డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే ఎక్కువ

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు  ఆమోద ముద్ర వేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు, మేథావులు మహిళా రిజర్వేషన్   చట్టం అమలుకు, జనగణన, డీలిమిటేషన్ (అసెంబ్లీ,లోక్ సభ,నియోజక వర్గాల పునర్విభజన)తో  ముడిపెట్టి,  ఏకంగా ఐదేళ్ళు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే  ఆ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది పక్కన పెడితే, ఇప్పడు కొత్తగా డీలిమిటేషన్ పై  రాజకీయ వివాదం తెరపై కొస్తోంది. ముఖ్యంగా లోక్ సభ నియోజక వర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది.   మరీ ముఖ్యంగా, రాష్ట్ర విభజ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తక్షణమే నియోజక వర్గాల పునర్విభజన జరగాలని అప్పటి నుంచి కోరుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు జనభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే,ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరుగుతుందని విమర్శిస్తూ ఉమ్మడి పోటానికి పిలుపు నిస్తోంది.   ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు మరింతగా  నష్ట పోతాయని,  దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్టాల ప్రజలు దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ (రెండవ తరగతి పౌరులు) గా అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే  రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు.  కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్ సభలో  వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 44 లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య, 36 తగ్గుతుందని అంటే, తెలుగు రాష్ట్రాలు ఎనిమిది శానాలు కోల్పోతాయని, దీంతో పార్లమెంట్ లో తెలుగు గళం బలహీనపడుతుందనిఅంటున్నారు.  అలాగే, కేరళ,(8) తమిళనాడు,(8) కర్ణాటక (2) పశ్చిమ బెంగాల్ (4) ఇలా  దక్షిణాది రాష్ట్రాలలో నియోజక వర్గాల  సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మరో వంక ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిన కారణంగా చాలా వరకు రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.  ఒక్క  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతమున్న 80 నియోజక వర్గాల సంఖ్య 11 పెరిగి 91 చేరుకుంటుంది.  నిజానికి  డీలిమిటేషన్  తర్వాత నియోజక వర్గాల సంఖ్య అన్ని రాష్ట్రాలలో  పెరగాలి కానీ, డీలిమిటేషన్ కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వలన జనాభా నియత్రణ పాటించిన ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. జనాభా నియంత్రణ పాటించడంతో పాటుగా జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు   స్థూల జాతీయ ఉత్పత్తికి 35 శాతం నిధులు అందిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని అంటున్నారు.కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నదని నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఇసుమంతైనా స్టేక్ లేని దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం, అదే సమయంలో తమ బలం ఎక్కువగా ఉన్నచోట మరిన్ని సీట్లు పెంచి తద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అయితే, ఇంకా ఇప్పటి వరకు డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరగ  లేదు. అంతకు ముందు జరగ వలసిన జనగణన ఇంత వరకు మొదలు కాలేదు.. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకే .. మరో సంవత్సరకాలం  పడుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే, మరో మూడేళ్ళ తరవాత 2026- 27 నాటికి కానీ  ఈ ప్రక్రియ పూర్తి కాదు .. ఈ లోగా ఏమైనా  జరగ వచ్చును. అయితే కేంద్రం ప్రతిపాదించిన జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మాత్రం కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచి, వారి గళం లోక్ సభలో, రాజ్యసభలో వినపడకుండా చేయాలన్న దురుద్దేశంతో చేసిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వార్త విని గుండె ఆగి మరణించిన టీడీపీ కార్యకర్త

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు. అలాగే  తెలుగునా  తెలుగు దేశం పార్టీని ఇంటి పార్టీగా, చంద్రబాబును ఇంటి ఇలవేలుపుగా ఆరాధించే ప్రజలు, అభిమానులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్దమనే రీతిలో దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని పలువురు  ఆ బాధలో కన్ను ముస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇంతవరకు పదుల సంఖ్యలో   చంద్రబాబు అభిమానులు మనస్తాపంతో కన్ను మూశారు.  తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిందన్న వార్త వినగానే ఆయన మరి కొన్ని రోజులు జైలులోనే ఉండకతప్పదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల కిందట చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసినప్పటి నుంచి తీర్పు అనుకూలంగా ఉంటుందని, ఆయన బయటకు వస్తారని ఆశతో ఎదురు చూస్తూ అదే విషయాన్ని అడిగిన వారికీ అడగని వారికీ కూడా చెబుతూ వస్తున్న చిత్తూరు జిల్లా ఒంటిమిట్టకు చెందిన తెలుగుదేశం కార్యకర్త శ్రీనివాసులు నాయుడు తీవ్ర మనస్తాపానికి లోనై గుండెపోటుతో మరణించారు. శ్రీనివాసులు నాయుడు మృతదేహానికి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు. 

ఒక్క నాటికీ క్షమించరు.. ఒక్క శాతం దాట నీయరు!

బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా,  ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో, ఉభయ పార్టీల నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఆ సమయంలోనే,  వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో టీడీపీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రునిగా పేర్కొన్నారు. గౌరవించారు.  టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు.అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలూకూ  లబ్ధి చేకూరింది. రెండు పార్టీలూ ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలూ కలిసి పోటీ   చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలాలలో భాగస్వాములయ్యాయి.  అయితే  అదంతా చరిత్ర. ఒకప్పటి మాట. నిజానికి  ఒక్క తెలుగు దేశం పార్టీని, పార్టీ నాయకులను మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలను, మిత్ర పక్షాల నాయకులను కూడా వాజ్ పేయి, అద్వానీ నాయకత్వంలో  పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు. సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు. అందుకే  ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళ పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా  నడిపించారు. అంతవరకు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు  సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్ పేయి  వమ్ము చేశారు. సరే  ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిం నుకోండి అది వేరే విషయం.   అయితే  బీజేపీ ప్రస్తుత నాయకత్వం ,(మోడీ షా జోడీ) మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వక పోవడమే కాదు, అవకాశం చిక్కితే మిత్ర పక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది  లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న టీడీపీ సహా అనేక మిత్ర పక్షాలు బీజేపీకి దూరమ య్యాయి.ఇప్పుడుకేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వం. మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా స్థానం లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. వాస్తవానికి మోడీ కేబినెట్ లో   అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత, ప్రాముఖ్యతా లేదు.    ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే  రాష్ట్రంలో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది. బీజేపీకి నిండా ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాజీ మిత్ర పక్షం తెలుగుదేశం అడ్డు తొలిగించి ఆ తర్వాత వైసీపీనీ టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహంలో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టు పెట్టే కుట్రలు పన్నుతున్నది. అందులో భాగంగానే  చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెర వెనక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమల దళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందనే నిన్నటి అనుమానాలు, ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పడు  వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇంతవరకూ జనసేనతో కలిసి  తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని  వైసేపీని గద్దె దించడంలో బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న, ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజీపే అసలు రంగు బయట పడిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వామ్మో  బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అని విస్తుపోతున్నారు. అంత క్రిమినెల్ బ్రెయిన్ ఉంది కనుకనే జగన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు , కుతంత్రాలకు పాల్పడినా, ప్రత్యేక హోదా సహా, ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చక పోగా, వైసీపీ అరాచక,అవినీతి ప్రభుత్వానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్క నాటికీ క్షమించరనీ,  ఒక్క  శాతం ఓటుకు మించి రానీయరనీ అంటున్నారు.  

