
Peddi: సమ్మర్ రేసు నుంచి తప్పుకున్న పెద్ది.. రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా?
మెగా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ 'పెద్ది' రిలీజ్ డేట్పై మళ్ళీ మొదలైన సస్పెన్స్! కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది'(Peddi). ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు మెగా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఏప్రిల్ నెలలో కూడా 'పెద్ది' రావడం కష్టమే అనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, 'పెద్ది' మూవీ ఏప్రిల్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వెళ్లే ఆలోచనలో ఉందట. రీసెంట్గా హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ సమయంలో చరణ్ మాట్లాడుతూ.. "టైంకి వస్తుందని చెప్పండ్రా" అని సరదాగా అన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జూన్ 26న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కెఎన్ కూడా 'పెద్ది' జూన్ 26కి వాయిదా పడిందనే విషయాన్ని హింట్ ఇచ్చారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటం, ప్రమోషన్స్ కి తగినంత సమయం లేకపోవడం వంటి కారణాలతో 'పెద్ది' విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ఇంతటి హైప్ ఉండటానికి ప్రధాన కారణం ఇందులోని భారీ తారాగణం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రా రా' వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ను అలరిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాలో ఎన్నడూ చూడని విధంగా ఒక రగ్గడ్ లుక్లో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే సినిమా ఇదని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Apr 07, 2026.webp)
Devara 2: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. 'దేవర 2' షూటింగ్ స్టార్ట్ డేట్ ఫిక్స్..!
'దేవర 2' లేటెస్ట్ అప్డేట్ మ్యూజిక్ సిట్టింగ్స్లో అనిరుధ్ బిజీ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ షూటింగ్ ఎప్పుడంటే..? 'దేవర 2' ఉంటుందా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. ఒకసారి ఉంటుందని, మరోసారి ఉండదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి 'దేవర 2' తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని, షూటింగ్ డేట్ కూడా లాక్ అయిందని న్యూస్ వినిపిస్తోంది. (Devara Part 2) 'దేవర: పార్ట్ 1' కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. అందుకే 'దేవర 2' ఉండకపోవచ్చనే అనుమానాల వ్యక్తమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా 'దేవర 2' ఉంటుందని చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్టే తాజాగా డేట్స్ కూడా ఇచ్చినట్లు వినికిడి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'దేవర 2' షూటింగ్కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. తారక్ ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించాడని, అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు. రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని, అందుకే ఈసారి ప్లానింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే కొన్ని అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడని, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పవర్ఫుల్గా ఉంటుందని వినికిడి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా అయిందని టాక్. అక్టోబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందేమో చూడాలి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు 'డ్రాగన్'తో పాటు 'దేవర 2' అప్డేట్ వచ్చే అవకాశముంది. 'దేవర' మొదటి భాగం సముద్ర నేపథ్యంలో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన, అనిరుధ్ సంగీతం సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లాయి. రెండో భాగంలో 'దేవర' మరియు 'వర' పాత్రల మధ్య ఘర్షణ మరింత తీవ్రంగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్లో మిగిలిపోయిన చిక్కుముడులన్నీ ఈ సీక్వెల్లో వీడతాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.
Mar 31, 2026
Prabhas: 'మహాకాళి' సినిమాలో ప్రభాస్?
ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త 'మహాకాళి' సినిమాలో గెస్ట్ రోల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. 'మహాకాళి'(Mahakali) సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) రోజురోజుకూ విస్తరిస్తోంది. ‘హను-మాన్’ విజయం తర్వాత యూనివర్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్త విన్నప్పటి నుంచి రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫిమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్తో వస్తున్న ‘మహాకాళి’ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్ వర్మ స్వయంగా కథను అందించాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఇది కేవలం ఒక అతిథి పాత్ర మాత్రమే కాకుండా, ఈ యూనివర్స్ లో రాబోయే పెద్ద సినిమాలకు పునాదిలా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి ప్రభాస్ ఇప్పటికే తన వంతు షూటింగ్ను కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 100 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వడం వల్ల ‘మహాకాళి’కి పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు లభించడం ఖాయమని చెప్పవచ్చు. ప్రభాస్ గతంలో ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో కూడా ఇలాగే స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ (Fauzi), ‘స్పిరిట్’ (Spirit) వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
Mar 29, 2026‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’.. ఎన్టీఆర్, బన్నీలతో మల్టీస్టారర్.. ఇక బాక్సాఫీస్ బద్దలే
• బన్నీ, ఎన్టీఆర్.. క్రేజీ మల్టీస్టారర్ లోడింగ్! • అల్లు అర్జున్, ఎన్టీఆర్తో ఆదిత్య ధర్ భారీ స్కెచ్ • మల్టీస్టారర్ సెట్ అయితే నెక్స్ట్ లెవలే • మళ్లీ తెరపైకి అదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ ఆదిత్య ధర్ చేరువలో ఉన్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధురంధర్2 ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సీక్వెల్.. త్వరలోనే కొత్త రికార్డులు సృష్టిస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, బన్నీలతో ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఆగిపోయిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు ఆదిత్య. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఆదిత్య ఎప్పుడో సంప్రదించారు. అయితే కథా చర్చలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది. తాజాగా ‘ధురంధర్ 2’ చూసిన బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఆదిత్యపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకం కలగడంతో, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్పెషల్ రోల్లో మెరుస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు గనుక ఒక్క ఫ్రేమ్లో కనిపిస్తే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆదిత్య ధర్ విజన్, తెలుగు స్టార్ల మాస్ ఇమేజ్ తోడైతే అది వెండితెరపై ఒక అద్భుతమే అవుతుంది.
Mar 23, 2026‘ఉస్తాద్’ తర్వాత హరీష్ శంకర్ పరిస్థితి ఏంటి.. అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే
- ‘ఉస్తాద్’ రిజల్ట్ చూశాక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? - హరీష్ శంకర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్! - మాస్ డైరెక్టర్ డైలమా.. మల్టీస్టారర్ చేస్తారా? గబ్బర్ సింగ్, మిరపకాయ్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలతో మాస్లో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, తాజాగా పవన్ కళ్యాణ్తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఫలితం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తదుపరి అడుగు ఎటువైపు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ తర్వాతి ప్రాజెక్ట్ నందమూరి బాలకృష్ణతో ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బాలయ్యకు ఒక లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఆశాజనకంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉండేది. అయితే బాలకృష్ణ కేవలం హిట్, ఫ్లాపుల ఆధారంగా కాకుండా, దర్శకుడితో ఉండే ట్యూనింగ్ మరియు కథలోని బలాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మరి హరీష్ రాసుకున్న స్క్రిప్ట్ బాలయ్యను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు, హరీష్ శంకర్ దగ్గర 'దాగుడు మూతలు' అనే ఒక క్రేజీ మల్టీస్టారర్ కథ కూడా సిద్ధంగా ఉంది. గతంలోనే ఈ సినిమా గురించి వార్తలు వచ్చాయి. ఇందులో ఇద్దరు హీరోలు అవసరం కావడంతో, సరైన కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మల్టీస్టారర్ కుదరకపోతే, మళ్ళీ సోలో హీరో కోసం కొత్త కథను సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హరీష్ శంకర్కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో 'గద్దలకొండ గణేష్', సాయి ధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాలు తీశారు. కాబట్టి వీరితో మరోసారి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిద్ధంగా ఉన్న కథలకి ఏ హీరో సెట్ అవుతారో అన్న దానిపై ఆయన టీమ్ వర్క్ చేస్తోంది. నిజానికి హరీష్ శంకర్ సినిమాల్లో డైలాగ్స్ మరియు హీరో ఎలివేషన్స్ మాస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటాయి. ఉస్తాద్ విషయంలో కూడా పవన్ను చూపించిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే కథా బలంలో కాస్త మార్పులు చేయాలని సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఇప్పటికే హరీష్కు అడ్వాన్సులు ఇచ్చి ఉండటంతో ఆయనకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, హరీష్ శంకర్ తన తర్వాతి సినిమాను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ష్యూర్ షాట్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. బాలయ్య సినిమాపై క్లారిటీ వస్తే కానీ ఆయన నెక్స్ట్ స్టెప్ అధికారికంగా తెలిసే అవకాశం లేదు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
Mar 23, 2026‘వారణాసి’ తర్వాత మహేష్ చేసే సినిమా ఫైనల్ అయినట్టేనా?
- ఆగస్ట్తో ‘వారణాసి’ షూటింగ్ పూర్తి - సెన్సేషనల్ డైరెక్టర్తో మహేష్ నెక్స్ట్ మూవీ - మహేష్ కోసం స్రిప్ట్ రెడీ చేసిన డైరెక్టర్ సూపర్స్టార్ మహేష్బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తన కెరీర్లోనే ఫస్ట్ టైమ్ గ్లోబల్ స్టార్గా అంతర్జాతీయ స్థాయి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్పై ఉంది. అయినప్పటికీ మహేష్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఆసక్తికరమైన చర్చలు ఫిలిం సర్కిల్లో జరుగుతున్నాయి. ‘వారణాసి’ సినిమా విషయానికి వస్తే.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాను 2027, ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ కోసం మహేష్, రాజమౌళి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక మహేష్ నెక్స్ట్ చేసే సినిమా విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్రెడ్డి పేరు ప్రముఖంగా చెప్ప్పుకుంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్స్తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న సందీప్రెడ్డి... మహేష్ కోసం ఒక ఎక్స్ట్రార్డినరీ సబ్జెక్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. మహేష్ క్లాస్ అండ్ మాస్ అప్పీల్కు, సందీప్ రా మేకింగ్ స్టెíల్ తోడైతే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ రకరకాల కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ‘వారణాసి’ చిత్రంతో గ్లోబల్ మార్కెట్కు వెళుతున్న మహేష్.. నెక్స్ట్ చెయ్యబోయే సినిమా సందీప్రెడ్డి డైరెక్షన్లో అయితే ఆ క్రేజ్ కంటిన్యూ అవుతుందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత సందీప్ ‘యానిమల్ పార్క్’ చేస్తారు. మరి మహేష్ ప్రాజెక్ట్ ఎప్ప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
Mar 21, 2026
Peddi: బిగ్ షాక్.. పెద్ది మళ్ళీ వాయిదా.. అసలేం జరుగుతోంది?
మెగా ఫ్యాన్స్ కి మరో షాక్! పెద్ది మూవీ మళ్ళీ వాయిదా పడిందా? సినిమాలు వాయిదా పడటం అనేది కామన్ అయిపోయింది. అందునా పెద్ద సినిమాలు అనుకున్న డేట్ కి రావడం అనేది గొప్ప విషయం అన్నట్టుగా మారిపోయింది. ఇప్పుడు 'పెద్ది'(Peddi) విషయంలోనూ అభిమానులకు షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ మూవీ, మరోసారి వాయిదా పడనున్నట్లు వార్తలొస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ ఆలస్యమవ్వడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా రావడం కష్టమని అంటున్నారు. పెద్ది మూవీ షూటింగ్ కొంత పెండింగ్ ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే టైమ్ చాలా తక్కువ ఉండటంతో.. టీమ్ అంతా పరుగులు పెడుతోందట. పెద్దిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్క కంటెంట్ కూడా డిజప్పాయింట్ చేయలేదు. ఆ అంచనాలను అందుకోవాలంటే.. మూవీ అవుట్ పుట్ ఓ రేంజ్ లో ఉండాలి. పైగా పెద్ది పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఎమోషన్స్ కి పెద్ద పీట ఉంటుంది. షూటింగ్ ఒక ఎత్తయితే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరొక ఎత్తు. ముఖ్యంగా ఎడిటింగ్, మ్యూజిక్ కోసం తగిన సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా విడుదల తేదీని దృష్టిలో పెట్టుకొని.. హడావుడిగా అవుట్ పుట్ ఇచ్చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే అవసరమైతే మరోసారి పోస్ట్ పోన్ చేసి, కాస్త ఆలస్యమైనా మంచి అవుట్ పుట్ తో రమ్మని.. సన్నిహితులు కూడా పెద్ది టీమ్ కి సూచిస్తున్నారట. దీంతో వాయిదా అంశం గురించి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు పెద్ది మరోసారి వాయిదా పడుతుందా లేదా? అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ
Mar 20, 2026క్రేజీ అప్డేట్.. మెగా ఫోన్ పట్టనున్న కిరణ్ అబ్బవరం.. ప్రాజెక్ట్ డీటైల్స్ ఇవే!
