ఫిష్ సప్లిమెంట్లు వాడేవారికి అలర్ట్.. వీటితో ఎంత డేంజర్ తెలుసా?

చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి గుండె నుండి మెదడు వరకు ప్రతి అవయవానికి ఆరోగ్యం చేకూరుస్తాయి.  కొందరు చేపలు తినని వ్యక్తులు ఫిష్ సప్లిమెంట్లు వాడుతూ ఉంటారు.  ఈ చేప నూనె టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వీరి నమ్మకం.  అయితే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు ఫిష్ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదంతో చలగాటం ఆడటమే అని చెబుతున్నాయి.  అసలు ఫిష్ సప్లిమెంట్లు ఎందుకు అనారోగ్యం? వీటితో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలుసుకుంటే.. సాల్మన్, మాకేరెల్,  ట్రౌట్ వంటి కొవ్వు చేపల నుండి తీసుకోబడిన నూనెను కలిగి ఉన్న క్యాప్సూల్స్  శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.  ఇవి  ముఖ్యంగా గుండె జబ్బులు (CVD), అధిక రక్తపోటు, లిపిడ్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి చాలా మంచివి.  ఈ సమస్యలు ఉన్నవారు ఈ క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె జబ్బులు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలలో వెల్లడైంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ క్రమ రహిత హృదయ స్పందన లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ సప్లిమెంట్లను తీసుకుంటే  క్రమరహిత హృదయ స్పందన 13శాతం,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5శాతం  పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తీసుకుంటే  హార్ట్ ఫెయిల్ ప్రమాదం 15శాతం,  మరణించే ప్రమాదం 9శాతం తగ్గించవచ్చట.   అంటే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. కానీ ఆరోగ్య స్పృహతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వీటిని వాడితే మాత్రం ముప్పు  వాటిల్లుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.                                                   *రూపశ్రీ.

వర్షాకాలంలో ఆకుకూరలు తినడం మంచిదేనా?

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి.  కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం అయినా కురుస్తూనే ఉంటోంది.  వర్షాల కారణంగా చెరువులు,  నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో కదలిక వస్తుంది. కొత్తనీరుతో పాటూ వివధ ప్రాంతాలలోని వ్యర్థాలు,  కలుషితాలు కూడా నీటితో కలుస్తాయి. వీటినే తాగునీరుగా,  వంటలకోసం ఉపయోగించడం వల్ల ఆహారం, నీరు అన్నీ కలుషితమవుతాయి.  ఒకవైపు ఇలా ఉంటే అధిక తేమ కారణంగా కొన్ని రకాల కూరగాయలు,  ఆకుకూరలు చాలా తొందరగా చెడిపోతాయి.  అలాంటి వాటిలో ఆకుకూరలు కూడా ఒకటి.  ఆకుకూరలను వర్షాకాలంలో తినవద్దని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా లేని ఆకుకూరలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, డయేరియా, ఫుడ్ పాయిజనింద్ వంటి అనేక ప్రేగు సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా ఆకుకూరలను ఆస్వాదించవచ్చని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం ఏం చేయాలంటే.. తాజా ఆకుకూరలు..  నచ్చిన ఆకు కూరలను  కొనుగోలు చేసిన తర్వాత  ఆకుకూరల మధ్యన తడిగా, కుళ్లినట్టు ఉండే ఆకులను వేరు చేయాలి.   ఆరోగ్యంగా, తాజాగా  కనిపించే ఆకులను వేరు చేయాలి. శుభ్రం..  ఆకుకూరల నుండి తాజాగా ఉన్న ఆకులను వేరు చేసిన తరువాత వాటిని శుభ్రం చేయాలి.  ఆకుకూరలు శుభ్రం చేయడానికి చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే లిక్విడ్ లను ఉపయోగిస్తుంటారు.   అయితే ఈ  కృత్రిమ క్లీనర్‌లను ఉపయోగించకూడదు.  బదులుగా, ఆకు కూరలను కుళాయి కింద వేగంగా పడుతున్న నీటి ధారలో కడగాలి. ఆరబెట్టాలి.. ఆకుకూరలను కడిగిన తర్వాత అదనపు నీటిని వడకట్టి ఫ్యాన్ కింద ఆకులను ఆరబెట్టాలి. ఆకు కూరలలో తేమ పోయేలా చేయడానికి సలాడ్ స్పిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేదా కిచెన్ టవల్‌తో ఆరబెట్టవచ్చు. ఈ ఆకుకూరలను వెంటనే అయినా ఉపయోగించవచ్చు. లేదంటే నిల్వ కూడా చేయవచ్చు. జాగ్రత్త..  ఒక గిన్నె నీటిలో  కొంచెం ఉప్పు వేసి నీటిని మరిగించి మంటను ఆపివేయండి. ఇందులో ఆకుకూరలు,  పచ్చిమిర్చి వేసి 30 సెకన్ల పాటు ఉంచాలి. పేర్కొన్న సమయాన్ని మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటిని ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచడం వల్ల వాటి రంగు,  ఆకుకూరల స్వభావం మారిపోతుంది.    ఐస్ బాత్.. వేడి నీటి నుండి ఆకు కూరలను తీసివేసిన వెంటనే  వాటిని మంచు నీటితో నిండిన గిన్నెలోకి మార్చాలి. ఒక నిమిషం అలాగే ఉంచి  తీసివేయాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండేలా చేస్తుంది.                                         *రూపశ్రీ.

మనసు బాగోకపోతే... ఆర్థికంగా దివాళా!

ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ... ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘Money and Mental Health Policy Institute’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది.   మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం... ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో... - 93 శాతం మంది తాము అవసరానికి మించి ఖర్చుపెడుతున్నామని ఒప్పుకున్నారు. - 92 శాతం మంది తాము ఆర్థిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని తేల్చిచెప్పారు. - 59 శాతం, తమకి అవసరం లేకపోయినా కూడా అప్పులు తీసుకుంటున్నామని తెగ బాధపడిపోయారు.   అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడమే కాదు... ఆ రుణాలకి సంబంధించిన నిబంధనలను అర్థం చేసేకోకుండానే రుణ ఒప్పందాలు పూర్తిచేశామని 24 శాతం మంది వాపోయారు. మరో 38 శాతం మంది ఆ అప్పు తీసుకునే సమయంలో తనకి ఏం చెప్పారో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా అప్పులకు దిగడం మాట అటుంచి, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకంగా 38 శాతం మంది ఉద్యోగాన్ని కోల్పోయారని తేలింది. ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా చాలానే బయటపడ్డాయి. అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, ఆర్థిక సంబంధాలను చెడగొట్టుకోవడం... వంటి దీర్ఘకాలిక నష్టాలతో జీవితం కునారిల్లిపోతుందిట.   పైన పేర్కొన్న కారణాలన్నింటివల్లా... మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. మనసులో ఉన్న అలజడి ఉపశమించేందుకో, సమాజంలో విలువను పెంచుకునేందుకో, అలవాటుగానో, నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనో... ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మానసిక స్థితిని గమనించుకోమని సూచిస్తున్నారు. మరోవైపు అటు వైద్యులు కానీ, ఇటు ఆర్థికరంగ సలహాదారులుకానీ తమ దగ్గరికి వచ్చేవారిలో మానసిక ఒత్తిడిని గమనించడమూ... వారి ఆర్థిక స్థితి మీద ఆ ఒత్తిడి ప్రభావం కలుగకుండా తగు హెచ్చరికలు చేయడమూ ఉండాలి.   - నిర్జర.

