ఇక 50 ఏళ్ల వరకూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అక్కర్లేదు!
ఇక 50 ఏళ్ల వరకూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అక్కర్లేదు!

దేశంలో వాహన చోదకులకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించనుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులకు భారీ ఊరట కల్పించేలా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్నది. అదేంటంటే.. ప్రస్తుతం.. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే.. అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది. అంటే మీరు చిన్న వయసులోనే లైసెన్స్ పొందితే, 50 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎలాంటి రీన్యూవల్ టెన్షన్స్ లేకుండా నిశ్చింతగా వాహనాలను నడుపుకోవచ్చన్నమాట. ఈ నయా ప్రతిపాదన వెనుక కేవలం గడువు పెంపు మాత్రమే కాదు.. రవాణా శాఖకు సంబంధించిన అనేక సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే బలమైన సంకల్పం కూడా ఉంది. ఇకపై వాహనాల యాజమాన్య బదిలీ ప్రక్రియతో పాటు వివిధ రకాల పర్మిట్ల పునరుద్ధరణ (Permit Renewal) పనులను వంద శాతం ఆన్‌లైన్ విధానంలోనే పూర్తి చేసేలా సరికొత్త వ్యవస్థను డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రాంతీయ రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

Publish Date: Jun 9, 2026 6:59PM
 సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి ఆత్మహత్య కేసు.. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన అత్తమామలు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి ఆత్మహత్య కేసు.. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన అత్తమామలు

చర్లపల్లి, ఘట్‌కేసర్ రైల్వే మార్గంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా విజయలక్ష్మి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మృతురాలి అత్తమామలు భగవంత్ రెడ్డి, సులోచన దంపతులు కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ తమకు, తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తమ కుమారుడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కోడలు తరఫు బంధువుల కన్నుపడిందని ఆరోపించారు. తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, డీసీపీని కలిసి వినతి పత్రం అందజేసినా పరిస్థితిలో మార్పు లేదని వృద్ధ దంపతులు తెలిపారు. దీంతో చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. తమను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, తమకు తక్షణ రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కమిషన్‌ను కోరారు. ఈ మేరకు వారి ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించినట్లు సమాచారం.

Publish Date: Jun 9, 2026 6:35PM
నాలుగు   నామినేషన్లూ సక్రమమే!
నాలుగు నామినేషన్లూ సక్రమమే!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు జరిగిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం (జూన్ 9) అధికారికంగా పూర్తయింది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 18 న జరగబోయే ఈ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరి పత్రాలు చెల్లుబాటు కావడంతో తదుపరి ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నలుగురు ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అదేవిధంగా, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కోటా కింద ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 4 స్థానాలకు గానూ కూటమి తరఫున ఈ నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. దీంతొ ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక కగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.

Publish Date: Jun 9, 2026 4:35PM
 ఇఎన్సీ మోహన్ నాయక్  చిట్టా.. 200 కోట్లకు పైగా ఆస్తులు   గుర్తించిన ఏసిబి
ఇఎన్సీ మోహన్ నాయక్ చిట్టా.. 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసిబి

ఏసీబీ దాడుల్లో ఇఎన్‌సి మోహన్ నాయక్‌కు సంబంధించిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయనకు సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం. ఆస్తుల పరంగా చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములు కూడా ఆయన పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతా ల్లో ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఆస్తులు ఎలా సంపాదించారు. ఆదాయానికి మించిన ఆస్తులా అనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో మొత్తం ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రోడ్డు భవనాల శాఖ ఇఎన్‌సి గా పని చేస్తున్న మోహన్ నాయక్‌ పై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి మంగళవారం (జూన్ 9) తెల్లవారుజాము నుండే ఏకకాలంలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఇప్పటివరకు మోహన్ నాయక్ 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంకా సోదాలు కొన సాగుతూ ఉన్నాయి.

