Read more!

English | Telugu

పిఠాపురంలో చిరంజీవి రోడ్‌ షోకి సర్వం సిద్ధం.. చిరు వెంట చరణ్‌, నాగబాబు!

Publish Date:Apr 27, 2024

ఎపిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగుతున్నారు. పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి ప్రచారం చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారికంగా ఆ విషయాన్ని ఖరారు చేశారు. 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడామె వైసీపి పార్టీ తరఫున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వంగా గీతను ఓడిరచి తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ఓటర్లను అభ్యర్థించేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ వేసినపుడు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సామాజిక సమీకరణాల ప్రభావం పిఠాపురంలో ఈసారి గెలుపు ఓటములను నిర్దేశించనుంది.  పవన్‌ ఇప్పటికే రెండు సభలు నిర్వహించారు. పిఠాపురం పైన తన విజన్‌ ఏంటో వెల్లడిరచారు. ఇదిలా ఉంటే.. పవన్‌ పార్టీకి కొద్ది రోజుల క్రితం చిరంజీవి రూ 5 కోట్ల విరాళం ఇచ్చారు. టీడీపీ కూటమి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్‌, పెందుర్తి నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్‌బాబుకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. వారిని గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చారు. జనసేన పార్టీని, పవన్‌కళ్యాణ్‌ని గెలిపించేందుకు చిరంజీవి మే 5 నుంచి పిఠాపురంలో ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మొదట పిఠాపురం వచ్చి ఆ తర్వాత గొల్లప్రోలు, పిఠాపురం టౌన్‌లలో రోడ్‌ షో నిర్వహిస్తారు. ఈ రోడ్‌ షోలో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌, నాగబాబు కూడా పాల్గొంటారని సమాచారం. చాలా కాలం తరువాత చిరంజీవి రాజకీయంగా ప్రచారానికి వస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కనిపిస్తోంది. చిరంజీవిని అనకాపల్లిలోనూ ప్రచారం చేయాలని సీఎం రమేష్‌ కోరుతున్నారు. దీని పై చిరంజీవి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చిరంజీవి తలపెట్టిన ప్రచారంలో అభిమానులతో పాటుగా జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనేలా అందరికీ సమాచారాన్ని అందించారు. 

Prasanth Varma to start Big Bollywood project before Jai Hanuman?

Publish Date:Apr 27, 2024

‘HanuMan’, starring Teja Sajja, was directed by Prasanth Varma, who took viewers by surprise in January 2024. The movie was a huge hit in Telugu and Hindi, and there is a lot of talk about the sequel, ‘Jai HanuMan’. Although it's still a work in progress, the reports are doing the rounds on the internet that Prasanth Varma and Ranveer Singh are making a massively budgeted period film. Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film soon. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. Sources say, "Ranveer Singh is a big fan of Prasanth Varma's work and met him right after the release of ‘HanuMan’. The director has been in talks with the actor for a big-budget film for the last three months. They have met multiple times and continue to be in discussions. Ranveer is sold on the idea and acknowledges the fact that it’s a very ambitious project. It’s a yes from Ranveer for the film in principle and the team is now figuring on other modalities to get things started."

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌. ఎందుకో తెలుసా?

Publish Date:Apr 27, 2024

సినిమా రంగంలో అద్భుతాలు సృష్టించాలంటే అది అందరి వల్లా అయ్యేది కాదు. ఎంతో డెడికేషన్‌, పట్టుదల, అన్నింటినీ మించి సమిష్టి కృషి ఉంటేనే అది సాధ్యమవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి అద్భుతాల్ని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి ప్రత్యేకత కలిగిన సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఒకటి. ఇలాంటి ఒక మరపురాని సినిమా, చరిత్ర సృష్టించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం వెనుక ఎంతోమంది శ్రమ, కృషి దాగి వున్నాయి. ఈ అద్భుత చిత్రరాజం ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసి 34 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటికీ ఈ సినిమాకి వన్నె తగ్గలేదు. ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది. ఈ కథకు పాత, కొత్త అనే తేడా లేదు. ఎన్ని జనరేషన్లు మారినా, కొత్త ట్రెండ్లు ఎన్ని వచ్చినా, ఎవర్‌గ్రీన్‌ చిత్రంగా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నిలిచిందంటే దానికి కారణం నిత్యనూతనంగా ఉండే కథావస్తువుతో ఈ చిత్రం రూపొందడమే. రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ. 13 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇది అప్పటికి ఇండస్ట్రీ రికార్డు. నందమూరి తారక రామారావు, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ‘అడవిరాముడు’ 70వ దశకంలో ఇలాంటి రికార్డును సాధించింది. ఆ సినిమా తర్వాత ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఆ స్థానాన్ని దక్కించుకుంది.  ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ తన వైజయంతి మూవీస్‌ బేనర్‌పై నిర్మించిన సి.అశ్వినీదత్‌కి ఒక డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉండేది. అదే ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరుని కథ’. ఎప్పటికైనా తన బేనర్‌లో అలాంటి సినిమా తియ్యాలన్నది ఆయన లక్ష్యంగా ఉండేది. చిరంజీవితో ఆ సినిమా చెయ్యాలని అనుకునేవారు. నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమా చెయ్యాలనుకున్నారు దత్‌. ఒక మంచి కథ కోసం అన్వేషిస్తున్నారు. ఆ సమయంలోనే రాఘవేంద్రరావును, రచయిత శ్రీనివాస చక్రవర్తిని తిరుపతి పంపించారు. అశ్వనీదత్‌ ఎలాంటి సినిమా తియ్యాలనుకుంటున్నారో, ఎలాంటి కథ అయితే రాఘవేంద్రరావు పూర్తి న్యాయం చెయ్యగలుగుతారో శ్రీనివాస చక్రవర్తికి తెలుసు. తిరుమలలో ఉండగానే తనకు తట్టిన ఒక లైన్‌ను రాఘవేంద్రరావుకి చెప్పారు శ్రీనివాస్‌. ‘ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చిన దేవకన్య అనుకోకుండా హీరోను కలుస్తుంది. ఆ సమయంలో ఆమె వేలికున్న ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరుకుతుంది’ ఇదీ లైన్‌. ఈ లైన్‌ రాఘవేంద్రరావుకి, అశ్వినీదత్‌కి, చిరంజీవికి నచ్చింది. ఆ ఒక్క లైన్‌ తప్ప పూర్తి కథగా శ్రీనివాస చక్రవర్తి దగ్గర లేదు. అప్పుడు అశ్వినీదత్‌ మద్రాస్‌లోని తన కొత్త ఆఫీస్‌ను ఈ సినిమా స్టోరీ డిస్కషన్‌కు సిద్ధం చేశారు. జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్‌, సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్‌, క్రేజీ మోహన్‌, శ్రీనివాస చక్రవర్తి ఈ కథ మీద కూర్చున్నారు. నెలరోజులపాటు చర్చించి కథను ఓ కొలిక్కి తెచ్చారు. ఈ డిస్కషన్స్‌కి చిరంజీవి కూడా వెళ్లి తనకు తోచిన సలహాలను ఇచ్చారు. మొత్తానికి కథ సిద్ధమైంది. మొదట ఈ సినిమాకి అనుకున్న టైటిల్‌ ‘భూలోక వీరుడు’. ఆ తర్వాత ‘జగదేక వీరుడు’ అనుకున్నారు. ఇందులో దేవకన్య పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉండడంతో ‘అతిలోక సుందరి’ అని చేర్చారు. మరి ఈ జగదేకవీరుడికి అతిలోక సుందరిగా నటించేదెవరు? అనే ప్రశ్నకు శ్రీదేవి రూపంలో వెంటనే సమాధానం దొరికింది. ఒక క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అయింది. తన క్యారెక్టర్‌కి సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ముంబాయిలో తనే దగ్గరుండి సిద్ధం చేయించారు శ్రీదేవి.  ఈ సినిమా కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 6 పాటల్ని రికార్డ్‌ చేశారు ఇళయరాజా. ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.చలం ఆధ్వర్యంలో మానససరోవరం, దేవలోకం, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌.. ఇలా 7 భారీ సెట్స్‌ నిర్మించారు. షూటింగ్‌ ప్రారంభించే సమయానికి సినీ కార్మికుల సమ్మె జరుగుతోంది. దీంతో బెంగళూరులో ముహూర్తం షాట్‌ను చిత్రీకరించడం ద్వారా లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించారు. కన్నడ హీరో రవిచంద్రన్‌ ఫస్ట్‌ షాట్‌కి క్లాప్‌నివ్వగా, ఎ.కోదండరామిరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఫస్ట్‌ షాట్‌ను డైరెక్ట్‌ చేశారు. విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేశారు. 1990 మే 9న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది. మొదటి మూడు రోజులు సినిమాకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చిందన్న విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రిలీజ్‌ సమయానికి ఆంధ్రప్రదేశ్‌ తుపాన్‌ తాకిడికి గురైంది. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్‌ సరిగా లేని కారణంగా చాలా సెంటర్స్‌కి ప్రింట్లు ఆలస్యంగా వెళ్ళాయి. మ్యాట్నీ నుంచి ప్రదర్శన మొదలు పెట్టారు. జనం థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. కలెక్షన్లు చాలా మందకొడిగా ఉన్నాయి. దీంతో నిర్మాత అశ్వినీదత్‌ షాక్‌కి గురయ్యారు. ఎందుకంటే ఉన్నదంతా సినిమాకే పెట్టేశారు. కాస్త అటూ ఇటూ అయితే మళ్ళీ తన కెరీర్‌ను జీరో నుంచి స్టార్ట్‌ చెయ్యాలి. మొదటి మూడు రోజులు ఫ్లాప్‌ టాక్‌తోనే రన్‌ అయింది. నాలుగో రోజు నుంచి సినిమా స్టామినా ఏమిటో అందరికీ అర్థమైంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గొడుగులు వేసుకొని మరీ థియేటర్లకు వచ్చారు. శ్రీకాకుళంలోని ఓ థియేటర్‌ వర్షం నీటితో ఉంది. జనం సినిమా చూస్తుంటే ఫైరింజన్ల సాయంతో థియేటర్‌లోని వర్షం నీటిని బయటకు తోడారు. అంతటి భారీ వర్షాల్లో సైతం ‘జగదేక వీరుడు’ అతిలోక సుందరి’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఈ సినిమా కథాకథనాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వాటికి తగ్గట్టు వేటూరి రాసిన పాటలు, ఇళయరాజా సంగీతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇక చిరంజీవి సినిమాల్లో ఉండే రెగ్యులర్‌ స్టెప్స్‌ ఈ సినిమాలో లేకపోయినా ప్రేక్షకులకు అవి కొరతగా కనిపించలేదు. ఈ సినిమాకి నటీనటుల నుంచి మొదలుకొని టెక్నీషియన్స్‌ వరకు అన్నీ కలిసొచ్చాయి. అందరి కృషికీ తగిన ఫలితం లభించింది. సమిష్టి కృషితో భారీ ఘనవిజయాన్ని సాధించవచ్చు అని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ టీమ్‌ నిరూపించింది. ఈ సినిమా 46 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ శతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అశ్వినీదత్‌.  ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని అవార్డులు కూడా వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజా, ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా స్వామినాథన్‌, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా సుందరం, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఎం.కృష్ణ, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా బి.చలం నంది అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ దర్శకుడుగా కె.రాఘవేంద్రరావు ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా చివరలో దేవకన్య ఉంగరాన్ని ఒక చేప మింగినట్టు చూపించడం ద్వారా సినిమాకి  సీక్వెల్‌ ఉండే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు రాఘవేంద్రరావు. సీక్వెల్‌ చేసే ఉద్దేశం తనకు కూడా ఉందని నిర్మాత అశ్వినీదత్‌ చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. 2020 ప్రాంతంలో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ జంటగా సీక్వెల్‌ చేసేందుకు అశ్వినీదత్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేయడం ద్వారా ఆ ఊహాగానాలకు తెరదించారు అశ్వినీదత్‌.

అతని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 12 సినిమాలు వెనక్కి వెళ్లాయి 

Publish Date:Apr 27, 2024

రెండో సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారిన హీరో అధ్యయన్ సుమన్. దాంతో ఒకేసారి పన్నెండు సినిమాలు తన ఇంటి ముందుకు వచ్చాయి. కానీ ఒకే ఒక్క చిత్రంతో అవన్నీ దూరమయ్యాయి. అందుకు కారణం ఎవరో కాదు నేనే. కేవలం నా నా  స్వయం కృతాపరాధమే అంటున్నాడు. అధ్యయన్ ఎవరో కాదు  ప్రముఖ హిందీ నటుడు శేఖర్ సుమన్ తనయుడు. తండ్రి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు  2008 లో చిత్ర రంగ ప్రవేశం చేసాడు. హాల్ ఇ దిల్ అతని మొదటి సినిమా. మొదటి సినిమాకే మంచి నాయుడు అనే గుర్తింపు పొందాడు.ఇక ఆ తర్వాత వచ్చిన రాజ్ 2  తో బాలీవుడ్ కి సరికొత్త సూపర్ స్టార్ రాబోతున్నాడనే కితాబుని అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి  ఇటీవల  జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. రాజ్ తర్వాత మంచి పేరు వచ్చిందని  ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీలయ్యాను.ఒక పత్రిక సైతం టాప్ ఫైవ్ న్యూ కమర్స్ అంటు రణబీర్ కపూర్, ఇమ్రాన్ ల సరసన నా ఫోటో పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యు టర్న్ తీసుకుంది. మూడో సినిమా జష్న్ ప్లాప్ అయ్యింది. ఇక అంతే నేను సంతకం చేసిన 12 సినిమాలు ఆగిపోయాయి. దిగులుగా  కూర్చునే కంటే జీవితంలో ముందుకు సాగిపోవడమే మంచిదని అనుకున్నాను అని చెప్పాడు. ఇప్పడు ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాకపోతే  ఇక్కడ విచిత్రం ఏంటంటే  తనతో పాటే ప్లాప్ సినిమాలు చేసిన చాలా మంది హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. ప్రస్తుతం   హీరామండి అనే  వెబ్ సిరీస్ లో చేసాడు.   ఇందులో  శేఖర్ సుమన్ కూడా ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ గా  మే 1 న విడుదల కానుంది. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దానికి దర్శకుడు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి లు ప్రధాన పాత్రల్లో  మెరిశారు  

Salman Khan latest film gets Disastrous Day 1 with Flop Talk?

Publish Date:Apr 22, 2023

After a hiatus of four years, Salman Khan marked his return to the silver screen on Eid with a family entertainer titled Kisi Ka Bhai Kisi Ki Jaan. The film's opening day witnessed some negative response among the masses. However, it failed to create the same buzz among multiplex audiences. Its reviews have not been encouraging either.   The film rakes only 12 Crores on its first day, which falls short of the staggering amounts earned by the actor's previous Eid releases. The collection of its opening day is even lower than Khan’s previous flops like Bharat, Race 3 and Tubelight.   It appears that the audience took the film for granted, just as the makers and Salman Khan did. In the past, Salman Khan has been known to release his films on the occasion of Eid, with 10 of his movies having been released on this auspicious day. The film is likely to become biggest disaster in Salman Khan's career.

Gangavva : గంగవ్వ చలివేంద్రం పెడితే.. వాళ్ళు అలా చేశారా!

Publish Date:Apr 27, 2024

  బయట ఎండలు మాములుగా లేవు.. దాంతో ఊరి నుండి బయటకు వెళ్ళి వచ్చేవారు దప్పికతో కల్లు తిరిగి పడిపోతుంటారని, వారి దాహం తీర్చేందుకు గంగవ్వ వాళ్ళ ఊరిలో నాలుగైదు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసింది‌. అయితే ఆ చలివేంద్రాలలో నీరు లేకుండా కొందరు దుర్వినియోగం చేయడానికి చూశారు. అదంతా కలిపి.. " గంగవ్వ చలివేంద్రం పెడితే.. సమ్మర్ కష్టాలు" అంటూ ఓ వ్లాగ్ చేసింది. తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో గంగవ్వ చేసిన వ్లాగ్స్ కనిపిస్తుంటాయి. ఆమెని ఇన్ స్పైర్ చేసుకొని కొన్ని గ్రామాలలోని వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారు. బయట వచ్చే సిచువేషన్ ని బట్టి సీన్లు చేయడం, మొబైల్ లోనే ఎడిట్ చేసి వాటిని వారి సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్ళి ప్రపంచమంతా తెలిసింది. ఆ తర్వాత తన రూటే సపరేట్ అయింది. దుబాయ్ కి కూడా వెళ్ళి అక్కడ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. అలా గంగవ్వ ఫేమస్ అయింది. తను ఇలా అవ్వడానికి అనిల్ జీలా ప్రధాన కారణం. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ లో తనతో మాట్లాడించి, డైలాగ్స్ చెప్పించి ఫేమస్ చేసాడు. అందుకే అనిల్ జీలాకి కూడా తెలంగాణలో ఎంతో మందికి మార్గనిర్దేశం అయ్యాడు.  అయితే విలేజ్ లో జరిగే వాటిని అంతే సహజంగా చూపిస్తూ ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ డబ్బు సంపాదించుకుంటున్నాయి. అయితే గంగవ్వ, చందు, అంజి మామ, అనిల్ జీల లాంటి కొందరు కలిసి " విలేజ్ షో - మిక్స్ " అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేశారు.  గంగవ్వ తాజాగా చేసిన ఓ వ్లాగ్ వైరల్ గా మారింది. తన ఊరి ప్రజల కోసం కార్పోరేటర్ ని అడిగి మరీ ఫిల్టర్ నీళ్ళు తెప్పించి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంది గంగవ్వ. అయితే తను చేసిన ఈ మంచిపనిని కొందరు దుర్వినియోగం చేశారు. వాళ్ళ ఊరి సర్పంచ్ గా గంగవ్వ పోటీచేసి గెలవాలని చూస్తుందని ఒకతను భావిస్తాడు. అతను తన స్నేహితుడితో కలిసి గంగవ్వ చలివేంద్రంలో లేని సమయంలో వస్తారు. అక్కడ కుండలలో ఉన్న నీళ్ళతో బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం లాంటివి చేసి నీళ్ళని వృధా చేశారు. ఇక అన్ని చలివేంద్రాలు చూసుకుంటు గంగవ్వ అక్కడికి వస్తుంది. ఇక నీళ్ళని వృధా చేసిన వారిద్దరిని తిట్టేస్తుంది. ఇక ఆ ఊరి కార్పోరేటర్ వచ్చి.. గంగవ్వ పెద్ద మనసు చేసుకొని దప్పికతో ఊరిలోకి వచ్చేవాళ్ళ కోసం ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసిందని, మంచి చేయకపోయిన పర్లేదు కానీ ఇలా దుర్వినియోగం చేయకూడదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు మారుతారు. సమ్మర్ లో కాసేపు ఎండలో తిరిగితేనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఇలా ప్రతీ ఊరిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని గంగవ్వ ఈ వ్లాగ్ ద్వారా చెప్పింది. మరి యూట్యూబ్ లో ఉన్న ఈ వ్లాగ్ ను మీరు చూశారా కామెంట్ చేయండి.  

ఊహించని కాంబో.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

Publish Date:Apr 23, 2024

అతికొద్ది కాలంలోనే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు. అయితే కొన్నేళ్లుగా విజయ్ కి సరైన విజయాలు దక్కడం లేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'పై ఎన్నో ఆశలు పెట్టుకోగా అది నిరాశపరిచింది. మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది. దీంతో ఇంకెవరైనా స్టార్ డైరెక్టర్ తో విజయ్ సినిమా పడితే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో విజయ్ సినిమా చేసే అవకాశముందనే వార్త ఆసక్తికరంగా మారింది. 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్(Prabhas) తో 'సలార్' చేశాడు నీల్. త్వరలోనే 'సలార్-2' కూడా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తో ఒక సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్(Ram Charan) వంటి స్టార్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ కన్ను.. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండపై పడటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల విజయ్ ఇంటికి ప్రశాంత్ నీల్ వెళ్ళాడు. వీరి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రానుందని, దానికి సంబంధించిన చర్చల కోసమే విజయ్ ని నీల్ కలిశాడని న్యూస్ వినిపిస్తోంది. ఓ రకంగా ఇది బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. 'సలార్-2'తో పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక.. విజయ్ తో నీల్ సినిమా చేస్తాడేమో చూడాలి. ఒకవేళ నిజంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పడితే మాత్రం.. ఒక్కసారిగా విజయ్ రేంజ్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు.

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

ఆడు జీవితం

Publish Date:Mar 28, 2024

Operation Valentine

Publish Date:Mar 1, 2024

KGF Chapter 2

Publish Date:Apr 14, 2022

RRR

Publish Date:Mar 25, 2022

Radhe Shyam

Publish Date:Mar 11, 2022

Clap

Publish Date:Mar 11, 2022