jagan axe on duvvada for praising lokesh

లోకేష్ భజన చేసిన దువ్వాడ.. కత్తికట్టిన జగన్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు.  గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా  మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.  వైసీపీ అధికారంలో ఉండగా  అడ్డూ అదుపూ లేకుండా  నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు.  చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా  జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ... మధ్యలో దివ్వెల మాధురి. ఈ ఫ్యామిలీ డ్రామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.  ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది.  మాధురితో కలిసి హైదరాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.   దువ్వాడ శ్రీనివాస్‌ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా దువ్వాడపై జగన్ తీసుకున్నది క్రమశిక్షణ చర్యే అయితే.. ఆ పని ఎప్పుడో చేసి ఉండాలి. దివ్వెల మాదురి వ్యవహారంలో రచ్చకెక్కినప్పుడు సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్  ఇన్‌స్టా రీల్స్‌, తిరుమల పర్యటనలో ఫొటోషూట్‌, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు.  అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్‌ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్‌ను పొగడటమే దువ్వాడపై వేటుకు కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్‌ పర్సన్‌ ఎవరు అని అడిగిన ప్రశ్నకు... లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్‌ను అంతగా పొడిగితే జగన్‌ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారంట. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు.. ఇదేనేమో..?

indus water treaty cancil big blow to pakisthan

ఒక్క ఒప్పందం ర‌ద్దు.. పాక్ ఖేల్ ఖ‌తం.. దుకాణం బందేనా?