రాజమహేంద్రవరం జైలులోనే విచారణ.. ఏసీబీ కోర్టు విస్పష్ట ఆదేశం

ఏసీబీ కోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిల్ స్కామ్ కేసులో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం (అక్టోబర్22)న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. చంద్రబాబునాయుడిని రాజమహేంద్రవరం జైలులోనే విచారించాలనీ, ఆయనను మరో చోటుకు తరలించడానికి వీల్లేదని షరతు విధించింది. కాగా సీఐడీ చంద్రబాబును ఐదురోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోరినప్పటికీ  ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజులకు మాత్రమే అనుమతించింది. అలాగే చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులు కూడా విచారణ సమయంలో ఉండేందుకు అనుమతించింది. అదే విధంగా  ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు వరకూ మాత్రమే విచారించాలని ఆదేశించింది. ఇక విచారణను వీడియోరికార్డింగ్ చేయాలని ఆదేశిస్తూనే..  సంబంధించి ఫొటోలు, వీడియోలూ లీకు కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.  విచారణకు సంబధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఏసీబీ కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. 

సీఐడీ కస్టడీకి చంద్రబాబు

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. సీఐడీ ఐదురోజుల కస్టడీ కోరగా సీబీఐ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు.  చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించగా,  సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అంతకు ముందు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టులో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వుల అనంతరమే సీబీఐ కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పిన సంగతి విదితమే. ఇందు కోసం విచారణ పూర్తై గురువారం ఉదయం (సెప్టెంబర్ 21)కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువడాల్సి ఉండగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును నేటి ఉదయానికి, ఆ తరువాత మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేశారు. కాగా శుక్రవారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబును సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబుకు హైకోర్టులో  ఊరట లభించిలేదు. స్కిల్ కేసులో తన ప్రమేయం లేదనీ, తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరి కొద్ది  సేపటిలో ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీ పిటిషన్ పై వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ ను రెండు రోజులు పొడిగించిన నేపథ్యంలో ఆయనను సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్పారు.  

130, 90, 30, 15.. ఇవి ర్యాంకులు కావు.. పడిపోతున్న వైసీపీ సీట్లు!

వైనాట్ 175 ఇదీ కొద్ది కాలం కిందటి  వరకూ ఏపీలో అధికార వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు.  స్వయంగా సీఎం జగన్ రెడ్డి ప్రదర్శించిన ధీమా.  ఔను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ అంతా వైనాట్ 175 అంటూ  తమ భుజాలు తామే చరుచుకునే వారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని కూడా చూశారు.  కానీ    వైసీపీ  చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలలో సౌండ్ తగ్గిపోయింది. వైనాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టిన వైసీపీ నేతలు కాస్త సీట్లు తగ్గినా  మాదే అధికారం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతకు ముందు వైనాట్ 175 అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ అదే నోటితో  ‘సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం' అని వ్యాఖ్యానించారు.  గత ఎన్నికలలో వైసీపీ 151 స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.  ముందుగా వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు ఆ తర్వాత ఈసారి 130కి పైగా స్థానాలతో మాదే విజయం అంటూ ప్రకటించారు. సాక్షాత్తు జగనే సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం అంటూ వ్యాఖ్యానించగా.. 120 స్థానాల‌లో త‌మ పార్టీ గెలుస్తుంద‌ని.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు.  వైసీపీ చేయించుకున్న కొన్ని సర్వే సంస్థలు ఆ మధ్య వైసీపీ 90 స్థానాలకే పరిమితం అవుతుందని నివేదికలు ఇచ్చాయి ఇచ్చాయి. అయితే గత మూడు నెలల కాలంలో  అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు ప్రభుత్వం నిలకడ లేని నిర్ణయాలు..  కక్షపూరిత రాజకీయాలు ప్రజలలో విసుగుపుట్టిస్తున్నాయి.  ఫలితంగా వైసీపీకి ఈసారి 30 స్థానాలు రావడమే గగనమని ఆఫ్ ది రికార్డ్ గావైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వైనాట్ 175తో మొదలైన వైసీపీ ప్రకటనల ప్రస్థానం ఇప్పుడు చివరికి 15 స్థానాల స్థాయికి దిగజారింది. నెల్లూరు జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్యనే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ, జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని,  వైసీపీకి ఈసారి 15 సీట్లు దక్కడమే మహా భాగ్యం అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 57 శాతం ఓట్లు తెచ్చుకుటుందని చెప్పిన కోటం రెడ్డి.. గతంలో తాను చెప్పినవన్నీ జరిగాయని.. ఇప్పుడు కూడా జరగబోయేది ఇదేనని బల్లగుద్ది చెప్పారు.  దీంతో కోటం రెడ్డి వ్యాఖ్యలపై చర్చలు జరుగుతున్నాయి. వైసీపీకి  ఘోర పరాజయం తప్పదన్న కోటం రెడ్డి జోస్యం వెనక ఉన్న బలమైన కారణాలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో  వైసీపీ గ్రాఫ్ దాదాపు పాతాళానికి పడిపోయిందన్నది  విశ్లేషకుల మాట. యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ లో వైసీపీ ప్రభుత్వానికి స్కాం కనిపించడం, రిటైర్డ్ అధికారుల నుండి.. మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును తప్పుబట్టడం, ఏపీ నుండి అమెరికా వరకూ నిరసనలు, జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు.. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరికొన్ని   కేసులు కూడా బనాయించడం, పీటీ వారెంట్లు, చంద్రబాబును జైలుకే పరిమితం చేస్తామన్న వైసీపీ నేతలు ప్రకటనలు,  లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామన్న బెదిరింపులు ఇలా ఎన్నో అంశాలపై ప్రజలలో చర్చ జరుగుతుంది. జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలూ, టీడీపీ,జనసేన పొత్తుతో మారిన సమీకరణాలు.. ఇలా అన్నీ కలిసి ఈసారి టీడీపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టడం ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   మొత్తం మీద తమ గ్రాఫ్ వేగంగా పతనమౌతోందని స్వయంగా వైసీపీ నేతలే ఓపెన్ గా ప్రకటించడం కొసమెరుపు. 

