TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

జగన్ ‘చేయి’ అందుకోనున్నారా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ చేయి’ అందుకోనున్నారా? గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా? జగన్ రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నారా? తాను విభేదించి బయటకు వచ్చిన కాంగ్రెస్ తో చెలిమికి తహతహలాడుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. దశాబ్దకాలంగా బీజేపీతో ఏకపక్షంగా స్నేహం చేసిన జగన్ ఇప్పుడు తన దృష్టిని కాంగ్రెస్ వైపు మళ్లించారంటున్నారు. ఇందుకు వారు ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తో జగన్ రహస్య భేటీని ఉదహరిస్తున్నారు. జగన్ ఇటీవల బెంగళూరులో కేసీ వేణుగోపాల్ తో రహస్యంగా భేటీ అయ్యారన్నప్రచారాన్నిపూర్తిగా కొట్టి పారేయలేమని పరిశీలకులు అంటున్నారు. హస్తిన ఢిల్లీ పీఠంపై మారిన సమీకరణాలు, ఏపీలో 2024 ఎన్నికల అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ రహస్య భేటీలోనే వైసీపీ జాతీయ స్థాయిలో ఎలాంటి పాత్ర పోషించాలి, రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణించేందుకు ఉన్న అవకాశాలు? తదితర అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. రాష్ట్రం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాతవైసీపీ సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికార కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉండటంతో జగన్ కు గతంలోలా ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి అండ, ఆసరా కరవైంది. కేంద్రంలో, బీజేపీ అగ్రనేతలలో చంద్రబాబు మాటకే చెల్లుబాటు అధికంగా ఉంటోంది. అలాగే.. జగన్‌పై గతంలో అక్రమాస్తుల కేసు సహా పలు కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. వాటి దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థలునమోదైన పాత కేసులు మళ్లీ తెరపైకి రావడం, దర్యాప్తు సంస్థల విచారణల వేగం పుంజుకోవడం ఆయనలో ఆందోళనను పెంచాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక కమలనాధులను ప్రాధేయపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదన్న భావనకు వచ్చిన ఆయన.. రాజకీయంగా రాష్ట్రంలో తాను, తన పార్టీ బలోపేతం కావాలంటే.. ‘హస్తం’ చేయి అందుకోవడం వినా మరో మార్గం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. బెంగళూరు వేదికగా కేసీ వేణుగోపాల్ తో జరిగినట్లు చెబుతున్న రహస్య భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. పుష్కర కాలంగా కేంద్రంలో అధాకారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించిన జగన్ ఇప్పుడు తాను కమలం పార్టీకి కటీఫ్ చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు.. సమయంలో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ప్రతిష్ట పెరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. [YS Jagan Mohan Reddy secreat Meeting With KCVenugopal, BJPTies Severed, Congress Party, INDIA Alliance, Bengaluru]

Published on: Mon Aug 31, 2026 5:07PM

political-news-img

సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి నెక్స్ట్ టార్గెట్ జగనేనా?

విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్‌కు కుడిచేయిలా ఉండేవారు. అంతే కాదు వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.అంతేనా ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయమే వ్యాపకమన్నారు. అయితే ఆ మాటకు కట్టుబడి ఉండలేదు. తాజాగా సొంత పార్టీ ప్రకటించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానన్నారు. ఈ లోగానే వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత కోటరీపైనా సంచలన విమర్శలతో ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్ అనుచర వర్గాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని సాయి రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన లేఖలో విజయసాయి.. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పనిలో పనిగా జగన్ పట్టించుకోలేదంటూ నిష్టూరమాడాడు. గతంలో కూడా పలు సందర్భాలలో వైసీపీలో జగన్ కోటరీపై విమర్శల దాడులు చేసిన విజయసాయి రెడ్డి తన తాజా బహిరంగ లేఖలో మాత్రం సజ్జల టార్గెట్ గా నేరుగానే విమర్శల దాడి చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడాన్ని నిలదీశారు. అలాగే జగన్ పట్ల తాను ఎంత లాయల్ గా ఉన్నానో చెప్పుకొచ్చారు. తానెన్నడూ జగన్ కు ద్రోహం చేయలేదన్న విజయసాయి.. జగన్ కోసం తాను ఎంతో చేశానని చెప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే తాను ఏ2 అని గుర్తు చేశారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, కాకినాడ పోర్ట్ కేసుల్లో కూడా తన పేరు ఉందనీ, వీటి వేటిలోనూ సజ్జల పేరు ఎందుకు లేదని ప్రశ్నలు గుప్పించారు. అక్కిడితో ఆగకుండా.. సజ్జలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో, తెలుగుదేశంతో కు రహస్య అవగాహన ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడు అంటూ పేరు చెప్పకుండా ఆరోపణలు, విమర్శలూ గుప్పించారు. ఆ నాయకుడే జగన్ మనసులో తనకు వ్యతిరేకంగా విషం నింపారనీ, ఇప్పుడా నాయకుడు నాయకుడు తెలుగుదేశం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్నారు. వైసీపీని వీడిన తరువాత నుంచీ సాయిరెడ్డి.వరుసగా ప్రణాళికా బద్ధంగా ఆ పార్టీపై విమర్శలు ఆరోపణలూ చేస్తున్న క్రమం గమనిస్తే.. ఆయన నెమ్మది నెమ్మదిగా జగన్ ను టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తన ఆరోపణలన్నీ ఒకే సారి గుప్పించలేదు. తొలుత జగన్ కోటరీ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా సాఫ్ట్ గా విమర్శించారు. ఆ తరువాత జగన్ కోటరీ ఆయనను తప్పుదోవపట్టిస్తోందనీ, జగన్ గమనించాలనీ సూచించారు. ఆ తరువాత కొందరి పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలూ, విమర్శలూ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కర్త, కర్మ, క్రియా అన్నీ రాజ్ కేసిరెడ్డే అని తొలుత చెప్పినది విజయసాయిరెడ్డే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవల జగన్ హయాంలోనే రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు భారీగా జరిగాయని బాంబు పేల్చారు. ఇప్పుడు తాజాగా నేరుగా సజ్జలపై విమర్శలూ, ఆరోపణలూ గుప్పించారు. 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో సజ్జల తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్న విజయసాయి, అప్పుడు జగన్ ప్రేక్షక పాత్ర వహించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. ఇప్పటి దాకా జగన్ ను నేరుగా విమర్శించలేదు. తాజా బహిరంగ లేఖలో మాత్రం జగన్ మౌనాన్ని నిలదీశారు. ప్రశ్నించారు. తద్వారా తన ఆరోపణలపై జగన్ స్పందించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకు వచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే.. తన కొత్త పార్టీ ప్రారంభించిన తరువాత ఇక ఆయన నేరుగా జగన్ నే టార్గెట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక . స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి. {Vijayasai Reddy Next Target Jagan,Vijaya Sai Open Letter, Sajjala, Attack Ycp Internal Crisis, AP Politics, Telugu One}

Published on: Sun Aug 30, 2026 9:55AM

political-news-img

‘స్థానిక ఎన్నికలు..వైసీపీ ద్వంద్వ వైఖరి.!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైపీపీ ద్వంద్వ వైఖరీ, డోలాయమానం, అదే సమయంలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఓ వైపు స్థానిక పోరులో గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల ఆశావహులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే.. సదరు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనని హెచ్చరించాడు. అదే సమయంలో ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకపక్క గెలుపే లక్ష్యంగా నిలవాలంటూ అధినేత పార్టీ శ్రేణులలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తుంటే.. మరోపక్క పార్టీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరినీ, ఎన్నికల విషయంలో ద్వేదీ భావాన్నీ, అదే సమయంలో ఓటమి భయాన్నీ సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికలను వీలైనంత వరకు వాయిదా వేయించేందుకే సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తూ కోర్టును ఆశ్రయించడం ఆ పార్టీలో స్థానిక పోరు విషయంలో ఎంత గందరగోళం నెలకొని ఉందో అర్ధమౌతున్నదంటున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ఆ పిటిషన్‌లో కోరారు. పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడం సరికాదని, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వాదనపై న్యాయ, ఎన్నికల విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్నంత మాత్రాన ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధన ఎక్కడా లేదని, గతంలో నిర్ణయించిన అర్హత తేదీల ప్రకారం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ నాయకులతో జరిపిన సమీక్ష సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం ఇస్తే సహించేది లేదని, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు. అంతేకాకుండా, స్థానిక పోరులో నిర్లక్ష్యం వహిస్తే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఓటమి భయంతోనే న్యాయపోరాటాల పేరుతో కాలయాపన చేయాలని చూస్తున్నారనే చర్చ మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే ఆశించిన ఫలితాలు రావేమోనన్న ఆందోళన వైసీపీలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్న వైకాపా, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలు గెలుచుకోలేకపోతే ఆ ప్రచారం తప్పని రుజువై ఉన్న కాస్తపరువూమంటగలుస్తుందన్న భయంలో ఉంది. అందుకే వీలైనంత కాలం ఎన్నికల వాయిదా దిశగా వ్యూహాలు పన్నుతోందనీ, అందులో భాగంగానే ఎన్నికల నిలుపుదల కోరుతూ కోర్టును ఆశ్రయించిందని చెగుతున్నారు. {AP Local Body Elections, YSRCP High Court Petition, YS Jagan Mohan Reddy, Lella Appi Reddy, Voter List Special Intensive Revision, AP Politics News, Local Bodies Grant}

