జగన్ నిర్వాకం..ఏపీలో విద్యావ్యవస్థకు గ్రహణం!

మనదేశంలో విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలదే పైచేయి. అనాది నుండి మహాముహులు చదివిన స్కూళ్ళు, కాలేజీలు ఇప్పుడు వెనకబడిపోయాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఒక పద్ధతి ప్రకారం చొచ్చుకొచ్చిన కార్పొరేట్‌ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తూ కొత్త సంస్కరణలు రాసుకొచ్చాయి. ప్రభుత్వాల హెచ్చరికలను వారు ఖాతరు చేయరు.. ప్రభుత్వ సంస్కరణలనూ వాళ్ళు లెక్కచేయరు. దీంతో ఇప్పుడు పేదవాడికి విద్య దూరమవుతుంది. కొనగలిగిన వారికే సరస్వతీ చేరువవుతుంది. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలను పునరిద్ధరుస్తున్నారు. సరికొత్త చట్టాలను తీసుకొచ్చి మరీ విద్యావ్యవస్థను బలీయం చేస్తున్నాయి.  తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు కార్పొరేట్ విద్యకు చెక్ పెట్టేలా కొత్త విధానాలను అవలంభిస్తూ మళ్ళీ ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్వ కళ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ముందు చూపు లేని విధానాలు, మొండిపట్టు జీవోలు ఇప్పుడు పేద పిల్లల పాలిట శాపంగా మారాయి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా మూర్ఖత్వపు నిర్ణయాలు ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనానికి బాటలు వేశాయి. నాలుగేళ్ళలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పేరిట చేసిన మార్పులు, భారీగా టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టకపోవడం, ఉన్న టీచర్లు, లెక్చరర్లకు జీతాల కొరత, పాఠశాలల విలీనం, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ కళాశాలలకు కేటాయించని నిధులు.. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగేళ్ళ పాలనలో విద్యావ్యవస్థ నాశనానికి అనేక కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. గత నాలుగేళ్ళ వైసీపీ పాలనలో కొత్తగా ఉపాధ్యాయ, లెక్చరర్ల నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. ఉన్న వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు అందడం లేదు. వచ్చే ఆ జీతాలు కూడా సమాయానికి అందడం లేదు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి. దీనికి తోడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా తీసుకొచ్చిన 172, 117 రెండు జీవోలు ఏపీ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. పాఠశాలల విలీనం పేరుతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసిన జగన్ సర్కార్.. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించేశారు. దశాబ్దాలుగా గ్రామంలో పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను సైతం మూసేసి.. కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అది కూడా మాతృభాష ఊసు లేకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియంను ఉంచారు.   ఇంగ్లీష్ మీడియం తెచ్చినా.. అందుకు తగిన ప్రొఫెషనల్ టీచర్లు లేకపోవడంతో అది అక్కరకురాని మీడియం మారిపోయింది. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా టీచర్, స్టూడెంట్స్ నిష్పత్తిని తెరపైకి తెచ్చారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలకు అయితే ప్రతీ 53 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో ప్రతీ 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. మరి అంత మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు విద్యాబోధన ఎలా చేయగలరో.. వారిపై ఎంతవరకు టీచర్లు దృష్టి పెట్టగలరో అనే మేధావుల ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.  ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అట్టర్ ప్లాప్ కార్యక్రమాలలో నాడు నేడు కూడా ఒకటి. లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం.. ఫోటో ఫోజులకు తప్ప ఈ కార్యక్రమం ఎందుకు పనికిరాకుండా పోయింది. రూ.వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేశారు. మరికొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొన్ని స్కూల్స్ లో పైపై మెరుగులు దిద్ది, రంగులేసి భారీగా నిధులను కొల్లగొట్టారు. అయితే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రంగులు వేసుకొని ఆనందం పొందడమే తప్ప పాఠశాలలకు విద్యార్థులను రప్పించే ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం ఇకపై విద్యారులు ఇక్కడే చేరండని ఏపీ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోవడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది.

కడప కంచుకోటకు బీటలు.. వైసీపీకి పరాభవం తప్పదా?

కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు జగన్ హయంలో వైసీపీకి ఉమ్మడి కడప జిల్లానే వాళ్ళ రాజకీయాలకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తిరుగులేదన్నది నిన్నటి వరకూ రాజకీయాలలో వినిపించే మాట. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ఆ జిల్లా ప్రజల నుండే మిశ్రమ స్పందన వస్తుంది. వైసీపీ సహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పలుమార్పు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయా సర్వేలలో కడప జిల్లా ప్రజల నుండి ఆసక్తికర అభిప్రాయాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేలు, వైసీపీ తరపున నిర్వహించిన సర్వేలలో కూడా ప్రజల నుండి వ్యతిరేక అభిప్రాయాలు బయటపడగా అవేవీ బయటకి రాకుండా చూసుకున్నట్లు తెలుస్తున్నది. మొత్తంగా చూస్తే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి వైసీపీకి ఊహించని షాక్ తప్పదనే అభిపాయాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి క‌డ‌ప‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా రాజంపేట, కడప పార్లమెంట్ పార్ల‌మెంటు స్థానాలు కూడా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఒక్క రాజంపేటలో హవా చూపించలేకపోయింది. ఆ తర్వాత 2019లో రాజంపేట స‌హా మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలు దక్కించుకొని క్లీన్ స్వీప్ అంటే ఏంటో చూపించింది. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సానుభూతితో పాటు వైఎస్ కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలబడి జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలని అన్ని నియోజకవర్గాలకు తిరిగారు. 2019 ఎన్నికలలో అయితే, వివేకానంద రెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ ఒక్క ఛాన్స్ అభ్యర్థన అన్నీ కలిసి వచ్చి క్లీన్ స్వీప్ చేయగలిగింది. అయితే, ఆ హ‌వా ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఈసారి ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం అసాధ్యమే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడ ప్రజలు దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి మొత్తంగా నాలుగైదు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. వైసీపీకి వ్యతిరేక పవనాలలో కీలకమైనది కుటుంబంలో వివాదాలు. జగన్మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దూరమవడం, మరో సోదరి సునీత సొంత కుటుంబంపైనే న్యాయ పోరాటం చేయడం.. ఈ కారణాలతో  వైఎస్ హార్డ్ కొర్ అభిమానులు జగన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయానికి విజయమ్మ కనీసం ఒకటి రెండు నియోజకవర్గాలలో ప్రచారం చేయకపోతే ఈ నష్టం తీవ్రత ఊహకు అందనంతగా   ఉండే అవకాశం ఉంది.  వైసీపీ వ్యతిరేక గాలి వీయడం వెనక మరో బలమైన కారణం వివేకా హత్య. గత ఎన్నికల సమయంలో ఈ హత్య వైసీపీకి చేసిన మేలు అంతా ఇంతా కాదు. అసలే తండ్రి లేని కుమారుడు, కక్ష పూరితంగా జైల్లో పెట్టారనే సానుభూతికి తోడు అండగా ఉంటాడుకున్న చిన్నాన్నను కూడా లేకుండా చేశారనే సానుభూతి బాగా వర్క్ అవుట్ అయింది. అయితే, ఇప్పుడు ఆ కుట్ర సొంత వాళ్ళ పనే అనే అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత తలెత్తే ఛాన్స్ ఉంది. రాయలసీమకి న్యాయరాజధాని తెస్తానని ఊరించడం.. ఇదిగో వస్తుంది.. మాట తప్పం మడం తిప్పం అంటూనే కాలం గడిపేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక అన్నిటికీ మించి స్థానిక ప్ర‌జ‌ల డిమాండ్‌ను ప‌రిష్క‌రించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కొరవై రచ్చకెక్కడం ప్రజలలో ఏహ్యభావన కలిగిస్తోంది. అదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ ఇక్కడ బలం పుంజుకున్నది. దీంతో ఇప్పుడు మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి సగానికి సగం స్థానాలను వైసీపీ చేజార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

స్పీడ్ న్యూస్ 2

26. కర్ణాటక అసెంబ్లీలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల ఓ సామాన్య వ్యక్తి అసెంబ్లీలోకి చొరబడి, ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే.. తాజాగా  ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది.  27. ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. 28. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సమంత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె ఏడాదిపాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 29.తనకు పీసీసీ చీఫ్ రానందుకు కొన్నిరోజులు బాధపడ్డానని కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం అన్నారు. కానీ తమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కతో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు. 30. భారత చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోన్న విషయాన్ని సినిమా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన్నట్టు ప్రముఖ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. 31.ఓ మహిళ అత్యంత కిరాతక హత్యకు గురైన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.  మహిళ చనిపోయిన తీరు వారిని తీవ్రంగా కలిచి వేసింది. ఆమెను చంపిన నిందితులు.. కళ్ల నుంచి గుడ్లను బయటికి తీశారు. ఆ మహిళ ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలు చేశారు. 32. ఫ్లిప్‌కార్ట్‌  కస్టమర్లు ఇకపై యాక్సిస్‌ బ్యాంక్‌ కు చెందిన పర్సనల్ లోన్స్‌ పొందొచ్చు. గరిష్ఠంగా 3 ఏళ్ల కాలవ్యవధిపై రూ.5 లక్షల వరకు పర్సనల్‌ లోన్స్‌ను మంజూరు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 33.రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ వెళ్లింది టీమిండియా. నెల రోజులపాటు కొనసాగనున్న ఈ టూర్‌‌.. జులై 12న డొమినికా వేదికగా జరిగే తొలి టెస్టుతో మొదలుకానుంది. 34. తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై మెత్తబడ్డారు.  పెండింగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. 35. సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీరమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీరమణ  చేసిన ప్రసంగం లో  సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు. 36. మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది. 37.ఈనెల 12న గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.  దేశ ప్రజలు ఐక్యంగా ఉండడానికి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు.  38. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు.  39. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు  భేటీ అయ్యారు. త్వరలో జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్న విషయం తెలిసిందే.  40. స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ టికెట్‌పై అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకునేందుకు కడియం శ్రీహరి-తాటికొండ రాజయ్య సిద్ధమయ్యారు. 41. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తానా సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీతక్కను సీఎంను చేస్తామని ప్రకటించారు.  42. నెల్లూరు పోలీసు కార్యాలయం ట్రెజరీ నిధులలో గోల్ మాల్ జరిగింది.  ట్రెజరీలో జమ చేయాల్సిన నిధులలో రూ.150 కోట్ల రూపాయల సొమ్మును పరిపాలనా విధుల్లో పని చేసే కొందరు స్వాహా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.    43.  తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా  కొనసాగుతోంది. ఆదివారం  క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.  44 ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను జగన్ తో భేటీ అయ్యానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ రోజు ఆయన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.  తమ జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై  చర్చ జరిగిందని చెప్పారు. 45. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగళం అంటూ  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య  సంచలన ఆరోపణలు చేశారు. క మంత్రిగా ఉన్న సమయంలో కడియం అనినీతికి పాల్పడ్డారనీ, అవసరం వచ్చినప్పుడు ఆయన ఆస్తులను బయట పెడతామని చెప్పారు.   46.  రానున్న ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.  జులై 12, 13 తేదీల్లో వాతావరణ శాఖ రాష్ట్రంలోని  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. 47.  తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి  విమర్శలు గుప్పించారు. హుస్సేన్ సాగర్ పరిశుభ్రతపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్నారు.  సెయిలింగ్ వీక్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆమెతెలంగాణకు ఓ గిఫ్ట్ లాంటి హుస్సేన్ సాగర్ ను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అన్నారు. సాగర్ ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  48. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని చెప్పారు. అలాగే జగన్ కేబినెట్ విస్తరణ అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.    49.ఒంగోలులో  భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.   గతంలో ఒంగోలులో ఇలాగే చాలాసార్లు భూమి కంపించిందని..   ఒంగోలులో కొండ ప్రాంతం దిగువన తరచుగా భూమి కంపిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  50. తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్లపై జరిగే ప్రమాదాలను నివారించడానికి   నిఘా భద్రతా విభాగం, పోలీసు శాఖా సమన్వయంతో పటిష్టమైన సమగ్ర  ప్రణాళికను రూపొందించాలని టి టి డి కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నిర్దేశించారు.

దిగ్విజయంగా స్కాట్లాండ్ (UK) లో ప్రప్రథమ తెలుగు అష్టావధానం

  ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లోని ఎడింబరో లో అంగరంగ వైభవంగా మొట్టమొదటి అష్టావధానం శ్రీ ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే నిన్న శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు నిర్వహించారు.   తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందు మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించడం విశేషం.  త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గారు, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి గారు, స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు కార్యక్రమాన్ని జ్యొతి ప్రజవల చేసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమిచే వారు కావడం వలన 12 మంది దివ్యమైన సూర్యులతో ప్రకాశిస్తూ సాగిందీ కార్యక్రమం.  సమస్యాపూరణం - శ్రీ నాగ ప్రసాద్ మంగళంపల్లి గారు  దత్తపది - శ్రీ రంజిత్ నాగుబండి గారు వర్ణన - శ్రీమతి సాయికుమారి దొడ్డ గారు నిషిద్ధాక్షరి - శ్రీమతి శైలజ గంటి గారు న్యస్తాక్షరి - శ్రీమతి హిమబిందు జయంతి గారు ఆశువు - శ్రీ అనంత రామానంద్ గార్లపాటి గారు, శ్రీమతి మమత వుసికల గారు పురాణ పఠనం - శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు, శ్రీ మిథిలేష్ వద్దిపర్తి గారు, శ్రీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి గారు అప్రస్తుత ప్రసంగం - శ్రీ సత్యశ్యాం కుమార్ జయంతి గారు, శ్రీ నిరంజన్ నూక గారు  ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విమర్శనాత్మక విశ్లేషణ శ్రీ అయ్యగారి ప్రసాద్ గారు చేశారు.  కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ గార్లని నిర్వాహకులు విజయ్ గారు మరియు పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, పూలు పండ్లతో సత్కరించారు.  ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ చివరగా నిర్వాహకులు విజయ్ గారు అవధాని గారికి, పృచ్ఛకులకు, వాలంటీర్లకు ధన్యవాదాలు తెలుపగా, వేడుకను మంగళహారతితో ముగించారు.  సాయంత్రం 'శ్రీ కృష్ణ లీలలు అంశం మీద భక్తి ప్రవచనాలు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది.   కార్యక్రమాలను క్రింది లింక్స్‌ని క్లిక్ చేసి వీక్షించండి.  Ashtavadhanam: https://fb.watch/lGbwVREE9j  Pravachanalu: https://fb.watch/lGCnvIaqFg

స్పీడ్ న్యూస్- 1

1. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది.  2.నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.  3.దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి 16వ తేదీ వరకు గుంటూరు-విశాఖపట్టణం , 11 నుంచి నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్టణం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, సోమవారం నుంచి 16 వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ, రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం  రైళ్లను రద్దుచేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. 4.ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం  కూడా కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు సోమవారం మధ్యాహ్నం కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.  5. గతేడాది నాకు ఇచ్చిన వాగ్ధానం మరిచారు అంటూ జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల వేడుకల్లో సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించారు. 6.రాజస్థాన్‌లో ఇంజినీరింగ్ ఆశావహుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడడం లేదు.  కోటాలో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి తాజాగా తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 7.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. 8.తెలుగు వారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడ తమ సత్తా చాటుతున్నారని హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  9.ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.యాషెస్ సిరీస్‌లో  ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించి  ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  10.ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల దృష్టి కొల్లాపూర్ సభపై కేంద్రీకృతమై ఉంది. 11.మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిధ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వివేక్ కోల్ పార్టీ నుంచి తప్పుకున్నారు.  12. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి.   తాజాగా ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందారు. 13 ఆంధ్ర ప్రదేశ్ అనకా పల్లిలో ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు బిల్లు రూపంలో కరెంట్ షాక్ ఇచ్చారు. దాదాపు మూడున్నర లక్షల కరెంటు బిల్లు వేయడంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. 14. ఇటీవల నందిగామలో ఓ మహిళపైనా, ఆమె బంధువులపైనా యాసిడ్ దాడి జరగడం తెలిసిందే.  నందిగామ యాసిడ్ దాడి ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర  మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం  పరామర్శించారు.  15.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పటల్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం సోమవారం  హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు వద్ద నిర్వహించారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కు విశేష స్పందన లభించింది. 16.  తెలంగాణ  మంత్రి మల్లారెడ్డి  సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారికి బోనం తీసుకువచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇప్పటి వరకు  తాను అమ్మవారిని కోరిన కోరికలన్నీ తీరాయని,  ఈ ఏడాది సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేకంగా మొక్కుకున్నానని, ఆ కోరిక కూడా తీరుతుందని నమ్ముతున్నానని తెలిపారు.  17. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గత నెలలో ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో బైక్‌ మెకానిక్‌ షాపులను సందర్శించిన విషయం తెలిసిందే.  తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశారు. 18.ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ధనసరి సీతక్క సోమవారం  పుట్టినరోజు సందర్బంగా  సీతక్కకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. "ములుగు ఎమ్మెల్యే, నా సోదరి ఎమ్మెల్యే సీతక్కకు పుట్టినరోజు శుభకాంక్షలు. ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లు ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.  19. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన ఆస్తులపై పచ్చి అబద్ధాలతో దేవుని ఎదుట ప్రమాణం చేశారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు.  ‘‘అనిల్‌కు ఇంటర్నేషనల్‌ నోటీసులు ఎందుకొచ్చాయి? పెరూలో బంగారు వ్యాపారం ఉందో, లేదో బయటపెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు.  20. దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  41 ఏళ్ల తర్వాత హస్తినలో 153 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కావడం ఇదే ప్రథమం. 21. తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. 22.ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీ కుటుంబం ఎలా బతికిందో చెబుతాను.. చెప్పుతో కొడుదువురమ్మంటూ సవాల్ విసిరారు.  23.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  24. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో తెరపై కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదని,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారుచేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురయ్యారు. లేడీ యాంకర్ ను తలపించేలా గడగడా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను అబ్బుర పరిచింది. 25.ఎన్నడూ లేనంత స్థాయిలో టమాటా ధరలు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని వారణాసిలో తన షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త  పీటీఐ వార్తా సంస్థ ప్రచురించింది.   

కాంగ్రెస్ షర్మిల నామస్మరణ.. ఎందుకంటే?!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. బలమైన నేతలను అంతే బలంగా తమ వైపుకు లాగేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని భావిస్తున్నది. అందుకోసం ఎన్నో రకాల ప్రణాళికలు రచించుకుంటుంది. ఈ క్రమంలో చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ నేతగానే మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. వైఎస్ వారసులుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయాలలో ఉండగా.. జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు దూరమై పూర్తిగా ఏపీ రాజకీయాలలోనే ఉన్నారు. ఇక షర్మిల అన్నతో విభేదించి తెలంగాణకు వచ్చేసి తండ్రి పేరిటనే కొత్త పార్టీ పెట్టారు. అయితే, వైఎస్ఆర్టీపీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణకు నోచుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ షర్మిలను తనలో కలుపుకొని వైఎస్ఆర్ బ్రాండ్ దక్కించుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పటికే షర్మిలతో సంప్రదింపులు జరపగా.. షర్మిల పార్టీ విలీనానికి సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో బలమైన సమాచారం ఉంది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెల్లి షర్మిల కోసమే అన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా వైఎస్ జయంతి రోజున రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు సైతం షర్మిల రీట్వీట్ చేసి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు. మీ హృదయంలో వైఎస్ఆర్ కు ఇంకా స్థానం ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ షర్మిల రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన రీట్వీట్ జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు మరింత క్లారిటీ ఇచ్చింది. ఇక షర్మిల పార్టీ విలీనం తర్వాత ఏపీకి వెళ్తారా తెలంగాణలో ఉంటారా అన్నదానిపై కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే  షర్మిల ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడం ఖాయమంటున్నారు. కాగా అసలు కాంగ్రెస్ పార్టీ షర్మిల కోసం ఇంత ఆరాటానికి కారణం ఏంటన్నది చూస్తే వైఎస్ఆర్ లెగసీ కోసమే అని చెప్పుకోవాలి. వైఎస్సార్ సర్కార్ పైఅవినీతి ఆరోపణలు, కక్ష్యపూరిత రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన సంక్షేమ పథకాలతో ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణలో సైతం ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులుగా ఎందరో నేతలు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు వైఎస్ బిడ్డగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే ఎన్టీఆర్ లెగసీ కోసం బీజేపీ పురందేశ్వరిని ఏపీకి అధక్షురాలిని చేయగా..  కాంగ్రెస్ షర్మిల ద్వారా మళ్ళీ వైఎస్ఆర్ ను ప్రజలకు గుర్తు చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు షర్మిలకు సైతం కాంగ్రెస్ లో ఇమిడిపోయేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులూ కాంగ్రెస్ తోనే ఆయన ప్రయాణం సాగింది. పైగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే తన అభిమతమని ఆయన అప్పట్లో ఎప్పుడూ చెప్పేవారు.  సోనియాను ప్రధానిగా చూడాలని ఉన్నా ఆ అవకాశం రాలేదని.. కానీ రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఉందని వైఎస్ఆర్ చెప్పేవారు. ఇప్పుడు ఆయన కలను సాకారం చేసేందుకు.. ఆయన ప్రజా సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో మరో ప్రయాణం మొదలు పెట్టినట్లు చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం ఉంది. మరి షర్మిల కాంగ్రెస్ చేరిక ఎప్పుడో ఇక వేచి చూడాలి.

