అడిగాడు సుధీర్. "సింగల్ గా ఉన్నారు" అని చెప్పింది. "ఎందుకు" "ఉన్న ఒక్క అందగాడు హైదరాబాద్ లో ఉంటే విజయవాడలో అమ్మాయిలంతా సింగల్ గానే ఉంటారు కదా " అంది భాను. "మరి హైదరాబాద్ లో అబ్బాయిలంతా ఎలా ఉన్నారు " అని అడిగింది భాను. "అందరూ సింగల్ గానే ఉన్నారు. ఉన్న ఒక్క అందగత్తె విజయవాడలో ఉండిపోతే ఇక్కడ అబ్బాయిలకు ఎవరు దొరుకుతారు" అంటూ కౌంటర్ ఇచ్చాడు సుధీర్.
May 04, 2026
Jayam Serial: విశ్వ సవాల్తో రుద్రలో మొదలైన అనుమానం.. నిజం తెలుసుకుంటాడా?
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -259 లో... గంగకి సుధా కాల్ చేసి మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావని అడిగినందుకు తను చేసిన పనులు చెప్తుంది. ఈ రోజు గుడికి రా అని సుధా అడుగగా గంగ సరే అంటుంది. ఆ తర్వాత గంగ దగ్గరికి పెద్దసారు వచ్చి.. ఎవరితో మాట్లాడావని అడుగుతాడు. సుధా అమ్మగారు అని గంగ చెప్పగానే పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మగారు గుడికి రమ్మంటున్నారని గంగ చెప్పగానే నేను కూడా వస్తానని పెద్దసారు అంటాడు. మరొక వైపు ధీరజ్ కి విశ్వ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయిస్తాడు. అప్పుడే కోపంగా రుద్ర వస్తాడు. ఏంటి రుద్ర కోపంగా ఉన్నట్టున్నావ్.. మా పెద్దనాన్నని ఎందుకు అవమానించావని అడగడానికి వచ్చావా అని విశ్వ అనగానే లేదు వయసులో పెద్దవారు అయి ఉండి సమాజంలో గౌరవ మర్యాదలున్న వ్యక్తితో అలాగేనా మాట్లాడేది అని రుద్ర అంటాడు. నేను అన్నీ అన్నా కూడా మీ పెద్దనాన్న ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు.. ఏం తప్పు చేశాడు.. ఆ విషయం మీ పెద్దనాన్నని అడుగు.. అంత జరిగినా నీకు ఎందుకు చెప్పలేదని విశ్వ అంటాడు. మీ పెద్దనాన్నని అడిగి నా దగ్గరికి రా అప్పుడు సమాధానం చెప్తానని విశ్వ అనగానే కోపంగా రుద్ర వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. మరొకవైపు గంగ, పెద్దసారు ఇద్దరు గుడికి వెళ్తారు. అక్కడికి సుధా రావడంతో పెద్దసారు పక్కన చాటున ఉండి చూస్తాడు. గంగని తను వచ్చినట్లు చెప్పొద్దని అంటాడు. ఆ తర్వాత సుధా వచ్చి మా అన్నావదినల షష్ఠి పూర్తి ఉంది.. వాళ్ళు బాగుండాలని దేవుడి పేరున అర్చన చెయ్యండి అని పంతులుగారితో సుధా చెప్తుంది. మీ అన్నయ్య అంటే ఇష్టమా అని గంగ అనగానే చాలా ఇష్టమని సుధా చెప్తుంది. అదంతా పెద్దసారు వింటాడు. మరొకవైపు శకుంతల గుడికి బయల్దేర్తుంది. పెద్దసారుని శకుంతల పిలిస్తే అతను ఉండడు.. వాళ్ళు గుడికి వెళ్లారని ఇందుమతి చెప్తుంది. నాకు చెప్పకుండా వెళ్ళారా అని శకుంతల కోపంగా ఉంటుంది. మనం వెళదాం అత్తయ్య అని ఇషిక అంటుంది. ఇక శకుంతల, ఇషిక ఇద్దరు బయల్దేరతారు. ఆ తర్వాత ఇషిక మెల్లగా శకుంతల ఆడపడుచు గురించి అడుగుతుంది. ఇంకొకసారి తన గురించి తియ్యొద్దని ఇషికపై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత నేను గుడికి వచ్చినట్లు రుద్ర సర్ కి చెప్పలేదని గంగ పక్కకి వెళ్లి ఫోన్ చేస్తుంది. తరువాయి భాగంలో పెద్దసారు, సుధా మాట్లాడుకుంటారు. రుద్రకి తన మేనత్త సుధా అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 03, 2026