Published on: Sat Aug 29, 2026 3:39PM

political-news-img

ఏపీలో స్థానిక సమరం.. వైసీపీలో అయోమయం.!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఆరంభమైన వేళ వైపీపీలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైపీపీ స్థానిక పోరులో సత్తా చాటలని ఆ పార్టీ అధినేత జగన్ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చి దిశా నిర్దేశం చేసినప్పటికీ పార్టీలో ఇసుమంతైనా ఉత్సాహం కనిపించడం లేదు. ఏకగ్రీవాలు కూడదు, అన్ని స్థానాలలోనూ గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని జగన్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రం ఆయన ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో క్షేత్రస్థాయి నాయకత్వం అయోమయంలో పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత.. జగన్ వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాష్ట్రానికి రావడం, అదీ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం పట్ల క్షేత్ర స్థాయి క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆదేశాలు వినా ఆయన.. స్థానిక పోరుకు సంబంధించిన ప్రణాళిక, వ్యూహాల గురించి మాట్లాడకపోవడంతో అసలేం చేయాలి? స్థినిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో పార్టీలో అయోమయ పరిస్థితులలో ఉందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ ఆదేశాల పట్ల పెదవి విరుస్తున్నారు. వ్యూహం లేకుండా స్థానిక పోరులో సత్తా చాటండి అన్న అదేశాలు నిష్ప్రయోజనమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ఇసుమంతైనా అవకాశం, బలం లేని చోట్ల పోటీలో నిలిచి ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయాన్ని వైసీపీ సీనియర్లే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పార్టీ అధినేత ప్రకటిస్తున్న లక్ష్యాలు, తీసుకుంటున్న నిర్ణయాలకూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ అసలు పొంతనే లేదన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ఎక్కువగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థతి, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు, సమస్యలు ఇవేవీ జగన్ దృష్టికి వెళ్లడంలేదని, అందుకే ఆయన నేల విడిచి సాము చేస్తున్న చందంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని క్యాడర్, స్థానిక నాయకులు అంటున్నారు. వీటన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో వైసీపీ సీనియర్లు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాల కారణంగా పోటీలో నిలబడినా.. అది నామమాత్రమే అవుతుందన్న ఆవేదన క్షేత్రస్థాయి క్యాడర్ లో వ్యక్తమౌతోంది. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు, క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలనీ, అలాగే పార్టీలో అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసి, ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా ఇవ్వకుంటే.. స్థానిక పోరులో భంగపాటు తప్పదని వైసీపీ నేతలే అంటున్నారు. (YCP Cader Confusion, Ap Local Body Elections, YCp Local Body Elections Strategy, YCP Leaders Unrest, Andhra Pradesh Politics, Telugu One)

Published on: Fri Aug 28, 2026 1:53PM

political-news-img

జగన్ బొత్సను పక్కన పెట్టేసినట్లేనా?

వైసీపీలో నాయకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఎవరూ చెప్పలేరు. వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటున్నారు. పార్టీ పరాజయం తరువాత జగన్ ఎంతో నమ్మకంగా ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలను బొత్సకు అప్పగించారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా పరాజయం పాలైనప్పటికీ బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష హోదా కల్పించారు. అయితే ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. అన్నిటికీ మించి.. బొత్స అడుగులు జనసేన వైపు పడుతున్నాయంటూ ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న ప్రచారాన్ని బొత్స గట్టిగా ఖండించకపోవడంతో జగన్ లో బొత్స ను ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యత నుంచి తప్పించి కొత్త వారికి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బొత్సకు ప్రత్యామ్నాయంపై బొత్స దృష్టి పెట్టారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక బొత్స వైఖరి మారిందన్న అనుమానం జగన్ లో కలగడానికి ప్రధాన కారణం ఇటీవలి కాలంలో బొత్స పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడమేనంటున్నారు. బొత్స తన కుమారులను రాజకీయాలలోకి తీసుకురావాలని భావిస్తున్నారనీ, 2024లోనే ఆ దిశగా ప్రయత్నించినా జగన్ అందుకు అంగీకరించలేదన్న చర్చ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ తరఫున వారు రాజకీయం అరంగేట్రం చేస్తే భవిష్యత్ ఉండదన్న యోచనతో బొత్స చూపు జనసేన వైపు మళ్లిందని చెబుతున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర పై బొత్స పెత్తనాన్ని వైసీపీలోని మిగిలిన సీనియర్ నేతలు అంగీకరించడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ధర్మాన వంటి సీనియర్ నేతలను బొత్స ఇసుమంతైనా పట్టించుకోవడం లేదని అంటున్నారు. బొత్స తీరుపై ధర్మాన ప్రసాదరావు కుమారుడైతే బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కూడా బొత్స విషయంలో పునరాలోచనలో పడి బొత్సను పక్కన పెట్టే యోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. Jagan keep aside Botsa Satyanarayana, YCP Uttarandhra, YCP Politics TeluguOne

Published on: Wed Aug 26, 2026 2:05PM

political-news-img

జెన్ జీ విచ్ఛిన్నానికేనా రిజర్వేషన్ హటావో ఆందోళన?

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా రిజర్వేషన్ హటావో’ పేరుతో యువత చేపట్టిన ఆందోళన ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల నీట్ లీక్ కు వ్యతిరేకంగా జెన్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన దేశవ్యాప్తంగా విద్యార్థులను, నిరుద్యోగులను,యువతను ఐక్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనలు ఆ ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో రిజర్వేషన్ హటావో ఆందోళన్ మిలియన్ల ఫాలోవర్లతో నెట్టింట జోరుగా ప్రచారం కావడం విశేషం. రిజర్వేషన్ వ్యవస్థపై సమగ్రమైన విశ్లేషణ చేసేందుకు ఒక జాతీయ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, గత ఎనిమిది దశాబ్దాలుగా అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రభావంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆందోళన కారులు కోరుతున్నారు. అలాగే కులం కంటే ఆర్థిక పరిస్థితులకే ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరింత ఊతం ఇవ్వాలని, పోటీ పరీక్షల్లో కనీస అర్హత మార్కులను సమానంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. 1990లో మందల్ కమిషన్ నివేదిక అమల్లోకి వచ్చిన సమయంలో దేశం ఎలాంటి సామాజిక మార్పులకు, ఘర్షణలకు లోనైందో, మళ్లీ అలాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన (ఆర్ హెచ్ ఏ) ఆరంభమైందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికీ ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ పోస్టుల్లో షెడ్యూల్డ్ ఎస్సీఎస్టీ బీసీ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగానే ఉందన్నది ప్రభుత్వ రికార్డుల ద్వారా తేటతెల్లం అవుతోంది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు , ఆర్టికల్ 15, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన ప్రాతినిధ్యం ద్వారా లభించిన హక్కులు కేవలం కేటాయింపులు కావు అని, అవి దశాబ్దాల తరబడి వివక్షకు గురైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కల్పించిన రాజ్యాంగ రక్షణలు అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వంటి నాయకులు స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్ హటావో ఆందోళన్ నిర్వాహకుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని స్వయంగా కేంద్ర మంత్రి స్థాయి అధికారి ద్వారా చర్చలు జరుపుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగాలు, విద్యావ్యవస్థలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ వివాదాన్ని రగిలిస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో బలంగా వ్యక్తమౌతున్న పరిస్థితి. Reservation Hatao Movement at Jantarmantar, Gen Z debate India, Jantar Mantar protest, Reservation reform demand, Indian affirmative action

Published on: Mon Aug 24, 2026 12:03PM

political-news-img

తెలంగాణ సీఎం మార్పు?

తెలంగాణ అధికార కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా ఆలపిస్తున్న అసమ్మతి రాగాలూ.. సీఎం మార్పుదిశగా పడుతున్న అడుగులకు సంకేతాలంటూ రాజకీయవర్గాలలో చర్చ ఆరంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ సీనియర్ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి పట్ల సొంత పార్టీలో కొందరు సీనియర్లు, మంత్రులూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గం ఆయనను పదవి నుంచి తప్పించేందుకు అధిష్ఠానం వద్ద తీవ్రస్థాయిలో పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను సీనియ నాయకుడు బాహాటంగానే బహిరంగంగానే ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులలో కూడా అయోమయానికి కారణమౌతోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి శైలిపై అసమ్మతి వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం వ్యక్తమౌతున్నంత స్థాయిలో లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పట్ల వ్యక్తమౌతున్న అసంతృప్తి, అసమ్మతి.. అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిందంటున్నారు. మరో వైపుబిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు రేవంత్ రెడ్డి సోదరులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ చేస్తున్న ఆరోపణలు విమర్శలూ కూడా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని కర్నాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యపై ఒకే సమయంలో చుట్టుముట్టిన విమర్శలు, ఆరోపణలతో తెలంగాణలో రేవంత్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను పోలుస్తున్నారుర పరిశీలకులు. సిద్దరామయ్యకు లాగా రేవంత్ పదవికి ఈ ఆరోపణలు, విమర్శలుఇది ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయంటున్నారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటి అగ్రనేతలతో కూడా రేవంత్ రెడ్డికి విభేదాలు పొడసూపాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మమేష్ కుమార్ గౌడ్, భట్టిలు నిరంతరం కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదంపులు జరుపుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఏ మంత సంతృప్తిగా లేదన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, హైకమాండ్ రేవంత్ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నదనడానికి సంకేతంగా చెబుతున్నారు. ఇదే రీతిలో అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. సొంత పార్టీలోని నాయకుల అసంతృప్తి, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ తెలంగాణలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో పెరిగిందనడం మాత్రం వాస్తవం. Telangana political heat, Revanth Reddy news, Telangana Politics,Telangana Congress Dissidence, KTR Allegation, Konda Comments Telangana CM Change Rumors

Published on: Sat Aug 22, 2026 10:44AM

political-news-img

వైసీపీలో తమ్మినేనికి ఉక్కపోత?.. అయినా కొనసాగక తప్పని అనివార్యత.!

తమ్మినేని సీతారాం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తమ్మినేని సీతారాం. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా ఉంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న తమ్మినేని సీతారాం ఆ పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నారు. పట్టించుకునే నాధుడే లేడు. పార్టీలో పలకరించే దిక్కు లేదు. ఆయన పార్టీలో ఉన్నారంటే ఉన్నారంతే.. సీనియారిటీకి గుర్తింపు లేదు. పార్టీ అధినేత జగన్ పట్టించుకోరు. దీంతో తమ్మినేని రాజకీయ ప్రయాణం గందరగోళంలో పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోనూ, ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు తమ్మినేని సీతారాం. వైసీపీ హయాంలో శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయనకు పార్టీ పరంగా ఇసుమంతైనా ప్రాముఖ్యత లభించడం లేదు. పార్టీ కార్యక్రమాలు, నిర్ణయాల్లో ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. Suffocation to Tammineni Seetharam in YCP, YCP Politics, YS Jagan Mohan Reddy, Srikakulam Politics, TeluguOne

Published on: Fri Aug 21, 2026 4:40PM

political-news-img

వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయవారసత్వం?

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి మూడో తరం రాజకీయవారసత్వం రాబోతోందా? ఆయన మనవరాలు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కుమార్తె హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కుటుంబ ప్రాభవం తగ్గుతున్న సూచనల నేపథ్యంలో జిల్లాపై ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ తన కుమార్తెను వ్యూహాత్మకంగా రాజకీయాలలోకి దించుతున్నారా అంటే.. ఔననే వినిపిస్తున్నది. కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే కడప జిల్లాలో మాత్రం హర్షారెడ్డి రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రచారం నిజమే అయితే.. అంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే.. అది కేవలం ఒక కుటుంబ సభ్యురాలి ఎంట్రీ మాత్రమే కాకుండా, వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వ కొనసాగింపుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా యువతను, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆమె పొలిటికల్ ఎంట్రీ దోహదపడుతుందన్న విశ్వాసం వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తమౌతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హర్షారెడ్డి కడప నుంచి లోక్ సభ లేదా అసెంబ్లీ బరిలోకి దిగుతారు. అయితే అంతకంటే ముందు.. పార్టీ సంస్థాగత, యూత్ విభాగాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాయలసీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు ఇటీవలి కాలంలో సడలింది. జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా వైఎస్ సునీత, షర్మిల నిలబడటంతో వైఎష్ కుటుంబ ఓటు బ్యాంకు కూడా నిట్టనిలువుగా చీలిపోయిందంటున్నారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అంటూ జరిగితే.. పరిస్థితులు జగన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందన్న ఆశాభావం వైసీపీయులలో వ్యక్తమౌతోందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతానికి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రచారం స్థాయిలోనే ఉంది. ఈ విషయంలో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే ఆమె రాజకీయ ప్రవేశం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. Harsha Reddy Political Entry, YS Jagan Daughter Harsha Reddy, AP Politics News, YSRCP Kadapa Politics, Harsha Reddy Kadapa Contest

Published on: Thu Aug 20, 2026 12:42PM

political-news-img

అసెంబ్లీ బహిష్కరణ.. అప్పట్లో చంద్రబాబుపై అనర్హత వేటెందుకు పడలేదంటే?

ఏపీలో అసెంబ్లీ గైర్హాజర్. అనర్హత వేటుపై చర్చ ఓ రేంజ్ లో సాగుతోంది. విపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి వైసీపీ సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ కారణంగా ఈ చర్చ ఇప్పుడు జోరందుకుంది. సభకు నిరవధికంగా గైర్హాజరు కావడం వల్ల వైసీపీఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంన్న ప్రచారం నేపథ్యంలో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించారు, అప్పుడు ఆయనపై అనర్హత చర్యలు తీసుకోలేదంటూ వైసీపీయులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం.. ఏదేని రాష్ట్ర శాసనసభలోని సభ్యుడు సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, వారి స్థానాన్ని ఖాళీగా ప్రకటించి అనర్హత వేటు వేసే అధికారం సభకు ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల సరళిని పరిశీలిస్తే.. వైసీపీ నేతలపై గైర్హాజరు కారణంగా అనర్హత వేటుకు వారు అర్హులయ్యే సమయం ఇంకెంతో దూరంలో లేదు. ఎందుకంటే.. త్వరలోనే వారు గైర్హాజరైన శాసనసభ పనిదినాల సంఖ్య 60 రోజులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ చంద్రబాబు విపక్ష నేతగా అసెంబ్లీ బాయ్ కాట్ చేసిన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అప్పట్లో ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. 2021లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బహిష్కరించిన ఉదంతానికి, ఇప్పటి వైసిపి ఎమ్మెల్యేల వైఖరికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో చంద్రబాబు సభను బహిష్కరించినప్పటికీ, ఆయన గైర్హాజరైన కాలంలో అసెంబ్లీ 40 రోజులకు మాత్రమే పని చేసింది. అంటే చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ సమయంలో అసెంబ్లీ 40 పని దినాలు మాత్రమే సమావేశమైంది. రాజ్యాంగంలో పేర్కొన్న 60 రోజుల పరిమితిని అది దాటకపోవడంతో ఆర్టికల్ 190(4) ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఒకవేళ అప్పుడు వైసిపి హయాంలో చంద్రబాబు 60 రోజుల పనిదినాల నిబంధనను దాటి ఉంటే, కచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే, ఆ సమయంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించాలని వైసిపి ఓ రేంజ్ లో ప్రయత్నాలు చేసింది. కానీ.. నాటి సమావేశాల కాలపరిమితి చట్టబద్ధమైన పరిమితిని దాటకపోవడంతో సాంకేతికంగా ఆయనపై చర్యలకు అవకాశం లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే, వైసిపి ఎమ్మెల్యేలలో కొందరు గతంలో వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లగా, ఇటీవల గవర్నర్ ప్రసంగం సమయంలో జగన్తో పాటు ఇతర సభ్యులు సభలో నిరసన తెలిపారు. అయితే, గవర్నర్ ప్రసంగానికి హాజరుకావడాన్ని సభా నిర్వహణ హాజరుగా పరిగణించలేమని ఇప్పటికే స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ఆ రోజు వైసిపి సభ్యుల హాజరు నమోదవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం గనుక చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తే.. వైసిపి ఎమ్మెల్యేల సభ్యత్వాలు ప్రమాదంలో పడతాయి. అదే జరిగితే రాష్ట్రంలో 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో? #APAssemblyBoycott #YSRCPMLAsDisqualification #ChandrababuNaidu #AssemblyBoycott, APPolitics, TeluguOne

Published on: Wed Aug 19, 2026 6:23PM