Publish Date: Jun 9, 2026 4:25PM
స్వదేశానికి చేరుకున్న  అనురూప్ రెడ్డి భౌతికకాయం
స్వదేశానికి చేరుకున్న అనురూప్ రెడ్డి భౌతికకాయం

అమెరికాలో స్నేహితులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ యువకుడు అనురూప్ రెడ్డి భౌతికకాయం స్వదేశానికి చేరు కుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవిడిపల్లి గ్రామానికి చెందిన అనురూప్ రెడ్డి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి కంప్యూ టర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది. అయితే.. ఆయన భౌతికకా యం ఇప్పుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు, అధికారులు కన్నీటి నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ కిరణ్మయి, ఎంఆర్వో అమర లింగం గౌడ్ కుటుంబ సభ్యులకు అధికారికంగా భౌతికకాయాన్ని అప్పగించారు.స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేసిన అనురూప్ రెడ్డి త్యాగం పట్ల గ్రామస్తులు, అధికారులు, పలువురు ప్రముఖులు అతని త్యాగాన్ని అభినం దిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

Publish Date: Jun 9, 2026 2:26PM
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన..  క్షతగాత్రులను పరామర్శించి, భరోసానిచ్చిన మంత్రి నారా లోకేష్
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. క్షతగాత్రులను పరామర్శించి, భరోసానిచ్చిన మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం (జూన్ 9)ఉదయం నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-1 విభాగంలో సోమవారం జూన్ 8) సాయంత్రం సంభవించిన ఘోర పేలుడులో తొమ్మండుగురు మరణంచగా, ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి నారా లోకేష్, వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇతర నగరాలకు తరలించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పారిశ్రామిక విపత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. సేల్ ( పరిధిలోని బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంకేతిక కమిటీని రంగంలోకి దించారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు, నిర్వహణ లోపాలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరపనుంది. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. మృతుల కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల తక్షణ సాయాన్ని ప్రకటించారు. పరిశ్రమలలో ఇలాంటి పునరావృతం కాకుండా విశాఖ పరిసర ప్రాంతాల్లోని భారీ పరిశ్రమలన్నింటికీ సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Publish Date: Jun 9, 2026 2:10PM
సూట్ కేసులో మృతదేహం.. మిస్టరీ ఛేదించిన పోలీసులు!
సూట్ కేసులో మృతదేహం.. మిస్టరీ ఛేదించిన పోలీసులు!

చెన్నైలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఇటీవల దొరికిన సూట్‌కేస్ లో కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు, కాళ్లు లేని ఒక పురుషుడి మృతదేహం లభ్యమై కలకలం రేపిన సంగతి విదితమే. ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. ప్రాథమికంగా మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు. షాపు రికార్డులు పరిశీలించగా, ఆ దుస్తులను ఇద్దరు వ్యక్తులు కలిసి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం దర్యాప్తుకు కీలక మలుపు ఇచ్చింది. తదుపరి దర్యాప్తులో కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ లోకేషన్ ట్రాకింగ్ ఆధారంగా పోలీసులు అనుమానితులను గుర్తించారు. వారు చెన్నైలోని తేనాంపేట, టి.నగర్ ప్రాంతాల్లో ఉన్నట్లు తేలింది. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతుడి భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి జీవించా లనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించు కుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసి, శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో కుక్కి పారవేసి నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

Publish Date: Jun 9, 2026 1:48PM
ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్లలో భారీ కోత!
ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులకు షాక్: సబ్సిడీ సిలిండర్లలో భారీ కోత!