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లు సమాచారం. నటుడిగా, నిర్మాతగా ఇప్పటికే తన సత్తా చాటుకున్న కిరణ్, ఇప్పుడు మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం త్వరలోనే ఒక భారీ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేయబోతున్నారట. గతేడాది 'క' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో, తన మార్కెట్ను ఒక్కసారిగా పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒక వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్న కిరణ్, తానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను జాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై సుధాకర్ చాగంటి నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే, ఈ చిత్రానికి హిట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారనే వార్త ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. కిరణ్ సినిమాల్లో పాటలకు ఉండే క్రేజ్ తెలిసిందే, అందుకే ఈ కాంబినేషన్ కుదిరితే మ్యూజికల్గా కూడా సినిమా మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గతంలో 'రాజావారు రాణిగారు' సినిమాతో సింపుల్గా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణమండపం' వంటి హిట్స్ అందుకున్నారు. అయితే మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా, మొండి పట్టుదలతో 'క' సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో కిరణ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 'చెన్నై లవ్ స్టోరీ' ఒకటి. ఈ లోపే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా హీరోలు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దర్శకత్వం వైపు రావడం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ కిరణ్ తనలో ఉన్న మల్టీ టాలెంట్ను బయటపెట్టాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహిస్తే అది లవ్ స్టోరీ అవుతుందా లేక 'క' లాంటి ఏదైనా మిస్టరీ థ్రిల్లర్ అవుతుందా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఒక వెరైటీ కాన్సెప్ట్తోనే ఆయన ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్టా. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నటుడిగా మెప్పించి, నిర్మాతగా లాభాలు అందుకున్న కిరణ్.. మరి డైరెక్టర్ క్యాప్లో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, టాలీవుడ్లో మరో వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ యాడ్ అయినట్లే! దీనిపై కిరణ్ అబ్బవరం టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Mar 16, 2026
Trisha: విజయ్ దెబ్బకు త్రిష సినిమాలకు గుడ్బై!
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్(Trisha Krishnan ) ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? రెండు దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఈ చెన్నై చంద్రం.. త్వరలోనే వెండితెరకు దూరం కానున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయ వర్గాలు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అయితే, ఇటీవల జరిగిన ఓ వేడుకలో త్రిష, విజయ్తో కలిసి కనిపించడంతో.. TVK పార్టీలో ఆమె చేరడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం త్రిష, మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. సూర్యతో 'కరుప్పు', మోహన్ లాల్ తో 'రామ్' సినిమాలు కూడా చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా త్రిష కొత్త సినిమాలకు సంతకం చేయడం లేదని సమాచారం. తన వద్దకు వస్తున్న కథలను సున్నితంగా తిరస్కరిస్తూ, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల షూటింగ్లను శరవేగంగా పూర్తి చేస్తోందట. త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. TVK పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, తమిళ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని ఆమె భావిస్తోందట. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని త్రిష భావిస్తున్నట్లు సమాచారం.