ఏమిటీ సింధూ జ‌లాల ఒప్పందం? ఈ  ఒప్పందం ర‌ద్దుతో పాకిస్తాన్ లో ఏర్ప‌డ‌నున్న సంక్షోభాల తీవ్ర‌త ఎంత? ఇప్ప‌టికే క్రికెట్ సంక్షోభంతో విల‌విల‌ ఇక ఆహార‌, ఆర్ధిక‌, సామాజిక‌, రాజ‌కీయంగానూ అవ‌స్థలేనా? కొన్ని శ‌తాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగ‌తి. అప్ప‌ట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. స‌ముద్ర జ‌లాల‌పై ప్ర‌యాణిస్తూ.. వివిధ ర‌కాల ప్రాంతాల్లో సెటిల‌య్యేవ‌ని అంటుంది మ‌న పురాత‌న భౌగోళిక చ‌రిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్ర‌యాణిస్తూ వ‌చ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టింద‌నీ.. అలా మ‌న‌కు హిమాల‌యా ప‌ర్వ‌తాలు ఏర్ప‌డ్డాయ‌ని అంటారు.  ఎప్పుడ‌యితే ఇక్క‌డ‌ మంచు శిఖ‌రాలు ఏర్ప‌డ్డాయో.. అప్ప‌టి వ‌ర‌కూ ఎడారిలాంటి ఈ ప్రాంతంలోకి బిందువులు సింధువులుగా మారి.. ఒక ప్ర‌వాహం  ఏర్ప‌డింద‌నీ.. త‌ద్వారా ఇక్క‌డొక‌ నాగ‌రిక‌త ఏర్ప‌డింద‌నీ.. దాన్నే సింధూ నాగ‌రిక‌త అంటార‌నీ చెబుతుంది మ‌న నైస‌ర్గిక భౌగోళిక‌ చ‌రిత్ర‌.  ఎప్పుడైతే ఇక్క‌డ జ‌ల ప్ర‌వాహం ఏర్ప‌డిందో దాన్ని ఆశించి.. ఆఫ్ఘ‌న్, ఇరాన్ వంటి  ప్రాంతాల నుంచి కొంద‌రు జీవ‌నాన్ని వెతుక్కుంటూ వ‌చ్చార‌నీ.. వారే త‌ర్వాతి కాలంలో ఆర్యులుగా అవ‌త‌రించార‌నీ అంటారు. ఇక‌, ఆఫ్రికా ఖండంతో పాటు వ‌చ్చిన వారు ద‌క్షిణాదిన ద్ర‌విడులుగా స్థిర‌ప‌డ్డార‌నీ చెబుతుంటారు. ఇది బేసిక్ ఆర్య ద్ర‌విడ థియ‌రీ అయితే..  ఈ థియ‌రీలో మేజ‌ర్ పార్ట్ సింధూ  జ‌లాల‌దే. ఈ జ‌లాల‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన వారే ఆర్యులుగా చెబుతుందీ ఆర్య ద్ర‌విడ సిద్ధాంతం. ఇదిలా ఉంటే కాల‌క్ర‌మేణా ఉత్త‌ర ద‌క్షిణ భార‌తాలు క‌ల‌సి ఒక దేశంగా ఏర్ప‌డ్డం.. ఒక‌ప్ప‌ట్లో అఖండ భార‌తంగా ఉన్న ఈ దేశం త‌ర్వాతి  రోజుల్లో పాక్, బంగ్లాతో పాటు శ్రీలంక‌, నేపాల్ అంటూ విడిపోయింద‌ని అంటుంది మ‌న సుదీర్ఘ కాల చ‌రిత్ర‌. 1947 నాటి నుంచి మ‌నం భార‌త్- పాకిస్థాన్ లు గా విడివ‌డ్డాం. 1960ల కాలంలో నాటి భార‌త‌ ప్ర‌ధాని నెహ్రూ, నాటి పాక్ అధ్య‌క్షుడు అయూబ్ ఖాన్ చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా వ‌చ్చిందే  సింధూ న‌దీ జ‌లాల ఒప్పందం. ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం మూడు సార్లు అంటే, 1965- 1971- 1999 భార‌త్ పాక్ మ‌ధ్య యుద్ధాలు జ‌రిగినా.. ఈ జ‌ల‌ ఒప్పందాలు మాత్రం చెక్కు చెద‌ర‌లేదు. మ‌ధ్య‌లో.. భార‌త్ పాక్ కి వ‌చ్చిన జ‌ల‌వివాదం ఎలాంటిదంటే.. ఇది ప్ర‌పంచ బ్యాంకు వ‌ర‌కూ వెళ్లింది. కిష‌న్ గంగ పై ఒక జ‌ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది భార‌త్. కిష‌న్ గంగ‌, రాట్లే ప్రాజెక్టులు నిర్మించిన భార‌త్ పై పాక్ ఆరోప‌ణ‌లు గుప్పించింది. అంతే త‌ప్ప.. ఈ సింధూ జ‌లాల ఒప్పందం మీద ఇంత వ‌ర‌కూ మ‌న‌కూ పాకిస్థాన్ కి  ఎలాంటి గొడ‌వా రాలేదు. ఈ ఒప్పందం ర‌ద్దు అప్పుడ‌ప్పుడూ తెర‌పైకి వ‌చ్చినా అవ‌న్నీ తామ‌రాకు మీద నీటిబొట్టులాంటిదే అయ్యింది.   అయితే ఇప్పుడు ప‌హెల్గాం దాడి త‌ర్వాత‌.. భార‌త్ ఈ జ‌ల‌ ఒప్పందం నుంచి త‌ప్పుకుంటే మొద‌ట జ‌రిగే ప‌ని.. జీలం, చినాబ్, రావి, బియాస్, స‌ట్లేజ్ వంటి న‌దీ జ‌లాలు పాక్ కి వెళ్ల‌కుండా క‌ట్ట‌డి చేసే అవ‌కాశ‌ముంది. వీటిపై భార‌త్ మ‌రింత‌ విస్తృతంగా ప్రాజెక్టులు క‌ట్టే ఛాన్సుంది. ఎప్పుడైతే.. ఈ డ్యాముల నిర్మాణం జ‌రుగుతుందో అప్ప‌టి నుంచీ పాకిస్థాన్ కి జ‌ల సంక్షోభం సంభ‌వించే ప్ర‌మాద‌ముంది. ఎప్పుడైతే ఈ న‌దీ జ‌లాల‌ ప్ర‌వాహం క‌ట్ట‌డి చేయ‌బ‌డుతుందో అప్ప‌టి నుంచీ ఆహార సంక్షోభం మొదలౌతుంది. ఎప్పుడైతే ఆహార సంక్షోభం వ‌స్తుందో ఆ నాటి నుంచి పాక్ లో క‌ర‌వు విల‌య తాండ‌వం చేస్తుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు మ‌టాష్ అయిపోతుంది. అంటే ఒక్క బొట్టు కూడా ర‌క్తం చిందించ‌కుండానే ఈ నిర్జ‌ల ఉత్పాతాన్ని సృష్టించ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఇది పాకిస్తాన్ త‌న‌కు తాను చేజేతులా చేసుకుంటున్న ఒకానొక దుశ్చ‌ర్య‌. ప‌హెల్ గాం దుండ‌గులు పాకిస్తాన్ సంబంధించిన వారేనంటూ ఇక్క‌డి నుంచి పాకిస్థాన్ దిశ‌గా వెళ్లిన డిజిట‌ల్ లింకులు చెబుతూనే ఉన్నాయి. దీని వెన‌క ల‌ష్క‌రే తోయిబాకి చెందిన‌ రెసిస్టెంట్ గ్రూప్ ఉన్నా.. దీని మూలాలు పాక్ లోనే తేలుతున్నాయి. ప్ర‌స్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, గ‌తంలో ఈ దేశ‌పు గూడాచార సంస్థ‌ ఐఎస్ఐకి చీఫ్ గా ప‌ని చేశారు. ఈ స‌మ‌యంలోనే మునీర్ కి ల‌ష్క‌రే వంటి టెర్ర‌రిస్టు గ్రూపుల‌తో విప‌రీత‌మైన  సంబంధాలు ఏర్ప‌డ్డాయి.  అత‌డే ఈ దుశ్చ‌ర్య‌కు క‌ర్త‌-కర్మ- క్రియ అంటూ కేవలం భార‌త్ మాత్ర‌మే కాదు అమెరికా సైతం విశ్వ‌సిస్తోంది. ఒక ప‌క్క అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ భార‌త్ లో ప‌ర్య‌టిస్తుండగా జ‌రిగిందీ ఉగ్ర దాడి. దీని వెన‌క పాక్  హ‌స్తం ఉన్న‌ట్టు గ‌ట్టిగా భావిస్తోన్న అమెరికా.. అంతే కాదు మునీర్ కీ లాడెన్ కీ పెద్ద తేడా లేదని యూఎస్ వాఖ్యానిస్తోందంటే.. ప్ర‌పంచ స్థాయిలో పాక్ ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.  ఇప్పుడు సింధూ జ‌ల ఒప్పందాల ర‌ద్దు ద్వారా పాకిస్థాన్ కి జ‌రిగే న‌ష్టం ఎలాంటిదో ఉద‌హ‌రించ‌డానికి.. ఇటీవ‌లి ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణే అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. భార‌త్ ఈ టోర్నీలో ఆడ‌టానికిగానూ పాకిస్థాన్ భూభాగంలో అడుగు పెట్టేది లేద‌ని తెగేసి చెప్పింది. దానికి తోడు రోహిత్ సైన ఫైన‌ల్ కి చేర‌డంతో.. పాకిస్థాన్ లో జ‌ర‌గాల్సిన  ఫైన‌ల్ కాస్తా దుబాయ్ లో జ‌రిగింది. దీంతో అప్పటి వ‌ర‌కూ పాక్ ఈ టోర్నీ కోసం పెట్టిన ఖ‌ర్చు మొత్తం వృధా అయ్యి... భారీ న‌ష్టం మిగిలింది. భార‌త్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇక సింధూ జ‌లాల‌తో పాటు.. పాకిస్థాన్ లోని భార‌త‌ దౌత్య అధికారుల ను సైతం తిరిగి  ర‌ప్పిస్తున్నారు. ఇక్క‌డున్న పాక్ యాంబ‌సీని కూడా పెట్టేబేడ స‌ర్దుకోమంటున్నారు. అంతేనా దేశంలో ఉన్న పాకిస్తానీయులు, ఇత‌ర ప‌ర్యాట‌కుల‌ను వారం లోగా దేశం వ‌దిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.  ఇక‌పై పాకిస్థాన్ కి గ‌తంలో లా ఉండ‌దు. ప‌హెల్ గామ్ దాడిలో 26 మందిని పొట్ట‌న పెట్టుకున్న పాపానికి త‌గిన ప్రాయ‌శ్చిత్తం అనుభ‌వించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఆ దేశం ఎల్ఓసీ ద‌గ్గ‌ర భ‌ద్ర‌త అప్ర‌మ‌త్తం చేసింది. ఇక ఏ ముహుర్తాన భార‌త సైనికులు ఏ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేస్తారో అన్న భ‌యంక‌ర‌మైన భ‌యాన్ని అనుభ‌విస్తోందీ పాపిష్టి దేశం. ఒక ప‌క్క మ‌న ర‌క్ష‌ణ  శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంత‌కింత అనుభ‌విస్తార‌న్న హెచ్చ‌రిక‌లు జారీ చేసిన స‌మ‌యాన‌.. ఎలాంటి భ‌యాన‌క ప‌రిస్థితి ఎదుర్కోవ‌ల్సి వ‌స్తుందో అన్న ఉత్కంఠ రాజ్య‌మేలుతోంది పాకిస్తాన్ లో. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది తాత్కాలికం. సిందూ జ‌లాల ఒప్పందం కార‌ణంగా పాకిస్థాన్ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతుంది. ఇటు జాలాల ఒప్పందం మాత్ర‌మే కాకుండా, అటు దౌత్య ప‌ర‌మైన సంబంధాల‌న్నిటినీ భార‌త్ పూర్తిగా తెంచుకుంటే పాకిస్థాన్ ప‌రిస్థితి వ‌చ్చే రోజుల్లో అగ‌మ్య గోచ‌ర ప‌రిస్థితి ఎదుర్కోవ‌డం ఖాయం. ఇప్ప‌టికే అమెరికా నుంచి నిధుల నిలిపివేత వేధ‌న అనుభ‌విస్తోన్న పాకిస్థాన్ కి మిగిలిన దిక్క‌ల్లా చైనా మాత్ర‌మే. అలాగ‌ని ప‌హెల్ గామ్ వంటి దాడుల‌తో రెచ్చిపోతున్న పాక్ కి అది బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. ఇప్ప‌టికే అమెరికా నుంచి విప‌రీత‌మైన సుంకాల దాడి ఎదుర్కుంటున్న చైనా.. త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ్డానికే ఆప‌సోపాలు ప‌డుతుంటే.. పాకిస్థాన్ కి ప్ర‌త్య‌క్ష సాయం  చేసే ఛాన్స్ లేదు.  ఎందుకంటే భార‌త్ కూడా పొమ్మ‌న లేక పొగ‌బెడితే.. వ‌ర‌ల్డ్  బిగ్గెస్ట్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ చైనా తాను చేసిన ప్రాడ‌క్టులు తానే అమ్ముకోలేదు. పాకిస్తాన్ని ఆ దేశం ద‌గ్గ‌ర‌కు చేర్చేదే.. అతి  పెద్ద మార్కెట్ అయిన భార‌త్ ను  న‌యానా భ‌యానా ఒప్పించ‌డానికి. ఇప్పుడు పాక్ విషయంలో భార‌త్ మ‌రింత క‌ఠినంగా  వ్య‌వ‌హ‌రించ‌డంతో చైనా కూడా హ్యాండ్స‌ప్ అనాల్సిందే. వీటిన్నిటి దృష్ట్యా చూస్తే పాకిస్థాన్ వ‌చ్చే రోజుల్లో చూసే సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక- ఆహార- సంక్షోభం అతి భ‌యంక‌ర‌మైన‌దిగా అంచ‌నా వేయ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా పాకిస్తాన్ ఆర్మీకున్న అధికారాల‌ను క‌త్తెరించి.. టెర్ర‌రిస్టులను స‌మూలంగా ఏరి వేస్తే త‌ప్ప‌... ఈ దేశానికి మ‌రో మార్గాంత‌రం లేదు.

governer post to ashoak gajapathi raju

అశోక్‌గజపతిరాజుకి రాజ్యంగ పదవి!

కేంద్ర మాజీ మంత్రి,  తెలుగుదేశం సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది. పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలగిన ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.  పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం రాజవంశస్థులు. అయినా ఆయనలో ఇసుమంతైనా దర్పం కన్పించదు . ప్రజాస్వామ్యంపై ఆయనకు ఎనలేని గౌరవం.  నేటికీ ఆయన పబ్లిక్‌గా మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఆ పదం వినిపిస్తుందంటే  డెమోక్రసీ పై ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు . 1978 లో రాజకీయాల్లోకి వచ్చి 2019 వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా , కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ప్రస్తుతం ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం తెలుగుదేశం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వివాద రహితుడు, హుందా రాజకీయాలకు పెట్టింది పేరైన మిస్టర్ క్లీన్ కాబట్టే 2024 ఎన్నికల తరువాత టీడీపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ పదవి కేటాయిస్తుందనే ప్రచారం జరుగుతున్న ప్రతిసారీ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన అశోక్‌గజపతి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. అ పదవికి ఆయన మాత్రమే సూటబుల్ అని  తెలుగు తమ్ముళ్ళుతో పాటు అధినేత చంద్రబాబు కూడా అభిప్రాయపడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది .  మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి , వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు . మరోవైపు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తమిళనాడు గవర్నర్ రవిని కేంద్రం తొలగిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఖాళీలను ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో అటు బీజేపీ, ఇటు టీడీపీ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి  ఆంధ్రప్రదేశ్ కోటాలో ఇస్తారంటున్నారు. అలాగే తమిళనాడు గవర్నర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది .  అదే జరిగితే టీడీపీకి కేంద్రం తరఫున లభించే తొలి గవర్నర్ పోస్టును అశోక్ గజపతిరాజుకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాలుగు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం మార్చే అవకాశం ఉందంటున్నారు. వాటిలో అశోక్ గజపతిరాజుకు ఛాన్స్ లభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్‌గజపతిరాజు అంటే ప్రధానికి ఎంతో గౌరవం ఉందని, అందుకే ఆయనకు రాజ్యాంగ పదవి దక్కడం ఖాయమంటున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా అశోక్ గజపతిరాజుకే ఆ పదవి ఇవ్వడానికి కారణాలు లేకపోలేదంటున్నారు . రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా , కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన అశోక్ గజపతిరాజుపై  మచ్చుకైనా ఒక్క అవినీతి మారక లేదు.  ఎక్కడా పార్టీకి సంబంధించి గానీ , ప్రజలను ఉద్దేశించి గానీ ఇప్పటివరకు వివాదాస్పదంగా మాట్లాడిన సందర్భం లేదు . టీడీపీలో అంత సీనియర్ అయినప్పటికీ ఆయన పార్టీ లైన్ ను ఎక్కడా క్రాస్ చేయలేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ స్టాండే తన స్టాండ్ అన్నట్లు కట్టుబడి ఉన్నారు.  2018లో ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకి వచ్చినపుడు చంద్రబాబు ఆదేశించగానే అశోక్‌గజపతి  రాజు తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు . నేటికీ ఏ ఒక్కరినీ ఏకవచనంతో పిలవడం ఆయనకు తెలీదు. తమ కుటుంబ సంస్థ అయిన మాన్సస్ ట్రస్ట్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనను ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని ప్రజాస్వామ్యబద్దంగానే ఎదుర్కొన్నారు అశోక్ . అంతేగాని జగన్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. నడవలేని పరిస్థితుల్లో కూడా టిక్కెట్లు ఆశించే ఈరోజుల్లో..  2024 ఎన్నికల సమయంలో వయోభారం కారణంగా ఇక ప్రత్యక్ష రాజకీయాలకు తాను అన్‌ఫిట్ అనీ,  ఇక ఎన్నికల్లో పోటీచేయనని స్వయంగా ప్రకటించారు.  ఒకవేళ కావాలి అనుకుంటే ఈ ఎన్నికల్లో ఆయనే విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి మళ్లీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే వారు . కానీ రాజకీయాల్లో కొత్త రక్తం దావాలన్నది ఆయన అభిమతం.  అదలా ఉంటే ఇప్పటికీ ఏ ఒక్కరోజూ తనకు గానీ , తన వాళ్ళకు గానీ ఫలానా పదవి కావాలని పార్టీ అధినేతను కోరిన దాఖలాలు లేవు . అంతెందుకు తన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు మంత్రి పదవి కావాలని కూడా అడగలేదట. పార్టీ చెప్పిన పని చేయడమే మన పని అనేది ఆయన సిద్దాంతం . ఈ సిద్దాంతాలు ఉండడం వల్లనే టీడీపీ నుండి గవర్నర్ అనగానే ఆయన పేరే వినిపిస్తోంది. చూడాలి మరి ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టి , ఆ రాజ్యాంగబద్ద పదవి ఆయన్ని ఎప్పుడు వరిస్తుందో.

articles of charge on ap cid former chief

ఏపీ సీఐడీ పీవీ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జి.. ఇక అరెస్టేనా?

ఏపీసీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైందా? ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ అంజనేయులు అరెస్టైన రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ పోలీసు అధికారి అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న ఎవరైనా సరే ఔననే సమాధానమిస్తారు. ముంబై నటి కాదంబరి జత్మలానీపై అక్రమంగా కేసు నమోదు చేసి ముంబై నుంచి విజయవాడ తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించిన కేసులో పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టయ్యారు. ఇప్పుడు జగన్ హయాంలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ గా తన పరిమితులను మీరి, ఇష్టారీతిగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ అరెస్టునకు రంగం సిద్ధమైంది. పీవీ సునీల్ కుమార్ పై తాజాగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనను ప్రస్తావిస్తూ తెలుగుదేశం కూటమి సర్కార్ గురువారం ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ ను గురువారం (ఏప్రిల్ 24) జారీ చేసింది.  జగన్ హయాంలో సీఐడీ చీఫ్ గానూ, అగ్నిమాపక డీజీగానూ పని చేసిన పీవీ సునీల్ కుమార్ అప్పట్లో నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనపై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ చార్జి జారీ చేసింది.  ప్రభుత్వానికి  సమాచారం ఇవ్వకుండా పీవీ సునీల్‌కుమార్‌ పలుమార్లు విదేశాలకు వెళ్లారని  విచాణలో తేలిన సంగతి తెలిసిందే.   గత ప్రభుత్వ హయాంలో 2022లో జార్జియా పర్యటనకు అనుమతులు తీసుకున్న పీవీ సునీల్‌కుమార్‌ యూఏఈకి వెళ్లారనే దానిపై ఒకటి, మరో సారి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా స్వీడన్‌ దేశానికి వెళ్లారన్నదానిపై మీద రెండోది, పోస్టింగ్  లేకుండా వెయిటింగ్‌లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అమెరికా దేశానికి వెళ్లారన్న దానిపై మరోటి చొప్పున ప్రభుత్వం   ఆర్టికల్ ఆఫ్ చార్జ్ జారీ చేసింది.  అంతకు ముందు కూడా అంటే  2019లో అమెరికా వెళ్తున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది యూకే వెళ్లారనే దానిపైనా  చార్జ్ చేసింది.   మొత్తం ఆరు సార్లు ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయనను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.  పీవీ సునీల్‌కుమార్‌ మీద మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో కూడా అభియోగాలు ఉన్నాయి.  ఆరు సార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపైన విచారణ చేపట్టేందుకు సీనియర్‌ ఐఏఎస్, స్పెషల్‌ సీఎస్‌ స్థాయిలో ఉన్న ఆర్‌పీ సిసోడియాను విచారణ అధికారిగా నియమించింది. ఐపీఎస్‌ అధికారులు విదేశాల పర్యటనలకు వెళ్లే ముందు చైన్‌ ఆఫ్‌ కమాండ్‌ ప్రోటోకాల్‌లను పాటించాలని, కానీ పీవీ సునీల్‌ కుమార్‌ పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని, ఇది క్రమ శిక్షణా రాహిత్యంగా పరిగణించడంతో పాటుగా ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్‌ కింద సస్పెండ్‌ చేస్తున్నట్లు ఇది వరకు తెలిపిన ప్రభుత్వం తాజాగా ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను నమోదు చేసింది.

vinay nava tragedy in oahalgaon terror attack

కాళ్ల పారాణి ఆరక ముందే!