ఇది బ్లాక్ టీ కాదు, మధుమేహాన్ని తగ్గించే డార్క్ టీ..!!

నేటికాలంలో మారుతున్న జీవనశైలి, రోజువారీ ఆహారపు అలవాట్లు..ఇవన్నీ కూడా రకరకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇది వ్యాధి కానప్పటికీ...ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం అసలైన చికిత్స. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలమీదకే వస్తుంది. ముఖ్యంగా సిటీ లైఫ్‌లో ఈ వ్యాధి చాలా త్వరగా వస్తోందని.. ఒక చాప్టర్ రిపోర్టు ప్రకారం ప్రతి పదిమందికి పరీక్షలు చేస్తే కనీసం ఐదారుగురికి మధుమేహం నిర్దారణ అవుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారాన్ని తీసుకుంటే.. ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడంతో డార్క్ ప్రయోజనాలేంటో చూద్దాం. డార్క్ టీ గురించి: డార్క్ టీ అనేది..ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. అదే గ్రీన్ టీలో ఆక్సీకరణ ప్రక్రియ జరగదు. డార్క్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 47% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ సందర్భంలో వారి వయస్సు, లింగం, వారి శరీర నిర్మాణం,  వారు నివసించే ప్రాంతం పరిగణనలోకి తీసుకుంటారని పరిశోధకులు తెలిపారు. అయితే ఈ టీని తయారుచేసేటప్పుడు ఇందులో చక్కెరను ఉపయోగించకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో సుమారు 2,000 మందిని ఉపయోగించారు. వారిలో 400 మందికి డయాబెటిస్ ఉంది. 350 మందికి మధుమేహం వచ్చే అవకాశం ఉంది.మిగిలిన వారిలో సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఉన్నాయి. వారిలో చాలా మంది టీ తాగలేదు. మరికొందరు ప్రతిరోజూ ఒకే రకమైన టీ తాగారు. పరిశోధకులు వారు ఎంత టీ తాగారు..వారి మూత్రంలో ఎంత గ్లూకోజ్ విసర్జించారో పరీక్షించడానికి వాటిని ఉపయోగించారు. రెండు కారణాల వల్ల డార్క్ టీ తీసుకోవడం వల్ల మధుమేహం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మొదటిది, ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడంతోపాటు..రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నిర్వహించడంలో సహాయపడుతుంది. రెండవది, పెద్ద మొత్తంలో గ్లూకోజ్ మూత్రంలో విసర్జించబడుతుంది. దీని వల్ల శరీరంలో నియంత్రణలో ఉండాల్సిన గ్లూకోజ్ తగ్గిస్తుంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తినడం వల్ల మధుమేహం మరింత ఉధృతం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే అధిక కొవ్వు పదార్ధాలు, చక్కెర, ఉప్పు పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీని వలన శరీరం మంటగా మారుతుంది. అందువల్ల కూరగాయలు, పండ్లతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని అధ్యయనం నివేదించింది.  

కడుపు ఉబ్బరం,  గ్యాస్ సమస్యను సింపుల్ గా ఇలా తగ్గించేయచ్చు..!

  పొట్ట ఉబ్బితే కడుపు బరువుగా అనిపిస్తుంది. దీని వల్ల కడుపులో గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది.  కొన్నిసార్లు కడుపు నొప్పితో బాధపడాల్సి వస్తుంది. సాధారణంగా, జీర్ణవ్యవస్థ క్షీణించడ.   ఆహారాన్ని సరిగా  నమలకుండా  తినడం, ఎక్కువ తినడం, స్పైసీ ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు లేదా పీరియడ్స్ సమయంలో కూడా ఉబ్బరం సమస్య వస్తుంది. ఈ ఉబ్బరం నుంచి బయటపడాలంటే జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు.  కొన్ని చిట్కాలుప్రయత్నించి ఉబ్బరం నుండి బయటపడవచ్చు.  అవేంటంటే.. నెమ్మదిగా తినాలి.. నెమ్మదిగా,  జాగ్రత్తగా తినడం చాలా ముఖ్యం.  ఆహారాన్ని పూర్తిగా నమలాలి.  ప్రతి ముక్కను నమిలి తినాలి. దీనివల్ల ఆహారంతో పాటు గాలి కడుపులోకి ప్రవేశించదు.  ఇది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. రోజువారీ శారీరక శ్రమ.. ఉబ్బరం వంటి సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ కొంత శారీరక శ్రమ చేయడం ముఖ్యం. వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్, వాకింగ్, యోగా లేదా లైట్ స్ట్రెచింగ్ చేయవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచి ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండండి.. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ సజావుగా పని చేస్తుంది.  మలబద్ధకం వల్ల ఉబ్బరం ఏర్పడదు. సోడియం.. అధిక ఉప్పు శరీరం నుండి నీరు గ్రహిస్తుంది.  ఇది ఉబ్బరానికి దారితీస్తుంది. అందుకే తాజా తృణధాన్యాల ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అలాగే తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు,  తక్కువ  సోడియం స్నాక్స్ తీసుకోవాలి.  శ్వాస..   డయాఫ్రాగ్మాటిక్ లేదా పొట్ట ద్వారా శ్వాస తీసుకోవడం ద్వారా ఉబ్బరం తగ్గుతుంది. దీన్నే డీప్ బ్రీడింగ్ లేదా పొట్ట నుండి గాలి పీల్చడం అంటారు. కడుపు నుండి మాత్రమే లోతైన శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించండి. పొట్టను బాగా లోపలికి తీసుకుంటూ శ్వాసను తీసుకోవాలి.  దీని వల్ల ఉబ్బరం సమస్య ఉండదు.                                                       *రూపశ్రీ.

రాత్రి 7గంటలలోపు భోజనం చెయ్యాలి ఇందుకే!

ప్రజలు ఆరోగ్యం కోసం మూడు పూటలా ఆహారం తీసుకుంటారు.  ఇందులో ఉదయం బ్రేక్ పాస్ట్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. చాలామందికి ఉదయం 9లోపు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో కొందరు 8 గంటలకు, మరికొందరు 9 గంటలకు, ఇంకొందరు 10 గంటలకు కూడా భోజనం చేస్తారు.  అయితే రాత్రి భోజనం విషయంలో వైద్యులు చాలా అసక్తికర విషయాలు వెల్లడించారు.  రాత్రి భోజనం 7 గంటలలోపు తింటే ఏం జరుగుతుందో కింది విధంగా వివరించారు. రాత్రి 7 గంటలలోపు భోజనం చెయ్యడం వల్ల ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం దొరుకుతుంది.  ఈ సమయం తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనివల్ల రాత్రి సమయంలో కడుపు  ఉబ్బరం, కడుపు భారంగా అనిపించడం,  అజీర్ణం వంటి  సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది. కొందరిలో ఆకలి వేళలు క్రమ పద్దతిలో ఉండవు. ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటారు. రాత్రి 7 గంటలలోపు తింటే ఆకలి వేళలు కూడా క్రమ పద్దతిలో ఉంటాయి. రాత్రి తొందరగా తినడం వల్ల  ఉదయాన్నే తొందరగా ఆకలి వేస్తుంది.  ఇది బ్రేక్పాస్ట్  స్కిప్ చేయకుండా ఉండటంలో సహాయపడుతుంది. చాలామంది రాత్రి 9 గంటలు దాటిన  తరువాత భోజనం విషయంలో చాలా హడావిడి పడుతూ ఉంటారు. ఇలా హడావిడిగా తినేటప్పుడు ఆహారం నమలరు.  అప్పటికే సమయం గడవడం వల్ల ఆ ఆహారం కూడా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. 7గంటలలోపు తినడం వల్ల హడావిడి ఉండదు. నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. దీనివల్ల తిన్న ఆహారం శరీరానికి ఒంటబడుతుంది. 7గంటలలోపు ఆహారం తినడం ద్వారా అది సరిగా జీర్ణం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు. బరువు తగ్గాలని అనుకునేవారు ఆహార వేళలు పర్పెక్ట్ గా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో 7గంటలలోపు తినడం వల్ల బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. జీవక్రియ  సజావుగా జరుగుతుంది. పడుకునేలోపు చాలా ఆహారం జీర్ణం అవుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. అంతే కాదు రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్ సిస్టమ్  సమన్వయంగా ఉంటుంది. ఇది నిద్రా చక్రం.  అంటే నిద్ర చక్రం చక్కగా పనిచేస్తుంది.                       *రూపశ్రీ.

గ్యాస్ట్రిక్ తలనొప్పి అంటే ఏంటి? ఇది తగ్గాలంటే ఏం చేయాలి?

తలనొప్పి అనేది ఎవరికైనా వచ్చే సమస్య. కానీ తలనొప్పి వల్ల ఒక్కొక్కరు ఒక్కోలా ఇబ్బంది పడతారు.  కొన్నిసార్లు ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.   సరిగ్గా నిద్రపోలేరు అలాగని ప్రశాంతంగా  మెలకువగా ఉండలేరు కూడా.  ఈ రకమైన తలనొప్పిని సాధారణ తలనొప్పిగా భావించలేం.  దీన్ని  గ్యాస్ట్రిక్ తలనొప్పి అని చెప్పవచ్చు. గ్యాస్ట్రిక్ తలనొప్పి కడుపుకు సంబంధించినది. ఇందులో పొట్టలో గ్యాస్ ఏర్పడి క్రమంగా తలకు  ఎక్కి ఆ తర్వాత తలనొప్పికి దారితీస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే, గ్యాస్ట్రిక్ తలనొప్పి అంటే ఏమిటి?  దాని నుండి ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుంటే.. గ్యాస్ట్రిక్ తలనొప్పి. గ్యాస్ట్రిక్ తలనొప్పిలో ఒక వ్యక్తి తలనొప్పితో పాటు గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అజీర్ణం,  పేలవమైన జీర్ణక్రియ, ముఖ్యంగా కడుపు,  ప్రేగులలో సమస్యల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఆహారం జీర్ణం కానప్పుడు, కడుపులో గ్యాస్ ఏర్పడటం ప్రారంభమవుతుంది.  దీని కారణంగా తలపై ఒక వైపున నొప్పి మొదలవుతుంది. లక్షణాలు.. వికారం మరియు వాంతులు,  కడుపు నొప్పి లేదా తిమ్మిరి.  అపానవాయువు,  అజీర్ణం,  యాసిడ్ రిఫ్లక్స్, అతిసారం లేదా మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి. గ్యాస్ట్రిక్ తలనొప్పి ఎందుకు వస్తుంది.. చెడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ తలనొప్పి వస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.  ఇది అసౌకర్యం,  తలనొప్పికి దారితీస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం,  తలనొప్పికి దారితీస్తుంది. తగినంత నీరు త్రాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది గ్యాస్ట్రిక్ తలనొప్పికి కారణమవుతుంది. ఋతుస్రావం,  గర్భధారణ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా గ్యాస్ట్రిక్ తలనొప్పికి కారణం. నివారణలు.. పిప్పరమింట్ టీ.. ఒక కప్పు పిప్పరమెంటు టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది కడుపు నొప్పి,  అజీర్ణానికి చికిత్స చేస్తుంది. తులసి ఆకులు.. 6-7 తులసి ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం,  గ్యాస్ తగ్గుతాయి. ఇది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మరసం,  గోరువెచ్చని నీరు.. నిమ్మరసం,  గోరువెచ్చని నీరు ఒత్తిడి,  కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఫెన్నెల్.. సోపు గింజలు ఉబ్బరం, గుండెల్లో మంట, గ్యాస్,  ఆకలి లేకపోవడం నుండి ఉపశమనం కలిగిస్తాయి. చమోమిలే.. చామంతిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది కడుపు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది.                                                 *రూపశ్రీ.

వర్షాకాలంలో పెరుగు తినడం మంచిది కాదా? నిజానిజాలేంటంటే..!

  సీజన్ ను బట్టి కొన్ని ఆహారాలు చేర్చుకోవాలని, కొన్ని అవాయిడ్ చేయాలని చెబుతూ ఉంటారు. అలా వర్షాకాలంలో తినకూడదు అని కొందరు చెప్పే వాటిలో పెరుగు ఉంటుంది.   వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం? దీని వెనుక కారణాలు ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది పూర్తీగా తెలుసుకుంటే వర్షాకాలంలో పెరుగు తినాలా వద్దా అనేది అర్థమైపోతుంది. చాలామంది ఈ వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదో కొన్ని కారణాలు చెప్తారు.  అవి ఎంత వరకు వాస్తవమూ తెలుసుకుంటే.. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా..? వర్షాకాలంలో  ఆహారంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినడం చాలా మంచిది. నిజానికి ఇందులో ఉండే ప్రోబయోటిక్ కాంపోనెంట్ వల్ల సీజన్ తో సంబంధం లేకుండా జీర్ణకోశ సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినవచ్చు. వర్షాకాలంలో పెరుగు జీర్ణం కాదా? పెరుగులో ఉండే ప్రోటీన్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ కారణంగా ఇది  పాల కంటే సులభంగా జీర్ణమవుతుంది.  పచ్చి పాలలో కంటే పెరుగులో ఉండే  పెప్సిన్ ద్వారా కేసైన్ ప్రోటీన్ ఎక్కువగా జీర్ణమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో పెరుగు తినడం చాలా మంచిది. రాత్రి సమయంలో పెరుగు తినకూడదా? రాత్రిపూట  పెరుగు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇందులో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది.  ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల ఆందోళనను తగ్గి మెదడుకు విశ్రాంతినిస్తుందని. అయితే నిద్రకు కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం పూర్తీ చేయాలి. పాలిచ్చే తల్లులు పెరుగు తినకూడదా? పెరుగులో క్రియాశీల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగు లేదా పెరుగులోని ప్రోబయోటిక్  మలబద్ధకం, అతిసారం నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి.  తల్లి లేదా బిడ్డకు జలుబు లేదా దగ్గు రాకుండా చేస్తుంది.పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిదని. గర్భవతులు పెరుగు తినకూడదా? గర్భిణీ స్త్రీలు  తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల చిన్న ప్రేగులలో జీర్ణక్రియకు పెరుగులోని బ్యాక్టీరియా అయిన లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ సహాయపడుతుంది.  కాబట్టి గర్బవతులు వారి ఆహారంలో కనీసం రోజుకు ఒకసారి  అయినా పెరుగును తీసుకోవచ్చు. అయితే ఆహారం బాగా జీర్ణం అయ్యే సమయం అయిన ఉదయం లేదా రాత్రి సమయాల్లో దీన్ని తీసుకోవడం మంచిది. పెరుగు తింటే లావు అవుతారా? పెరుగులో కొవ్వులు మాత్రమే కాకుండా  కాల్షియం, విటమిన్ డి, పొటాషియం,  ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఇది కాల్షియంను  గ్రహించడంలో సహాయపడుతుంది.                                             *రూపశ్రీ. 

మౌత్ వాష్ వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే.!

నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, అందరి ముందు ఆహారం తినాలన్నా దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం బాగుండాలి. అయితే చాలామంది నోటి శుభ్రత, దంతాల రంగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నోరు దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలన్నా, దంతాలు తెల్లగా ఉండాలన్నా  మంచి టూత్ పేస్ట్, మౌత్ వాష్ వాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు పళ్లు సరిగ్గా తోముకోరనే కారణంతో వారికి మౌత్ వాష్ ఉపయోగిస్తుంటారు. కానీ మౌత్ వాష్ వాడటం ప్రమాదాలతో కూడుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అసలు మౌత్ వాష్ వాడటం ఎంతవరకు సేఫ్? వీటిని వాడితే జరిగేదేంటి? మౌత్ వాష్ లో ఏముంటుంది? మార్కెట్లో బోలెడు మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. క్యాన్సర్ రావడానికి ప్రేరేపిస్తుంది.  ఏ మౌత్ వాష్ అయినా సరే.. వాటిలో 25శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఎంత వరకు సేఫ్.. మౌత్ వాష్ సేఫా కాదా అనే విషయం గురించి వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. దంత సంరక్షణకు, నోటి శుభ్రతకు ఇది మంచిదే అయినప్పటికీ మౌత్ వాష్ ఎక్కువ వాడితే మాత్రం నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. మౌత్ వాష్ ను మితంగా వాడితే అది దంతాల మీద మరకలను, దంతాల  మధ్యలో ఉండే మురికిని తొలగిస్తుంది. నోటికి తాజాదన్నాన్ని కూడా ఇస్తుంది. కానీ మౌత్ వాష్ ఎక్కువ  వాడటం వల్ల అది నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది. మౌత్ వాష్ వాడితే జరిగేది ఇదే.. మౌత్ వాష్ వాడటం వల్ల కేవలం నోటి క్యాన్సర్ మాత్రమే కాదు.. తల, మెడ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అధ్యనాలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా వాడే వారి నోరు తొందరగా పొడిబారుతుంది. వీటిలో ఉండే ఆల్కహాల్ దీనికి కారణం అవుతుంది.  నోటి లోపలిచర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు, నోటి క్యాన్సర్ తొందరగా రావడానికి కారణం అవుతుంది. అందుకే మౌత్ వాష్ లను వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఆరోగ్యకరమైన అలావాట్లు ఉంటే దంతాలు,నోరు సహజంగానే శుభ్రంగా ఉంటాయి.  ఒకవేళ నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు కానీ, ఇబ్బందులు  కానీ ఉంటే దంత వైద్యుడిని కలిసి సమస్య పరిష్కరించుకోవడం మంచిది.                                         *నిశ్శబ్ద.

వర్షాకాలంలో ఈ పని చేస్తే చాలు.. ఆమడదూరంలో అంటువ్యాధులు

వర్షపు రోజులలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణం  అనేక రకాల వైరస్‌లు,  బాక్టీరియాల పెరుగుదలకు అత్యంత అనుకూలమైనవి. ఈ సీజన్‌లో అంటు వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అంటు వ్యాధులను నివారించడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే  అలవాట్లు పెంపొందించుకోవడం ఎంతో అవసరం.  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ.  అయితే ప్రతిరోజూ ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించడం అనేది ఉదయంతో ప్రారంభం కావాలి. దీంతో రోజు మొత్తం ఒక క్రమంలో పటిష్టమవుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఈ వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన అంటువ్యాధులను అరికట్టడానికి ప్రతిరోజూ ఉదయం ఒకే ఒక్క పని చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేవలం సాధారణ వైద్యులే కాదు.. ఆయుర్వేద నిపుణులు కూడా ఉదయాన్నే చేసే ఈ పనిని సమర్థిస్తున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగమని అల్లోపతి నుండి ఆయుర్వేదం వరకు అన్నిరకాల వైద్యులు చెబుతున్న మార్గం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఉదయాన్నే వేడినీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. వర్షాకాలంలో  ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా సాధారణంగా వచ్చే సమస్య.  పరిస్థితులలో ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. బరువు తగ్గడానికి అలాగే సాధారణ దగ్గు, జలుబు,  ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి గోరువెచ్చని నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని అన్ని వైద్యాలలో చెప్పబడింది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో గోరువెచ్చని నీటిని తీసుకోవడం  ప్రయోజనకరంగా పరిగణించబడింది. గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం,  జీర్ణ సమస్యలకు చికిత్స చేయడం చాలా సులువుగా ఉంటుంది. ముక్కులు మూసుకు పోతే.. ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌లో ముక్కు మూసుకుపోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. నిజానికి మొదట ముక్కులు మూసుకుపోవడంతోనే ఈ సమస్య మొదలవుతుంది. దీనికి నివారణ కావాలంటే  గోరువెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వేడి నీటిని తాగడంతోపాటు  తేలికపాటి ఆవిరిలో లోతైన శ్వాస తీసుకోవడం కూడా మంచిది. ఇది  సైనస్‌ సమస్యను  తొలగించడంలో సహాయపడుతుంది. ముక్కు లోపలి గోడలకు ఓదార్పు లభిస్తుంది.  వేడి పానీయాలు ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి,  అలసట నుండి త్వరగా, శాశ్వత ఉపశమనాన్ని అందిస్తాయి. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. వర్షాకాలంలో  జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, వాతావరణంలోని తేమ కారణంగా శ్వాస సమస్యలు, జీర్ణసంబంధ సమస్యలు కూడా వస్తాయి.  గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీరు  కడుపు,  ప్రేగులలో  కదులుతున్నప్పుడు, శరీర వ్యర్థాలను చాలా సులువుగా  బయటకు పంపుతుంది. వేడి నీటిని తాగడం జీర్ణవ్యవస్థను సక్రియం చేయడంలో, జీవక్రియను మెరుగ్గా  ఉంచడంలో ఒక భాగం. అంతే కాదు   కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి, కడుపులో వికారం వంటి ఇతర సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటే వర్షాకాలంలో ఎదురయ్యే ప్లూ, జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.                                                         *నిశ్శబ్ద.

చపాతీలు ఇలా చేసుకుని తింటే పదింతలు పోషకాలు లభిస్తాయి..!

చపాతీలు చాలామందికి ఇష్టమైన ఆహారం. ఉదయం టిఫిన్ లోకి అయినా, మధ్యాహ్నం లంచ్ లోకి అయినా, రాత్రి డిన్నర్ లోకి అయినా సులువుగా ఇమిడిపోయే ఆహారం ఇది.  పైగా స్వచ్చమైన గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటే బోలెడంత ఆరోగ్యం కూడా.  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేసేవారు,  బరువు తగ్గాలని అనుకునేవారు, బరువు నియంత్రణలో ఉంచుకునేవారు చపాతీలు తీసుకుంటూ ఉంటారు. అయితే చపాతీలు తినడం వల్ల మాములు కంటే పదింతలు పోషకాలు లభించాలన్నా,  ఆరోగ్యానికి మేలు జరగాలన్నా ఈ కింది విధంగా చేసుకుని తినాలి. సాధారణంగా చపాతీలు చేయడానికి గోధుమ పిండిలో కాసింత ఉప్పు, నూనె వేసి నీటితో కలిపి పిండి సిద్దం చేసుకుంటారు. కానీ పోషకాలు  ఎక్కువ లభించాలన్నా, ఆరోగ్యానికి మరింత మేలు జరగాలన్నా చపాతీ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర పదార్థాలు మిక్స్ చేయాలి. మెంతి ఆకు లేదా మెంతి గింజల పొడి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.  కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గుండెకు మేలు చేస్తాయి.  మెంతి ఆకును లేదా మెంతి గింజల పొడిని గోధుమ పిండిలో వేసి కలిపి ఆ పిండితో చపాతీలు చేసుకుని తినాలి.  ఇది చాలా ఆరోగ్యం చేకూరుస్తుంది. మునగ ఆకులు కూడా మెంతి ఆకుల మాదిరిగానే ఉపయోగించవచ్చు.  ఒకవేళ తాజా ఆకులు లభ్యం కాకుంటే మునగ ఆకుల పొడిని కూడా గోధుమ పిండిలో కలిపి పిండి సిద్దం చేసుకోవచ్చు.  మునగ ఆకులు లేదా పొడి కలిపి చేసిన గోధుమ పిండి చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంచుతాయి.  అంతేకాదు బరువు తగ్గడంలోనూ, కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహాయపడతాయి. శరీరానికి ఆరోగ్యం చేకూర్చే గింజలలో అవిసె గింజలు ప్రధానమైనవి.  అవిసె గింజలను పొడిగా చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీ పిండి సిద్దం చేసుకోవాలి.  దీంతో చపాతీలు చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.  అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కంలగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.                                                     *రూపశ్రీ.

వర్షాకాలంలో కొబ్బరినీరు తాగవచ్చా? వైద్యులేం చెప్పారంటే..!

వేసవిలో  విపరీతమైన దాహం అనిపించినప్పుడు కొబ్బరి నీరు అమృతంలా అనిపిస్తుంది. కేవలం వేసవిలోనే కాదు.. కొబ్బరి నీరు ప్రతి సీజన్‌లో శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పుష్కలంగా పోషణను అందిస్తుంది.  శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా చర్మానికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో, వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే..  ఎండాకాలం అయినా,  చలికాలం,  వర్షాకాలం అయినా కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. ఇందులో ఉండే అనేక ఖనిజాలు,  విటమిన్లు  శరీరానికి మేలు చేస్తాయి. అందుకే కొబ్బరి నీళ్లను నిర్ణీత పరిమాణంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటు వర్షాకాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి.  కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. మరోవైపు కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి కడుపు నొప్పిని కలిగిస్తుంది.  ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి నీరు  సహాయం చేస్తుంది. అయితే  తాజా కొబ్బరి నీళ్లను మాత్రమే తాగాలని గుర్తుంచుకోవాలి. పాత లేదా నిల్వ చేసిన  కొబ్బరి నీరు  హాని చేస్తుంది.  వర్షాకాలంలో కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యం క్షీణించవచ్చు. వాస్తవానికి, కొబ్బరి నీటిలో చాలా సోడియం ఉంటుంది.   వర్షాకాలంలో సోడియం ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బరం,  రక్తపోటు వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల వర్షాకాలంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం  సురక్షితమే అయినా మితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, కొంతమందికి కొబ్బరి నీళ్లతో అలెర్జీ సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో దీన్ని తీసుకుంటే శరీరంలో వాపు, పిత్తం, దురద వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.                                         *రూపశ్రీ.  

వర్షాకాలంలో దగ్గు, జలుబును ఇలా తగ్గించేయచ్చు..!

వాతావరణం మారితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపడానికి ఎక్కువ సమయం పట్టదు.  వర్షాకాలం ప్రారంభమైన నేపధ్యంలో  దగ్గు,  జలుబు చాలా ఎక్కువగా  వస్తుంటాయి. ఈ సీజనల్ సమస్యలు సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇవి అంత సులువుగా తగ్గవు.  వీటిని తగ్గించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను ప్రయత్నించవచ్చు.  ఇవి చాలా వేగంగా దగ్గు, జలుబు నుండి రిలీఫ్ ఇస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. తేనె..   జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు  ఉదయం, సాయంత్రం తేనెను వెచ్చ చేసి తింటే సమస్య నుంచి బయటపడవచ్చు. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది జలుబు,  దగ్గుకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేనెను కొద్దిగా వేడి చేసి తీసుకోవాలి. అయితే  ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. వెల్లుల్లి.. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లిని పచ్చిగా లేదా తేలికగా కాల్చి తింటే  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది దగ్గు, జలుబు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. పసుపు.. పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.  సీజనల్ సమస్యల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు నీటిని తయారు చేసి త్రాగవచ్చు లేదా పసుపు టీ లేదా పసుపు పాలు తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. తులసి.. తులసి ఆకులను వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల దగ్గు,  జలుబు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి దగ్గును నివారించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఉప్పు నీరు.. ఉప్పు నీరు గొంతును శుభ్రపరచడంలో..   దగ్గు,  జలుబు నుండి ఉపశమనాన్ని అందించడంలో ప్రభావవంతంగా ఉంటాయి . ఉప్పునీరు గొంతులో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది.  ఈ నీటిని తాగాల్సిన అవసరం లేదు ఈ నీటితో పుక్కిలిస్తే సరిపోతుంది. ఉప్పు నీళ్లతో పుక్కిలిస్తే గొంతు క్లియర్ అవుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి ఆ నీటితో పుక్కిలించాలి.                                             *రూపశ్రీ.

మహిళల గుండెకు ముప్పు పొంచి ఉందా ?

పురుషుల కన్నా మహిళల్లో నే గుండెపోటు సమస్యతో మరనిస్తున్నారు .సహజంగా స్త్రీలకు ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద చూపరు. ఎచిన్న సమస్యకైన మళ్ళీ వస్తే చూద్ద్దాం అన్న ధోరణిలో ఉంటారు.అదే వారి పాలిట శాపం గా మారుతుంది ఒక కేసు విష యం లో రోగి పరిస్థితి చూసిన డాక్టర్ చాలా ఆగ్రహంగా మాట్లాడుతూ ఇన్ని రోజుల నుండి రాకుండా ఏమి చేసారు. ఇప్పుడు చూడండి 7౦% బ్లాక్స్ ఏర్పడ్డాయి.కోపంగా మందలించారు.చెమట పడుతుంటే వేడి ఎక్కువగా ఉంది కదా అని అనుకున్నా మెట్లు ఎక్కు తుంటే ఆయాసం వస్తుంటే పనెక్కువ అయ్యిందని అందుకే అలసట వచ్చిందని అనుకున్నా. గుండె నొప్పి నాకు ఎందుకు వస్తుంది? అని సరి పెట్టుకున్నా కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు. అని అన్నది ఆమె.కన్న బిడ్డకు చిన్న జలుబు చేసినా కంగారు పడిపోతారు.భర్తకు చిన్న జ్వరం వచ్చినా హడావిడి చేస్తారు. ఇంట్లో ఎవరికీ ఏం జరిగినా కంగారు పది పోయే డి ఆ ఇంటి మహాలక్ష్ములే. అదే మహిళలు తమ అనారోగ్య గురించి మాత్రం పట్టించుకోరు అందుకు చాలా సందర్భాలాలో జబ్బు బాగా ముదిరి పోయే దాకా చికిత్సకు వెళ్లరు. ఇక గుండె జబ్బు విషయానికి వస్తే అదేదో మగ వాళ్ళకు మాత్రమే వచ్చే జబ్బుగా అనుకుంటారు. గుండె జబ్బుకు స్త్రీలు, పురుషులు అన్న పక్ష పాతం ఉండదు. ఆ కులము ఈ కులము అన్న వివక్ష ఉండదు. ఈ మతము ఆమతము అన్న పక్ష పాత ధోరణి గుండెకు ఉండదు. ఎవరు అన్నారు గుండె జబ్బులు పురుషులకు మాత్రమే వచ్చే వని స్త్రీలకు భావోద్వేగాల ను భరించే శక్తి సహనం ఎక్కువే. ఓర్పు ఒర్చుకోవడం స్త్రీ ల ప్రవృత్తి. అందుకే ఆమె గుండె గట్టిది. అంటూ ఉంటారు. అందుకే మన వాళ్ళు ఆడవాళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవని ఉన్నా అతి తక్కువే అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం గా చెప్పవచ్చు. నిజానికి పురుదులతో పాటు సమానం గా మహిళలలో కూడా గుండె జబ్బుల అవకాశం  ఎక్కువే సాధారణంగా మహిళలలో క్యాన్సర్ బాధితులు అదీ రోమ్ముక్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ ,ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ల కన్నా గుందేజబ్బుల వల్ల మరణించిన వాళ్ళే ఎక్కువ అని ఒక అద్యయనం లోతేలింది. స్త్రీలను వేదించే సమస్యలలో క్యాన్సర్ కన్నా 6 వంతులు ఎక్కువ అవకాశం గుండె పోటు కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.ముఖ్యంగా స్త్రీలు ౩౦ సంవత్సరాలు దాటగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించి క్యాన్సర్ స్క్రీనింగ్ కు వెళుతూ ఉంటారు.అయితే పనిలో అనిగా గుండెకు సంబందించిన పరీక్షలు చేయించుకోడం లో మాత్రం ఎందుకో తాత్సారం చేస్తారు. తమ గుండె గట్టిదనే నమ్మకం తో ధీమా తో ఉంటారు.విద్యా వంతులైన మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ఉదాసీనంగా ఉండడం అంత క్షేమం కాదు. గుండె పోటు మహిళ్ళలో రావడానికి కారణాలు... గుండె పోటు అంటే అది మగవాళ్ళకు మాత్రమే వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని అంటున్నారు అపోలో ఆసుపత్రికి చెందినా  ప్రముఖ హృద్రోగ నిపుణులుడాక్టర్ ఎ  శ్రీనివాస్. ఇప్పటికే చాలా మందిలో అదే ఆపోహ కలిగి ఉండడం విచారకరం అనారు వైద్య నిపుణులు.చాతిలో నొప్పి అని అనిపించినా అది గ్యాస్ నొప్పో,మరేదైనా నొప్పి గా భావిస్తారు. తప్ప గుండె నొప్పిగా అనుమానించరు. ఆడవాళ్ళలో గుండేనొప్పి తక్కువ కాబట్టి నాకు గుండె జబ్బు రావడం ఏమిటి నాకు అస్సలు గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని విశ్వాశం తో ఉంటారు స్త్రీలు. స్త్రీలకూ గుండె జబ్బు ఉండనే విషయాన్ని గుర్తించడం లో మిస్ అవుతూ ఉంటారు .ముఖ్యంగా స్త్రీలు మెనోపాజ్ తరువాత మరణిస్తున్న మహిళల లో ప్రాధాన కారణం గుండె పోటే అయి ఉంటుంది.సాధారణంగా మెనోపాజ్ దశలో ఊపిరాడక పోవడం,బలహీనం గా ఉండడం, గుండె దడ నీరసం, లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్త్రీలలో గుండె సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని గుర్తించలేరు అని అంటారు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్.దాదాపు మెనోపాజ్ లో ఉండే సమస్యలే కదా అని అనుకుంటారు. అందుకే చాలా సందర్భాలలో  తమకు గుండె జబ్బు ఉందన్న విషయాన్ని గుర్తించలేక పోతారు.కొన్ని సార్లు స్త్రీలలో వచ్చే ఆయాసాన్ని ఆస్తమాగా పోప్రబడతారు. లేదా నీరసం గా ఉన్నాం కదా అందుకే ఆయాసం గా ఉందేమో అనుకుంటారు.చాలా సంఫర్భాలలో మహిళలు గుండె నొప్పిని గుర్తించక పోవడానికి ఇదే కారణం. అయితే గుండె నొప్పి లక్షణాలు కూడా మహిళ ల్లో వేరు వేరు గా ఉంటాయి అని శ్రీనివాస్ విశ్లేషించారు.సాధారణ గుండేనొప్పి లాగా నొప్పి పాకుతూ ఉంటుంది. సాంప్రదాయిక గుండె నొప్పి లక్షణాలు ఏవి ఉండక పోవచ్చు. ఆయాసం గా ఉండడం, చమట పట్టడం వంటి లక్షణాలు గుండె నొప్పి అన్న విషయాన్ని కలిగించవు. నీరసం,బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు అన్న అనుమానాన్ని కలిగించవు. నీరసం బలహీన పడి పోవడం కూడా గుండె జబ్బు లక్షనమం గానే బహిర్గతం అవుతాయి కాని అవి సాధారణ అనారోగ్యపు లక్షణాలుగా పర్గానించడం వల్ల ఒక్కోసారి గుండె జబ్బును కనిపెట్టడం మిస్ అవుతారు.ఇలాంటి సమయం లో చిన్న బ్లాక్ ఉన్నా అది హటాత్తుగా  విచ్చినం చెందవచ్చు. దాంతో అకస్మాతుగా గుండెపోటు వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఫలితం గా ప్రాణాల మీదకు వస్తుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలా అకాస్మాతుగా గుండె పోటుకు గురి అయ్యే అవకాశాలు ఉండవు. అందుకే మెనో పాజ్ దశలో లక్షణాల లో అశ్రద్ధ చేయవద్దని 4౦ ఏళ్ళు దాటినా గుండెకు సంబందించిన అన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయిన్చుకోవాలి.అవగాహన ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ కోసం పాప్స్మియర్ టెస్ట్ లు మమ్మో గ్రామ్ మామో గ్రఫీ, చేయించు కోవడం లేదు. చాలా మందికి మొదటి సారి గుండెపోటు రావడమే ప్రాణా పాయానికి  దారి తీస్తుంది.  పరీక్షల్లోనూ వేరుగా ఉంటాయి... సాధారణ లక్షనాలాతో గుండె జబ్బును కనిపెట్టడం కష్టం. కాబట్టి మహిళ ల్లో డయాగ్నిస్టిక్ పరీక్షలు కీలకం అవుతాయి. కొన్ని సార్లు ఈ పరీక్షలలో కూడా గుండె జబ్బు ఉన్నా లేనట్లుగా తేలే అవకాశాలు లేకపోలేదు. అందు వల్ల మహిళలు గుండెజబ్బు గుర్తించడం లో వైద్యుల నైపుణ్యం తో పాటు అన్ని రకాల పరీక్షలు ప్రాధాన పాత్ర వహిస్తాయని వాటి అన్నిటి సమీకృత ఫలితాలను బట్టే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.నిపుణులైన డాక్టర్లు మాత్రమే కేస్ హిస్టరీ ని బట్టి పరీక్షలు చేయిస్తారు. ఈ పరీక్షలలో ముఖ్యంగా ఇ సి జి ఎకో పరీక్షలు మార్పులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి .ఒక్కోసారి టి ఎం టి పరీక్ష కూడా తప్పుగా చూపించ వచ్చు. జబ్బు ఉన్న లేదని లేకున్నా ఉందని రావొచ్చు. కాబట్టి ఒకే పరీక్ష ఆధారం గా చెప్పలేము. ఈ పరీక్ష లన్నిటికీ బెరేజు వేసుకుని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.ఆంజియో గ్రామ్ లో కూడా మహిళల డి ప్రత్యేకతే. పురుషులకన్న మహిళల శరీర నిర్మాణం చిన్నదిగా ఉంటుంది. అదే విధంగా రక్త నాళాలు సైతం చిన్నవిగా ఉంటాయి. అన్జియో గ్రామ్ చేసేటపుడు ఉపయోగించే చేయి లేదా  కాలి రక్త నాళాలు కూడా చిన్నగా ఉంటుంది. కాబట్టి అన్జియో గ్రామ్ చాలా జాగ్రతగా చేయాలి. నైపుణ్యం లేకుండా అన్జియోగ్రామ్ చేస్తే సరైన ఫలితాలు రావు.మహిళ ల్లో గుండె రిస్క్ ఎక్కువ... కొలస్ట్రాల్ పేరుకుపోయి అదేరో స్క్లిరో సిస్ రావడం సర్వ సాధారణం కాని మహిళలలో రక్త నాళాలు స్పాసమ్ అంటారు రక్త నాళాలు పట్టేసినట్లు. అయిపోవడంవల్ల కుంచించుకు పోతాయి.తద్వారా రక్త ప్రసరణ కష్టం అవుతుంది. రక్త నాళాలు పెద్దవైతే జబ్బు మొదలై నప్పటికీ రక్తం ప్రసరించడానికి ఇంకా చోటు ఉంటుంది. కాబట్టి అడ్డంకి పెద్దది అయ్యే వరకూ జబ్బు ముదరదు. కాని రక్త నాళం చిన్నదిగా ఉండడం వల్ల చిన్న అడ్డకి ఏర్పడినా సమస్య ఎక్కువ అవుతుంది. అందు వల్ల ఒకే సైజు బ్లాక్ పురుషులలో అద్దంకి కాక పోయినా మహిళలలో మాత్రం పెద్ద సమాస్య అయి కూర్చుంటుంది. మహిళల లోనే రిస్క్ ఎక్కువ. పురుషుల కన్నా మహిళల్లో రక్త నాళాల పరిణామం చిన్నదిగా ఉండడం వల్ల చికిత్స విధానం లో కూడా వేరుగా ఉండడం వెర్రిలో రక్త నాళాలు మూసుకు పోయే అవకాశం చిన్న సైజు స్టెంట్ వాడాల్సి ఉంటుంది. పెద్ద రక్త నాళాలలో మళ్ళీ అడ్డంకులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది.చిన్న రక్త నాళాలు ఉన్నప్పుడు స్తేన్టింగ్ సరిగా చేయకుండా మళ్ళీ క్లోత్స్ రక్తం గడ్డ కట్టే అవకాశం లేదా అడ్డాకులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రక్త నళాలలో అడ్డంకులు ఏమేరకు ఉన్నాయో తెలుసుకోడానికి వాడే పరికరాలు కూడా మరింత ఆధునిక సంతరించుకుని అందుబాటులోకి వచ్చాయి ఇంట్రా వాస్క్యులార్ అల్ట్రా సౌండ్ ఆప్టికల్ కోహారెన్స్ టమో గ్రఫీ ద్వారా చికిత్సకు ముందు తరువాత అడ్డంకులు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తారు. అయితే ఆధునిక పరిజ్ఞానం తో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడం కూడా ప్రాధాన అంశం. గుండెపోటు వస్తే... మహిళల లో కూడా మరణాల రేటు ఎక్కువ మగ వాళ్ళ కన్నా మూడు వంతులు ఎక్కువ సాధారణ మొదటి సారి గుండెపోటు వచ్చిన తరువాత చికిత్సచికిత్స చేయించు కోకుంటే పురుషులలో 2౦% రిస్క్ ఉంటె మహిళ లలో 5౦% రిస్క్ ఉంటుంది. రక్త నాళాలు చిన్న సైజువి కాబట్టి బైపాస్ లో కూడా రిస్క్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి స్టెంట్ సరిగా పెట్టక పోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. సమర్దులైన నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోక పోతే పంపింగ్ సామర్ధ్యంభయపడాల్సిన అవసరం లేదు.జబ్బు ఉందన్న విషయాన్ని సకాలం లో గ్రహించకుండా తెలిసి నిర్లక్ష్యం చేసినా ఎటువంటి చేయించుకోక పోతే గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇటీవలే అందు బాటులోకి వచ్చిన బై వెంట్రీ క్యులర్ పెసింగ్ అన్న విధానం సత్ఫలితాలు ఇస్తుంది. గుండె పంపింగ్ సా మర్ధ్యం పెరగడం కోసం ఇక మరో దారి లేదనుకున్నప్పుడు దీనిని వాడతారు. నివారణా ఉపాయాలు... సమస్య ఉన్నప్పటికీ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ లో మందులు జాగ్రత్తగా వాడుకుంటే గుండె జబ్బును అదిగా మించ వచ్చు.అయితే నివారణ అన్నది అన్నిటికన్నా ఉత్తమం.గుండెను కాపాడు కోవాలంటే ప్రధానంగా జీవన శైలి లో మార్పులు చేసుకోవడం అవసరం.ఒత్తిడి తగ్గించుకునే ప్రయాత్నం చేయాలి దైనందిన వైవాహిక జీవితం లో సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్ చేసుకోవాలి.బిపి షుగర్ కొలస్ట్రాల్ రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒక వేళ ఈ సమస్యలు వచ్చినా అదుపులో ఉంచుకోడానికి డాక్టర్ సలహా మేరకు తప్పని సరిగా సలహా తీసుకోవాలి.సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.స్థూల కాయం మధుమేహం సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.                                                 

సంపూర్ణ పోషణ కావాలంటే ఈ మూడు రకాల సీడ్స్ తింటే చాలు..!

ఆహారపు అలవాట్లు మంచిగా ఉంటే శరీరానికి తీసుకునే ఆహారం  ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే మాంసకృత్తులు, విటమిన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్,  ఫైబర్ వంటి పోషకాలను తప్పనిసరిగా  ఆహారంలో చేర్చుకుంటారు. దీని కోసం ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు,  పాల ఉత్పత్తులు వినియోగిస్తారు. కానీ ఆహారంలో సీడ్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని విత్తనాలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి  ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  ముఖ్యంగా మూడు రకాల  విత్తనాలు ఆరోగ్యానికి ఒకటి కాకుండా అనేక పోషకాలను అందించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.   ఈ విత్తనాలలో మొక్కల ఆధారిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాల బయటి పొర నుండి లభించే ఫైబర్ జీర్ణం కావడం కష్టం. అందుకే ఈ విత్తనాలను తినడానికి ఉత్తమ మార్గం వాటిని పొడి రూపంలో తీసుకోవాలి లేదా వాటిని తాజాగా మెత్తగా,  సలాడ్ టాపింగ్స్‌గా తినాలి. ఈ విత్తనాలు శోథ నిరోధక,  ప్రేగు కదలికలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.  మలబద్ధకం లేదా అతిసారం,  ఏదైనా కడుపు సంబంధిత సమస్య ఉంటే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పిసిఒఎస్ సమస్య ఉన్నవారు కూడా అవిసె గింజలను తీసుకోవచ్చు. నువ్వులు.. ఒక గ్లాసు పాల కంటే కొన్ని నువ్వుల గింజల నుండి  కాల్షియం ఎక్కువ లభిస్తుంది. రుతుక్రమం ఆగిన స్త్రీలు మూడ్ స్వింగ్స్ లేదా హార్మోన్ల సమస్యలు వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు.  నువ్వులను 5 వారాల పాటు క్రమం తప్పకుండా  తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రొఫైల్ మెరుగుపడుతుంది. ఈ గింజలు యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు.. గుమ్మడి గింజలు  స్త్రీలకే కాదు పురుషులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో  మెగ్నీషియం,  ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటాయి.  ఈ రెండూ నిద్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మంచి మొత్తంలో ఫ్లేవనాయిడ్లు,  యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి ఎలాంటి సెల్యులార్ డ్యామేజ్‌ను అయినా  తొలగిస్తాయి.                                 *రూపశ్రీ. 

టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ఎన్ని లాబాలో!

ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద.  

ఆలివ్స్ ఎప్పుడైనా తిన్నారా? వీటిని తింటే కలిగే లాభాలు ఇవే..!

సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు  ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఆలివ్ అంత గొప్పదని అర్థం. కేవలం ఆలివ్ నూనె మాత్రమే కాదు.. ఆలివ్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్స్  ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయితే  ఆలివ్స్ తింటే కలిగే లాభాలేంటో ఒక్కసారి చూడాల్సిందే.. గుండె ఆరోగ్యం.. ఆలివ్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈ కారణంగా ఆలివ్ తీసుకుంటే గుండె  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఇవి మంచి కొవ్వులను పెంచడం ద్వారా చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ లో ఉండే ఫాలీఫెనాల్స్  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో  విటమిన్ ఇ, హైడ్రాక్సీటైరోసోల్,  ఒలీరోపిన్‌లతో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలోనూ, ప్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి. పేగు ఆరోగ్యం.. ఆలివ్ లో ఉండే పోషక విలువలు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆలివ్ లు ప్రోబయోటిక్ లను కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. చర్మానికి మంచిది.. ఆలివ్ లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీద దాడి చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను  ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. బరువు.. బరువు తగ్గడంలో ఆలివ్స్ సహాయపడతాయి. ఆలివ్ లలో ఉండే మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. అదే విధంగా ఆలివ్స్ లో ఉండే ఫైబర్ కూడా ఆకలిని నియంత్రిస్తుంది.  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఆలివ్స్ ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.                                      *నిశ్శబ్ద.

షుగర్ పేషంట్లు ఈ కూరగాలయను డైట్లో చేర్చుకోవాలి.!!

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి పెరగడానికి అతి పెద్ద కారణం తప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే, మీరు ఈ వ్యాధిని నివారించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచే అనేక ఆహారాలు ఉన్నాయి. డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కూరగాయల గురించి మనం తెలుసుకుందాం. కాకరకాయ: కాకరకాయ రుచి ఎంత చేదుగా ఉంటుందో మనందరికీ తెలుసు, కానీ ఈ కూరగాయ మధుమేహ రోగులకు వరం లాంటిది.  పాలీపెప్టైడ్-పి అనే సమ్మేళనం ఇందులో ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీ: మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవాలి. ఈ కూరగాయలలో విటమిన్ కె, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముల్లంగి: ముల్లంగి, పోషకాలు సమృద్ధిగా, మధుమేహ రోగులకు చాలా ప్రభావవంతంగా నిరూపించవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఈ రూట్ వెజిటబుల్ చాలా సహాయపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగపడుతుంది. ఆకుకూరలు: ఆకు కూరలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో బచ్చలికూర మధుమేహ రోగులకు ఉత్తమ ఎంపిక. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్, అనేక విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పొట్లకాయ: పొట్లకాయ ఆరోగ్యానికి నిధి. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో పొట్లకాయను ఖచ్చితంగా చేర్చుకోండి.    

బలహీనంగా .. నీరసంగా అనిపిస్తుందా? మీ సమస్య ఇదే కావచ్చు..

శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.