Mar 14, 2026
Anushka Shetty: అనుష్క పెళ్లికి వేళాయే.. వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పెళ్లిపీటలు ఎక్కుతున్న అనుష్క శెట్టి ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా? వరుడు ఎవరో తెలుసా? టాలీవుడ్ 'లేడీ సూపర్ స్టార్' అనుష్క శెట్టి(Anushka Shetty) పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. గత కొన్నేళ్లుగా ఆమె వివాహం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నప్పటికీ, ఈసారి మాత్రం పెళ్లి దాదాపు ఖాయమైందని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అనుష్క బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమని, సదరు వ్యాపారవేత్త కుటుంబం అనుష్క కుటుంబానికి అత్యంత సన్నిహితులని సమాచారం. అనుష్క స్వతహాగా మంగళూరుకు చెందిన కన్నడ అమ్మాయి కావడంతో, తన సొంత ప్రాంతానికి చెందిన వ్యక్తితోనే ఏడడుగులు వేయడానికి మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క వయసు 44 ఏళ్లు. గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పెళ్లి అంటూ అనేక రూమర్లు వచ్చినప్పటికీ, వారిద్దరూ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ అని పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి' తరువాత అనుష్క సినిమాలు తగ్గించింది. మూవీ ప్రమోషన్స్ లోనూ కనిపించడంలేదు. గతేడాది అనుష్క నటించిన 'ఘాటి' చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'కథనార్' అనే ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అనుష్క తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంది. అయితే, ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు ముగిశాయని, త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి అధికారికంగా వెల్లడిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ ఏడాది టాలీవుడ్లో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ఇదే కానుంది. Also Read: ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన నిర్మాత కన్నుమూత
Mar 14, 2026
NBK 111: బాలయ్యకు విలన్ గా టాలీవుడ్ స్టార్!
'NBK 111'లో విలన్ గా టాలీవుడ్ హీరో బాలయ్యను ఢీ కొట్టబోతున్న యంగ్ స్టార్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో రూపొందుతోంది. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 'వీరసింహారెడ్డి' తరువాత బాలకృష్ణ-గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో పాటు.. బాలయ్య అండర్ వరల్డ్ డాన్ గా కనిపించనున్నాడనే వార్తల నేపథ్యంలో.. 'NBK 111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. 'NBK 111'లో విలన్ గా మంచు మనోజ్(Manchu Manoj) నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ముందు విలన్ గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలి. అలాంటి సాహసం చేయడానికి మనోజ్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన ముద్ర వేసిన మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గానూ రాణిస్తున్నాడు. ముఖ్యంగా 'మిరాయ్'లో స్టైలిష్ విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు 'NBK 111'లోనూ స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారని వినికిడి. కాగా, బాలకృష్ణ-మనోజ్ కలిసి నటించడం అనేది ఇది మొదటిసారి కాదు. 14 ఏళ్ళ క్రితం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' అనే సినిమా చేశారు. అందులో మనోజ్ హీరోగా నటించగా, అతిథి పాత్రలో బాలయ్య కనువిందు చేశారు. Also Read: మృత్యుంజయ్ మూవీ రివ్యూ
Mar 06, 2026
Vijay vs sangeeta: 250 కోట్ల డీల్ అంట.. విడాకులు వస్తాయా? రావా?