వరద నీటిలో కొట్టుకుపోయిన వంతెన

తెలుగు రాష్ట్రాలు వర్షాభావంతో అతలాకుతలమౌతుంటే.. ఉత్తరాది వర్ష బీభత్సంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు బ్రిడ్జిలు ధ్వంసం  అయ్యాయి.  హిమాచల్ ప్రదేశ్ లోని  బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన అమాంతం  కొట్టుకుపోయింది. అలా వంతెన కొట్టుకుపోతున్న సంఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ సామాజిక మాధ్యమంలో  వైరల్ అయ్యింది.  బియాస్ నదీ తీరం  కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మనాలిలో మెరుపు వరదల కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మినీ జమిలి.. లోక్ సభతో పాటే 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీ పరస్పెక్టివ్ ను పూర్తిగా మార్చేసిందా? అంతకు ముందు వరకూ  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ఉన్న ధీమా ఒకింత తగ్గినట్టుగా కనిపిస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులకు స్థాన భ్రంశం కల్పించింది. త్వరలో మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకర చేయనున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా సన్నగిల్లడం వల్లనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు కూడా నగారా మోగిస్తే ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశాలు ఒకింత మెరుగ్గా ఉంటాయని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో మాటు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తుగానే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచన చేస్తున్నదంటున్నారు. ఏపీ వంటి రాష్ట్రాలు ముందస్తుకు రెఢీగా ఉన్నాయనీ, అలా రెడీగా లేని రాష్ట్రాలను కూడా ఒప్పించి ఏదో విధంగా ఈ ఏడాది చివరికే పలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరిపించేస్తే.. విపక్షాలు ఐక్యతాయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, ఎన్నికలకు అవి ఇంకా పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో  అధికారంలో ఉన్న బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయన్నది మోడీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే  నరేంద్రమోడీ మినీ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని అంటున్నారు.  గతంలో నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణ పై  ఆసక్తి కనబరిచినా, అయితే అది అనుకున్నంత ఈజీ కాదని తేలిపోవడంతో అప్పటికి మిన్న కున్నారనీ,ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినీ జనరల్ ఎలక్షన్ కు వెళితే.. అంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలనూ కలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు వెడితే రాజకీయంగా తమ విజయానికి తిరుగుండదన్న భావన మోడీలో బంలంగా ఉందని చెబుతున్నారు.      డిసెంబర్ నెల లో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగాల్సుంది. అలాగే  వచ్చే ఏడాది మే-జూన్ నెల లో మరో ఆరు  రాష్ట్రాల కు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు పెండింగు జరగాల్సి ఉంది.  మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరగాల్సి ఉంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే జరగాల్సి ఉంది.  దీనిని దృష్టిలో  ఉంచుకునే ఈ డిసెంబర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ను ఓ మూడునెలలు వాయిదా వేయడమో లేదా వచ్చే ఏడాది మే, జూన్ లలో జరగాల్సిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపడమో చేస్తే  శ్రమ, వ్యయం, సమయం అన్నీ కలిసి వస్తాయన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు.  అయితే ఈ ఏడాది చివరిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటే.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ కావాలి. అలా కాకుండా వచ్చే ఏడాది  మే, జూన్ లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరపడం అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. దీంతో మోడీ రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

సమృద్ధిగా వర్షాలు.. భవిష్యవాణి

ఎల్ నినో.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దాదాపుగా ముఖం చాటేసిన పరిస్థితి. జూలై రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకూ మంచి వర్షాలు కురిసిన జాడ లేదు. ఈ తరుణంలో భవిష్యవాణి తెలంగాణ వాసులకు శుభవార్త  తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పింది. ఏపీలో ఫరవాలేదనిపించినా తెలంగాణలో వర్షాలు ఇప్పటికీ మబ్బుల చాటునే దాగున్నాయి. అయితే ఆషాఢం బోనాల సందర్భంగా జోగిని స్వర్ణ లత మాత్రం ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి చెప్పింది. లోపాలు  లేకుండా తనకు పూజలు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన భవిష్యవాణి.. గత ఏడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలలో భాగంగా స్వర్ణలత సోమవారం (జూలై 10) పచ్చిమట్టికుండపై నిలుచుని వినిపించిన భవిష్యవాణిలో ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తాయన్ని చెప్పారు. ఎల్లవేళలా వెన్నంటి భక్తులను కాపాడుకుంటాననీ చెప్పిన భవిష్యవాణి, అగ్నిప్రమాదాల గురించి భయం వద్దన్నారు.  స్వర్ణలత భవిష్యవాణి వినేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. 

రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీ.. వైసీపీ యూటర్న్!

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నది సామెత. జగన్ సర్కార్ కు చాలా విషయాలలో ఈ సామెత అస్సలు వర్తించది. ఇక తప్పదనుకున్నప్పుడో, మరో గత్యంతరం లేని సందర్బంలో మాత్రమే తాను చేసిన తప్పును దిద్దుకుంటున్నట్లుగా కలర్ ఇస్తుంది. జగన్ సర్కార్. జగన్ సర్కార్ అంటే అదేదో కేబినెట్ సమష్టిగా చేసే పాలన అనుకుంటే ఎవరైనా సరే తప్పులో కాలేసినట్లే అవుతుంది. జగన్ సర్కార్ లో మంత్రులంతా తమ అధినేత, ముఖ్యమంత్రి ఏం అనుకుంటే అదే చేస్తారు. ఆయన మనసు గ్రహించి మసులు కుంటారు. ఇక ప్రభుత్వాధికారుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. జగన్ చెప్పిందే వారికి వేదం. అందుకే రుషి కొండకు గుండు కొట్టేసినా, హోటల్ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించమన్నా.. నిబంధనలు అంగీకరించవనీ, పర్యావరణ సమస్యలు వస్తాయనీ అన్న విషయాన్ని కనీసం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యమైనా చేయరు.   రుషికొండ పనైపోయింది. ఇప్పుడిక    ఆ రుషికొండ బీచ్ ను కూడా పూర్తిగా ఒక ప్రైవేటు బీచ్ గా మార్చేసుకుంటున్నారు.  బీచ్ లోకి ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. మంగళవారం నుంచి  ఆ ఫీజులు వసూలు చేయాలని కూడా నిర్ణయించేశారు.   విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో  ప్రవేశానికి టిక్కెట్లు పెట్టిన దాఖలాలు లేవు. ఆ పుణ్యం కట్టుకోవాలని జగన్ సర్కార్ గట్టిగా నిర్ణయించేసుకుంది.  రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. వాటికి ఖర్చులు అవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి కేంద్రమే  భ్లూ ఫాగ్ బీచ్‌లకు నిధులు ఇస్తోంది. అయినా  రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీజు నిర్ణయించి దోపిడీకి తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా  రుషికొండ పై కట్టిన నివాసం నుంచి బీచ్ లోకి వెళ్లి సేదదీరేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేుకుంటున్నారని గతంలో అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం తారస్థాయికి చేరిందన్న సంగతిని గ్రహించిన ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు తెరలేపింది.  తూచ్ రిషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజ్ అంతా ఉత్తిదేనని మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.   నిజానికి మంగళవారం (జూలై 11) నుంచి రుషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజు అమలు చేయడానికి సర్వ సిద్ధమైపోయింది. ఎవరికీ తెలియకుండా అమలు చేసేద్దామని భావించారు.  కానీ అసలు విషయం ముందుగానే వెల్లడి అయిపోయిన నేపథ్యంలో  మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.  

అడ్డంగా బుక్కయ్యారు!

తాజాగా విశాఖపట్నంలో ఆర్మీడ్ రిజర్వ్ సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు వ్యక్తులను బెదిరించి నగదు గుంజుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉల్కిపడింది. అయితే తాజాగా సీఐ స్వర్ణలత వ్యవహారం, గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సీఐ, ప్రస్తుతం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఒకేలా ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఊపందుకొంది.  స్వర్ణలత.. సీఐగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారని.. ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి కాస్తా వివాదాస్పదం కావడంపై ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.    అలాగే సీఐ స్వర్ణలత సినిమాల్లోకి వేళ్లాలని భావిస్తున్నారని... ఆ క్రమంలో ఆమె.. తన ఆటపాటలతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు.. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయని.. అలాంటి వేళ సీఐ స్వర్ణలత వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోందని అంటున్నారు. పోలీస్ అధికారి అయి ఉండి.. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటనే ఓ వాదన అయితే గతంలో గట్టిగానే నడిచిందనే టాక్ పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదీకాక నోట్ల మార్పిడి వ్యవహరంలో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షలాది రూపాయిలు కొట్టేశారంటూ అభియోగాల నేపథ్యంలో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయ్యారు.  మరోవైపు 2019 ఎన్నికలకు ముందు దాదాపుగా ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాదవ్ విధులు నిర్వహిస్తున్నారని.. ఆ సమయంలో తాడిపత్రిలో స్థానికంగా చోటు చేసుకొన్న ఓ వివాదం.. చినికి చినికి గాలీ వానగా మారడం.. ఆ సమయంలో అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం.. ఈ నేపథ్యంలో కదిరి సీఐ ప్లస్ పోలీస్ ఉద్యోగు సంఘం నాయకుడు గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మీసం మెలేస్తూ.. జేసీకి వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని... ఈ అంశం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ తర్వాత గోరంట్ల మాధవ్‌.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి..  జగన్ పార్టీలో చేరి హిందూపురం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ గతేడాది గోరంట్ల మాధవ్‌ది అంటూ చెబుతున్నో ఓ నగ్న వీడియో అయితే.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.  అటు గోరంట్ల మాధవ్, ఇటు స్వర్ణలత.. ఈ ఇద్దరు పోలీస్ శాఖలో సీఐలుగా ఉన్నారని.. ఈ ఇద్దరు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘంలో కీలక పదవుల్లో ఉన్నారని... అలాగే ఈ ఇద్దరు సీఐలుగా ఉండి.. స్వయంగా ప్రెస్‌మీట్లు పెట్టి.. టీడీపీ సీనియర్ నేతలపై విమర్శలు గుప్పించారనే అంటున్నారు.    దీంతో గోరంట్ల మాధవ్ తరహాలోనే సీఐ స్వర్ణలత సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. పోలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రానున్న ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

దటీజ్ సీఐ స్వర్ణలత!

కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని నాలుగో సింహం పోలీస్‌. మరి కనిపించని ఆ నాలుగో సింహం పోలీసుల్లో కూడా కనిపించని అసలు సిసలు కోణాలు సైతం.. విశాఖ మహిళ ఆర్మీ రిజర్వుడ్ సీఐ స్వర్ణలత విషయంలో తాజా తాజాగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.  పలువురికి ఆదర్శంగా ఉంటూ.. బాధ్యత గల పోలీస్ శాఖలో ఉన్న సీఐ స్వర్ణలత.. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో.. వ్యక్తులను బెదిరించి.. లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఇలా అడ్డంగా దొరికిపోవడం.. ఆమెపై ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు కావడం.. రాష్ట్రంలోనే కాదు.. పోలీస్ శాఖలో సైతం స్వర్ణలత వ్యవహారం సంచలనంగా  మారింది. అయితే ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె.. అధికార జగన్ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధిని ఆశ్రయించి.. వారి ద్వారా ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు  తీసుకు వచ్చినా.. అప్పటికే జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయిందని.. ఈ నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధి సైతం.. హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తిసినట్లు ఓ ప్రచారం  వాడి వేడిగా ఉక్కు నగరంలో సాగుతోంది. మరోవైపు స్వర్ణలత ఇలా అడ్డంగా బుక్ అయిపోవడంతో.. ఆమె గారి ముచ్చట్లు, మక్కువలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సీఐ స్వర్ణలతకి ఖాకీవనంలో విధులు నిర్వహించడం కంటే.. టాలీవుడ్‌లో నటించడంలోనే కిక్కు ఎక్కువని భావించి.. ఆ క్రమంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు టాలీవుడ్‌తో మంచి సంబంధాలున్నాయని తెలుసుకొని.. సదరు ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకున్నారు..  వారిని కలిసి తన మనస్సులోని మాట చెప్పగా..  త్వరలో   తీయబోయే చిత్రంలో చాన్స్ ఇస్తానని.. కానీ ఆ పాత్రకు న్యాటం మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాలని కండిషన్ పెట్టడంతో.. సీఐ స్వర్ణలత ఓ కోరియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకొని మరీ డెడికేషన్‌తో స్పెషల్ కోచింగ్ సైతం తీసుకొని మరీ నృత్యం నేర్చుకున్నారు. అందులోభాగంగా కొన్ని సినిమా పాటలకు సీఐ స్వర్ణలత చేసిన డ్యాన్సులకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. వటిలో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బనీ తీయ్యనీ దెబ్బ.. పాటకు చేసిన డ్యాన్స్  వీడియోను చిరు ప్రయత్నం అంటూ సీఐ స్వర్ణలత సోషల్ మీడియాలోకి వదలడంతో...  ఆ వీడియో  సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్నది. అంతేకాకుండా ఆమె నృత్య రీతులకు  నెటిజనులు   ఫిదా అయిపోయారనే   చర్చ సైతం వాల్తేరులో వైరల్ అవుతోంది.   ప్రస్తుతం సీఐ స్వర్ణలత ఏపీ 31 అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నది. సదరు సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలో కూడా స్వర్ణలత భాగస్వామిగా ఉన్నారు. ఆ సినిమా కోసమే  నోట్ల మార్పిడి వ్యవహారంలో పోలీస్ మార్క్ వ్యవహారం ఆమె నడిపించారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అదీకాక ఆమె ఎప్పుడు ఎక్కడ.. విధులు నిర్వహించినా అక్కడ తనదైన శైలిలో స్వర్ణలత మార్క్ చూపించేవారనే ఓ చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు సీఐ స్వర్ణలత నటిస్తున్న ఏపీ 31 పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదీ ఏమైనా పాపం పండాలన్నా.. మనలోని టాలెంట్ బయటకు రావాలన్నా.. దానికి ఓ టైమ్‌ రావాలి. అలా అయితేనే.. మనమేమిటో.. మన సత్తా ఏమిటో.. మన ప్రతిభా పాటవాలు ఏమిటో పది మందికి తెలుస్తాయి. అయినా పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహించినా.. నృత్య రీతులు నేర్చుకొని డ్యాన్సులు చేసినా.. రాని పేరు ప్రఖ్యాతలు.. ఒక్కసారిగా ఇలా నోట్లు మార్పిడి వ్యవహారంలో ఖాకీ పవర్‌తోపాటు లాఠీ పవర్ చూపించి మరీ పోలీస్ మార్క్ దందాలు చేస్తే.. పేరు ప్రఖ్యాతలు ఇలా తన్నుకు వస్తాయని  సీఐ స్వర్ణలత   ఊహించి ఉండరని అంటున్నారు. ఈ అలోచన ఉంటే 2016లో నోట్ల రద్దు అప్పుడే ఈ వ్యవహారం నడిపి ఉండేవారనే   చర్చ సైతం రేపో మాపో కార్యనిర్వహాక రాజధానిగా కాబోతున్న విశాఖ నగరంలో వీర విహారం చేస్తోంది.

వందే భారత్ రైలు అసలు రంగులోకి..