ఇంకా ఎన్ని రోజులు?

కారణాలేమైతేనేం కోర్టుల్లో వ్యాజ్యాలు తేలడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అరెస్టులు, కేసుల నమోదు నిబంధనలను, పద్ధతులు పాటించకుండా అడ్డగోలుగా జరిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అక్రమంగా అరెస్టయిన వారి పరిస్థితి ఏమిటి? కోర్టుల నిర్ణయం వెలువడే వరకూ కారాగారంలో ఎదురు చూడాల్సిందేనా? రిమాండ్ లో.. అది శిక్ష కాకపోయినా ఎంతకాలమైనా వేచి చూడాల్సిందేనా? చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ అందరిలోనూ వ్యక్తమౌతున్న అనుమానాలూ సందేహాలూ ఇవే. ఎందుకంటే చంద్రబాబును స్కిల్ కేసులో కనీసం ఆయన పేరు కూడా ఎఫ్ ఐఆర్ లో లేకపోయినా అర్థరాత్రి అరెస్టు చేశారు. న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు వెలువడడం లేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల గతేమిటన్న భయం జనబాహుల్యంలో వ్యక్తం అవుతోంది. గత నాలుగున్నరేళ్లకు పైగా జైలులో మగ్గుతున్న కోడికత్తి నిందితుడి శ్రీను పరిస్థితిని ఉదహరిస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్.. అందుకు సిద్ధంగా లేరు. కేసును మరింత లోతుగా విచారించాలంటూ పిటిషన్లు వేస్తూ.. కోర్టుకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిలుపై ఉన్నారు. ముఖ్యమంత్రిని కనుక విచారణకు హాజరు కాకుండా మినహాయింపు పొందారు. ఆయన ఆ కేసులో బెయిలు పొంది దశాబ్దకాలం గడిచిపోయింది. ఆ కేసుల విచారణ ఏ స్థాయిలో ఉందో.. ఎప్పుడు విచారణ జరుగుతోందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.  జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ, సీబీఐల దర్యాప్తులో పలు ఆధారాలు స్పష్టంగా లభించాయి. ఆ కేసుకు సంబంధించి ఆస్తుల జప్తు కూడా జరిగింది. కానీ చంద్రబాబుపై కేసు విషయంలో సీఐడీ ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. ఆయన పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సాక్ష్యాలను కూడా చూపలేదు.  కనీసం అరెస్టు చేసే నాటికి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేదు. అయినా రాత్రికి రాత్రి అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కోరింది. ఇప్పుడు స్కిల్ కేసులో  చంద్రబాబు పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కస్టడీ కోరుతోంది. కస్టడీలోకి తీసుకుని విచారించి ఆధారాలను సేకరిస్తామని సీఐడీ చెబుతోంది. చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తయిపోయింది. దీంతో కోర్టు ఆయన రిమాండ్ ను రెండు రోజులు పొడిగించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయ్యింది. తీర్పు రిజర్వ్  అయ్యింది. నేడు, రేపు అంటూ ఆ తీర్పు కోసం ఎదురు చూపుల పర్వం కొనసాగుతోంది.  చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగురాష్ట్రాలలోనే కాదు.. జాతీయ స్థాయి సహా ప్రపంచ దేశాలలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రాకముందే ఏపీ మంత్రులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రకటనలు చేసేస్తున్నారు. కోర్టులో ఉన్న అంశాలపై సభ వేదికగా ప్రసంగాలు దంచేస్తున్నారు.  జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటారు.. మరి స్కిల్ స్కాం అంటూ చంద్రబాబును అరెస్టు చేసి రెండు వారాలు పూర్తయినా ఇంకా ఆయన పిటిషన్లపై తీర్పులు వెలువడేందుకు ఎదురు చూసే పరిస్థితి రావడాన్ని ఏమంటారు?

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మరి కొద్ది సేపటిలో తీర్పు

స్కిల్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తయినా రెండు రోజులుగా తీర్పు వాయిదా పడుతూవస్తున్నది. ఇందుకు కారణం ఏపీ హైకోర్టులో చంద్రబాబు స్వాష్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండడమే. ఆ తీర్పును బట్టే ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం (సెప్టెంబర్ 21) ఉదయం కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామన్న ఏపీసీ కోర్టు న్యాయమూర్తి తొలుత మధ్యాహ్నానికి, ాతరువాత సాయంత్రానికి చివరికి  శుక్రవారం (సెప్టెంబర్ 22)కి వాయిదా వేసింది. మళ్లీ శుక్రవారం (సెప్టెంబర్ 22) ఉదయం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఒక వైపు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఏ విధంగా ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతుంటే.. అంత కంటే ఎక్కువగా బాబు స్క్వాష్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడు వెలువడుతుంది? ఆ తీర్పు ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు తీర్పు వెలువడనుంది. అయితే అంతకు ముందు చంద్రబాబు రిమాండ్ గడువు పూర్తి కావడంతో  శుక్రవారం ఉదయం (సెప్టెంబర్ 18) న వర్చువల్ గా చంద్రబాబును కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో చంద్రబాబు రిమాండ్ ను కోర్టు రెండు రోజులు పొడిగించింది.   ఈ సందర్భంగా చంద్రబాబు న్యాయమూర్తికి తన వాదన వినిపించారు. అక్రమ కేసులో  అన్యాయంగా తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు.  నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తనను స్కిల్ కేసులో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిందని పేర్కొన్నారు.  ఈ కేసులో తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సి ఉందని, ఏపీ సీఐడీ అలా చేయలేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన అరెస్టు జరిగిందని చెప్పారు.  తనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. నిర్ధారణ కాని ఆరోపణలతో అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.  చట్టాన్ని తాను గౌరవిస్తానన్నారు.  కాగా జైలులో సౌకర్యాలపై  జడ్జి  చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.   జైల్లో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారుఅంతే కాకుండా న్యాయమూర్తి చంద్రబాబుతో మీ మీద వచ్చినవి ఆరోపణలు మాత్రమేనన్నారు. దీన్ని మరోలా అర్ధం చేసుకోవద్దని అన్నారు. 