-విజయ్, సంగీత కేసు పరిస్థితి ఏంటి -మధ్యవర్తిత్వానికి తేరా లేపారా! -అదంతా రూమరేనా! ఇళయ దళపతి 'విజయ్'(Vijay)కి ఇటీవల భార్య సంగీత(sangeeta)విడాకుల నోటీసు పంపించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఎప్పట్నుంచి ఇంటర్నల్ గా గొడవలు జరుగుతున్నాయో తెలియదు కానీ, సడెన్ గా సంగీత విడాకులు పంపించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ తో పాటు యావత్ ఇండియన్ సినీ పరిశ్రమ షాక్ కి గురయ్యింది. దీంతో ఎవరు ఎంత బిజీలో ఉన్నా విజయ్, సంగీత ఎపిసోడ్ కి సంబంధించిన మరిన్ని కొత్త విషయాల కోసం సోషల్ మీడియాని అస్సలు వదలటం లేదు. ఈ నేపథ్యంలో న్యూ అప్ డేట్ ఒకటి ఆ అందరు మరింతగా చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. కాకపోతే ఆ అప్ డేట్ హోదా రూమర్. ఏంటో చూద్దాం. సంగీత ఇష్యు మరింతగా పబ్లిక్ లోకి వెళ్లకుండా విజయ్ సామరస్యంగా ముగించాలని చూస్తున్నాడని, అందుకు గాను కోర్టు దాకా వెళ్లకుండా సంగీత, కుమారుడు జేసన్ సంజయ్, కూతురు సాషాల భవిష్యత్తుతో పాటు ఆర్ధిక నిలకడ కోసం 250 కోట్ల రూపాయలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇందు కోసం విజయ్ కొంత మంది పెద్దలని రంగంలోకి దింపాడనే వార్తలు తమిళ సినీ మార్కెట్ తో పాటు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగానే చెప్పుకున్నట్టు రూమర్ హోదాలోనే. aslo read: Peddi: రామ్ చరణ్ రుద్రతాండవం.. రై రై పుట్టుకకి కారణం చెప్పిన అనంత్ శ్రీరామ్ ఏది ఏమైనా విజయ్ కి ఈ ఇయర్ ప్రారంభమే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పొంగల్ కి రిలీజ్ కావాల్సిన 'జన నాయగన్'(Jana Nayagan)సెన్సార్ ఎంట్రీ వల్ల ల్యాబ్ లోనే ఉంది. రిలీజ్ విషయం కూడా చెప్పలేని పరిస్థితి. మళ్ళీ నెల రోజులకే సంగీత నుంచి విడాకుల నోటీసు. ఈ నేపథ్యంలో మే లేదా జూన్ లో జరిగే ఎన్నికల్లో విజయ్ తన కొత్త పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా ఎలాంటి ఫలితాలని చవి చూడబోతున్నాడనే ఆసక్తి ఏర్పడింది.
Mar 04, 2026
నందమూరి ఫ్యాన్స్ కి బిగ్ న్యూస్.. మోక్షజ్ఞ డెబ్యూపై క్లారిటీ వచ్చేసింది!
నందమూరి అభిమానులకు శుభవార్త! మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారు! నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ, ఏవో కారణాలతో అది పట్టాలెక్కలేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? డైరెక్టర్ ఎవరు? అంటూ అప్పటినుంచి చర్చ జరుగుతూనే ఉంది. త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడనుంది. (Nandamuri Mokshagna) క్లాసిక్ ఫిల్మ్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను బాలకృష్ణ తలపెట్టిన సంగతి తెలిసిందే. స్వయంగా బాలయ్యే కథ రాసుకోవడం విశేషం. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, కొంతకాలంగా మళ్ళీ ఎటువంటి చప్పుడు లేదు. అయితే త్వరలోనే సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Aditya 999) బాలకృష్ణ ఇచ్చిన స్టోరీ లైన్ ని తీసుకొని క్రిష్ తన టీమ్ తో కలిసి ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఉగాది కానుకగా మార్చిలో అధికారికంగా ప్రకటించి, త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. కాగా, 'ఆదిత్య 999'లో మోక్షజ్ఞ హీరోగా నటించనుండగా, బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది మొదటి సినిమాలోనే తండ్రితో కలిసి నటిస్తుండటం ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు. Also Read: 15 ఏళ్ళ ప్రేమ కావాలి.. ఇలాంటి డ్రీమ్ డెబ్యూకి అదృష్టం ఉండాలి!
Feb 25, 2026
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అక్కినేని హీరో!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ రంగంలోకి వివిధ భాషలకు చెందిన స్టార్స్ ప్రత్యేక పాత్రలో అక్కినేని హీరో! జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ కావడంతో 'డ్రాగన్'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను పెంచే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో అక్కినేని హీరో అఖిల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Akhil Akkineni) 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టోవినో థామస్ విలన్ గా నటిస్తున్నాడు. అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. అలాగే 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. కథకు కీలకమైన ప్రత్యేక పాత్రలో అఖిల్ కనిపించనున్నాడట. నిడివి తక్కువ అయినప్పటికీ ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్, అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ రోల్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా అఖిల్ ఓకే చెప్పినట్లు టాక్. కాగా, అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, జూన్ కి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి. Also Read: 24 ఏళ్ళ క్రితం బండ్ల గణేష్ హీరోగా భారీ సినిమా.. ఎందుకు ఆగిపోయింది?