జమ్మూ కశ్మీర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు సాగించిన మారణకాండ మామూలు విషాదం కాదు. మాటలకందని మహా విషాదం. ముష్కర మూకలు సాగించిన రాక్షస కృత్యం.  అవును. పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తిన మహా విషాదం. ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన రాక్షస కృత్యం. బార్య కళ్ళెదుట భర్తను, పిల్లల కళ్ళెదుట తండ్రిని, తల్లి కళ్ళెదుట ఎదిగొచ్చిన కొడుకును  తూటాలకు బలిచేసిన మహా ఘాతుకం. పాకిస్థాన్ ప్రేరేపిత ముష్కర మూకలు చేసిన ఈ ఉగ్రదాడిలో మరణించిన ప్రతి ఒక్కరిదీ ఒక విషాద వ్యథ. గుండెలు పిండే విషాదం.   అందులోనూ దేశం మొత్తం కన్నీరు పెట్టేలా చేసిన నేవీ ఆఫీసర్  వినయ్ నర్వాల్  వ్యధ మరింత విషాదం. కేవలం వారంరోజుల క్రితమే వినయ్ నావల్, హిమాన్షి మూడు ముళ్ళ బంధంతో  ఒకటయ్యారు. హనీ మూన్ కు కశ్మీర్ వెళ్లారు. అదే వారు చేసిన తప్పో లేక హిందువులుగా పుట్టడమే వారు చేసిన మహాపరాధమో కానీ  హనీమూన్ విషాదంగా మారింది. ఉగ్రవాదులు హిమాన్షి కళ్ళ ముందే  వినయ్ నావల్ ని కాల్చి చంపారు.   పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ,ఒక్క వారం రోజుల వ్యవధిలోనే ఆ కొత్త జంట నూరేళ్ళ జీవితం ముగిసి పోయింది. పెళ్లి కలలు కరిగి పోయాయి. నవవధువు పాదాల పారాణి ఆరక ముందే, కళ్యాణ తిలకం ఆమె కన్నీళ్ళలో కరిగి గుండెల్లోకి జారిపోయింది.  అవును. ఏప్రిల్ 16 న ముస్సోరీలో  మూడు ముళ్ళ సాక్షిగా ఆ ఇద్దరు ఒకటయ్యారు. ఏప్రిల్ 19న కర్నల్ లో బంధు మిత్రులకు వివాహ విందు ఇచ్చారు. అందరి ఆశీస్సులు అందుకున్నారు. ఏప్రిల్ 21న  హనీమూన్ కు కశ్మీర్ చేరుకున్నారు. ఏ ప్రిల్ 22.. ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు  ఏప్రిల్ 23న అతడి మృతదేహం కర్నల్ చేరుకుంది. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ ఆఫీసర్  వినయ్ నావల్ నూరేళ్ళ స్వప్నం.. విషాద చిత్రంగా మిగిలి పోయింది. నిజానికి గతంలోనూ  దేశంలో అనేక చోట్ల  ఉగ్ర దాడులు జరిగాయి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ఎన్నో ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. కానీ, పహల్గాం ఉగ్రదాడి  హిందువులే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడి. ఉగ్రవాదులు తూటా పేల్చేందుకు ముందుగా  విక్టిమ్’  ఎవరో, ఏ మతమో అడిగి నిర్ధారణ చేసుకుని ఆ తర్వతనే తూటాలు పేల్చారు.  వినయ్ నర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. ఆ ఇద్దరు బేల్ పూరి తింటున్న సమయంలో,  ఉగ్రవాది ఒకడు నర్వాల్ ని సమీపించి నువ్వు ముస్లిమా అని అడిగాడు.. కాదనగానే కాల్చి చంపాడు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. హిమాన్షి స్పాట్లో చెప్పిన, వీడియోలో రికార్డు అయిన సత్యం. ఇలా జరుగుతుందని, ఎప్పుడు అనుకోలేదని  ఆమె భోరు మన్నారు.  ఇంకా విషాదం ఏమంటే, మరో వారం రోజుల్లో  మే 1న నర్వాల్ ని 27పుట్టిన రోజు. ఇంతలోనే ఈ విషాదం. మరో రెండు రోజుల్లో కొత్త జంట, కొచ్చి నేవీ క్యాంపు లో కొత్త జీవితం (కాపురం) ప్రారంభించేందుకు  ముహూర్తం పెట్టుకున్నారు. కానీ  ఇంతలోనే  ఉగ్రవాదులు ‘మృత్యు’ ముహూర్తం పెట్టారు. ప్రాణాలు తీశారు.  కర్నాల్ సిటీలో నర్వాల్ ఇంటి ముందున్న పెళ్లి పందిరి, పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలంకారాలు అలా ఉండగానే, అదే పందిరిలోకి నర్వాల్ శవ పేటిక వచ్చింది. ఆ విషాద దృశ్యం చూసి కంటతడి పెట్టని వారు లేరు. తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, తల్లి తండ్రులు బంధువులు, మొత్తం కర్నాల్ నగరమే కన్నీరు మున్నీరైంది. సరే హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్, మరి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు నర్వాల్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తుందని  హామీ ఇచ్చారు.  కానీ.. పాదాల పారాణి అయినా అరక ముందే భర్తను కోల్పోయిన హిమాన్షి కి ప్రభుత్వం ఏమి  న్యాయం చేస్తుంది. ఆ తల్లితండ్రుల కడుపు కోతకు ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది?  అయినా  పభుత్వం మహా అయితే.. పోయిన ప్రాణానికి విలువ కట్టి, నష్ట పరిహారం ఇస్తే ఇవ్వవచ్చును ?  పెళ్ళయి పది రోజులు అయినా  కాకముందే  చెరిగిన నుదిటి బొట్టుకు నష్ట పరిహారం  ఇంతని ఎవరు ఖరీదు కడతారు?  ఏదో ఇస్తారు, ఏదో జరుగుతుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేసిన విధంగా  ఉగ్రవాది ఎక్కడ నక్కినా, వెతికి, వేటాడి శిక్షించ వచ్చును. ఇంకా ఏమైనా  చేయవచ్చును.కానీ కంటి తుడుపు చర్యలు, ప్రకటనలు, ప్రగల్భాలతో ప్రయోజనం ఉంటుందా? ఉగ్రవాదానికి ముగింపు ఉంటుందా?

huge number of launch pads in pok

పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం, హింసా సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్ లోకి పంపించేందకు పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది. ఈ లాంచ్ ప్యాడ్ లను గుర్తించిన భారత భద్రతా బలగాలు.. అక్కడ నుంచి భారత్ లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పై నుంచి? ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, జైషేమహ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్థాన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.  

cbn going to delhi today

ప్రధానిని ఆహ్వానించేందుకు హస్తినకు చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన  ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ  రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. మొత్తం మీద గంట సేపు సాగే ఆయన పర్యటన కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్రధానంగా అమరావతి  చరిత్ర తెలిపేవిధంగా ఏర్పాటు చేయనున్న పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందం టున్నారు. కాగా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం (ఏప్రిల్ 25) ఢిల్లీ వెళ్లనున్నారు. అమరావతి పర్యటనకు ప్రధాని షెడ్యూల్ ఇలా ఉ:ది. మే2 మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో అమరావతిలో  దిగుతారు. అక్కడ నుంచి సభాస్థలి వరకూ దాదాపు కిలోమీటర్ పైగా దూరానికి రోడ్ షో ద్వారా వెడతారు. ఈ రోడ్ షో దాదాపు 15 నిముషాల పాటు సాగుతుంది.  అనంతరం అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. ఆ తరువాత అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఇలా ఉండగా  ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు.  వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికపై 100 మంది ఉంటారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదిక ఏర్పాటు చేస్తున్నారు.   ప్రధాని సభ ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ఆరుగురు మంత్రులలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మంత్రులు  నారాయణ, పయ్యావుల,  నారా లోకేశ్, సత్య కుమార్ యాదవ్,   నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్రలు ఉన్నారు.  అలాగే ఈ పర్యటనకు నోడల్ అధికారిగా జి.వీరపాండియన్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  

tense at pakisthan high commissiom newdwlhi

పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీలోని  పాకిస్తాన్  హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే.. పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త   వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.  అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.   సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్  ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు.  ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్  నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు  42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.   

encounter chattisgarh and telangana border

ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం భీకర కాల్పులు.. వేల సంఖ్యలో మావోయిస్టులు..  వాయుసేన సహకారంతో భద్రతా దళాల కూంబింగ్ ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు విరమించి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇలా ఉండగా   చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. అక్కడ దాదాపు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ గాలింపు జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి.  వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. వాయుసేన కూడా ఈ కూంబింగ్ లో భాగస్వామి అయ్యిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తో  నక్సల్స్ ముక్త భారత్ దిశగా పడుతున్న అడుగులు ముగింపు దశకు వచ్చినట్లే అవుతుందని కూడా అంటున్నారు.  కూబింగ్ నిలిపివేయాలి, శాంతి చర్చ లకు పిలవాలి అంటూ మావోయిస్టులు   రాసిన లేఖను  కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపిం చడం లేదు.   వచ్చే ఏడాది మార్చినాటికి నక్సల్స్ ముక్త భారత్ ను చూడాలన్న లక్ష్యంతో  కేంద్రం అడుగులు వేస్తున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో వేల సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్ పీఎఫ్, సైన్యం సంయుక్త ఆపరేషన్ కింద ఆపరేషన్ కగార్ సాగుతోంది.  ఇప్పుడు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.   తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టులు అత్యంత సేప్టీ జోన్ గా భావిస్తుంటారు. ఆ కారణంగానే అందుకే ఛత్తీస్ గఢ్ లో తమ ఆనుపానులన్నీ భద్రతా దళాలు తెలుసుకుని దాడులు చేస్తుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు. ఇలా ఇక్కడ మకాం వేసిన వారిలో  పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి కూంబిగ్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలకు దారితీసే అన్ని మార్గాలనూ దాదాపుగా చుట్టుముట్టేశారు.  మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్టలను వాయిసేన విమానాలు జల్లెడపడుతున్నాయి.  కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో హరగోపాల్ వంటి పౌరహక్కుల సంఘం నేతలు రంగంలోకి దిగి.. శాంతి చర్చల కోసం మావోలు లేఖ రాసిన తరువాత కూడా ఈ తీరులో ఏరివేత కార్యక్రమం కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే కూంబింగ్ నిలిపివేసి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కోరుతున్నారు. 

tearful story of new kashmir

కొత్త క‌శ్మీరం.. క‌న్నీటి గాథ‌!

క‌శ్మీర్ లోయ విధ్వంసంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో విషాద గాథ‌ హార్స్ రైడ‌ర్ సాహ‌స‌గాథ‌.. క‌లిమాతో త‌ప్పించుకున్న ఓ ప్రొఫెస‌ర్ తెలివైన క‌థ‌ హానీ మూన్ కి వ‌చ్చి శ‌వ‌పేటిక‌లో వెళ్లిన న‌వ వ‌రుడు బోరున విల‌పించిన న‌వ వ‌ధువు దీన ప్రేమ గాథ‌.. తొలిసారి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన క‌శ్మీరీలు సీఎం నుంచి కామ‌న్ మేన్ వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే వెత‌.. క‌త‌! గ‌త కొన్నేళ్ల నుంచి కొత్త క‌శ్మీరం ఆవిష్క‌రిస్తున్న వేళ‌.. ఎన్న‌డూ లేని విధంగా ప‌ర్యాట‌కులు సంద‌డి చేస్తున్న స‌మ‌యాన‌.. కాశ్మీరం నిజంగానే ఒక భూత‌ల స్వ‌ర్గ‌మా అనిపించింది. క‌శ్మీర్ భార‌త్ లో భాగం అయితే మ‌న‌కు ఇంత‌టి భాగ్యం ల‌భిస్తుందా? అన్న కోణంలో స్థానిక క‌శ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న  సంద‌ర్భం కూడా ఇదే.  అయితే గ‌త మూడున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 26 మంది ప‌ర్యాట‌కుల‌ను హ‌త‌మార్చి.. పాక్ ఉగ్ర‌వాదులు ఇక్క‌డి వారికి మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. సామాన్యుల నుంచి సీఎం వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే మాట‌. ఇది అమానుషం. ప్ర‌పంచ మాన‌వాళిపై జ‌రిపిన న‌మ్మ‌క ద్రోహం. ఇదొక అస‌హ్య‌క‌ర‌మైన చర్య‌. ఈ దాడికి తెగ‌బ‌డింది జంతువులు. వార‌ు అస‌లు మ‌నుషులు కాదు. త‌మ రాష్ట్రానికి ఆహ్లాదం వెతుక్కుని వ‌చ్చిన వారు తిరిగి వెళ్లేట‌పుడు ఆనందంగా వెళ్ల‌కుండా విషాద‌ంగా వెళ్ల‌డం.. త‌మ‌ను తీవ్రంగా  బాధిస్తోంద‌ని బాధ ప‌డ్డారు సీఎం ఒమ‌ర్ అబ్ధుల్లా. మ‌రి కొంద‌రు ప‌ర్యాట‌కులు శ‌వ‌పేటిక‌ల్లో వెళ్ల‌డాన్ని తామైతే అస‌లు జీర్ణించుకోలేక పోతున్నామ‌నీ ఆ దృశ్యాలు త‌మ‌ను క‌ల‌చి వేస్తున్నాయ‌ని అన్నారు సీఎం అబ్దుల్లా. ఇక క‌శ్మీరీలైతే.. తాము స్వ‌చ్ఛందంగా హోట‌ళ్లు, షాపులు మూసి వేసి.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌మ ప్రాంతానికే మాయ‌ని మ‌చ్చ‌లాంటి ఘ‌ట‌న‌గా వీరు భావిస్తున్నారు. త‌మ గుండెల‌పై ఈ దాడి గున‌పం దించింద‌నీ,  ఒక్క‌సారిగా పాత కాశ్మీర్ త‌మ క‌ళ్ల‌కు క‌ట్టింద‌నీ. ఇన్నాళ్ల పాటు తాము చూసింది క‌ల‌. ఇదే క‌ఠిక వాస్త‌వం. మా పాత క‌శ్మీర్ ని మ‌ళ్లీ మాకు వ‌ద్ద‌న్నా మా ఉగ్ర మూక‌లు  బ‌హుక‌రించ‌డం మాకుసుతరామూ ఇష్టం లేద‌ని వారు ఘోషిస్తున్నారు. 15రోజుల పాటు ప‌ర్యాట‌కుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స‌హా అన్ని ఉచితంగా ఇస్తామ‌నీ.. సైనికుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ను కూడా అందిస్తామ‌ని క‌శ్మీరీలు అంటున్నారు. ఇది ప‌ర్యాట‌కం డ‌బ్బు ద‌స్కానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. మాన‌వ‌త్వానికి చెందిన అంశం కాబ‌ట్టి.. బాధిత కుటుంబాల‌కు త‌మ ప్ర‌గాఢ సాను భూతిని వ్య‌క్తం చేశారు. త‌మ‌లో ఒక‌డైన హార్స్ రైడ‌ర్ అదిల్ షా త‌మ క‌శ్మీరీల త‌ర‌ఫున ఉగ్ర‌వాదులతో పోరాడి వీర మ‌ర‌ణం పొంద‌డం త‌మ‌ను క‌ల‌చి వేసింద‌నీ, ప‌ర్యాట‌కుల ప‌ట్ల మా ప్రేమ ఎలాంటిదో అదిల్ షా మ‌ర‌ణం రూపంలో  తెలియ చేసిన‌ట్టుగా స్థానిక క‌శ్మీరీలు చెబుతున్నారు. మేం మీకోసం ప్రాణం పెడ‌తామ‌న‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం మ‌రేదీ లేద‌ని అంటున్నారు వారు. ఇక న‌వ జంట విన‌య్- హిమాన్షుది..  అత్యంత విషాదక‌ర‌మైన‌ ఘ‌ట‌న‌.  వీరి పెళ్ల‌య్యింది ఏప్రిల్ 16, ఆమె భ‌ర్త విగ‌త జీవిగా మారింది ఏప్రిల్ 22న‌. ప‌ట్టుమ‌ని వారం కూడా నిల‌వ‌ని వివాహ బంధం వీరిది. ఆమె అత‌డి శ‌వ‌పేటిక ద‌గ్గ‌ర ఏడ్చిన ఏడుపు.. ఎంత హృద‌య విదార‌కంగా నిలిచిందంటే.. ప్ర‌పంచ‌మంతా ఆమెతో క‌ల‌సి ఏడ్చేంత‌. అంత‌గా ఆమె త‌న భ‌ర్త శ‌వ‌పేటిక‌ను వ‌ద‌ల్లేక వ‌దులుతూ.. చివ‌రిగా జై హింద్ అంటూ ఆమె చూపిన దేశ భ‌క్తి న‌భూతో.. ఆ స‌మ‌యంలో వారికి తెలీదు త‌మ‌పై ఒక ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని. విన‌య్ అయితే హిమాన్షుతో క‌ల‌సి ఎంతో ఉల్లాసంగా  గ‌డుపుతున్నాడు. ఇద్ద‌రూ క‌ల‌సి ఆడి  పాడారు. అత‌డైతే తాను చ‌నిపోయే స‌మ‌యానికి భేల్ పూరీ తింటున్నాడు. ఇంత‌లో ఆమె మొహంపై ర‌క్తం చిందింది. చూస్తే ఒక ఉగ్ర‌వాది త‌న భ‌ర్త‌ను కాల్చి చంపిన దృశ్యం చూసి విల‌విల‌లాడిపోయిందా న‌వ వ‌ధువు.  ఇక క‌లిమా చ‌ద‌వ‌డం వ‌ల్ల బ‌తికిపోయిన దంపతుల‌ది మ‌రో ర‌క‌మైన గ్రేట్ ఎస్కేప్ స్టోరీ. ఒక చెట్టు కింద బెంగాలీ ప్రొఫెస‌ర్ భ‌ట్టాచార్య ప‌డుకుని ఉన్నారు. ఆయ‌న కుటుంబం కూడా అక్క‌డే ఉంది. తాను నిద్రిస్తుండ‌గా.. క‌లిమా చ‌దువుతున్న చ‌ప్పుడు. లేచి చూశాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ఒక ఉగ్ర‌వాది అత‌డ్ని హిందీలో అడిగాడు. అంతే అత‌డు త‌న‌కు తెలిసిన క‌లీమా బిగ్గ‌ర‌గా చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. ప‌క్క‌నే ఉన్నత‌న్ని కాల్చి   అక్క‌డి నుంచి వెళ్లిపోయాడా ఉగ్ర‌వాది. దీంతో బ‌తుకు జీవుడా అంటూ అక్క‌డ నుంచి పారిపోయింది భ‌ట్టాచార్య కుటుంబం. ప‌హెల్గాంకి 5 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్ర మ‌ట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండే బైస‌ర‌న్ ప‌చ్చిక‌బ‌య‌ళ్లు.. ఎంతో ఆహ్లార‌క‌రంగా ఉంటాయి.. ఇక్క‌డికి న‌డ‌క లేదా గుర్ర‌పు స్వారీ ద్వారా మాత్ర‌మే వెళ్లగలం. అందులో భాగంగా ఇక్క‌డ హార్స్ రైడ‌ర్లు చాలా మంది త‌మ జీవ‌నోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. అలా ప‌ర్యాట‌కుల‌ను బైస‌ర‌న్ కు త‌న గుర్రం మీద ఎక్కించుకుని నాలుగు డ‌బ్బులు సంపాదిస్తుంటాడు అదిల్ షా. అత‌డ‌లా వ‌స్తుండ‌గానే ఈ దాడి జ‌రిగింది. అత‌డైతే ఎంతో వీరోచితంగా ఉగ్ర‌వాది నుంచి తుపాకీ లాక్కో బోతూ.. వారి కాల్పుల్లో చ‌నిపోయాడు. ఇప్పుడ‌త‌డి భార్యా పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు అనాథ‌ల‌య్యారు. వీరు త‌మ కుమారుడి మ‌ర‌ణ వార్త విని భోరున విల‌పిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్నే ఉగ్ర‌వాదులు ఎంపిక చేసుకోడానికి గ‌ల కార‌ణం ఇక్క‌డ ప‌ర్యాట‌కులు అధికంగా వస్తుండటమే.. వీలైనంత ఎక్కువ  మందిని మట్టుపెట్టవచ్చన్న అంచనాలతోనే  ఉగ్ర ముఠా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ దాడికి తామే కార‌కుల‌మంటూ ల‌ష్క‌రే తోయిబా రెసిస్టెన్స్ గ్రూప్ బాధ్య‌త తీస్కుంది.  ప్ర‌ధాని మోడీ అయితే రెండు రోజుల సౌదీ ప‌ర్య‌ట‌నను అర్ధంతరంగా ముగించుకుని హుటాహుటిన  భార‌త్ చేశారు. హోం మంత్రి అమిత్ షా సీఎం, లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యి ప‌రిస్థితి స‌మీక్షించారు. బాధితుల‌తో మాట్లాడారు. ఇక ఢిల్లీలో అత్య‌వ‌స‌ర భ‌ద్ర‌తా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక‌పై పాక్ తో మ‌రోలా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఊహించ‌లేనంత గ‌ట్టి దెబ్బ తీస్తామ‌న్నారు రాజ్ నాథ్ సింగ్. ఇక‌పై ఏ ర‌క‌మైన దౌత్య సంబంధాలు కూడా పాక్ తో ఉండ‌వ‌ని తెగేసి చెప్పారు. ఆ ముగ్గురు ముష్క‌రులు పాకిస్తానీలే కాబ‌ట్టి.. 1960 నాటి సింధు జ‌లాల ఒప్పందం అమ‌లు  నిలిపి వేశారు. ఇక్క‌డి పాక్ దౌత్య వేత్త‌ల‌ను మీ దేశం దయచేయండని హుకుం జారీ చేశారు.  భార‌త్ లో ఉంటున్న  పాకిస్తానీలు గానీ, ప‌ర్యాట‌కులు గానీ వారం లోగా భార‌త్ వీడాల‌ని సూచించారు. పాక్ లోని భార‌త దౌత్య అధికారుల హోదాల‌న్నిటినీ ర‌ద్దు చేసి.. వారిని తిరిగి వ‌చ్చేయాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడంద‌రి చూపల్లా ఒక్క‌టే.. ఉగ్ర‌దాడికి భార‌త స‌మాధానం ఏ స్థాయిలో ఉంటుందా? అని మాత్ర‌మే!

pehalgaon terror attack aims hindus

మంచుకొండల్లో మారణహోమం.. హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో..  దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది. ఉగ్రవాదానికి మతం లేదంటారు.  మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి?  హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి?  మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా?  పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు.. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గాం ఉగ్రదాడిలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ.. హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం.. పహల్గాం ఉగ్రదాడితో  తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడితో.. కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే.. పహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయ్. అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్. ఇలా.. ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ.. తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయ్. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడి.. పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే.. కశ్మీర్‌లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవా దులు. ఎందుకంటే.. ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే.. ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు.. టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువులను.. కాఫిర్‌లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు.. ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది.. మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెబుతున్నారు. కేవలం కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం విభజనని పెంచి.. అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణహోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు. చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం.. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు.. మేము.. నిన్ను చంపం. ఈ భయానక ఘటన గురించి మోడీకి అని.. టెర్రరిస్ట్ ఆమెను ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్‌లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి.. రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే.. ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయ్. అమర్‌నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు.. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి.. భారత్‌లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతున్నది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని.. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగానూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే.. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

India gives befitting reply to Pakistans provocations

పాక్ కవ్వింపులు.. దీటుగా భారత్ బదులు!

కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది.  ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసే సింది.  వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన  పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో భేటీ అయిన  భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల మేరకు అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను  మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే వారు దేశం విడిచి వెళ్లాలంటే అట్టారీ -  వాఘా చెక్ పోస్టు ఒక్కటే మార్గం.  దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. దానిని మూసివేయడంతో  ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్థానీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులు జైలుకు వెళ్లక తప్పదు. ఇక ఇప్పుడు వారు  అనివార్యంగా తాము తిరిగి వెళ్లడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. వీసా ఉంది కదా అన్న ధైర్యంతో అడ్రస్ లు మార్చి దేశంలో తిరిగే అవకాశం ఇసుమంతైనా లేదు. అదే విధంగా సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ ట్రీటీ) రద్దు చేసింది. పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసింది.  భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు కూడా  మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలతో  ఒక అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఇక పాకిస్తాన్‌లో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పెహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో  భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది.  కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే  ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుంబిగించింది.  కరాచీ తీర ప్రాంతంలో  రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్ కు సమాచారాన్ని అందించింది. ఇందు కోసం తీరప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, పాక్ క్షిపణి పరీక్షలపైనా నిఘా ఉంచామనీ పేర్కొంది.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉందని పేర్కొంది.  

no entry to pak citizens

పాక్ పౌరులకు అనుమతి నో.. సింధు జలాల ఒప్పందం రద్దు!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన  ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది.  ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది. అందులో బాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ   సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది.  అందులో భాగంగా  సింధు నది జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే  భారతదేశంలోకి పాకిస్థాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా, ఆ దేశస్థులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది.   ఈ మేరకు పాక్  పాక్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశంతోనూ చర్చల ప్రశక్తే లేదని ప్రకటించింది. ఇప్పటికీ పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుంటే ముందుముందు మరిన్ని కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమబని భారత్ హెచ్చరించింది.    

vidadala rajani stopped in vixag airport

విశాఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విడదల రజనీ నిర్బంధం?

మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ  హయాంలో  యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు  వసూలు చేశారనే ఆరోపణలపై  మాజీ మంత్రి విడుదల రజని,  ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన  అధికారి  జాషూవా,  మాజీ మంత్రి  విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  ఇదే కేసులో విడదల రజని మరిది విడదల గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు గురువారం (ఏప్రిల్ 24) ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మాజీ మంత్రి విడదల రజనీ, విడదల గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే  విజిలెన్స్ అధికారి జాఘువా సైతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్లన్నీ విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. విడదల రజనీ యాంటి సిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన కోర్టు, ఆమెకు అరెస్టు నుంచి మాత్రం ఎటు వంటి మినహాయింపూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పరారీ అయ్యే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. కాగా విడదల రజనీ దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రం నుంచి రజనీ విదేశాలకు వెళ్లకుండా  రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయంలో విడదల రజనీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను అరెస్టు చేశారా? లేక అడ్డుకున్నారా అన్న విషయంలో క్లారిటీ లేదు.  

గోపీనాథ్ అరెస్టు.. ఇక మాజీ మంత్రి విడదల రజనీ వంతేనా?

వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.  అరెస్టు అనంత‌రం.. ఆయనను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు తరలించారు.   ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు.  యడ్లపాడులో  క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదులపై  మాజీమంత్రి విడదల రజపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నే విడదల రజిని మరిది గోపినాథ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌ లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు.   2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు  ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడదల రజని  ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు.  ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.   కాగా సైబరాబాద్ మెక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  ముందస్తు బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు.  ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడదల గోపీనాథ్ ను అరెస్టు చేయడంతో  విడదల రజనిని కూడా అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. 

కారు స్టీరింగ్ చేతులు మారుతుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ  సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.  అవును పాతికేళ్ళ క్రితం, 2001 ఏప్రిల్‌ 2న జలదృశ్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం) లో పురుడు పోసుకున్నటీఆర్ఎస్ ఇంత కాలం బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా అప్పటికే  ప్రత్యేక  తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేకం ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే  అనుకున్నవారు, అన్నవారు కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్  విజయవంతంగా, రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించింది.  ప్రతిపక్ష అనుభవాన్నీ రుచి చూసింది.    నిజానికి, తెలుగు నాట  అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా, పాతికేళ్ళు బతికి బట్ట కట్టిన పార్టీలు రెండే రెండున్నాయి. 1982 లో  నందమూరి తారక రామ రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్ట కట్టిన పార్టీగా చరిత్ర  పుటల్లో నిలిచింది.  ఈ పాతికేళ్ళలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో  భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) గా  పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే  ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాతీయ పార్టీ, జాతీయ పార్టీగా  రూపాంతరం చెందినా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా  పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు, కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సారథ్యకలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి,ముందు ముందు కూడా ఆయనే కొనసాగుతారు.  అందులో అనుమానం లేదు.  అయితే పదవి ఆయనదే అయినా..  పెత్తనం అయన చేతుల్లో ఎంతవరకూ ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఫార్మ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? తెర వెనక నుంచి మార్గ ‘దర్శకత్వం’ మాత్రమే చేస్తారా? అంటే.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను జాగ్రత్తగా గమినిస్తే..  ఏదో ఇలాంటి, ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతోందననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి.. కారాణాలు ఏమైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకూ కుదించుకు పోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్  అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానై చక్రం తిప్పుతున్నారనేది  కళ్ళ ముందున్న సత్యం. అదలా ఉంటే గడచిన రెండుమూడు రోజుల్లో కేటీఆర్  వేర్వేరు టీవీ చాన్నాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ, పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు. వినిపించరు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనక నుంచి మార్గ దర్శకత్వం  మాత్రమే చేస్తారు. తెరపై కనిపించే రోజువారీ రాజకీయ  కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు.  అలాగే, ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్  కొనసాగుతారు, కానీ, అసెంబ్లీకి మాత్రం రారని, కేటీఆర్  ఒకటి రెండు ఇంటర్వ్యూలలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రస్ మంత్రులు చేసే అవమానాలను భరించవసిన అవసరం కేసీఆర్ కు లేదని, అందుకే ఆయన, అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు.. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు, అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి  రాలేదని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్  కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు.  సో.. ఇక గులాబే బాస్  ఎవరంటే.. తెర వెంక కేసీఆర్,  తెరపై కేటీఆర్ ఆర్  అంటున్నారు.

ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో  అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.   అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తెలుగువారి   కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.  ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు.. మన దేశంలో  సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు.  అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.   దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.  జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు.