అబద్ధాల పుట్ట.. తప్పుల తడక.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్
Publish Date:Feb 3, 2023
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ బాకా ఊదడానికే పరిమితమైందని విపక్షాలు విమర్శించాయి. ఎంత సేపూ ప్రభుత్వ పథకాలను ఆకాశానికి ఎత్తేయడమే తప్ప రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం లేదని దుయ్యబట్టాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ధరణి పోర్టల్ వంటి అంశాలు గవర్నర్ ప్రస్తావించనే లేదన్నారు.
సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట అని అభివర్ణించారు. ఈ ప్రసంగం చేయడం కంటే గవర్నర్ ప్రసంగం లేకుండా గత ఏడాది మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఆమె ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావనకైనా రాలేదని నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని జీవన్ రెడ్డి అన్నారు.
అలాగే దళితబంధు పేరుతో దళితుల్నిప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ తమిళిసై ప్రసంగం మొత్తం తప్పుల తడక అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్నదిపూర్తిగాఅవాస్తవమని, ఎక్కడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందడం లేదన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసలు మాట్లాడనేలేదని ఈటల అన్నారు.
తెలుగుదేశంకే స్వల్ప మొగ్గు.. ఆత్మసాక్షి సర్వే
Publish Date:Feb 3, 2023
ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు.. కేసీఆర్, తమిళిసైల మధ్య విభేదాలకు తెర!
Publish Date:Feb 3, 2023
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
Publish Date:Feb 3, 2023
బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటలకు?
Publish Date:Feb 3, 2023
80 ఏళ్లకు గమ్యం చేరిన పెయింటింగ్!
Publish Date:Jun 19, 2022
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
పవార్ సారథ్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్?
Publish Date:Mar 17, 2021
బడ్జెట్ రెడీ సంక్షేమానికి పెద్ద పీట?
Publish Date:Mar 16, 2021
ప్రచారం ముగిసింది.. ఇక పోరాటం మిగిలింది..
Publish Date:Mar 12, 2021
నేనూ హిందువునే..! ఓట్ల కోసం నేతల నినాదం
Publish Date:Mar 10, 2021
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు
Publish Date:Mar 15, 2021
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
2 వేల నోటు ఇక ఉండదా!
Publish Date:Mar 15, 2021
బీజేపీ నోటాను బీట్ చేసింది...
Publish Date:Mar 15, 2021
స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు!
Publish Date:Mar 15, 2021
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నిక రద్దేనా..?
Publish Date:Mar 15, 2021
ఆశయానికి, అత్యాశకి తేడా గుర్తించడమెలా?
Publish Date:Feb 3, 2023
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.
"ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం
అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం"
ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి.
ఆశయం!!
ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.
ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి. ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.
ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది. ఇదీ ఆశయంలో ఉన్న సారం.
అత్యాశ!!
కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.
కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.
ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు.
ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.
లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.
ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.
ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.
◆నిశ్శబ్ద.
మీ బడ్జెట్ మీ చేతుల్లో ఉందా?
Publish Date:Feb 2, 2023
సి.పి బ్రౌన్ పుట్టింది మన దేశంలోనే అని మీకు తెలుసా?
Publish Date:Feb 1, 2023
ప్రతిభకు-ప్రవర్తనకు గల సంబంధం తెలుసా?
Publish Date:Jan 31, 2023
ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం మనదగ్గరే ఉంది!
Publish Date:Jan 30, 2023
అలసటకు కారణాలు!
Publish Date:Feb 3, 2023
ఈ శరీరం అలిసిపోయింది వంట్లో శక్తి లేదు ఏదో బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు.ఇది కేవలం వృద్ధాప్యం లో ఉన్నవారి మాటలలో మాత్రమే ఒకప్పుడు వినిపించేది అయితే ఈ పరిస్థితి పోస్ట్ కోవిడ్ తరువాత అన్ని వర్గాలలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చి మళ్ళీ శక్తి ఉత్సాహాలాను పుంజుకోవాలని అనుకుంటున్నారు కోవిడ్ భారిన పడ్డ బాధితులు. అలసట తో అలిసిపోతున్నామని అంటున్నారు. అలసట ఇది మనందరికీ తెలిసిన పదమే అప్పుడప్పుడూ చిన్న చిన్న జ్వరాలు వచ్చి పోయినప్పుడు మనల్ని హలో అని పలకరిస్తుంది.ఒక్కోసారి వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయిన వారిలో,శస్త్ర చికిత్స జరిగి కోలుకుంటున్న కొందరిలో త్వరగా అలిసిపోవడం మాములుగా పైకి కనిపిస్తున్నా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండడం సహజంగా కనిపిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు.
ఇంకొందరిలో నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం ఆయాసం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయాని రోగులు తమ తోటి వారితో వాపోయిన ఘటనలు ఈ మధ్యకాలం లో తరచుగా వింటూనే ఉన్నాము. దీనినే వైద్య పరిభాష లో క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ సి ఎఫ్ ఎస్ ను కనుగొనేందుకు గల కారాణాలు ఏమిటి అని కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రం లో పరిశోదనలు జరుతున్నాయని నిపుణులు వెల్లడించారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సి.ఎస్. ఎఫ్. వల్ల బాధపడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోవడం గమనించవచ్చు.
సి ఎస్. ఎఫ్ వల్ల సంపాదన పనుల వల్ల కుటుంబాలు దేశాలు అసాధారణ స్థాయిలో ఆదాయాన్ని ఉత్పాదకతను కోల్పోతున్నాయి దశాబ్దాల పాటు ఆరోగ్య భీమా రంగాలలో దీనిని పట్టించుకొని పశ్చిమ దేశాలు ఇటీవల సి.ఎస్. ఎఫ్. ను వ్యాధిగా గుర్తించి చికిత్సను భీమా పరధిలోకి తీసుకు వచ్చినట్లు గ్రంధ రచయిత పరిశోధన సారాన్ని మనకు అందించిన రచయిత రామ్మోహన్ అప్పరసు స్పష్టం చేసారు.అసలు సి.ఎస్. ఎఫ్. వ్యాధికి కారణాలను కనుగొనే పరిశోదన ద్వారా చికిత్చా విధానం వరకూ సి .ఎస్. ఎఫ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి.
మీరు అలిసిపోతున్నారంటే అది సాధారణమైనదే అయిన సి.ఎఫ్.ఎస్ ప్రస్తుతం చేయగలిగింది దానిని అర్ధం చేసుకోవడం ఎదుర్కోవడమే. మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నం వల్ల ఆశక్తులను చేసే నీరసం అలసట చక్రబంధం నుంచి బయట పడగలుగుతారు. వాస్తవానికి అలసట పై చేసే పోరాటం అంత కష్టతరమైంది ఏమి కాదు అని అంటున్నారు నిపుణులు.
మనం నిత్యజీవితంలో ఎలాంటి సందర్భాలలో అలిసిపోతారు అన్న విషయం తెలుసుకుందాం...
రోజంతా వృత్తి,ఉద్యోగాలలో ఉన్నవారు,తీవ్రంగా క్రీడలలో పాల్గొన్నవారు అలిసిపోవడం సహజమే అని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఎవరైనా కుటుంబాలతో దూర ప్రాంతాలు,విహార యాత్రలు వందలకిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయడం.వల్ల అసలు శరీరంలో శక్తి లేనంతగా అలసట ఉంటుంది. ఇలాంటి సమయంలో కొద్ది గంటలో,లేదా కొన్ని రోజుల్లో విశ్రాంతి తీసుకుంటాం. మళ్ళీ రెట్టించిన ఉత్సాహం తో తిరిగి రోజువారి కార్యక్రమాలతో మళ్ళీ బిజీ అయిపోతాం. అయితే కొన్ని సందర్భాలలో అలసట ఒక పట్టాన తీరదు.
ఒకరెండు సంవత్సారాల క్రితం జరిగిన అధ్యయనంలో రోజూ ఏదు గంటల పాటు నిద్రపోయిన వారు సైతం వారిలో 45% మంది అలసటతో గడుపుతున్నట్లు నిపుణులు గమనించారు. నేటి కాలమాన పరిస్థితులలో వివిధ రంగాలలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,వృత్తి నిపుణులు, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభ మాత్రమే దీని బారిన పడుతున్నారని,ఇందులో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు.
ఈ పరిస్థితి అంటే ఫాటిగ్ యు సింగ్ ద్రోహం నుండి బయట పది శక్తి ఉత్సాహాలను తిరిగి పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మానసిక నిపుణులు చేస్తున్న ప్రయత్నం అలసట మన కండరాలను మజిల్ ఫ్యాటీ యు నాడీ వ్యవస్థను సెంట్రల్ ఫ్యామిలీ యును తీవ్రంగా ప్రాభావితం చేస్తోంది అని నిపుణులు నిర్ధారించారు.అసలు అలసటకు కారణాలు ఏమిటో అత్యధికంగా నిస్సాత్తువ నిస్తేజం మనలను ఎందుకు ఆవరిస్తోందో మీకు తెలిపే ప్రయాత్నం చేస్తున్నారు రామ్మోహన్ అర అప్పరసు గారు మీరు ఒంటరి కాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని పరిష్కారం అందించే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారని ఫలితం వస్తుందని ఆశిద్దాం.
నెయ్యి వాడితే వచ్చే పరిణామాలు ఇవే
Publish Date:Feb 2, 2023
కొవ్వు చెప్పే కథ వింటే ఆశ్చర్యపోతారు!
Publish Date:Feb 1, 2023
ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీ డేంజర్ లో ఉనట్టే!
Publish Date:Jan 31, 2023
గుండెపోటు ఉన్నవారు సెక్స్ లైఫ్ కు దూరం ఉండాలా?
Publish Date:Jan 30, 2023
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
Publish Date:Jul 17, 2020
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి.
రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది.
కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
జియో గ్లాస్ ఫీచర్స్
- నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే.
- ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు.
- ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు.
- ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది.
- హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు.
- అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది.
- జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
- ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Publish Date:Mar 13, 2019
Your WhatsApp account will be deactivated if you use these apps
Publish Date:Mar 11, 2019
Best phones under 20,000 in 2019
Publish Date:Mar 9, 2019
Google introduces educational app Bolo to improve children’s literacy in India
Publish Date:Mar 6, 2019