హస్తినకు ఏపీ సీఐడీ అధికారులు.. నారా లోకేష్ అరెస్టు కోసమేనా?

స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ ఇప్పుడు నారా లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిందా? హస్తిన పర్యటనలో ఉన్న ఆయనను అక్కడే అరెస్టు చేసి ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే  సమాధానం చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే ఏపీ సీఐడీ  చీఫ్ సంజయ్, ఎస్పీ సరిత, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుళ్లు హస్తిన బయలుదేరనున్నారు. వారి హస్తిన యానం లక్ష్యం నారా లోకేష్ అరెస్టేనని పరిశీలకలు సైతం విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత వరుసగా సీఐడీ చీఫ్ సంజయ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తామని బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవలి కాలంలో అంటే చంద్రబాబు అరెస్టు తరువాత పలువురు మంత్రులు, వైసీపీ నేతలూ కూడా తరువాతి అరెస్టు లోకేషే అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతీ విదితమే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ బృందం హస్తినకు బయలుదేరడంతో లోకేష్ అరెస్టు అవుతారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ కేసులో మరిన్ని అరెస్టులు జరగనున్నాయని ఏపీ సీఐడీ సంజయ్ వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఐడీ బృందం హస్తిన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  సీఐడీ బృందం హస్తిన యానం లక్ష్యం నారా లోకేష్ అరెస్టేనని తెలుగుదేశం నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనలో వారు సుప్రీం కోర్టు న్యాయవాదులతో భేటీ అవుతారని కూడా సమాచారం.  అంతే కాకుండా హస్తినలో లోకేష్ కదలికలు, ఎవరెవరికి కలుస్తున్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాలపై కూడా ఏపీ సీఐడీ ఆరాతీస్తోందని అంటున్నారు. అలాగే హస్తిన కేంద్రంగా స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ లోకేష్ జాతీయ స్థాయిలో అందరి మద్దతు, సంఘీభావం కూడగడుతున్న నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఐడీ కూడా తన వాదన మీడియా వేదికలపై చెప్పేందుకు కూడా సమాయత్తమౌతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే  ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చంద్రబాబు అరెస్టుపై, తమ దర్యాప్తులో తేలిన అంశాలపై నిబంధనలను కూడా పక్కన పెట్టి మీడియా ఎదుట మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ బృందం శుక్రవారం ( అక్టోబర్ 22) హస్తినకు బయలుదేరనుండటం సర్వత్రా ఆసక్తినీ, ఉత్కంఠనూ రేకెత్తిస్తోంది.  

ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ సస్పెన్షన్ల పర్వం

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ తీవ్ర గందరగోళం మధ్యే ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకుపోయి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు యధాప్రకారం తెలుగుదేశం సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ ప్లకార్డులను కోర్టుల వద్ద ప్రదర్శించాలన్నారు. అసెంబ్లీ ఏమీ తెలుగుదేశం కార్యాలయం కాదనీ ఇష్టారీతిగా వ్యవహరిస్తే సహించేది లేదనీ హెచ్చరించారు. సభలో అన్ని విషయాలూ చర్చిస్తామని చెబుతున్నా తెలుగుదేశం రచ్చ చేస్తున్నదని విమర్శించారు. సీఎంను ఉద్దేశించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమనీ, నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యులు కూడా అంబటికి దీటుగా సమాధానం ఇచ్చారు. సభలో పరిస్థితి గందరగోళంగా మారడంతో ప్రభుత్వ విఫ్ ప్రసాదరాజు.. జోక్యం చేసుకుని సభలో సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తున్న తెలుగుదేశం సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.  కాగా అందుకు తెలుగుదేశం సభ్యులు సైకో పాలన పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే స్పీకర్ తెలుగుదేశం సభ్యులు అచ్చెన్నాయుడు, అశోక్ లను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకూ సస్పెండ్ చేశారు. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు.  

తమ్మినేనీ.. స్పీకరేనా మీరు?

 స్పీకర్ స్థానంలో  కూర్చున్నది ఎవరైనా, ఆ స్థానానికి ఒక విలువ ఉంది. అందుకే, చట్ట సభల్లో స్పీకర్ స్థానాన్ని, గౌరవంగా సంబోధించాలి, సంబోధిస్తారు. అలాగే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి  తాను స్వతహాగా,ఎలాంటి వారైనా, ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినా తాను కూర్చున్న  స్థానం గౌరవాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. అదే స్పీకర్ ప్రథమ కర్తవ్యం. స్పీకర్ రాజకీయ పదివి కాదు, రాజ్యాంగ పదవి, అందుకే, స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి  ప్రమాణ స్వీకారానికి ముందే, రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసి, బాధ్యతలు స్వీకరించడం ఒకప్పుడు ఆనవాయితీగా ఉండేది.. స్వతంత్ర భారత లోకసభ మొదటి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలాంకర్  ఆ ఒరవడికి శ్రీకారం చుట్టారు. అయితే అనంతర కాలంలో  వచ్చిన స్పీకర్లు చాలా వరకు  రాజకీయ సభ్యత్వానికి రాజీనామా చేసినా చేయక పోయినా, ‘చైర్’ గా సంభోదించే స్పీకర్ స్థానం గౌరవాన్ని దిగజార్చే స్థాయికి దిగజారలేదు.  అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు రాజ్యంగ వ్యవస్థలు రాజకీయం రంగు పులుముకున్నాయి. స్పీకర్ వ్యవస్థ అందుకు మినహాయింపు కాదని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం పదే పదే రుజువు చేస్తున్నారు. తాజాగా గురువారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీలో తన తీరుతో మరోమారు ఆ విషయాన్ని తమ్మినేని సందేహాలకు అతీతంగా రుజువు చేశారు. స్పీకర్ స్థానలో ఉన్న వ్యక్తిని రాజకీయ పదవుల ఆకాంక్షలు, రాజకీయ వాసనలు వదలకపోతే ఆ  స్థానం విలువ దిగజారుతుంది.  గురువారం(సెప్టెంబర్ 21) ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీలో అదే జరిగింది. అవును. ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుని ఉద్దేశించి, ‘వాట్ ఈజ్ దిస్... యూజ్‌లెస్ ఫెలో.. ఎవడ్రా చెప్పాడు నీకు’అంటూ చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయి. నిజానికి సభ్యులు అదుపు తప్పి  నోరు జారితే మందలించో మరో మార్గంలోనూ సభ్యులను దారికి తెచ్చి,సభను సజావుగా నడిపించాల్సిన పవిత్ర బాధ్యతలో ఉన్న స్పీకరే, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే..? స్పీకర్ గౌరవమే కాదు. సభ గౌరవం కూడా పలచనవుతుంది. ఇప్పటికే దిగజారిన చట్ట సభల ప్రతిష్ట మరింత దిగజారి, పరిహాసం పాలవుతుంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో జరిగింది సరిగ్గా అదే.    అందుకే తెలుగు దేశం  అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ గురించి సభలో ఎక్కడా వినిపించకూడదని వైసీపీ తీసుకున్న రాజాకీయ నిర్ణయాన్నే, స్పీకర్  ఫాలో అయ్యారా  అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ స్థానాన్ని గౌరవించలేదనే కారణాన్ని చూపుతూ మొదటి రోజు సమావేశాల నుంచి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపైనైతే ఏకంగా ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకూ సస్పెన్షన్ వేటు వేశారు.   ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఒక ఎత్తైతే.. అంతకుమించి స్పీకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు చెపుతున్న వ్యాఖ్యలు, స్పీకర్ స్థానం విలువలను పలుచన  చేశాయన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలి రోజే స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు పూనుకున్నారు. నిజమే తమ నాయకుడి అక్రమ అరెస్ట్ ను జీర్ణించుకోలేని టీడీపీ సభ్యులు ఆవేదనలో ఆగ్రహాన్ని ప్రదర్శించి ఉంటే ఉండవచ్చును. కానీ అలాంటి సమయంలోనే కదా స్పీకర్ విజ్ఞత, వివేచనతో వ్యవహరించ వలసినది. కానీ, స్పీకర్ తమ్మినేసి ఆవేదనతో  ఆగ్రహించిన  సభ్యులను సమాధాన పరిచే ప్రయత్నం   చేయకుండానే  వారిపై  సస్పెన్షన్ వేటు వేశారు.  స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించివేశారని, మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని కారణాలుగా చెప్పారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి ‘యూజ్‌లెస్ ఫెలోస్’, ‘ఎవడ్రా చెప్పాడు నీకు’ వంటి భాషను వాడడంతో  వేళ్లన్ని ఆయనవైపే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? స్పీకర్ స్థాయి వ్యక్తికి ఇది తగునా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అనుచితంగా వ్యవహరించిన స్పీకర్‌పై ప్రతిపక్ష తెలుగుదేశం మండిపడింది. ఆయన తీరును ఎక్స్‌ (గతంలో ట్విటర్) వేదికగా ఖండించింది. ఈయన అసలు స్పీకర్ పదవికి అర్హుడేనా? అని నిలదీసింది.  టీడీపీ వాళ్ళని యూజ్ లెస్ ఫెలో అంటారు.. వైసీపీ వాళ్ళని ‘మన వాళ్ళు’ అంటారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను కూడా టీడీపీ షేర్ చేసింది. దీంతో స్పీకర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఈ విధంగా వ్యవహరించడం కొత్తేమీ కాదని, తన తీరులో మార్పురాదని మరోసారి ఆయనే స్వయంగా చాటి చెప్పారని.. అసెంబ్లీలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అనుచితంగా ప్రవర్తించారని ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్ ఇలా మాట్లాడొచ్చా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. వీటిపై స్పీకర్ స్పందిస్తారో లేదో వేచిచూడాలి మరి.

బాబు అరెస్టు ఎఫెక్ట్.. జగన్ కు మోడీ, షా నో అప్పాయింట్ మెంట్

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సీరియస్ అయ్యారా? ఆ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌కి మోడీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? అంటే అవుననే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రం  పెద్దలు ఇప్పటి వరకు స్పందించకున్నా.. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు మాత్రం  చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. జగన్ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.   మరోవైపు సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేశారు.   సీఎం జగన్... తన విదేశీ పర్యటన పూర్తి చేసుకొని.. స్వదేశానికి వచ్చిన వెంటనే.. అంటే ఆ మరునాడే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో, హోం మంత్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారని.. ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది... దాని వెనుక ఉన్న కారణాలు.. ఢిల్లీ పెద్దలకు ఆయన వివరించనున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.    కానీ జగన్ లండన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకొని దగ్గరదగ్గర పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది   లేదు. ఎందుకు వెళ్లలేదంటే.. సీఎం జగన్‌కు మోడీ, అమిత్ షా ద్వయం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. మరో వైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనాయి.  అలాంటి వేళ.. ప్రదాని, హోం   మంత్రి క్షణం తీరిక లేకుండా ఉన్నారని.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లలేదనీ వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి.  మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రంలోని పెద్దలకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని.. దీంతో వారు సైలెంట్ అయి.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీ పెద్దలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని.. దాంతో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారనే చర్చ సైతం కొనసాగుతోంది.  అదీకాక.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. సీఎం   జగన్‌కు కేంద్రంలోని పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తే.. అందుకు సంబంధించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. సైలెంట్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆచి తూచి స్పందించాలని లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉందన్న భావనలో   బీజేపీ అధినాయకత్వం ఉందని అంటున్నారు.   ఇక ఇప్పటికే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి వెళ్తామంటూ ఏపీ బీజేపీ పెద్దలు క్లియర్ కట్‌గా ప్రకటించారు. కానీ చంద్రబాబు అరెస్ట్‌ కావడం.. ఆయనను రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం... ఆ క్రమంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్‌.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందంటూ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. బీజేపీ పరిస్థితి డోలాయామానంలో పడినట్లు అయిందని.. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహాం ఎలా ఉండబోతుందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

యూటీగా హైదరాబాద్.. బీజేపీ త్రి బర్డ్స్ ఎట్ వన్ షాట్ వ్యూహం!

కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించడం ఖాయమైపోయింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలోనే ఈ ప్రకటన ఉంటుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్డ్ నెస్ కోసం కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. కంటోన్మెంట్ అధికారులతో చర్చలు జరిపారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే విధంగా వారిని సమాయత్తం చేస్తున్నారు. 2024లో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుగువన్ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు అదే నిజం కాబోతున్నది.  వాస్తవానికి  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన  తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా అంగీకారం తెలిపారు.  అయితే తరువాత ఈ ప్రతిపాదన మరుగున పడింది. హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్ తో ముగుస్తుంది.  రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  కొనసాగాయి. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై విభజిత ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరింది. దీంతో అమరావతి రాజధాని కాదు, ఏపీకి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతే తప్ప ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కనుక అక్కడ నుంచి పాలన సాగిస్తూ.. మూడు రాజధానులను నిర్మిస్తామని చెప్పలేదు. దీంతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విభజిత ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేశారే తప్ప విభజన చట్టంలో ఉన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కనుక అక్కడ నుంచి పాలన సాగిస్తామంటూ క్లెయిమ్ చేయలేదు. దీంతో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే కొనసాగుతూ వచ్చింది.  మధ్యలో అడపాతడపా ఉమ్మడి రాజధాని అంశాన్ని ఏపీ మంత్రులు తెరపైకి తీసుకువచ్చినా వారి మాటలలో కానీ, చేతలలో కానీ ఎన్నడూ సీరియస్ నెస్ కనిపించలేదు. ఏదో  రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చేసిన ప్రకటనల్లాగే మిగిలిపోయాయి.  వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఆ రాష్ట్రం హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే.  సరిగ్గా ఈ తరుణంలో కేంద్రం కొత్తగా యూనియన్ టెరిటరీగా హైదరాబాద్ అంటూ పాత ప్రతిపాదననే తెరపైకి తీసుకువచ్చింది. ఇది రాజకీయంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు సానుకూలం అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతగా ప్రయత్నించినా కనీస మాత్రమైన రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో విఫలమైన బీజేపీ.. యూనియన్ టెరిటరీ పేరుతో కనీసం హైదరాబాద్ పై పెత్తనం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో  ఆ దిశగా సీరియస్ గా దృష్టిపెట్టిందన్నది పరిశీలకుల విశ్లేషణ. హస్తిన తరహా అభివృద్ధి ఉంటుందన్న భావనలో హైదరాబాదీయులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటెసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా ఒకే సారి ఇటు బీఆర్ఎస్ సర్కార్ ను, అటు ఏపీ సర్కార్ నూ ఇరుకున పెట్టడమే కాకుండా.. ఎంఐఎం కు హైదరాబాద్ నగరంలో ఉన్న పట్టు కూడా కోల్పోయేలా చేయవచ్చన్నది బీజేపీ వ్యూహంగా  చెబుతున్నారు. అంటే త్రిబర్డ్స్ ఎట్ వన్ షాట్ ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.   హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్  అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవన్నది కూడా పరిశీలకులు చెబుతున్న మాట. వస్తే గిస్తే తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురు కావచ్చుననీ, దానిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదనీ బీజేపీ భావిస్తోందంటున్నారు.  ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు గతంలో కేసీఆర్ అంగీకారం తెలిపారనీ, అప్పుడు ఔనని ఇప్పుడు కాదనడం ఏమిటన్న వాదనతో తెలంగాణ అభ్యంతరాలకు కొట్టి పారేయొచ్చున్నది బీజేపీ పెద్దల భావనగా చెబుతున్నారు.  మొత్తం మీద ఇప్పటి వరకూ అడపాదడపా మాత్రమే వినిపించిన యూనియన్ టెరిటరీ హైదరాబాద్ అన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయనడానికి తార్కానంగా కిషన్ రెడ్డి కంటోన్మెంట్ అధికారులను ఎటువంటి పరిస్థితి ఎదురైనా సంసిద్ధంగా ఉండేలా సమాయత్తం చేయడాన్ని పరిశీలకులు చూపుతున్నారు. 

వారం రోజులుగా హస్తినలోనే లోకేష్.. వ్యూహం ఏమిటి?

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వారం రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై  జాతీయ మీడియాజాతీయ దృష్టి కేంద్రీకరించేలా చేశారు.  జాతీయ మీడియా ప్రశ్నలకు సమర్ధంగా బదులిచ్చి జాతీయ స్థాయిలో సమర్థ నేతగా నిరూపించుకున్నారు. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ జగన్ తో బహిరంగ చర్చకు సై అంటూ సవాల్ విసిరి సంచలనం సృష్టించారు. అలాగే జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలతో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా అందరి మద్దతూ పొందగలిగారు. అయితే ఇక్కడ ఏపీలో ఆయన లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్టుకు ఖండిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తెలుగుదేశం శ్రేణులు దీక్షలతో, ర్యాలీలతో చంద్రబాబు అరెస్టునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అయినా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యత, పాపులారిటీ ఉన్న నారా లోకేష్ ఈ సమయంలో రాష్ట్రం బయట ఉండటం ఒకింత లోటుగానే కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ.  మరి లోకేష్ ఢిల్లీలోనే వారం రోజులుగా ఎందుకు మకాం వేశారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం ఒక్క సారిగా నిస్తేజంగా మారిపోయిందా? ఈ పరిస్థితిని అధిగమించడానికి న్యాయపోరాటం, ప్రజా పోరాటాలు కాకుండా మరో మార్గం ఏమైనా ఉందా? గతంలో  1984 లో అప్పటి ఎన్టీఆర్ సర్కార్ ను అప్పుడు కేంద్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామ్య విరుద్ధంగా అప్పటి ఏపీ గవర్నర్ రామ్ లాల్ సహకారంతో గద్దె దింపినప్పుడు.. ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహాన్ని ఒక పద్ధతిలో సమన్వయ పరిచి గొప్ప రాజకీయ ఉద్యమంగా మలచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సమయంలో ప్రజాగ్రహాన్ని ప్రజాందోళనగా, రాజకీయ ఉద్యమంగా  మలచే విషయంలో ఎందుకు వెనకబడుతోంది?   అప్పట్లో ప్రజాందోళనలు కేంద్రం మెడలు వంచేలా పకడ్బందీగా సాగడం వెనుక చంద్రబాబు చాణక్యం ఉంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహాన్ని రాజకీయ ఉద్యమంగా మలచాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది.  హస్తినలో  లోకేష్ అదే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  లోకేష్ ఢిల్లీలో పార్టీ అంతర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ మీడియా ద్వారా జగన్ సర్కార్ అరాచక విధానాలను, ప్రజావ్యతిరేక విధానాలను దేశం కళ్లకు కడుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. లోకేష్ ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ కోరలేదు. అసలు వారిని కలుసుకోవాలన్న ఉద్దేశమే లేనట్లుగా హస్తినలో ఆయన వ్యవహరిస్తున్నారు. హస్తిన నుంచే వర్చువల్ గా ఇక్కడి పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సంఘీభావం ప్రకటించేందుకు లోకేష్ ను కలవడానికి జాతీయ స్థాయి నేతలకు క్యూకడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాపకింద నీరులా చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రబావం కేంద్రంలోని మోడీ సర్కార్ కూ  చుట్టుకుంటోంది.   చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ సర్కార్ కు మోడీ, షాల మద్దతు ఉందన్న అభిప్రాయం జాతీయ స్థాయిలో నెలకొనేందుకు లోకేష్ హస్తిన పర్యటన దోహదపడిందనడంలో సందేహం లేదు. మోడీకి అనుకూలం అని భావించే నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ కూడా బేషరతుగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీకి సంఘీభావం ప్రకటించడాన్ని ఇక్కయ ప్రత్యేకంగా చెప్పు కోవాలి.  లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేసిన తీరు ఏపీ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. హస్తినలో లోకేష్ అడుగులు ఒకే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ నూ, మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ నూ కంగారు పెడుతోంది.   లోకేష్ హస్తిన పర్యటన, వారం రోజులుగా అక్కడే మకాం వేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు చేసిన జగన్ సర్కార్ ఆయనను సాధ్యమైనంత ఎక్కువ కాలం జైలులో ఉంచే విధంగా ప్రణాళికా రచన చేసిందని తెలుగుదేశం భావిస్తున్నది. అందుకే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బలంగా న్యాయపోరాటం చేయాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన లోకేష్.. రాష్ట్రంలో తెలుగుదేశం లీగల్ టీమ్ చేస్తున్న పోరాటానికి సమాంతరంగా అవసరమైతే సుప్రీం కోర్టులోనూ చంద్రబాబు అక్రమ అరెస్టును చాలెంజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన తన హస్తిన పర్యటనలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులను కూడా కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. సపోజ్ ఫర్ సపోజ్  హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విషయంలో  వ్యతిరేక తీర్పు వస్తే వెంటనే సుప్రీంను ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ లోకేష్ దగ్గరుండి చూసుకుంటున్నారని చెబుతున్నారు.   హైకోర్టులో   క్వాష్ పిటిషన్ పై వ్యతిరేక తీర్పు వస్తే.. ఏసీబీ కోర్టు  చంద్రబాబును కస్టడీ కి అనుమతించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. అందుకోసమే వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవసరంమై చర్యలు తీసుకుంటున్ానరనీ, అందుకోసమే లోకేష్ వారం రోజులుగా హస్తినలో మకాం వేసి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారనీ చెబుతున్నారు.  మొత్తం మీద లోకేష్ హస్తిన పర్యటన వైసీపీలో గుబులు రేపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో దాదాపు బీజేపీ వ్యతిరేక, అనుకూల పార్టీలన్నీ లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటిస్తుండటంతో బీజేపీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. 

జైల్లోనే బాబును అంతం చేసే కుట్ర.. లోకేష్

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. జగన్ విపక్ష నేతగా ఉన్న సమయం నుంచీ కూడా చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ కూడా చంద్రబాబును ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలి అన్న తీరుగానే ఉన్నాయి. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలి వంటి వ్యాఖ్యలను ఆయన విపక్ష నేతగా అలవోకగా చేసేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబుపై రాష్ట్రంలో వరుస దాడులు జరిగాయి. రాష్ట్ర పోలీసులు చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రత సరిగా లేదని ఎన్ఎస్జీ సైతం కేంద్ర హోం శాఖకు నివేదికలు పంపింది. తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడి, కుప్పం, నందిగామ ఇలా బాబు జిల్లాల పర్యటనల సందర్భంగా వైసీపీ నేతలు ఆయనకు అతి సమీపంలోకి వెళ్లి మరీ దాడులకు ప్రయత్నించడం వంటి ఘటనలు చంద్రబాబు భద్రత విషయంలో జగన్ సర్కార్ ఎంత ఉదాశీనంగా వ్యవహరించిందో ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబుకు జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో సైతం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అరెస్టుకు నిరసనగా ర్యాలీలు, ధర్నాలతో ఊరూవాడా దద్దరిల్లుతోంది. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును జనం ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అంతకు రెట్టింపు జైల్లో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగురాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరిలోనూ ఇదే ఆందోళన వ్యక్తం అవుతోంది. సర్వోన్నత న్యాయస్థానమే ఏపీలో  ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించిందంటే రాష్ట్రంలో ఎంతటి దారుణ పరిస్థితి ఉందో అవగతమౌతుంది.  చంద్రబాబుకు జైల్లో భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. కనీస సౌకర్యాలు లేవనీ, ఆయనకు కనీసం వేడినీరు ఇవ్వడం లేదనీ, దోమలు విపరీతంగా ఉన్నాయనీ భువనేశ్వరి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఒక రిమాండ్ ఖైదీ మరణించారు. ఆయన డెంగ్యూ కారణంగా మరణించారు. ధవళఏశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. ఈ సందర్భంగా జైల్లో దోమలు విపరీతంగా ఉన్నాయనీ, చంద్రబాబు గదిలో ఏసీ లేదనీ, మ్యాట్ లు కూడా సరిగా లేవనీ భువనేశ్వరి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ములాఖత్ లో చంద్రబాబు తనతో స్వయంగా చెప్పారని భువనేశ్వరి అన్నారు. ఇప్పుడు అదే జైలులో ఉన్న  గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించిన సంఘటనతో  చంద్రబాబును కూడా అదే విధంగా అంతం మొందించేందకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్లూ వీళ్లూ కాదు.. స్వయానా చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబును అంతమొందించాలన్న కుట్రతోనే  జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు చంద్రబాబును జైలులోనే అంతం చేసేందుకే  ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేయాలన్నదే సైకో జగన్ పన్నాగం అని లోకేష్ అన్నారు.  జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబుకు జైలులో హాని తలపెట్టే కుట్ర సాగుతోందనీ, ఆయనకు సరైన భద్రత కల్పించలేదనీ, దోమలు విపరీతంగా కుడుతున్నాయని చెబుతున్నా జైలు అధికారులు పట్టించుకోవడం లేదనీ లోకేష్ అన్నారు.  జైలులో చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ సర్కార్ దే బాధ్యత అన్నారు.  

బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో నందమూరి సుహాసిని

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కానీ,  ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్  కానీ స్పందించలేదు. దీంతో  తెలుగుదేశం కీలక నేతల దగ్గర నుంచి పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిలోనూ వీరి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి,నెలకొని ఉంది.  అలాంటి వేళ.. అదే ఫ్యామిలీకి చెందిన  ఓ మహిళ చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటించారు.   చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతోపాటు... చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా.. హైదరాబాద్‌ మహానగరంలోని  పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగుతున్న తెలుగుదేశం శ్రేణులకు మద్దతుగా నిలిచారు. స్వయంగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నారు.  ఆమె నందమూరి సుహాసిని. ఎన్టీఆర్ తనయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె. దీంతో ఆమెపై పార్టీ నుంచే కాదు ప్రజల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   తెలంగాణ టీడీపీలో నందమూరి సుహాసిని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ పురోగతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి నందమూరి హరికృష్ణ. ఆయన కుమార్తె నందమూరి సుహాసిని సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు ఆమె పట్ల అభిమానం చాటుతున్నారు. గత ఎన్నికల్లో అంటే 2018లో నందమూరి సుహాసిని.. కుకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు.  దీంతో ఆమె రాజకీయాలకే కాదు.. తెలుగుదేశం పార్టీకి సైతం దూరం జరుగుతున్నారనే ఓ ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని రుజువు చేస్తూ  నాటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున.. రాష్ట్రంలో ఏక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ  ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆ కార్యక్రమంలో  సుహాసిని పాల్గొంటూ వస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ఆయన కుమార్తె నందమూరి సుహసిని పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అలాంటి వేళ.. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారడం.. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్‌ మహానగరంలోనే కాకుండా.. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో సైకిల్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం.. ఇంకో వైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై పార్టీ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో  తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరం నేడీ స్థాయిలో ఉండడానికి మూల కారణం చంద్రబాబునాయుడి విజన్, కృషి అనీ, అటువంటి వ్యక్తిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడమేమిటనీ సామాన్యులు కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఆగ్రహం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తెలుగుదేశం గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు. అలాగే నందమూరి సుహాసిన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినా విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.  

కమలం గూటికి మంచు లక్ష్మి?!

నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది. వారి రాజకీయ అడుగులు ఎటుపడుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో పార్టీ గూటికి చేరుతున్నారా? అసలింతకీ మోహన్ బాబు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు. అన్న సందేహాలు ఆయన అభిమానుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు క్రియాశీలంగా లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. గత నాలుగున్నరేళ్లుగా పార్టీలో మోహన్ బాబుకు ఎటువంటి గుర్తింపూ లేదన్న అసంతృప్తి ఆయనలో బలంగా ఉందని అంటున్నారు. అలీ, పోసాని కృష్ణ మురళి వంటి వారికి కూడా ఏవో పదవులు ఇచ్చిన జగన్ తనను పట్టించుకోకపోవడంపై మోహన్ బాబు ఒకింత ఆగ్రహంగా కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆ మధ్య ఒక సారి కుమార్తెతో కలిసి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాంతో అప్పట్లో ఆయన తెలుగుదేశం గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే మోహన్ బాబు స్వయంగా అటువంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీకి చెందిన బూమా మౌనికను వివాహం చేసుకోవడంతో ఆయన తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం ఇప్పటికీ జోరుగా సాగుతోంది. ఇక మరో కుమారుడు మంచు విష్ణు.. భార్య వైసీపీ అధినేత, సీఎం జగన్  బంధువు. దీంతో మోహన్ బాబు కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు. మంచు లక్ష్మికి పీఎంఓ నుంచి కాల్ వచ్చిందనీ, దీంతో ఆమె శుక్రవారం (సెప్టెంబర్ 21) హస్తిన బయలుదేరుతున్నారనీ చెబుతున్నారు. ఒక వేళ మంచు లక్ష్మా కాషాయ కండువా కప్పుకుని కమలం మోహన్ బాబు విష్ణులు వైసీపీలోనూ, మంచు మనోజ్ తెలుగుదేశం పార్టీలోనూ, మంచు లక్ష్మి బీజేపీలోనూ ఇలా ఒకే కుటుంబంలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు అవుతుంది. అయితే మంచు విష్ణు కమలం తీర్థం పుచ్చుకుంటున్నారన్న విషయంపై అటు బీజేపీ కానీ, ఇటు మంచు ఫ్యామిలీ కానీ కన్ఫర్మ చేయలేదు.