Illu Illalu Pillalu: ధీరజ్ కారు కోసం నగలు తాకట్టు పెట్టిన ప్రేమ.. షాక్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -461 లో... ధీరజ్ డల్ గా ఉంటే తన మూడ్ ని డైవర్ట్ చెయ్యడానికి ప్రేమ వస్తుంది. ఒరేయ్ నా జుట్టు తడిగా ఉంది తుడువవా అని ధీరజ్ ని ప్రేమ అడుగుతుంది. దాంతో ధీరజ్ చిరాకుపడతాడు. నాపై నీకు కోపం ఉంది కదా గొడవ జరగడానికి కారణం నేనే అనుకుంటున్నవ్ కదా అని ప్రేమ అంటుంది. అదేం లేదు తుడుస్తానని తన జుట్టుని టవల్ తో తుడుస్తాడు ధీరజ్. అప్పుడే కార్ షోరూం వాళ్ళు ధీరజ్ కి ఫోన్ చేస్తారు. మీరు కార్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చారు కదా రేపు రాకుంటే క్యాన్సిల్ అవుతుందని చెప్తారు. దాంతో ధీరజ్ క్యాన్సిల్ చెయ్యమని చెప్తాడు. ఇక ప్రేమ ఫోన్ తీసుకొని రేపు ఈవెనింగ్ వచ్చి డౌన్ పేమెంట్ కట్టి కార్ తీసుకుంటామని చెప్తుంది. డబ్బు ఎక్కడిది అని ధీరజ్ అంటాడు. నేను చూసుకుంటాను కదా.. మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇస్తానని అన్నారని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ధీరజ్ వెళ్ళాక ప్రేమ తన నగలు తీసుకొని ఇంతకంటే వేరే మార్గం లేదురా, నిన్ను తక్కువ చేసి చూడడం నాకు ఇష్టం లేదని నగలు తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి బెల్ పట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. భాగ్యంకి ఫోన్ చేసి మావయ్య గారు బెల్ ఇచ్చారు.. ఏం అవసరం ఉన్నా బెల్ కొట్టమని చెప్పారు వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నానని వల్లి అనగానే... నిన్ను కాళ్ళు పట్టుకునేలా చేస్తారా.. నీ ఇగో చల్లారే వరకు వాళ్ళకి పనులు చెప్పమని భాగ్యం సలహా ఇస్తుంది. ఆ తర్వాత వల్లి దగ్గరకి చందు వచ్చి ఏమైనా తినాలనిపిస్తే చెప్పమని అంటాడు. నాకు హాల్వా తినాలని ఉందని శ్రీవల్లి చెప్తుంది. మరొకవైపు నగలు పట్టుకొని ప్రేమ బ్యాంక్ కి వెళ్తుంది. నువ్వు భద్రవతి మేనకోడలు కదా అని అడుగుతాడు అక్కడి మేనేజర్. ఇక ప్రేమ డైవర్ట్ చేస్తూ.. నాకు అర్జెంట్ గా డబ్బు కావాలని ప్రేమ అంటుంది. కాసేపు వెయిట్ చెయ్యండి అని మేనేజర్ అంటాడు. ఆ తర్వాత మేనేజర్ సేనాపతికి ఫోన్ చేసి మీ కూతురు నగలు తాకట్టు పెట్టి డబ్బు కావాలని అంటుందని చెప్తాడు. సరే మీరు రేపు ఇస్తానని చెప్పండి అని సేనాపతి చెప్తాడు. ఇక రేపు ఇస్తాను అమ్మ బ్యాంకులో ఇప్పుడు అంత డబ్బు లేదని ప్రేమతో మేనేజర్ చెప్తాడు. ఆ తర్వాత ప్రేమని తీసుకొని వెళ్ళడానికి ధీరజ్ వస్తాడు. ఏంటే ఇక్కడ బ్యాంక్ ఉంది, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. ఏదో ల్యాండ్ మార్క్ కోసం బ్యాంకు అడ్రెస్ చెప్పాను.. నీకు అన్ని డౌట్స్ అని ప్రేమ కవర్ చేస్తుంది. డబ్బు అరెంజ్ అయిందా అని ధీరజ్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 03, 2026
Karthika Deepam 2: జ్యోత్స్నతో గొడవపడ్డ వ్యక్తే శ్రీధర్ ప్రాణదాత.. కార్తీక దీపం సీరియల్లో ఊహించని మలుపు!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam2 ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-660 లో.... శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఒకతను హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. అతను గిఫ్ట్ షాప్ లో జ్యోత్స్న తో గొడవ పడ్డ వ్యక్తి.. అతను కార్తీక్ కి ఫోన్ చేసి విషయం చెప్పగానే కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. శ్రీధర్ ని కలిసి మాట్లాడతాడు. నిన్ను సేవ్ చేసిన అతనికి థాంక్స్ చెప్పాలని కార్తీక్ బయటకు వస్తాడు. ఎదురుగా అతనే వస్తాడు. కార్తీక్ తనని పరిచయం చేసుకుంటాడు. అతను కూడా నా పేరు సూరజ్ అని చెప్తాడు. అప్పుడే సూరజ్ కి ఫోన్ వస్తుంది. ఏదో మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు అని వాళ్ళకి సారీ చెప్తాడు. మీరు మా నాన్నని సేవ్ చెయ్యడం వల్లే మీరు మీటింగ్ మిస్ అయ్యారని కార్తీక్ అంటాడు. జీవితం మళ్ళీ రాదు.. అవకాశం మళ్ళీ వస్తుందని సూరజ్ అనగానే చాలా రోజుల తర్వాత ఒక మనిషి తో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. ఇద్దరు కలిసి శ్రీధర్ దగ్గరికి వెళ్తారు. ట్యాబ్లెట్స్ కి డబ్బు ఎంత అని కార్తీక్ అడుగుతాడు. మీరు అడగకూడదు నేను చెప్పకూడదని సూరజ్ అంటాడు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలని కార్తీక్ అనగానే టైమ్ వచ్చినప్పుడు అని సూరజ్ అంటాడు. రాకపోతే నేనే మీ ఋణం తీర్చుకున్నాను అని అనుకోండి అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత దీప ఇంటికి వెళ్తుంది. కార్తీక్ ఎక్కడ అని కాంచన అడుగుతుంది. ఏమో అని దీప అనగానే కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. కార్తీక్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది. శ్రీధర్ లిఫ్ట్ చేస్తాడు కానీ తనకి అలా జరిగినట్లు ఏం చెప్పడు. ఆ తర్వాత శ్రీధర్ ని తీసుకొని కావేరి దగ్గరికి వెళ్తాడు కార్తీక్. విషయం తెలిసి స్వప్న ఏడుస్తుంది. నాన్నని ఇంకొకసారి టెన్షన్ పెట్టనని స్వప్న అంటుంది. ఇంకొకసారి ఇలా టెన్షన్ పెడితే నాన్న మనకి ఉండడు అని కార్తీక్ అంటాడు. పిన్ని నాన్నని జాగ్రత్తగా చూసుకోమని కార్తీక్ చెప్తాడు కార్తీక్. కాశీ నువ్వు ఇక్కడే ఉండమని కార్తీక్ అన్నాడు. మీ అమ్మకి చెప్తావా అని శ్రీధర్ అడుగగా చెప్తానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 03, 2026
Brahmamudi: దుగ్గిరాల వారసుడి ఎంట్రీ ఎప్పుడు.. శృతికి దొరికిపోయిన రాజ్!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1022 లో... రేఖకి ఇందుని అప్పగించాలని రాజు నిర్ణయం తీసుకుంటాడు. రేఖని పిలిచి ఇందుని అప్పగిస్తాడు. రేఖని చూసి ఇందు షాక్ అవుతుంది. ఇందుని రేఖ లాక్కొని వెళ్తుంటే.. రాజు వంక బాధగా చూస్తుంది ఇందు. రాజు కూడా తన వంక బాధగా చూస్తాడు.అప్పుడే లక్కీ డబ్బు పట్టుకొని వస్తాడు. ఏంట్రా ఆ అమ్మాయి వంక అలా చూస్తున్నావ్.. తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అదేం లేదు ఆ అమ్మాయి నా వంక దీనంగా చూస్తుందిరా అని రాజు బాధపడుతాడు. ఆ తర్వాత నువ్వు ఈ డబ్బు సాహోకి ఇచ్చెయ్ నా ఫ్యామిలీ సేఫ్ అని రాజు అంటాడు. ఇది ఐశ్వర్యకి ఇచ్చేస్తాను అని రాజు అంటాడు. మరొకవైపు ఇందుని లాక్కొని వెళ్లి రేఖ ఇంట్లో పడేస్తుంది. అది చూసి ఏంటి రేఖ ఏమైనా అయితే ఎలా.. అలా పడేసావని అపర్ణ కోప్పడుతుంది. నీ మనవరాలిని ప్రాణాలతో తీసుకొని వచ్చాను సంతోషించు అని రేఖ అంటుంది. మా రేఖ నీ గురించి తలవంచి అందరిని డబ్బు అడిగింది.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియదా అని ఇందుపై భ్రమరాంబ కోప్పడుతుంది. రేపు ఆస్తి పేపర్స్ పై సంతకం చెయ్యాలని ఇందుకి రేఖ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇన్ని రోజులు ఏమయ్యావ్.. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు అని ఇందుని సుభాష్ అడుగుతాడు. డబ్బు కోసం వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారని ఇందు చెప్తుంది. మరొకవైపు రాజు హాస్పిటల్ కి వెళ్లి ఎవరినో బయట నుండి చూస్తూ ఉంటాడు. డాక్టర్ తో తన గురించి మాట్లాడతాడు. తను త్వరగా కోలుకోవాలని చెప్తాడు. మా ప్రయత్నం మేం చేస్తున్నామని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రాజుని శృతి చూస్తుంది. తన దగ్గరికి వెళ్లేసరికి రాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాజు ఇంటికి వెళ్తాడు. అసలు నువ్వు ఆ సాహోతో ఏం చేస్తున్నావ్ రా అని చలపతి అడుగుతాడు. బిజినెస్ అని రాజు చెప్తాడు. రాజు ఇంట్లో నుండి వెళ్లిపోతుంటే.. తనని ఫాలో అవుతు వచ్చిన శృతి, రాజుని ఆగమని అంటుంది. లోపల మా నాన్న ఉన్నాడు వెళ్ళండి అని రాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇందాక వెళ్ళింది ఎవరు అని శృతి లోపలకి వెళ్లి అడుగుతుంది. మా అబ్బాయి అని చలపతి అనగానే అబద్ధం చెప్తున్నారు.. అతను అచ్చం మా స్వరాజ్ సర్ లాగే ఉన్నారని శృతి అంటుంది. రాజు గురించి ఏదైనా తెలుస్తుందేమోనని చలపతి, లక్ష్మి అనుకొని.. వాడు మా అబ్బాయి కాదని జరిగింది మొత్తం చెప్తారు. అతను దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన వాడిలా ఉన్నాడని శృతి అనగానే వాళ్ళు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఆస్తి పేపర్స్ పై ఇందు వేలిముద్ర వేస్తుంది. అది చెల్లదని అపర్ణ వాళ్లతో ఇందు చెప్తుంది. అదే విషయం రేఖ వాళ్లతో లాయర్ కూడా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 03, 2026.webp)
సుధీర్ కి ఎపిసోడ్ డబ్బులు కట్ చేద్దాం!