Feb 24, 2026
నాగచైతన్య 25వ సినిమా.. రాజమౌళి కాదు.. రంగంలోకి సుకుమార్!
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నాగచైతన్య 25వ సినిమా దర్శకుడు రాజమౌళి అంటూ మొదట ప్రచారం సుకుమార్ కాంపౌండ్ అంటూ తెరపైకి కొత్త న్యూస్ అసలు చైతన్య 25వ సినిమా డైరెక్టర్ ఎవరు? అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తన 24వ సినిమా 'వృషకర్మ'ను కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో చైతన్య ఘన విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య 25వ సినిమా గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. హీరో కెరీర్ లో 25వ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అందుకే చైతన్య 25వ సినిమాపై అక్కినేని కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli) పేరు వినిపించింది. చైతన్య 25వ సినిమా దర్శకుడు రాజమౌళి అంటూ ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నాగచైతన్య 25వ సినిమా సుకుమార్ కాంపౌండ్ లో తెరకెక్కునుందని తెలుస్తోంది. చైతన్య 25వ చిత్రానికి సుకుమార్(Sukumar) కథ అందించడంతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడట. 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు(Buchi Babu Sana) మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు తన రెండో సినిమా 'పెద్ది'(Peddi)ని ఏకంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'పై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. దీని తర్వాత ప్రతిష్టాత్మక నాగచైతన్య 25వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. కాగా, నాగ చైతన్య-సుకుమార్ కాంబినేషన్ లో గతంలో '100% లవ్' అనే విజయవంతమైన చిత్రం రావడం విశేషం. ఆ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు 25వ సినిమాకి కథ అందిస్తున్నాడని టాక్. మరి చైతన్య 25వ సినిమా కోసం సుకుమార్ ఎలాంటి కథను ఇస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే, నాగచైతన్యతో సినిమా చేయబోయే దర్శకుల లిస్టులో మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొరటాల శివ, వెంకీ అట్లూరి, క్లాక్స్ వంటి దర్శకుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. Also Read: ఉదయ్పూర్ బయల్దేరిన విజయ్, రష్మిక
Feb 23, 2026‘వారణాసి’కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!
సూపర్స్టార్ మహేష్(Superstar Mahesh babu), ఎస్.ఎస్.రాజమౌళి(S.S.Rajamouli) కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబ్ ట్రాటింగ్ ఎడ్వంచరస్ మూవీ ‘వారణాసి’(Varanasi). ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్ప్పుడు వస్తున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న హైప్ను మరింత పెంచుతున్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనగానే సహజంగానే ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే సినిమాకి అన్ని హంగులు కల్పించడానికి రాజమౌళి కషి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారనే వార్త వినిపిస్తోంది. నాని హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రంలో విలన్గా సుదీప్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నటుడిగా అతన్ని ఎక్కడికో తీసుకెళ్లిందా సినిమా. ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో ఒక సీన్ చేశారు. ఇప్ప్పుడు ‘వారణాసి’ చిత్రంలో సుదీప్ కోసం రాజమౌళి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ను క్రియేట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో 30 నిమిషాల పాటు సుదీప్ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. కథను మలుపు తిప్పే కీలక పాత్ర అతనిదని చెబుతున్నారు. ఒక తెలుగు సినిమాలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే సినిమాగా ‘వారణాసి’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పథ్విరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప్పుడు సుదీప్ కూడా ఈ సినిమాలో భాగం కానుండడంతో మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో రాజమౌళి చేసిన కొన్ని సినిమాలు సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకున్నాయి. దానికి భిన్నంగా ‘వారణాసి’ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Feb 20, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