వందేభారత్ ఎల్స్ ప్రెస్ రైళ్లంటూ..పేదోళ్ళకి అందనంత ఎత్తులో..జెండా ఊపుతూ.. అదే పనిగా ప్రారంభత్సవాలు చేస్తూ.. జనాలకు  విదూషకుడిగా  కనిపించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి హాస్యాన్ని పండించారు.   తాజాగా వందేమాతరం ఎక్స్ ప్రెస్ ల రంగు మార్చి.. తమ అసలు రంగును చాటుకున్నారు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. చైన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కషాయ రంగుతో ఉన్న వందేభారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకోవడంతో, దీంతో రంగు మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు.  ఈ నిర్ణయంతో వందే భారత్ రైలు ఇక కషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి. జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు ఇప్పటి వరకు 25రైళ్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని, జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించుకున్నామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. త్వరలో పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ 'టీ ట్రైన్' లను ప్రవేశపెట్టాలే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత.. దక్షిణాదిలో మరెన్నో వందేభాదర్ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. చైన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకూ 70వేల బోగీలు తయారయ్యాయి. ఫీడ్ బ్యార్ ఆధారంగా రైళ్లకు అనేక మార్పులు చేస్తున్నారు. భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్‌పై కూడా దృష్టి సారించారు.2023-24లో ఈ కార్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజాభివృద్ధే తమ సర్కార్ అభిమతమని చెప్పుకుంటూ.. పురాతన కూడళ్లు..రోడ్లకు పేర్లు మార్చి.. తమ నైజాన్ని చాటుకున్న కేంద్రం.. ఇప్పుడు రైళ్లకు సైతం.. రంగులు మార్చడం.. కాషాయమే తమ అసలు అభిమతం..ఉద్దేశమని తెలపకనే తెలిపింది కదా అని పరిశీలకులు అంటున్నారు. ఇదే మరి..మోడీ మార్క్ రాజకీయాలంటే..!

వైసీపీలో వైఎస్సార్ బ్రాండ్ మాయం!

దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి అసలైన వారసులు ఎవరంటే కుమారుడు వైఎస్ జగన్ తో పాటు కుమార్తె షర్మిల కూడా నేనున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే, అసలైన వారసుడిగా జగన్ కు ఏపీ ప్రజలు పట్టం కట్టారు. ఆయన చేసిన కొన్ని సంక్షేమ పనులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు తెచ్చి పెట్టాయి. వైఎస్ఆర్ పాలనపై నమ్మకం కుదిరిన వారే జగన్ కోరిన ఒక్క ఛాన్స్ నినాదానికి పడిపోయారు. ఏది ఏదైతేనేం జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది వైఎస్ఆర్ కుమారుడిగానే. అందుకే వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన ప్రతి పథకానికి, కట్టే ప్రతి నిర్మాణానికి ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడెప్పుడో కట్టిన వాటికి సైతం పేర్లు మార్చి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక, ఈ నాలుగేళ్ళలో ఎప్పుడు వైఎస్ఆర్ కి సంబంధించి జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పల్లె స్థాయి కార్యకర్త నుండి సాక్షాత్తు సీఎం వరకు ఈ వేడుకలను ప్రత్యేకంగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే రాయలసీమలో ఈ సంబరాలు అంబరాన్ని అంటేలా నిర్వహించేవారు. ఇడుపులపాయను సుందరంగా అలంకరించి తమ నేతకు ఘన నివాళి అర్పించేవారు. కానీ, తాజాగా జులై 8న వచ్చిన వైఎస్ఆర్ జయంతిలో ఎక్కడా గతంలో స్థాయిలో జోష్ కనిపించలేదు. సాక్షాత్తూ ఆయన కుమారుడు, సీఎం జగన్మోహన్ రెడ్డే త‌న తండ్రి ఘాట్‌కు వెళ్లి పూలుచల్లి నివాళి అర్పించి అటు నుండి అటు పులివెందుల‌ ప‌ర్య‌టనకి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 150 మంది ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించలేదు. రాయలసీమలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చిన్నా చితకా సేవా కార్యక్రమాలు నిర్వహించగా   రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడా ఆ స్థాయి కార్యక్రమాలు కూడా లేవు. గ్రామాలలో అంతకు ముందు మూడేళ్లు కేక్ కటింగ్, స్వీట్లు పంచడం, అన్నదానాలు, రక్తదానాలు నిర్వహించగా ఈసారి దాదాపుగా ఆ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీలో వైఎస్ఆర్ మ్యానియా ఏమైందని సహజంగానే అనుమానాలు మొదలవుతున్నాయి. వైసీపీ నేతలు, పెద్దలు కావాలనే ఈసారి వైఎస్ఆర్ జయంతిని పక్కన పెట్టారా? లేక అధిష్టానం చెప్పినా ఆ పార్టీ నేతలు లైట్ తీసుకున్నారా? అనే చర్చ ఆ పార్టీ శ్రేణులలోనే మొదలైంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి సైతం వైఎస్ఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడం లేదు. అంతకు ముందు ప్రతి పథకానికి తన తండ్రి పేరు పెట్టుకున్న సీఎం ఇప్పుడు తెచ్చే పథకాలకు జగనన్న పేరు వచ్చేలా చూసుకుంటున్నారు., పట్టాల పంపిణీ నుండి పలు సంక్షేమ పథకాల వరకూ ఇప్పుడు జగన్ పేరే కనిపిస్తుంది.. వినిపిస్తున్నది. బహుశా తండ్రి లెగసీతో అధికారంలోకి వచ్చినా ఇప్పుడు తన సొంత ఇమేజ్ ప్రజలపై ఉండేలా చూడాలనే ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడూ అదే క్రమంలోనే వైఎస్ఆర్ కి సంబంధించిన కార్యక్రమాలను కూడా సోసోగానే చూస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కనుక ఇలాంటి వేడుకలను ఘనంగా నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. అయినా ఈసారి వైసిపీ ఆ పని చేయలేదు.  ఒకవైపు అధిష్టానం ఈ వేడుకలపై ఫోకస్ పెట్టకపోగా.. ఆ పార్టీలో ఇతర సమస్యల కారణంగా నేతలు కూడా మొహం చాటేసినట్లు కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత కుమ్ములాట‌లు, ప్రభుత్వ పనితీరుపై నమ్మకం లేక లైట్ తీసుకున్న వాళ్ళు కొందరు, తనకు ఈసారి టికెట్ వస్తుందనే ఆశలేని నేతలు కొందరు.. ఇలా ఎవ‌రికివారే మౌనంగా ఉండిపోయారు. దీనికి తోడు మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న నెల్లూరు లాంటి జిల్లాలలో ఇప్పుడు ఆ కోటలు బద్దలైపోవడం.. ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తితో ఉండడం లాంటి కారణాలు కూడా  వైఎస్సార్ జయంతి కార్యక్రమాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మమ అనిపించేయడానికి కారణంగా చెబుతున్నారు.  అయితే, అసలే ఎన్నికల సమయం కనుక కనీసం అధిష్టానం అయినా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా లైట్ తీసుకోవడం చూస్తుంటే దీని వెనక వాళ్ళ ఆలోచన మరేదైనా ఉందేమో అనుకోవాల్సి వస్తుంది.

మా నిధులు మీరెలా వాడేశారు.. జగన్‌పై కేంద్రం సీరియస్

ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా ఆర్ధిక పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎడా పెడా తెచ్చిన అప్పులు పెరిగి ఇప్పుడు పెద్ద అనకొండలా మారిపోయాయి. రాష్ట్రంలో దెబ్బతిన్న అభివృద్ధి, ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టకపోవడం, వైసీపీ నేతల తీరు కారణంగా పెట్టుబడులు పెట్టేవారు రాష్ట్రం వైపు చూడడమే మానేశారు. ఉన్న వాళ్ళలో కొందరు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దీంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం లేక పప్పు బెల్లం మాదిరి తలకి ఇంత చొప్పున చేసే పంపకాలు పెరిగి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. మరో వైపు కరోనాతో దెబ్బతిన్న సామాన్య ప్రజల ఆర్ధిక స్థితిపై భారీగా ధరల పెంపు పిడుగు పడడంతో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఉన్న ఆదాయం కూడా దిగజారిపోయింది. దీంతో ఏపీ పరిస్థితి ఆర్ధికంగా అగమ్యగోచరంగా మారిపోయింది.  ఏపీలో గత ఏడాది కాలం నుండి నెలా నెలా జీతాలకు, పెన్షన్లకు కూడా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితి. గత రెండేళ్లుగా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ ఒకటో తేదీన జీతం అందలేదు. కొందరైతే ఏ నెలకి ఆ నెల జీతం చూడడంపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు, బాండ్లు, మద్యంపై వచ్చే ఆదాయాన్ని, పలు దేవాలయాల ఆదాయాన్ని కూడా తనఖా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా పరిమితికి మించి అప్పులు చేసింది. ఇవి చాలవని వివిధ కార్పొరేషన్ల నిధులు, కేంద్ర పథకాలకు వచ్చే నిధులను కూడా తన ప్రభుత్వాన్ని నడిపేందుకు వాడుకున్నారు. అలాగా ఇప్పుడు కేంద్రం ఒక పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వగా.. జగన్ ప్రభుత్వం దాన్ని సొంత అవసరాలకు వాడుకుంది. దీంతో ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల‌ను తక్షణమే సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.  కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించాల‌నే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా ఈ మధ్యనే అందుకోసం కేంద్రం నిధులకు కేటాయిస్తుంది. ఈ క్ర‌మంలో భాగంగా 90 శాతం నిధుల‌ను కేంద్రం ఇవ్వనుండగా 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాలి. ఆ నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి, ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాలి. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి కేంద్రం నిధులు ఇస్తుండగా.. ఈ మధ్యనే పలు రాష్ట్రాలకు నిధులను జమ చేసింది. ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌కు మళ్లించింది. దీంతో కేంద్రం ఆగ్రహించింది.  కేంద్ర పథకానికి, పేదల గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులపై సమాచారం లేకుండా మల్లింపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.  కనీసం జీవో కూడా లేకుండా రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. అంతేకాదు, తక్షణమే ఆ నిధులను సింగిల్‌ నోడల్‌ ఖాతాకు జ‌మ చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కారును ఆదేశించింది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో ఒకసారి విడుదల చేసిన రూ.1879 కోట్లలో నుంచి రూ.639 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. నిజానికి ఈ పథకంలో భాగంగా రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా జమ చేయకపోవడం వలనే ఈ నిధులు అలా పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఇవ్వాల్సినని ఇవ్వకపోగా.. సమాచారం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా నిధులను మళ్లించడం కేంద్రానికి కోపం తెప్పించింది.

పొత్తులపై జనసేన నేతల నోటికి పవన్ తాళం

ఏపీ రాజకీయాలలో అత్యంత హైటెన్షన్ క్రియేట్ చేస్తున్న అంశం రానున్న ఎన్నికల్లో పొత్తులు. ఈ ఎన్నికలలో వైసీపీ ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా సింగల్ గానే పోటీ చేస్తుంది. రహస్య పొత్తులు ఏమైనా ఉంటే ఉండే అవకాశం ఉంటుంది కానీ అధికారంగా 175 మంది వైసీపీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే బీజేపీ పయనం ఎటువైపు అన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. కానీ, జనసేన మాత్రం టీడీపీతోనే అని తేల్చి చెప్పేసింది. ఏడాదిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాను ఓ మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఈ మధ్య కాలంలో వారాహీ విజయయాత్రలో పవన్ ప్రసంగాలను బట్టి పొత్తు అంశంపై కొన్ని అపోహలు మొదలవగా.. దీనికి ముగింపు పలికేలా జనసేన నేతలకు  పవన్ స్పష్టత ఇచ్చారు. పవన్ వారాహీ యాత్రలో తనను సీఎంను చేయాలని కోరడం.. అభిమానులు సీఎం నినాదాలు, మీరు తలచుకుంటే సీఎం అవుతానని, మీరు తనని సీఎం చేయాలని మాట్లాడడం, పలుచోట్ల అభ్యర్థులకు టికెట్ల హామీ ఇవ్వడంతో పవన్ టీడీపీతో పొత్తుకు వెనక్కు తగ్గినట్లుగా ప్రచారం మొదలైంది. దీనికి తోడు కొందరు జనసేన నేతలు పలు టీవీ చానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూలలో తమకు పొత్తు అవసరం లేదని.. ఈసారి ఎలాగైనా జనసేన అభ్యర్థులు గెలుస్తారని మాట్లాడంతో పొత్తు అంశం వెనక్కు వెళ్లినట్లుగా ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా జనసేన ఈ తరహా పోస్టులు పెడుతుండడంతో టీడీపీ సానుభూతిపరులు వాటికి గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రచారం మరింత ముదిరి టీడీపీ-జనసేనల మధ్య దూరం పెరగకముందే పవన్ కళ్యాణ్ జనసేన నేతలు ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే  పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహీ విజయ యాత్ర పూర్తి చేసుకోగా.. ఈ యాత్రకి ఆశించిన స్థాయి కంటే ఎక్కువ మైలేజీ వచ్చింది. జనసేన నేతలు, పవన్ అభిమానులలో ఈ యాత్ర జోష్ పెంచింది. ఈ క్రమంలోనే ఈ వేడిలోనే పవన్ రెండో దశ వారాహి యాత్రకి సిద్ధమవుతున్నారు. దీని కోసమే తాజాగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పొత్తులపై కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ఇకపై మీడియా ముందు కానీ.. సోషల్ మీడియాలో కానీ జనసేన నేతలు పొత్తుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని పవన్ తేల్చి చెప్పారట. పొత్తుల గురించి మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించవద్దని కోరారట. అంతే కాదు,  పార్టీ నేతలు టీవీ చర్చల్లో కానీ, పార్టీ సమావేశాలలో కానీ ఎక్కడా పొత్తుల గురించి మాట్లాడవద్దని.. ఒకవేళ అలా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు కూడా వెనకాడబోమని చెప్పారట. పార్టీకి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఎంతో ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను నిర్ణయాలు తీసుకుంటానని, అదే పొత్తుల విషయంలో ఇంకెంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటానో, ఎంత లోతుగా చర్చిస్తానో పార్టీ నేతలు అర్థం చేసుకోవాలని కోరిన పవన్.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల మనోభావాలు తెలుసుకుని.. లోతుగా అధ్యయనం చేశాకనే పొత్తులపై నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకూ సంయమనం పాటించాలని చెప్పారట. అయితే, టీడీపీతో పొత్తు ఖరారు అయిన అంశమే కావడంతో దీనిపై స్పందించి అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా పవన్ ఈ హెచ్చరికలు జారీచేసినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు బీజేపీ అంశం తేలే వరకూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఉండదు. ఈ లోగా టీడీపీ-జనసేన మధ్య దూరం పెరిగే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అందుకోసమే పవన్ పార్టీ నేతల నోళ్ళకి తాళం వేసినట్లు భావించాల్సి వస్తుంది.

రణరంగం తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి vs కేతిరెడ్డి

తాడిపత్రిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు బజారుకెక్కి బూతులతో విరుచుకుపడే స్థాయికి చేరింది. ఏడాది క్రితం వేసిన చీనీ తోట మూడేళ్ళకు కాపుకు రావాల్సి ఉండగా   ఏడాదికే కాపు రాక నష్టపోయినట్లుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రూ. 13.89 లక్షల పంట బీమా కొట్టేశారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు చీనీ తోటలను పరిశీలించేందుకు కేతిరెడ్డి తోటకు వెళ్తానంటూ సవాల్ కూడా విసిరారు. దీంతో జేసీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.  ఈక్రమంలో జేసీకి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ప్రతి సవాల్ విసిరారు. క్రాప్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే తనకూ వచ్చిందని.. జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని.. కాబట్టి ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాదు పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనే వాడు ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తన తోటలో అడుగు పెట్టి చూడాలని సవాల్ విసిరారు. నాకు ఎమ్మెల్యే పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష.. ఆ పదవే ఇప్పుడు లేకపోతే జేసీని ఇంటిలో నుంచి బయటకి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి తాడిపత్రి పట్టణమంతా తిప్పేవాడినని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అంత పనికిమాలిన వాడిని ఈ రాష్ట్రంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. కాగా, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మొదలైన ఆరోపణల పర్వం తాడిపత్రి పట్టణమంతా వ్యాపించింది. టీడీపీ, వైసీపీ వర్గాలలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో నియోజకవర్గంలోని మిగతా టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు చినీ తోటకి కాపలా ఉన్నారు. దీంతో ఏ నిముషానికి ఏం జరుగుతుందో అనేలా వాతావరణం మారిపోయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఏది ఏమైనా జేసీ వర్గం చీనీ తోటకి వెళ్లి సందర్శించి అసలు వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలని చూస్తుంటే ఎమ్మెల్యే వర్గం దాన్ని అడ్డుకోవాలని చూస్తుంది. అయితే, నిజానికి జేసీ ఆరోపించిన దానిలో నిజం లేకపోతే ఎమ్మెల్యే కేతిరెడ్డి భయపడాల్సిన పనిలేదు. మీడియాతో సహా ఓ హార్టికల్చర్ అధికారిని తీసుకుని చీనీ తోటకి వెళ్లి చూసుకుంటే అసలు నిజం తేలిపోతుంది. నిజంగానే పంట పెట్టి మూడేళ్లయినా కాపు లేక నష్టపోయి ఉంటే ఆరోపణలు చేసిన జేసీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. కానీ, అదేమీ లేకుండా అసలు తోటకి వెళ్లే వారిని అడ్డుకోవడం.. ఇలా వాడు వీడు అంటూ చెప్పుతో కొడతా అంటూ బూతులు లంకించుకోవడం చూస్తుంటే జేసీ ఆరోపణలే నిజమా అన్న భావన కలుగుతున్నది. ఓ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడంతో మరోసారి వైసీపీ నైజం ఇదేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో మంత్రుల దగ్గర నుండి మహిళా ఎమ్మల్యేల వరకూ ఈ బూతు పురాణంలో చెడ్డపేరు తెచ్చుకోగా కేతిరెడ్డి వారి జాబితాలోనే చేరి పార్టీ పరువు గంగలో కలిపేస్తున్నారు. ఇక  తాడిపత్రిలో ఈ హీటెక్కిన రాజకీయం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సి ఉంది.

పవన్ కోరిన రూట్ మ్యాప్ పురందేశ్వరి ఇస్తారా?

ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. ఒకవైపు అధికార పార్టీ మరోసారి అధికారం దక్కిచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటే..  ప్రజలలో  పెరిగిన జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా  మార్చుకునేందుకు  ప్రతిపక్షాలు ప్రజల మధ్యకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పాదయాత్ర, బస్సు యాత్ర మొదలు పెట్టగా.. బీజేపీ ప్రక్షాళన మొదలు పెట్టింది. దీంతో ఎన్నికల రోహిణీకార్తె వేడిని మించిపోయింది.  అయితే, ఏపీ రాజకీయాలను మలుపుతిప్పే అంశం ఏదైనా ఉందంటే అది పొత్తులే. ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకూ రాజకీయం ఒకలా ఉంటే ఒక్కసారి పొత్తులపై స్పష్టత వస్తే  ఆ తర్వాత ఉండే మజానే వేరు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా.. సింగల్ గానే పోటీకి దిగుతారా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే  బీజేపీ-జనసేన అధికారికంగానే పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. పొత్తులో ఉన్నా ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీలూ కలిసి చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదు. దీనిపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇప్పటంలో జనసేన సమావేశం.. ఆ తర్వాత ప్రభుత్వం కక్షసాధింపుతో ప్రజల ఇళ్లను ధ్వంసం చేయడం.. మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడే ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేపట్టడం అందరూ చూసిందే. కాగా  అప్పుడు అక్కడ జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తుందని ఎదురుచూస్తున్నానని.. అది తనకు ఇస్తే ఏపీలో వైసీపీని గద్దె దించుతామని  స్పష్టం చేశారు. దానికి ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు బీజేపీ రోడ్ మ్యాప్ వెరీ క్లియర్ అని అది ఎపుడో పవన్ కి ఇచ్చేశామని కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా సోము వీర్రాజు కౌంటర్ అయితే ఇచ్చారు కానీ పవన్ అడిగిన రోడ్ మ్యాప్ మాత్రం  ఇవ్వలేదు.  ఇవ్వకుండానే ఆయన బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇ  మాజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరికి పార్టీ రాష్ట్ర పగ్గాలను బీజేపీ అధిష్ఠానం అప్పగించింది.  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ రాజకీయాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, రానున్న ఎన్నికలలో పొత్తులపై కూడా చర్చించారని అంటున్నారు. ఇక  ఆమె ఢిల్లీ నుంచి విజయవాడ  వచ్చి ఏపీ బీజేపీ చీఫ్ గా పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్ కనుక ఎలాగూ ఆ పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలు ఆమెకి ఘనస్వాగతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అధ్యక్షురాలిగా ఆమె తన వర్గాన్ని కూడా సిద్ధం చేసుకోవడం కామనే. ఎలాగూ అధిష్టానం చెప్పే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆమె కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే  ఇప్పుడు పవన్ కి పురందేశ్వరి రోడ్ మ్యాప్ ఇస్తారా? ఈ రోడ్ మ్యాప్ బీజేపీకి నచ్చినట్లుగా ఉంటుందా లేక పవన్ కోరుకుంటున్నట్లుగా ఉంటుందా?  అన్నదే ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు మొదలైన దగ్గర నుండి ఎటు చూసినా దారులు వేరుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు టీడీపీ పేరు లేకుండా ఇదే మాట   ప్రకటించేశారు.  బీజేపీ మాత్రం ఆ విషయంలో  ఇప్పటికీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. నోటితో పలకరించి నొసటితో వెక్కిరించిన చందంగా సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇంతకుముందున్న అధ్యక్షుడైతే   టీడీపీని ప్రధాన శత్రువుగా చూసే వారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు? సోము వీర్రాజు టైంలో జనసేనతో ఏర్పడిన గ్యాప్ ఇప్పుడు తొలగిపోతుందా?.. జనసేన బీజేపీ కలసి తెలుగుదేశంతో కలిసి పని చేస్తాయా అన్నది చూడాలి.