జీ తెలుగులో ప్రసారమయ్యే ఆటా డాన్స్ షోకి ట్రోఫీ ఇవ్వడానికి సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎన్నో విషయాలను ఈ సందర్భంగా ఆయన షేర్ చేసుకున్నారు. "నీహారిక గారి గురించి మా అందరికీ తెలియని విషయం ఏదైనా " అని సుధీర్ అడిగాడు. "నీహారిక , వైష్ణవ క్లాస్మేట్స్. స్కూల్ అంతా షేక్ ఐపోయేది. నిహారిక వస్తుంటే చదువుల తల్లి వస్తున్నట్టు ఫీలయ్యేవాళ్ళం మేము. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. "అన్నాడు. "ఎందుకంటే వైష్ణవ కంటే నేను బెటర్ గా చదివేదాన్ని కాబట్టి" అంది నిహారిక. "ఎంత బాగా చదివేది అంటే టెక్స్ట్ బుక్ ని అలానే దింపేసేది" అన్నాడు సాయి ధరమ్ తేజ్. "ఇదేంటో నాకు ఎక్కడో కొడతాంది" అని సుధీర్ అనేసరికి "నెక్స్ట్ నేను కొడతా" అన్నాడు తేజ్. "అలాగే దింపేసేది "అంటే అని సుధీర్ అనేసరికి "చిట్టీలు రాసేటప్పుడు అలాగే ఉంటదిగా మరి " అన్నాడు తేజ్. "బావా నేను లైఫ్ లో చేయనిది చిట్టీలు పెట్టడం " అంది "మేము మాట్లాడుకుంటాం అని సుధీర్ అనేసరికి నా పరువు తీసే పని చేయకు అని నిహారిక వార్ నింగ్ ఇచ్చింది. వెంటనే తేజ్ "తల్లీ ఎం చేయొద్దు ఈ ఎపిసోడ్ డబ్బులు కట్ చేద్దాం" అని తేజ్ తిరిగి సుధీర్ మీద కౌంటర్ వేసాడు. "మీరు రావడం వలన మాకు చాల విషయాలు తెలిసాయి" అన్నాడు సుధీర్. "ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆడుకున్నా అందుకే ఇప్పుడు నన్ను ఇలా " అని నిహారిక అనేసరికి "సుధీర్ తెలుసుగా . సుప్రీమ్ సినిమాలో యాక్షన్ కూడా ఉంటది తెలుసుగా " అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తేజ్. "నాకు వైష్ణవ్ ని తేజ్ ని చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు అన్ని చోట్లకు కలిసే వెళ్తారు. ఇద్దరికీ ఫ్రెండ్స్ కూడా సేమ్ గా ఉంటారు. నేను మా వరుణ్ అన్నతో అనేదాన్ని వైష్ణవ చిన్నోడైనా తేజ్ బావ చక్కగా అన్ని చోట్లకు తీసుకెళ్తాడు నువ్వెందుకు నన్ను తీసుకెళ్ళవు నేను బావ దగ్గరకు వెళ్ళిపోతా బావైతే నన్ను కూడా తీసుకెళ్తాడు. ఇలాంటి బ్రదర్స్ ని నేనెక్కడా చూడలేదు " అని చెప్పింది నిహారిక.
May 02, 2026
పవన్ కళ్యాణ్ కాళ్ళ మధ్య ఉన్న హీరో ఎవరు ?
ఆట లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పాడు. " మీరంటే మాలాంటి వాళ్లకు ఒక్క విషయంలో జెలస్ ఉంటది. మా అందరికీ దక్కని అదృష్టం మీకు దక్కింది. అది చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది" అంటూ ఒక పిక్ ని ప్లే చేయించాడు సుధీర్. ఆ ఫోటో వెనక స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్. " చిన్నప్పుడు మా అమ్మ షాపింగ్ కి వెళ్తూ మా మావయ్య దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. ఆయన నన్ను ఆడించేసరికి నిద్రొచ్చేసింది. అలా నన్ను కాళ్ళ మధ్య పెట్టేసుకుని నిద్రపోయారు. " అని చెప్పాడు తేజ్. "మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అని కాళ్లతో లాక్ చేసేసారు " అన్నాడు సుధీర్. "చిన్న సైజు హ్యూమన్ కేజ్ లో పెట్టాడు బాబాయ్ బావని " అని నిహారిక చెప్పింది. ఆ రోజుల్లో పెద్దగా ఉయ్యాలలు అవీ లేవు కదా అందుకే అలా పెట్టారు. "చాలా క్యూట్" అంటూ రాధికా ఖుషీ అయ్యారు. "అందులో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రేమ కనబడుతోంది. ఎక్కడ పడిపోతారనే అని గట్టిగా కాళ్లతో పట్టుకున్నారు. ఇందుకే సర్ మేమంతా కొంచెం కుళ్ళుకునేది.మేమంతా కొంచెం జెలస్ ఫీలయ్యేది " అన్నాడు సుధీర్. " తప్పులేదులే. హ్యాపీగా జెలస్ ఫీలవ్వచ్చు " అన్నాడు తేజ్. ఇక తేజ్ గురించి రఘు మాష్టర్ మాట్లాడారు. " ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉంటూ డార్లింగ్ అని పిలుచుకునే మంచి వ్యక్తి ఎవరూ దొరకలేదు నాకు. మేము కలిసి జర్నీ చేసి షూటింగ్ లో కూడా అల్లరి చేసేవాళ్ళం. మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉండేది. నాకు ఇష్టమైన వ్యక్తి. తేజ్ ది రాబోతున్న మూవీలో కూడా వర్క్ చేసాను " అని చెప్పారు.
May 02, 2026.webp)
Brahmamudi : ఇందు కోసం మనసు మార్చుకున్న రాజు.. రేఖ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1021 లో... రాజు డల్ గా ఉంటాడు. అప్పుడే ఇందు వస్తుంది. డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు.. డబ్బులోనే సంతోషం ఉందని అనుకుంటావని ఇందు అనగానే నీకేం తెలుసు మా మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు నువ్వు డబ్బులో పుట్టి పెరిగావ్ కాబట్టి నీకు డబ్బుల గురించి తెలియదని రాజు తనకి డబ్బు గురించి క్లాస్ తీసుకుంటాడు. వీడు డబ్బు పిచ్చోడు కానీ మంచివాడే అని ఇందు అనుకుంటుంది. మరొకవైపు ఐశ్వర్యకి తన ఫ్రెండ్ రాహుల్ ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇవ్వకుండా మీ ఆంటీ దగ్గరికి వచ్చి డబ్బు వసూల్ చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత రేఖ దగ్గరికి ఐశ్వర్య వచ్చి.. ఇందు కిడ్నప్ అయి చాలా రోజులు అవుతుంది కదా .. డబ్బు అరెంజ్ అయిందా ఆంటీ అని రేఖని అడుగుతుంది. లేదు ప్రెజెంట్ ఇరవై లక్షలున్నాయని రేఖ అంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడానికి అవి సరిపోతాయని ఐశ్వర్య అనుకొని కిడ్నాపర్ కి ఫోన్ చేసి ఇరవై లక్షలు ఉన్నాయని చెప్పండి డబ్బు అవసరం అయితే వాడే ఒప్పుకుంటాడని ఐశ్వర్య అంటుంది. దాంతో రాజుకి రేఖ ఫోన్ చేసి ఇరవై లక్షలున్నాయని అంటుంది. నీకు ఎలా కన్పిస్తున్నా.. నాకు కోటి కావాలని ఫోన్ కట్ చేస్తాడు. వీడికి ఎక్స్ ట్రాలు బాగా అవుతున్నాయని రాజుకి ఐశ్వర్య ఫోన్ చేసి.. ఒరేయ్ ఇప్పుడు మా ఆంటీ దగ్గర ఇరవై లక్షల కంటే ఎక్కువ లేవు.. ఇప్పుడు అవి తీసుకుందామని ఐశ్వర్య అంటుంది. దాంతో సాహో అన్న మాటలు గుర్తుచేసుకొని సరే అంటాడు. ఆ తర్వాత రేఖకి రాజు ఫోన్ చేసి నువ్వు చెప్పిన అమౌంట్ నాకు ఒకే ఎక్కడికి రావాలో చెప్తానని రాజు అనగానే రేఖ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏంట్రా అలా ఒప్పుకున్నావని లక్కీ అంటాడు. ఇప్పుడు మనకి ఆ సాహో గానీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలని రాజు అంటాడు. ఆ తర్వాత డబ్బుతో రేఖ, భూషణ్ బయల్దేరతారు. మరొకవైపు ఇందుని రాజు గుడికి తీసుకొని వస్తాడు. లక్కీని మాస్క్ వేసుకోమని డబ్బు తీసుకొని రమ్మని రాజు వాళ్ళ దగ్గరికి లక్కీని పంపిస్తాడు. ఆ తర్వాత ఇందుకి ఎదురుగా గుళ్లో రేఖ ఉంటుంది. తరువాయి భాగంలో ఇందుని లాక్కొని రేఖ వెళ్తుంటే దూరం నుండి రాజు చూసి బాధపడతాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అని రాజుని లక్కీ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 02, 2026.webp)
Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్లికి కార్తీక్ మాస్టర్ ప్లాన్.. కథలో కొత్త ఎంట్రీ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -659 లో..... కార్తీక్ ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న కచ్చితంగా చెప్తుంది. దాంతో సుమిత్ర తనపై కోప్పడుతుంది. బావకి నేను ఇష్టం లేనని ముందు చెప్పాలి కదా అని జ్యోత్స్న అంటుంది. నాకు కార్తీక్ లండన్ నుండి వచ్చాకే చెప్పాడు కానీ ఆ విషయం మీతో చెప్పమని అన్నాడు కానీ కాంచన, దశరథ్ దగ్గర తన కూతురిని కార్తీక్ కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట తీసుకున్నాడు. ఎక్కడ ఈ కుటుంబాలు విడిపోతాయోనని అలోచించి ఈ విషయం చెప్పలేదు.. ఆ తర్వాత దీపని పెళ్లి చేసుకున్నాక ఏం జరిగిందో అంతా తెలుసు కదా అని పారిజాతం అంటుంది. మీరు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ నష్టపోయింది నేను అని జ్యోత్స్న అంటుంది. ఒక తల్లిగా చెప్తున్నా నువ్వు చేస్తుంది తప్పు.. ఇంకొకసారి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటానంటే నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తానని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత థాంక్స్ రా కార్తీక్.. జ్యోత్స్న మనసులో ఏముందో తెలిసేలా చేసావని శివన్నారాయణ అనగానే నాకు కాదు పారుకి చెప్పాలని కార్తీక్ అంటాడు. ఇద్దరికి థాంక్స్ అని శివన్నారాయణ చెప్తాడు. థాంక్స్ రా కార్తీక్ అని సుమిత్ర చెప్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి నెల రోజుల్లో జ్యోత్స్నకి పెళ్లి చెయ్యాలని కార్తీక్ చెప్తాడు. మరొకవైపు స్వప్న ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తానని అంటుంది. దానికి వద్దని శ్రీధర్ అంటాడు. నాకు నచ్చినట్లు బ్రతకనివ్వరా అని స్వప్న అంటుంది. ఇప్పుడు జ్యోత్స్నని వైరా కిడ్నాప్ చేసాడు. అలా నిన్ను ఎవరైనా చేస్తే నేను తట్టుకోలేనని శ్రీధర్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. జ్యోత్స్న తరుపున సారీ చెప్తుంది. మరొకవైపు కార్ లో శ్రీధర్ వెళ్తుంటే తనకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒకతను జ్యోత్స్నకి గిఫ్ట్ షాప్ లో తనకి నచ్చిన బొమ్మని ఇవ్వమంటే ఇవ్వలేదు.. ఆ అబ్బాయి కార్ లో ఉన్న శ్రీధర్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. శ్రీధర్ ఫోన్ ద్వారా కార్తీక్ కి విషయం చెప్తాడు. కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తాడు. శ్రీధర్ తో మాట్లాడతాడు. నిన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసిన వాళ్ళు ఎక్కడ అని కార్తీక్ వెళ్తుంటే అతనే ఎదురుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
May 02, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



