బీజేపీ డబుల్ గేమ్.. వైసీపే షాడో ఫైటింగ్
దక్షిణాదిలో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టు సాధించేందుకు, బీజేపీ పట్టువీడని విక్రమార్కునిలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నిజానికి, తెలంగాణ విషయం ఎలా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏమి చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలి పోతోంది. ఇది చరిత్ర. అయినా, ఓటమి నుంచి ఓటమికి సాగే ప్రయాణంలో కమల దళం’ కొత్త ఎత్తులు, పొత్తులతో ప్రయోగాలు చేస్తోంది.
ఇప్పుడు అదే, క్రమంలో నేషన్ ఫస్ట్ ... అని ప్రవచనాలు పలికే బీజీపీ ... రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను సైతం దెబ్బతీసే విధంగా పాలన సాగిస్తున వైసీపే అరాచక, అసమర్ధ పాలనక కొనసాగింపుకు తెర వెనక కుట్రలకు తెర తీసిందనే అనే అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి. అవును, అందుకే, తెలుగు ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వైసేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీజేపీ తేరా వెనక కుట్రలు పన్నుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఈకుతల్లో భాగంగానే తెలుగు దేశం పార్టీని ఒంటరిని చేసేందుకు ఇటు జగన్ రెడ్డిని, అటు పవన్ కళ్యాణ్’ను కమల దళం దువ్వుతోందని అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లే వచ్చినా, 40 శాతం ఓట్లు తెచ్చుకుని జన పక్షంగా నిలిచింది. గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది. మరో వంక,జగన్ రెడ్డి ‘ఒక్క ఓటు’ అభ్యర్ధనకు మోసపోయిన ప్రజలు, ఆయన గారి నిజ రూపాన్ని తెలుసుకుని అతగాడిని సాగనంపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించి, రాజధాని అయినా లేని రాష్ట్రంగా నవ్యాన్ధ్రను మిగిల్చిన జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేది లేదని ‘గడప గడప’ ముఖం మీదనే తలుపులు వేస్తున్న సమయంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీ సర్కార్’కు ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నం చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన కలవటం ఖాయమైన నేపధ్యంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం మొదలు తీసుకుంటున నిర్ణయాలు, తాజా పాత్ర అనుమానస్పదంగా ఉందని అంటున్నారు. ఓ వంక జనసేన నేత పవన్ కళ్యాణ్’ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో ముందుకు సాగుతుంటే, అదే సమయంలో పవన్’ను దగ్గరకు తీసిన బీజేపీ, టీడీపీతో దూరంగా ఉంటోంది. అంతే కాదు, బీజేపీ జగన్ రెడ్డికి మేలు చేసేందుకు పవన్ కళ్యాణ్’ను కూడా తమవైపుకు తిప్పుకుని ముక్కోణపు పోటీ వ్యూహ రచన చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
ఈనేపధ్యంలో ఇప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్ర బీజేపే నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు, మరో వంక వైసీపీ నాయకులూ ముందెన్నడూ లేని విధంగా బీజేపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా పురందేశ్వరికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. విరుదుచ్కు పడుతున్నారు. రాష్ట్రంలో నిండా ఒక శాతం ఓటు లేని బీజేపీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి పురందేశ్వరికి ఉన్న కుటుంబ సంబంధాలను తెర మీదకు తెచ్చి మంత్రులు సహా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒక విధంగా రాష్ట్రంలో పోటీ, వైసీపీ, బీజేపీల మధ్యనే ఉంటుందనే ‘చిత్రా’న్ని చూపించే ప్రయత్నం వైసీపే చేస్తోంది. పోనీ అదీ నిజం అనుకుందామంటే, అదే సమయంలోనే కేంద్రం ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తోంది.
అంతే కాదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శిస్తున్న కమల నాధులు, అడిగిందే తడవుగా నిబంధనలను తుంగలో తొక్కి మరీ రాష్ట్రాన్ని, మరింత అప్పుల ఊబిలోకి తీసుకుపోయే విధంగా ఆర్థిక వెసులు బాటు పేరున జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసులుకుంటోంది. ఒక విధంగాచూస్తే జగన్ రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకు, రాష్ట్ర ప్రజల మెడలకు అప్పుల ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏపీ కోరిన విధంగా రుణ సేకరణకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎంతగా అడిగినా పట్టించుకోని రెవిన్యూ లోటు నిధులు ఇప్పుడు విడుదల చేసింది, మోదీ ప్రభుత్వం. రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం స్వాగతించదగిన పరిణామమే అయినా, ఆ నిర్ణయం వెనక ఉన్న కుట్ర, కుతంత్రం ఏమిటన్నదే ఇప్పడు అసలు ప్రశ్న, అంటున్నారు.
తాజాగా కేంద్రం జగన్ హాయంలో ఏపీలో గతం కంటే పెట్టుబడులు పెరిగాయని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో అసలు పెట్టబుడులు వెళ్లిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం రాజ్యసభలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23లో 284.22 మిలియన్ డాలర్లు వచ్చాయని ప్రకటించింది.
ఏపీలో జగన్ పాలనలో పేదరికం తగ్గిందని నీతి అయోగ్ నిర్ధారించింది. పేదరిక నియంత్రణకు జగన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు మేలు చేశాయని పేర్కొంది. మరో వంక మణిపుర్ హింసాకండను నిరసిస్తూ ప్రతిపక్ష కూటమి లోక్ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం, రాష్త్రాల హక్కులను హరించేందుకు ఉద్దేశించిన, ‘ఢిల్లీ ఆర్డినెన్సు’ స్థానంలో ప్రవేశ పెట్టే బిఅల్లు సహా, ఎన్నికల్ సమయంలో మోదీ ప్రభుత్వానికి కీలకంగా మారిన ఇతర వివాదాస్పద బిల్లులకు వైసీపీ, అడగక ముందే జీ హుజూర్ అంటూ’ జై కొట్టింది.
ఇలా ఒకరి కొకరు పరస్పరం సహకరించుకుంటున్న బీజేపీ, వైసీపీ రాష్ట్రంలో మాత్రం షాడో గిభ్ట్ చేస్తున్నారు. అయితే, ప్రజలు అమాయకులు కాదు .. ఆరు నూరైనా ..మళ్ళీ మరో మరు జగన్ రెడ్డికి అధికారం అప్పగించేంది లేదని సప్స్తం చేస్తున్నారు.