భారతదేశంలోని కోట్లాది మంది పేద మహిళల వంటగది కష్టాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. పొగ లేని వంటగదిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందారు. అయితే, తాజాగా ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి అందిస్తున్న 9 సబ్సిడీ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల సంఖ్యను ఏకంగా 4 కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షాకింగ్ నిర్ణయంతో ఉజ్వల యోజన లబ్ధిదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రభుత్వం ఈ రకమైన సబ్సిడీ కోత విధించడానికి ప్రధాన కారణం సబ్సిడీ సిలిండర్లు భారీగా పక్కదారి పట్టడమే అని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో పెద్ద ఎత్తున డైవర్షన్ రాకెట్ నడుస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది అక్రమార్కులు ఉజ్వల యోజన లబ్ధిదారుల పేర్లను వాడుకుంటూ, తక్కువ ధరకే లభించే ఈ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్లను బుక్ చేస్తున్నారు. అలా తక్కువ రేటుకు పొందిన సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర కమర్షియల్ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ఏడాదిలో 9 సిలిండర్ల వరకు సబ్సిడీ పొందే వెసులుబాటు ఉండటాన్ని ఈ ముఠాలు పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ విధమైన లూప్‌హోల్స్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు ప్రతి నెలా భారీగా గండి పడుతోంది. అందుకే ఈ అక్రమ దందాలకు శాశ్వతంగా బ్రేక్ వేయడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూస్తే, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఒక సాధారణ సగటు కుటుంబం ఏడాదికి సగటున కేవలం 4 ఎల్‌పీజీ సిలిండర్లను మాత్రమే వినియోగిస్తోంది. అంటే నిజమైన లబ్ధిదారులకు ఒక సంవత్సర కాలానికి 4 సిలిండర్లు సరిపోతున్నాయి. కానీ, ఈ పథకం పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు గరిష్ట పరిమితి అయిన 9 సిలిండర్ల వరకు సబ్సిడీని క్లెయిమ్ చేస్తూ తీవ్ర దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిజాయితీ గల లబ్ధిదారుల సాధారణ వాడకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, అదే సమయంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే ఈ 4 సిలిండర్ల లిమిట్ పెట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రభుత్వం కేవలం సబ్సిడీ వర్తించే సిలిండర్ల సంఖ్యను మాత్రమే ఏడాదికి 4 కి పరిమితం చేసింది. అంతేకాని, మీరు మార్కెట్లో కొనుగోలు చేసే సిలిండర్ల సంఖ్యపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేదు. ఒకవేళ మీ కుటుంబానికి ఏడాదికి 4 కంటే ఎక్కువ సిలిండర్లు అవసరమైతే, మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. కాకపోతే, మొదటి 4 సిలిండర్లకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. ఆ తర్వాత మీరు తీసుకునే ఐదవ ఎల్‌పీజీ సిలిండర్ నుండి మార్కెట్లో ఉన్న పూర్తి ధరను చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సామాన్య పేద ప్రజలపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్న అందరిలోనూ రేకెత్తుతోంది. నిజాయితీగా గ్యాస్ వాడుకునే నిరుపేద కుటుంబాలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఎందుకంటే మెజారిటీ గ్రామీణ కుటుంబాలు ఏడాదికి 4 సిలిండర్ల కంటే ఎక్కువ వాడటం లేదు. కాబట్టి, గ్యాస్‌ను కమర్షియల్ గా వాడుతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న బ్లాక్ మార్కెట్ దందా చేసేవాళ్లకు మాత్రమే ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఏది ఏమైనా, అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ వల్ల సబ్సిడీ దుర్వినియోగానికి చాలా వరకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తోంది.

Publish Date: Jun 9, 2026 1:36PM
 వ్యాపారి ఇంట్లో భారీ చోరీ...  నేపాలీలే!
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ... నేపాలీలే!

హైదరాబాద్ నగరంలో బడా బాబులను టార్గెట్గా చేసుకొని నేపాలి వాళ్లు గృహ సహాయకులుగా చేరి దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాలి వాళ్లు పనిచేస్తూ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి పాల్పడిన ఘటన, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో బర్తడే పార్టీ పేరుతో భార్యాభర్తలకు మత్తు పదార్థాలు ఇచ్చి ఇల్లు గుల్ల చేసిన ఘటనలు మరవ కముందే గచ్చిబౌలిలో మరో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు. ఇంటి తాళాలు తలుపులు బలవంతంగా పగలగొట్టిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు భావించారు. అనంతరం కుటుంబ సభ్యులు పూజ గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చింది. అనంతరం ఇంట్లో పూర్తిస్థాయిలో తని ఖీలు నిర్వహించగా ఇంట్లో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా మాయ మైనట్లుగా గుర్తించారు. దీంతో బాధిత వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పని చేసే నేపాలీ దంపతులపై అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మొత్తం ఒక కిలో బంగారం చోరీ జరిగిందని, దాని విలువ కోటి రూపా యలు ఉంటుందని బాధిత వ్యాపారి తెలిపారు.

Publish Date: Jun 9, 2026 1:36PM
ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు క్రూ సభ్యులు అస్వస్థత.. పైలట్ ఏం చేశాడంటే?
ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు క్రూ సభ్యులు అస్వస్థత.. పైలట్ ఏం చేశాడంటే?

రోడ్డు మార్గంలో ప్రయాణి స్తున్నప్పుడు ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే సమీప ఆస్పత్రికి తరలిం చడం సాధ్యమవుతుంది. అయితే గాల్లో వేల అడు గుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే? ముందుగా విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే సమీప విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనే మంగళవారం (జూన్ 9) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగిన అనంతరం వైద్య సిబ్బంది ఇద్దరు క్రూ సభ్యులకు ప్రాథమిక చికిత్స అందించి... అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని అపోలో హాస్పిటల్ కు తరలించారు.ఇద్దరు సిబ్బందికి ఒకేసారి అస్వస్థతకు గురి కావడం వెనుక కారణాలేమిటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా విమానం లోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నట్లు అధికా రులు వెల్లడించారు.

Publish Date: Jun 9, 2026 1:23PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds