స్పీడ్ 4

వనమా ఎన్నిక చెల్లదు 41.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన  కోర్టు నేడు తీర్పు వెలువరించింది. .......................................................................................................................................................... తెలంగాణ పాఠశాలల్లో పాఠ్యాంశంగా సీపీఆర్ శిక్షణ 42. తెలంగాణలో పాఠ్యాంశంగా   సీపీఆర్‌ శిక్షణను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణాల ను నియంత్రించేందుకు విద్యార్థులలో సీపీఆర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా పాఠ్యాంశంగా ప్రాథమిక శిక్షణ చేర్చనుంది.   ...................................................................................................................................................... 43.  రానున్న రోజులలో  ఐటీ ఉద్యోగాలలో ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ బాగా తగ్గిపోయే అవకాశం ఉందని  ఆర్థిక సంవత్సరంకోసం ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్  బిజినెస్‌లైన్ ద్వారా సేకరించిన డేటా వెల్లడించింది. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్యమే ఇందుకు కారణమని ఆ డేటా పేర్కొంది. ............................................................................................................................................................. కర్నాటక సర్కార్ కూల్చివేతకు సింగపూర్ లో కుట్ర: డీకే 44. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సింగపూర్ లో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.   వైద్య పరీక్షల కోసం జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలో డీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ............................................................................................................................................................. 6న తమిళనాడుకు రాష్ట్రపతి ముర్ము 45.  మద్రాసు విశ్వవిద్యాలయం  165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు రానున్నారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ద్రౌపది ముర్ము తమిళనాడు పర్యటనకు రావడం ఇదే మొదటి సారి.  .............................................................................................................................................. ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలో వర్గాలన్నీ విలీనం: శశికళ 46. వచ్చే యేడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలన్నీ విలీనమౌతాయని  ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు  శశికళ అన్నారు. మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆమె అన్నారు. .................................................................................................................................................. బైజూస్ కార్యాలయం మూత 47. విద్యారంగ టెక్‌ దిగ్గజం బైజూస్‌  సంస్థ తాజాగా బెంగళూరు కల్యాణి టెక్‌పార్క్‌లోని కార్యాలయాన్ని  ఖాళీ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కిన్న బైజూస్ ఇక్కడి ఉద్యోగులను ఇతర కార్యాలయాలకు సర్దుబాటు చేసింది. ............................................................................................................................................................ జగన్ పై గంటా విమర్శలు 48. ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.  ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ  హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారని సెటైర్లు వేశారు.  ........................................................................................................................................................... అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశమే లేదు: ఫడ్నవీస్ 49.     మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ త్వరలో మహారాష్ట్ర సీఎం కాబోతున్నారంటూ కాంగ్రెస్ నేత   పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలను బీజేపీ నేత ఫడ్నవీస్ కొట్టి పారేశారు. అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని చెప్పారు.  చవాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ........................................................................................................................................................... మత్స్యకారుల వలలో డాల్ఫిన్.. వండుకుని తినేశారు 50.యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్  మత్స్యకారులకు చిక్కింది.  వలలో చిక్కిన డాల్ఫిన్ ను మత్స్యకారులు భుజంపై మోసుకొని ఇంటికి తీసుకువెళ్లారు. దానిని వారు వండుకు తినడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 

స్పీడ్ న్యూస్ 3

సాంకేతిక లోపంతో నిలిచిన టికెట్ల బుక్కింగ్ 26. సాంకేతిక లోపంతో ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్‌ నిలిచిపోయింది.  ఈ మేరకు ట్వీట్ చేసిన ఐఆర్‌సీటీసీ  సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.  సాధ్యమైనంత త్వరలో టికెట్ బుకింగ్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది. ............................................................................................................................................................... రోడ్లపైకి వరద నీరు 27.ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతులతో అధ్వానంగా తయారైంది.  మరోవైపు పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి వచ్చిన వరద రోడ్డుపై ప్రవహిస్తోంది. ................................................................................................................................................. కట్టేరు వాగు ఉధృతి 28. భారీ వర్షాలకు తిరువూరు నియోజకవర్గ పరిధిలోని  వినగడప వద్ద కట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది.  కట్లేరు వాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గే వరకు వాగు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ............................................................................................................................................................ కోటిపల్లి ప్రాజెక్టులోని వరద నీరు 29. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరాయి.  పూర్తిస్థాయి నీటిమట్టంతో కోట్లు ప్రాజెక్ట్ ఆ లుగు పారుతుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి నీరు కుదరడంతో నాగ సంబంధర్ దోర్నాల మీదుగా వాగు పొంగి ప్రవహిస్తుంది  .............................................................................................................................................. భారీ వర్షాలకు తెగిపోయిన రహదారి 30.ఆర్మూర్ లో గత రాత్రి  కురిసిన భారీ వర్షం కారణంగా  , రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో ఆ రహదారి తెగిపోయింది.  దీంతో రైల్వే స్టేషన్ కు రాకపోకల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న్నారు. .................................................................................................................................................. నేతన్నలపై దాడులు సహించం: పరిటాల శ్రీరామ్ 31. నేతన్నలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని  తెలుగుదేశం నాయకుడుపరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.   ......................................................................................................................................................... మోడీ సర్కార్ పై అవిశ్వాసం 32. మణిపూర్ లో   హింసపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడంతో  విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అంశంపై కేంద్రపై  లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ................................................................................................................................................ 27న రైతుల ఖాతాల్లోకి ఆ సొమ్ములు 33. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. ........................................................................................................................................................ ఢిల్లీలో డెంగ్యూ జ్వరాలు 34.  యమునానది వరదలతో అతలాకుతలమైన ఢిల్లీ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటోంది. అంతలోనే మరో ముప్పు నగరవాసులను భయంపెడుతోంది.   ఢిల్లీ వాసులు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి. .................................................................................................................................................... మణిపూర్ లో మరో దారుణం 35.  మణిపూర్ లో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్ర్య సమయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ దారుణం జరిగింది. బాధిత వృద్ధురాలు ఇబెటోంబికు 80 ఏళ్ల వయసు ఉంటుంది. ............................................................................................................................................................... ఇండియాపై మోడీ విమర్శలు 36. విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  మాట్లాడిన మోడీ  విపక్ష కూటమి పేరు లక్ష్యంగా ఆయన  గుప్పించారు. పీఎఫ్ఐ, ముజాహిదీన్ వంటి  వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందన్నారు.   ................................................................................................................................................... ఆకాశంలో స్వర్గానికి ద్వారం 37. బెంగళూరులో వినువీధిలో కనిపించిన వింత ఆకారం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఆకాశంలో మబ్బుల మధ్య ధ్వారం ఆకారం ఏర్పడటం చూపరులను ఆకట్టుకుంది. స్వర్గానికి ద్వారంలా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.   ............................................................................................................................................................... జల దిగ్బంధనంలో వేల్పూర్ 38. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆర్మూర్ - మెట్ పల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  వేల్పూర్ జల దిగ్బంధం పై క్షేత్రస్థాయిలో  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు. ........................................................................................................................................................ తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల 39. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. tirupatibalaji.ap.gov.in సైట్లో భక్తులు తమ వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక వృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు కూడా విడుదలయ్యాయి. ............................................................................................................................................................ వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు 40. వరంగల్-ఖమ్మం హైవేపై భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది.  

కుకీ , మెయిటీల ఘర్షణ ఈనాటిది కాదు

కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలతో మండుతున్న మణిపూర్‌లో వెలుగులోకి వస్తున్న దారుణాలు ప్రజలని భయకంపితుల్ని చేస్తున్నాయి. మే 4న రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, అంతకు  కొన్ని రోజుల ముందు అంటే ఏప్రిల్ 30న హంగ్లాల్‌మౌన్ వైఫీ (21) అనే యువకుడిని పోలీసులు చుర్‌చాంద్‌పూర్‌లోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మెయిటీ కమ్యూనిటీపై ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినందుకు గాను అతడిని అదుపులోకి తీసుకుని ఇంఫాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  ఆ తర్వాత నాలుగు రోజులకు రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభం కాగా, పోలీసు కస్టడీలో ఉన్న వైఫీని దుండగులు వీధిలోకి లాక్కొచ్చి మరీ కొట్టి చంపేశారు. బీకాం చదువుతున్న వైఫీని మణిపూర్ హైకోర్టు నుంచి సజివాలోని సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా దుండగుల మూక దాడిచేసి, పోలీస్ వ్యాన్ నుంచి అతనిని కిందకు లాగి, కొట్టి చంపేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.  పోలీసుల నుంచి ఆ మూక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లాక్కుందని, రాడ్లు, కర్రలతో వైఫీపై దాడిచేసిందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. వైఫీపై గుంపు భయంకరంగా దాడి చేస్తుండడంతో భయపడిన పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. మణిపూర్ లో ప్రధానంగా రెండు మతాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని చెప్పొచ్చు.   మెయితీస్  హిందూ మతానికి ప్రాతినిద్యం వహిస్తున్నారు. కుకీలు క్రైస్తవులు. వీళ్లు కొండలలో నివసిస్తారు.  కుకీలు కంటే మెయిటీలు ఎక్కువ విద్యావంతులు.  వ్యాపార, రాజకీయ రంగాల్లోరాణించిన తెగ ఇది. కుకీలు. వీరిని  నాగాలు అని కూడా అంటారు. ఎక్కువ మంది క్రైస్తవులు. కుకీలు ఈశాన్య మయన్మార్ అంతటా విస్తరించి ఉన్నారు. మణిపూర్‌లో ఉన్న వారిలో ఎక్కువగా  మయన్మార్ నుండి వలస వచ్చిన వారే. కొన్ని శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ వైరుధ్యం ఇంకా కొనసాగుతూ వస్తోంది. మణిపూర్‌లో మెజారిటీ కమ్యూనిటీ మైటీస్.   కుకీలు-దాదాపు అందరూ క్రైస్తవులు.

స్పీడ్ న్యూస్ 2

కేసీఆర్ ను గద్దె దించే వరకూ పోరాటం: ఈటల 11.కేసీఆర్ ను గద్దె దించే వరకు తాము పోరాటం చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్  అన్నారు. యువతను నిర్వీర్యం చేస్తోన్న చరిత్ర కేసీఆర్ ది అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటికి ఇద్దురు వృద్ధులకు పెన్షన్  ఇస్తామన్నారు. ........................................................................................................................................................ కుతుబ్ షాహీ మసీదుపై పిడుగుపాటు 12. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. పిడుగు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.  సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ............................................................................................................................................................... పాఠశాలల వేళల్లో మార్పులు 13. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది.  మంగళవారం నుంచి   ప్రాథమిక పాఠశాలలు, ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం గం.9.30 నుంచి 4.45 వరకు పని చేస్తాయి. ........................................................................................................................................................ పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన 14. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ప్రకటనకు పట్టబట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో కేంద్రం   తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. ........................................................................................................................................................ ట్రాక్ బేస్ లోపంతో నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 15.  రైల్వే ట్రాక్ బేస్ లోపం వల్ల కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి వద్ద ఈ ఉదయం నిలిచిపోయింది.    రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసిన అనంతరం బయలుదేరింది. ............................................................................................................................................................ 18 మంది డీఎస్పీల బదిలీ 16.   18 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్  నిన్న రాత్రి  త్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ బదలీల ప్రక్రియ సాగుతోంది.  ........................................................................................................................................................ 17.  హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో  ఒకే ట్రాక్ పైకి రెండు లోకల్ ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ఈ ఘటనపై రైల్వే శాఖ అంతర్గతంగా విచారణ జరుపుతున్నది. ...................................................................................................................................................... మేఘాలమ పీఎం కార్యాలయంపై దాడి 18.మేఘాలయ సీఎం కన్నాడ్ సంగ్మా కా ర్యాలయంపై దాడి జరిగింది.  తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ........................................................................................................................................................... ఆన్ లైన్ లో సబ్సిడీ ధరకు టమాటా 19. కేంద్రం సబ్సిడీపై కిలో  టమాటోలను 70రూపాయలకే ఆన్‌లైన్‌లో అందిస్తోంది. టమాటా ధరలు ఆకాశానికి అంటిన నేపథ్యంలో   ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ  ఆన్‌లైన్‌లో నెట్‌వ‌ర్క్ ద్వారా కిలో రూ.70లకే టమోటాలను అందిస్తోంది. .............................................................................................................................................................. ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ గూడాపై దాడి 20.  రాజస్థాన్ అసెంబ్లీలో  అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగారు.  తన వద్ద రెడ్ డైరీ ఉందని, సీఎం అశోక్ గహ్లోత్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి అందులో ఉందని చెప్పి మంత్రి పదవి పోగొట్టుకున్న  రాజేంద్ర సింగ్‌ గుడాపై ఈ దాడి జరిగింది. ...................................................................................................................................................... కూనేటివాగుకు వరద పోటు 21.ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  మెంటాడ మండలం కొండలింగాలవలసలోని కూనేటి వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో కొండలింగాలవలస పరిధిలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  ................................................................................................................................................. కట్టలేరు వాగుకు వరద ఉధృతి 22. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వినగడప వద్ద కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో  20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వచ్చే వాహదారులు ఇబ్బందులు పడుతున్నారు. ......................................................................................................................................................... 30న  పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం 23.ఈ నెల 30న  పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో  ప్రకటించింది.  ఈ  ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 351.9 కిలోల  డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ సహా ఆర్కేడ్‌, ఎలోక్స్‌-ఏఎం, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్‌, గెలాసియా-2, 3యూ, స్కూబ్‌-2, 3యూ ఉపగ్రహాలను  కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ...................................................................................................................................................... పవన్ పై రోజా విమర్శలు..చిన్న మెదడు చితికిపోయింది 24.  మంత్రి  రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడిన ఆమె  పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.   ........................................................................................................................................................ భారీ వర్షాలకు గుజరాత్ లో కుప్పకూలిన భవనం 25. గుజరాత్ లో భారీ వర్షాల ధాటికి గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది.  ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

వనమా తరువాత వంతు మంత్రి శ్రీనివాస్ గౌడ్ దేనా?

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన రోజే అటువంటిదే మరో  పిటిషన్ ను కొట్టి వేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాల్సిందిగా శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధృవపత్రాలు ధాఖలు చేశారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాసగౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని రాఘవేంద్రరాజు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా ఆ పిటిషన్ ను కొట్టివేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన హై కోర్టు ఇరు పక్షాల వాదనలూ విన్న తరువాత శ్రీనివా గౌడ్ పిటిషన్ ను కొట్టివేసింది.   పిటిషనర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాఘవేంద్రరాజు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ పలువురు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రాఘవేంద్రరాజు ధాఖలు చేసిన పిటిషన్ తీర్పు ఎలా ఉండబోతోందన్న చర్చకు తెరలేపారు. ఏది ఏమైనా  మంత్రి శ్రీనివాసగౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించడం బీఆర్ఎస్ కు, మంత్రికీ కూడా ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎల్లలు దాటిన ప్రేమ కథలు

బాలివుడ్ లో ఇండియా పాక్ క్రాస్ బార్డర్ లవ్ స్టోరీలు కోకొల్లలు. అలాంటి సినిమాలు ఇప్పటి వరకు 12 వచ్చాయి.హీనా (1991), షహీద్ ఏ మహబ్బత్ సింగ్ (1999), రిఫ్యూజీ (2000), గదర్ (2001), దిల్ పర్ దేశీ హోగయా(2003), వీర్ (2004), ఏక్ తా టైగర్ (  2012), టోటల్ సియప్ప(2014) అలాంటివే.  ఇండియా, పాకిస్థాన్ శత్రుదేశాలు. అయినప్పటికీ ఇరు దేశ పౌరుల మధ్య జరుగుతున్న లవ్ స్టోరీలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఫేస్ బుక్ పరిచయాలు పరిణయాలకు దారి తీస్తున్నాయి.   కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ ఇళ్లు వదిలేసి ప్రియుడిని వెతుక్కుంటూ ఇండియా వచ్చేసింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా హైదర్ పాకిస్థాన్ మహిళ అక్రమంగా ఇండియా ప్రవేశించింది. గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్రియుడిని వెతుక్కుంటూ నేపాల్ మార్గంలో ఇండియా ప్రవేశించి ప్రియుడిని కల్సుకుంది.  ఎట్ట కేలకు యుపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వార్త ఇరు దేశాల్లో సంచలన వార్తగా మారింది. మళ్లీ ఇప్పుడు ఇండియాకు చెందిన అంజు పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. రాజస్థాన్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అంజుకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో సోషల్ మీడియాలో పరిచయమైన అంజు ప్రేమలో పడింది. నస్రుల్లాను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. పాకిస్థాన్, భారత పౌరుల మధ్య ప్రేమలు కొత్తేం కాదు. చాలా కాలంగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రేమ కథలు ఆసక్తికరంగా మారాయి. 

కుమ్ములాటలతో దిగజారు..వైసీపీ ప్రతిష్ట రోడ్డు పాలు!

ఏపీలో మరోసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వైసీపీ రకరకాల ప్రణాళికలు రచిస్తుంది. కేవలం అధికారమే లక్ష్యంగా అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరం జరిగిన వైసీపీ కేవలం సంక్షేమ తాయిలాలపైనే ఆధార పడి ఆశలు పెచుకుంటుంది. ఆ సంక్షేమమే తనను ఈసారి గట్టెక్కిస్తుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు సామజిక తరగతుల వారీగా లెక్కలేసి పప్పు బెల్లాల ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుంది. అయితే, ఈ నాలుగేళ్ళలో జగన్ సర్కార్ చేసిన కక్ష్యపూరిత రాజకీయాలు, ముందు చూపులేని జీవోలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఇప్పుడు ఫోకస్ పెట్టిన ప్రతిపక్షాలు గుక్కతిప్పుకోకుండా విమర్శల దాడి చేస్తున్నాయి. ఈ విమర్శలకు సమాధానం చెప్పుకోలేని ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష నేతలపై బూతుల పంచాంగం అందుకోవడం కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఇది చాలందన్నట్లు సొంత పార్టీ నేతలలో కోరవైన సఖ్యత ఇప్పుడు వైసీపీని రోడ్డు పాలు చేస్తుంది. అంతకు ముందే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఇప్పుడు ఎన్నికల సమయానికి క్షత్రస్థాయిలో రాజకీయం వేడెక్కడంతో సొంత పార్టీ నేతల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగుతుంది. ఇది ఇక్కడా అక్కడా అని లేకుండా.. రాష్ట్ర నలుమూలన నుండి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల ముందు నుండి స్థానిక నేత‌ల ఆధిప‌త్యాలు, ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన ప్ర‌యోగాలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళ‌న‌లు కలిసి వైసీపీ ప‌రిస్థితి ఇప్పుడు పూర్తిగా దిగజారి పోయినట్లే కనిపిస్తుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ  ఇబ్బందుల్లోనే ఉంద‌ని ఏపీ రాజకీయాలను దగ్గర నుండి చూసిన వారికి అర్ధమవుతుండగా.. ఇది ఇప్పటికే శృతి మించి తారస్థాయికి చేరినట్లుగా కనిపిస్తుందని.. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత దిగజారి పార్టీకి తీరని నష్టం చేకూర్చనుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన నియోజక వర్గాలతో పాటు గత ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందిన నియోజకవర్గాలలో కూడా ఇదే పరిస్థితి కనిపించడం వైసీపీలో మరింత ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద సగానికి సగం నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి కనిపిస్తుండగా.. వాటిలో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే చేయి జారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో నంద్యాల జిల్లా నందికొట్కూరు, సత్యసాయి జిల్లా హిందూపురం, గుంటూరు జిల్లాలోని ప్ర‌త్తిపాడు, కోనసీమ జిల్లా రామ‌చంద్ర‌పురం, రాజ‌మండ్రి రూర‌ల్‌, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, టెక్క‌లి, అన్నమయ్య జిల్లా రాజంపేట‌, కృష్ణా జిల్లాలోని కోడూరు, ప్రకాశం జిల్లా గిద్ద‌లూరు, బాపట్ల జిల్లా అద్దంకి, ప‌రుచూరు నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య పంచాయతీ ఇప్పటికే రచ్చ కెక్కింది. ఇవి కాకుండా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలున్న మరికొన్ని నియోజకవర్గాలలో కూడా ఇప్పటికే అంతర్గత పోరు రోడ్డున పడింది. రాష్ట్రంలో గత ఐదేళ్ల కాలంలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ వేసిన అడుగులు ఇప్పుడు స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటూ.. పార్టీని రోడ్డున పడేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యేల చేస్తున్న విమర్శలు ఒకెత్తయితే.. సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు మరో ఎత్తు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పట్టుమని మరో ఆరు నెలలు మాత్రమే ఎన్నికలకి సమయం ఉంది. ఒక్కసారి ఎన్నికల మూడ్ మొదలైతే ఈ అసంతృప్తిని చల్లార్చడం ఎవరి వలన కాదు. ఇప్పుడే ఈ వివాదాలను ముగించేయాలి. ఇప్పటికే వైసీపీ పెద్దలు ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. కానీ, నేతలు మాత్రం అదేమీ పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. పెద్దల మాటలు కూడా పెడ చెవిన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. మరి ఈ సమస్యని వైసీపీ ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి.

స్పీడ్ న్యూస్ 1

పోలవరం గేట్లన్నీ ఎత్తివేయండి! 1. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి వచ్చిన వరదను  దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ని తెలంగాణ కోరింది. గత ఏడాది  పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ముంపునకు గురైందని పేర్కొంది.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం  వాటర్ ఇయర్లో గేట్లన్నీ తెరిచే ఉంచాలని కోరింది. ............................................................................................................................................................... పట్టిసీమ ద్వారా నీటి విడుదల 2.  గోదావరిపై పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా  నాలుగేళ్ల తర్వాత నీటిని విడుదల చేశారు. కుడి కాలువలోకి ఆరు పంపుల ద్వారా 2,124 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  2019లో చివరిసారిగా 43.99 TMCల నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చారు. ........................................................................................................................................................... ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్ 3. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని నేతలు ఆరోపించారు.   .......................................................................................................................................................... ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 4. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ప్రస్తుతం ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  .............................................................................................................................................. డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్ 5. హైదరాబాద్ లో  ఈ తెల్లవారు ఇక అంబులెన్స్  రోడ్డు డివైడర్ ను ఢీకొంది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలి  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో   డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నగరంలోని వనస్థలిపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ........................................................................................................................................................ ఉమ్మడి వరంగల్ లో భారీ వర్షాలు 6. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు  జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.  ..................................................................................................................................................... అత్తాపూర్ లో పిడుగుపాటు 7. హైదరాబాద్‌ అత్తాపూర్ లోని ఓ నాలుగు అంతస్తుల భవనం సమీపంలో పిడుగు పడటంతో అపార్ట్‌మెంట్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయాయి.  పిడుగు శబ్దానికి స్థానికులు తీవ్ర భయందోళనలకు లోనయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ................................................................................................................................................... జల్ జీవన్ మిషన్ అమలులో ఏపీ వెరీ పూర్ 8.  జల్‌జీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగా లేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పేర్కొన్నారు.  రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు.   .............................................................................................................................................. పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు 9. పొలంలో యుద్ధ విమానం ఇంధన ట్యాంకు పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. సంత్ కబీర్‌నగర్ జిల్లా బంజారియా బలుశాషన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ, వాయుసేనకు తెలియజేశారు.  ...................................................................................................................................................... 29న అమిత్ షా తెలంగాణ రాక 10. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.  కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా రావడం ఇదే మొదటి సారి.

వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. బీఆర్ఎస్ కు షాక్

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో కొత్త గూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అప్పటి ఎన్నికలలో వనమా వెంకటేశ్వరరావు జలగం వెంకట్రావుపై నాలుగువేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  అయితే ఆయనకు ప్రత్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పట్లో పోటీ చేసి ఓడిపోయిన జలగం వెంకట్రావు హై కోర్టును ఆశ్రయించారు. వనమా ఎన్నికల అఫిడవిట్ లో  ఆస్తుల వివరాలు తప్పుగా చూపారంటూ జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   దీనిపై  విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం (జూలై 25) తీర్పు వెలువరించింది.  వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ  2018 నుంచి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇక, అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వర రావుకు ఐదు లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఇదిలా ఉండగా తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ హైకోర్టు తీర్పు వనమాకే కాకుండా బీఆర్ఎస్ కు కూడా గట్టి ఎదురుదెబ్బగానే చెబుతున్నారు.

మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం?

మణిపూర్ హింసా కాండ విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్ష కూటమి ఇండియా నిర్ణయంచింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు వేదికగా మోడీ ఒక ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో  సభా కార్యక్రమాలను స్తంభింపచేస్తున్న సంగతి  విదితమే. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయటా కూడా విపక్ష  కూటమి ఇండియా ఆందోళనలు చేపట్టింది. సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టింది. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో  విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.  

తాను చనిపోతూ మరికొందరిలో బతికింది

 బ్రెయిన్ డెడ్(జీవన్మృతులు) అవయవదానం చేయడం వల్ల మరికొందరిలో ఆశలుచిగురిస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అవయవాలు అమర్చి ప్రాణం పోస్తున్నారు. ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన పూజ అనే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు. చివరకు వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో తమ కూతురు అవయవాలను దానం చేసి ఆ బాలిక తల్లిదండ్రులు మరికొందరికి జీవితాన్ని ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 18న పూజ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో పూజ తల్లిదండ్రులు గమనించి అప్రమత్తమయ్యారు. అయితే, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న పూజను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందించారు. అయితే, రోజులు గడిచినా పూజ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్సకు స్పందించకపోవడంతో ఈ నెల 24న పూజ బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో జీవన్ దాన్ ప్రతినిధులు పూజ తల్లిదండ్రులను కలిసి అవయవదానం గురించి వివరించారు. దీంతో తమ కూతురు మరికొందరి రూపంలో బ్రతికే ఉంటుందని పూజ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. వైద్యులు పూజ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించి జీవన్ దాన్ సంస్థకు అందజేశారు.

కూటమితో కాంగ్రెస్ బలపడేనా?

పేరు మారింది. కాంగ్రెస్ సారధ్యంలో దేశాన్ని పదేళ్ళు పాలించిన, ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ) పేరు మారింది. అవును, 2 024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ, కూటమిని ఓడించడమే లక్ష్యంగా బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కూటమికి కొత్త పేరును ఖరారు చేశారు. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయన్స్) గా నామకరణం చేశారు. అయితే  కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూపీఎ పేరును ఎందుకు మార్చవలసి వచ్చింది? అనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పక పోయినా, యూపీఏ  అనగానే భూమి ఆకాశాలను ఏకం చేసిన కుంభకోణాలు గుర్తుకు వస్తాయని, అరచేతిని అడ్డుపెట్టి యూపీఏ అవినీతి చరిత్రను హస్తం పార్టీ కప్పిపెట్టే ప్రయత్నం చేస్తోందని,అందుకే పేరు మార్చారని కొందరు, కొత్త కూటమికి కాంగ్రెస్ సారథ్యం కొనసాగించడాన్ని కొందరు కొత్త పాత మిత్రులు వ్యతిరేకించడం  చేత పాత కూటమికి కొత్త పేరు అవసరం అయిందని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.     అదలా ఉంచి విషయంలోకి వస్తే, నెల రోజుల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో, జేడీయూ, అర్జేడీ సారథ్యంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశంతో పోలిస్తే, బెంగుళూరులో కాంగ్రెస్ సారథ్యంలో జరిగిన రెండవ సమావేశం ఒక ముందడుగుగానే భావించవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. పాట్నా సమావేశానికి 15 పార్టీలు హాజరైతే బెంగుళూరు సమావేశానికి, ఏకంగా 26 పార్టీలు హాజరయ్యాయి. అంతకంటే ముఖ్యంగా, తొలి సమావేశంలోనే తలేగరేసి, కూటమిలో కొనసాగాలంటే అంటూ కాంగ్రెస్ పార్టీకి షరతులు విధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (పార్టీ) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించేంది లేదని, ఖారాఖండిగా చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగుళూరు సమావేశానికి హాజరు కావడం, కూటమి ముందడుగుకు మరో సాక్ష్యంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.  అయితే, ఇంకో కోణంలో చూస్తే, అటు కేజ్రీవాల్, ఇటు మమతాబెనర్జీ హాజరు వెనక కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏదైనప్పటికీ అందుకు హస్తం పార్టీ భారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది అనేది  కాదన లేని నిజంగా కాంగ్రస్ నాయకులు అంగీకరిస్తున్నారు. అలాగే, ఢిల్లీ ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు స్థానిక నాయకులు, ఆర్డినెన్సు విషయం ఎలా ఉన్నా, ఆప్ బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ తలొగ్గి ఆర్డినెన్సు విషయంలో అభిప్రాయం మార్చుకుందనే పబ్లిక్ పర్సెప్షన్ ఏర్పడడం స్థానిక నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆప్ డిమాండ్ చేసే వరకు ఆగకుండా ముందుగానే ఆర్డినెన్సును వ్యతిరేకించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఇప్పుడు ఆప్  ఓపెన్ గా కాంగ్రెస్ పేరు పెట్టి డిమాండ్ చేసిన తర్వాత  సరే అని తల ఉపడంతో  కాంగ్రెస్ పార్టీ  ఆప్ ఆధిపత్యాన్ని అంగీకరించడమే అవుతుందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అలాగే  బెంగుళూరు సమావేశంలో పశ్చిమ బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూపిన, ‘విదేయ’ పూర్వక అభిమానం బెంగాల్ కాంగ్రెస్ నాయకులనే కాదు, బెంగాల్లో కాంగ్రెస్ మిత్ర పక్షం సిపిఎం నాయకులకు కూడా చికాకు తెప్పించిడమే కాదు  ఒక విధంగా ఇరకాటంలోకి నెట్టేసిందని అంటున్నారు. ప్రతిపక్షం స్పేస్ ను పూర్తిగా బీజేపీకి వదిలేసి కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కు బీ టీమ్ లా  వ్యహరించావాల్సి వస్తున్నదని కాంగ్రెస్ నాయకులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 మందికి పైగా సామాన్య  ప్రజల ప్రాణాలను బలితీసుకున్న హింసాత్మక సంఘటలను, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే ఎక్కువగా విమర్శించాయి .ముఖ్యమంత్రి బెనర్జీ మీద మండి పడ్డాయి. మమత ప్రభుత్వం హింసకు పాల్పడిందని విమర్శించాయి. కానీ అంతలోనే మమతా బెనర్జీతో కాంగ్రెస్ అగ్రనాయకులు చెట్టా పట్టాలేసుకుని తిరగడం బెంగాల్ కాంగ్రెస్, లెఫ్ట్ నాయకులకు రుచించడం లేదు.  అంతే కాదు  మమతా బెనర్జీ వత్తిడి కారణంగానే  కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొత్త కూటమి సారథ్యం విషయంలో మౌనంగా ఉండి పోయిందని, చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ, కూటమి సారథ్యం కోరుకోవడం లేదని పేర్కొనవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో  పనిచేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్దంగా లేదని మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీని  కూటమి సారథి (ప్రధాని అభ్యర్ధి) గా అంగీకరించేందుకు తృణమూల్ సిద్డంగాలేదని మమతా  బెనర్జీ  అనేక సందర్భాలలో స్పష్టం చేసిన నేపధ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే  కూటమి నాయకత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టింపు లేదని చెప్పుకోవలసి వచ్చిందని  బెంగాల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ అధినాయకత్వం పై రుసరుస లాడుతున్నారు.  ఈనేపధ్యంలో ఇండియాగా నామకరణం చేసుకున్న విపక్ష కూటమి కోసం కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇప్పటికే బీహార్ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు  బీ టీమ్  గా సర్డుకుపోతున్న కురువృద్ద పార్టీ  కాంగ్రెస్ భవిష్యత్ లో బెంగాల్, ఢిల్లీ, పంజాబ్ యూపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్టనర గా అడ్జస్ట్ అవ్వక తప్పదనే  నిర్ణయానికి వచ్చిందని  ఇది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. అదే సముయంలో రేపటి ఎన్నికల్లో పొత్తులు, ఒత్తిళ్ళ కారణంగా  కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య కుదించుకు పోతుందని తద్వారా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిధి, పాత్ర మరింత కుంచించుకుపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది... ఇండియా కూటమి భవిష్యత్ ఏమిటి, హస్త రేఖలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడే చెప్పడం సరికాదాని  అందుకు ఇంకొంత సమయం పడుతుందని అంటున్నారు.

  పోటెత్తుతున్న  జంట జలాశయాలు 

 రాష్ట్రంలో పలు జలాశాలయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్  జంట జలాశయాలకు భారీగా వరద నీరు పెరుగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 2000  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1761.50 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 1761.75 అడుగులుగా నమోదు అయ్యింది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. అటు ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.10 అడుగులుగా ఉంది. వర్షం కారణంగా ముసారంబాగ్‌లో మూసీ పొంగిపొర్లుతున్నాయి. అప్పట్లో మూసీ నది పొంగి హైదరాబాద్ కు భారీ వరదలు వచ్చాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రావడంతో మూసీ ప్రవాహం ఎక్కువై  హైదరాబాద్ ను ముంచెత్తింది. 1908 సెప్టెంబర్ 28 రాత్రి హైదరాబాద్ కు కాలరాత్రి అని చెప్పొచ్చు. అందరూ నిద్రలోకి జారుకోగానే మూసీ ప్రవాహం ఉప్పొంగి ఇళ్లు కొట్టుకుపోయాయి. నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ పరిపాలనలో హైదరాబాద్ సంస్థానం ఉండేది. పురానాపూల్ బ్రిడ్జి మాత్రమే గోల్కొండ పట్టణం, హైద్రాబాద్ పట్టణానికి మధ్య ఉండేది. ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లాలన్నా పురానాపూల్ బ్రిడ్జి తప్పితే మరో మార్గం లేదు.  కోసల్ వాడి, అప్జల్ గంజ్ ప్రాంతాల్లో వరద భీకరంగా ప్రవాహించింది. దాదాపు 80 వేళ ఇళ్లల్లో నివసించే వారు నిరాశ్రయులయ్యారు. 15వేల మంది మృత్యువాత పడ్డారు  మూసీ నుంచి వచ్చే వరద అంతకంతకు పెరగడంతో ఉస్మానియా హాస్పిటల్ లో ఉన్న మర్రిచెట్టు దాదాపు150 మంది ప్రాణాలను రక్షించింది. మూసీ భారీ వరదల నేపథ్యంలో నిజాం రాజు రెండు జంటజలాశయాలను నిర్మించాలని నిర్ణయించారు. అవే ప్రస్తుతమున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. 

కాంగ్రెస్‌లో 119 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా కలకలం!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్ లో ఎన్నడూ లేనంతగా జోష్ కనిపిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏపీలో నామరూపాల్లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీ అయినా కూడా తెలంగాణలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తోడు కేసీఆర్ మార్క్ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ నుండి నేతలు వలసెళ్లిపోయారు. తనకు రాష్ట్రంలో పోటీనే లేకుండా చేసుకొనే క్రమంలో కేసీఆర్ కాంగ్రెస్ ను దెబ్బతీశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ లోపం కూడా తోడై తెలంగాణలో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ, రెండు పార్లమెంటు ఎన్నికల్లోనూ పేలవమైన ఫలితాలతో కాంగ్రెస్ చతికిల పడింది. ఆ పార్టీ నేతలు కూడా చప్పబడ్డారు. కానీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో పూర్వ వైభవం కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హుషారుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి వచ్చే నేతలు, సమావేశాలు, సంప్రదింపులతో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ బిజీబిజీగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అన్ని మూలల నుండి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలకి చొచ్చుకుపోతుంది. రేపు ఎన్నికలలో విజయం  కోసం ఇప్పుడు నేతలంతా ఒకే తాటిపైకి చేరి కేసీఆర్ పై సమరశంఖం పూరిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలో టికెట్లు దక్కేది ఎవరికి? నేతల ఎంపిక హైకమాండ్ ఆదేశిస్తుందా? లోకల్ లీడర్లు తమ వర్గం నేతలను సిఫార్సులు చేస్తారా? సర్వేల ఫలితంగానే టికెట్లు దక్కనున్నాయా? ఇలా రాజకీయ వర్గాలలో పలు చర్చలు కూడా జరిగిపోతున్నాయి. అదలా ఉండగానే ఇదిగో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అంటూ కాంగ్రెస్ లీడర్ల వాట్సాప్ లలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల ప్రాబబల్స్ అన్న పేరుతో ఈ జాబితా వైరల్ అవుతుంది. దీంతో ఈ జాబితా ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో కలకలం రేపుతోంది. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ తరపున తమకే టికెట్ దక్కుతుందని ఇప్పటికే ప్రజలలో ప్రచారం మొదలు పెట్టిన నేతలు ఈ జాబితాలో పేరు ఉండడంతో ఆనందంగా ఉంటే.. జాబితాలో లేని నేతలు తమ వర్గం నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. కాగా, ఈ జాబితా కూడా వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరుతో ఉండడం విశేషం. సునీల్ టీం సర్వేలు చేసి ఫలితాల ఆధారంగా ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లుగా ప్రచారం జరుగుతుండగా.. కాంగ్రెస్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు.  వాస్తవానికి సునీల్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే లేరు. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి సలహదారుగా ఈ మధ్యనే వెళ్లారు. అయితే సునీల్ టీం మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తుంది. ఒక రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక లాంటి ముఖ్యమైన విషయం అంటే సునీల్ కూడా తెలంగాణకు వచ్చే ఖరారు చేస్తారు. కానీ, ఆయన ఇక్కడ లేకుండానే సునీల్ పేరిట ఈ జాబితా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనే విషయం అర్ధంకావటం లేదు. జోరు మీదున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా అభ్యర్థుల జాబితా పేరిట బ్రేకులు వేయాలనే ప్రత్యర్థి నేతల పన్నాగం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జాబితా విడుదల చేస్తే టికెట్ దక్కని అసంతృప్త నేతలు రెబల్స్ గా మారితే ప్రత్యర్థులకు బలం చేకూరుతుంది. మరి నిజంగానే ఈ జాబితా సునీల్ కాంగ్రెస్ అధిష్టానికి పంపారా? సునీల్ పేరు మీద మరెవరైనా జాబితా తయారుచేసి ప్రచారంలో పెట్టారా అన్నది తేలాల్సి ఉంది.

బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం?.. పోటీ ఎక్కడ నుంచంటే?

దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు,  విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవరాలు, నందమూరి బాలకృష్ణ కుమార్తె, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోడలు,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి నందమూరి బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తున్నది. వచ్చే ఎన్నికలలో నారా బ్రాహ్మణి రాజకీయాలు అరంగేట్రం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  ఆమె రాజకీయ ప్రవేశంపై నారా, నందమూరి కుటుంబాలతో పాటు తెలుగు దేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో ఆమె ఎక్కడ నుండి బరిలో దిగనున్నారు? ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న బ్రాహ్మణి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం వెనకున్న కారణాలేంటి? అన్న అనుమానాలు సహజంగానే అందరిలో వ్యక్తమౌతున్నాయి. నారా బ్రాహ్మణి విషయానికి వస్తే ఇప్పటికే ఆమె సమర్ధురాలిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. యూఎస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిన బ్రాహ్మణి ఇప్పటికే హెరిటేజ్ గ్రూపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా తన తండ్రి చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పటల్  ట్రస్ట్ కి బోర్డు సభ్యురాలిగా  కొనసాగుతున్నారు. చిన్న నాటి నుంచి ఇటు సినీ, అటు రాజకీయ రంగాలను దగ్గరగా చూసిన నారా బ్రాహ్మణి తనకు ఇష్టమైన వ్యాపార రంగంలోకి వెళ్లి దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. హేరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్య క్రమాలను చేపట్టడంలో కూడా ఆమె ముందున్నారు. హేరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మి కుల పిల్లల చదువు కోసం ఆమె ఎంతో తపిస్తారని  ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఆమె సమర్ధతకి నిదర్శనమే అప్పటికే లాభాలలో ఉన్న హెరిటేజ్ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ముందుకెళ్లడం. కాగా, ఇప్పుడు ఆమె రాజకీయాలలో కూడా అరంగేట్రం చేయనున్నారని అంటున్నారు. నిజానికి ఈ ప్రచారం  కొత్తదేం కాదు. గతంలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బ్రాహ్మణిని పోటీచేయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని టీడీపీ సర్వేలు చేయిస్తున్నదని కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబుకు, కేశినేని నాని మధ్య చాలా గ్యాప్ రావడానికి కూడా బ్రాహ్మణి విషయం బయటికి పొక్కడమేనని అప్పట్లో నెట్టింట్లో  వదంతులు షికార్లు చేశాయి. అయితే ఆమె రాజకీయ ప్రవేశం అప్పటికి కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది.  ఇప్పుడు మరోసారి బ్రాహ్మణి రాజకీయాలలోకి రానున్నారని, అది కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్నారని ప్రచారం మొదలైంది. తన తండ్రి నందమూరి బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచే 2024 ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీ చేయవచ్చన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకూ అంతా పురుష ఎమ్మెల్యేలే ఉన్నారు. మహిళలు పోటీ చేసినా గెలవలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలకు ఇక్కడ టికెట్ ఇవ్వడం లేదు. అందుకే ఈసారి వైసీపీ ఈ మహిళా సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకోవాలని చూస్తుంది. గతంలో వైసీపీ నుండి 2014లో నవీన్ నిశ్ఛల్, 2019లో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వేవ్ లో కూడా బాలయ్య గెలవగా.. ఇప్పుడు మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉన్నారు బాలయ్య. అయితే, వైసీపీ హిందూపురం ఇంచార్జి పదవిని మహిళా నేత టీఎన్ దీపికకు అప్పగించింది. దీంతో తెలుగుదేశం కూడా ఇక్కడ మహిళా నేతనే బరిలోకి దించాలని భావిస్తున్నదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు నారా బ్రాహ్మణి బెస్ట్ అప్షన్ గా తెలుగుదేశం నిర్ణయించిందని ప్రచారం జరుగుతున్నది. అంతకు ముందు తన తాత, ఆ తరువాత తండ్రి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో ఇప్పుడు కుమార్తె పోటీకి దిగడం మంచి పరిణామమే అవుతుందని టీడీపీ నేతలు   భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి అప్పటి లాగా ఇది కూడా ప్రచారంగానే మిగిలిపోతుందో.. లేక ఈసారి నిజంగానే బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం ఉంటుందో చూడాల్సి ఉంది.

స్పీడ్ న్యూస్ 4

రోడ్ కం రైలు వంతెనపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిషేధం 41. రాజమహేంద్రవరం లోని   రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాల రాకపోకలను అధికారులు ఆదివారం నుంచి నిషేధించారు.  వంతెన దెబ్బ తిన్న నేపథ్యంలో  రోడ్లు, భవనాలశాఖ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిషేదం ఎంత కాలం అన్నది వెల్లడించలేదు.   .......................................................................................................................................................... ఏపీలో దళితులపై దాడులు..తక్షణమే చర్చించాలి: ఎంపీ కనకమేడల 42.  ఏపీలో దళితులు, గిరిజనులపై దాడుల అంశాన్ని అత్యవసరంగా చర్చించాలంటూ రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర నోటీసు ఇచ్చారు.   ఏపీలో గిరిజనులు, దళితులపై దాడులు పెచ్చరిల్లుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ..................................................................................................................................................... నాలుగు రైళ్లు రద్దు 43.సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా  ఈనెల 24 నుంచి 30 వరకు ర కాచిగూడ-నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌-కాచిగూడ (07593), హెచ్‌.ఎస్‌.నాందేడ్‌-నిజామాబాద్‌ (07854), నిజామాబాద్‌-హెచ్‌.ఎస్‌.నాందేడ్‌ (07853) రైళ్లను రద్దు చేస్తున్నట్లు   రైల్వే  శాఖ ప్రకటించింది. ........................................................................................................................................................... ఏపీలో ప్రవేశించిన కొలికిపూడి యాత్ర 44. అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకు చేపట్టిన పాదయాత్ర  ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆదివారం ఏపీలోకి ప్రవేశించింది.   ............................................................................................................................................................ మణిపూర్ హింసాకాండ వెనుక కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే 45. మణిపూర్‌లో చెలరేగుతున్న హింస వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర  బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు మోడీ తమకు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. నగ్న వీడియో బయటపడకుంటే అసలాయన నోరిప్పేవారే కాదన్నారు. ............................................................................................................................................. విజయసాయికి ప్రకాశం రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు: బాలినేని 46.  ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఎంపీ   విజయసాయిరెడ్డికి అప్పగించనున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.  నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రను   ఆపలేదని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న వాలంటీ ర్లను   విమర్శించడం సరికాదని చెప్పారు. ................................................................................................................................................... కేసీఆర్ పాలన అవినీతి మయం: షర్మిల 47. గత తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలన అంతా అవినీతి మయం అని షర్మిల ఆరోపించారు. తాను చెప్పింది కరెక్టు కాదనే ధైర్మం ఉందా అని సవాల్ చేశారు. నిజంగా అవినీతి రహిత పాలన సాగించి ఉంటే ఎన్నికలలో   సిట్టింగులకు టికెట్టివ్వాలని  షర్మిల కేసీఆర్ కు సవాల్ విసిరారు. ........................................................................................................................................................... కేసీఆర్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: ప్రవీణ్ కుమార్ 48. తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో జరిగి బహుజన మహిళా సదస్సులో ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో అవినీతి పాలన అంతమొందించేందుకు అందరూ కష్టపడాలన్నారు.  ................................................................................................................................................... 49. సర్పంచ్ ల ఆందోళన కృష్ణా జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది.  స్పందన హాల్లో కలెక్టర్  ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో  సర్పంచులు లోపలకు వచ్చి నిరసన తెలియజేస్తూవేదిక ముందు బైఠాయించి నినాదాలు చేశారు.  పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ......................................................................................................................................................... సత్యేంద్రజైన్ కు బెయిలు పొడగింపు 50. ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మధ్యంతర బెయిల్‌ను కోర్టు పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సత్యేంద్ర జైన్ కు ఆరోగ్య కారణాలతో  మధ్యంతర బెయిలు లభించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతర బెయిల్‌ కొనసాగుతుందని కోర్టు తెలిపింది.

పిడమర్తి పోటీ ఖాయం.. సత్తుపల్లి నుంచా, కంటోన్మెంట్ నుంచా?

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేయడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ టికెట్ల కేటాయింపు పై దృష్టి సారించాయి.  గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు కసరత్తులు మొదలు పెట్టేశాయి.  రాష్ట్రంలో జోష్ మీద ఉన్న  కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు పార్టీలోకి వచ్చి చేరుతుండటంతో ఆ పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల జాబితా రూపొందించే విషయంలో భారీ కసరత్తే చేయాల్సి వస్తుంది.  ఇక అధికార బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.   బీజేపీ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా జోష్ మీద ఉన్న పార్టీ.. ఇటీవల డీలా పడింది. పార్టీ తరఫున నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకని నియోజకవర్గాలే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఏ పార్టీ సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న గట్టి పట్టుదలతో ఉంది. కర్నాటకలో ఇలాగే చేసి సక్సెస్ సాధించడంతో ఆధిష్ఠానం తెలంగాణలో కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని భావిస్తోంది. అయితే వచ్చిన ఇబ్బంది ఏమిటంటే.. ఇటీవలే పార్టీలోకి వచ్చి చేరిన నేతలు, తొలి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతల మధ్య పార్టీ టికెట్ కోసం పోటీ పడుతుండటమే.  అది పక్కన పెడితే ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన పిడమర్తి రవికి  వచ్చే ఎన్నికలలో పోటీ నిమిత్తం టికెట్ ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఆయనను పార్టీ ఎక్కడ నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపుతుంది అన్న విషయంలో మాత్రం భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కంటోన్మెంట్ లేదా.. లేదా  గత రెండు ఎన్నికలలో పోటీ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఆయన పోటీలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పిడమర్తి రవి టికెట్ హామీతోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన కోరుతున్నట్లుగా కంటోన్మెంట్ టికెట్ దక్కి అవకాశాలైతే అంతంత మాత్రంగానే ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పిడమర్తి ఇష్టం ఉన్నా లేకున్నా సత్తుపల్లి నుంచే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు.   అయితే సత్తుపల్లి నుంచి పిడమర్తికి టికెట్ ఇస్తే పొంగులేటి మద్దతు ఎంత వరకూ ఉంటుందన్నది పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సత్తుపల్లి నుంచి పొంగులేటి మట్టా ఆనంద్ కు పార్టీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కోరి ఉన్నారు. దీంతో పిడమర్తి ఒక వేళ సత్తుపల్లి నుంచే పోటీ చేయాల్సి వస్తే మట్టా ఆనంద్ ను పొంగులేని ఎలా సముదాయిస్తారన్నది ఆసక్తికరం. 

స్పీడ్ న్యూస్ 3

జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు 26.  సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ రైతులు శిబిరాలలో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసనకు దిగడంతో  కృష్ణరాయపాలెంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో అమరావతి రైతుల నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  ............................................................................................................................................................. పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 27. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద కొనసాగుతోంది.   స్పిల్ వే దగ్గర  ఈ రోజు 32.320 మీటర్లకు గోదావరి నీటిమగట్టం చేరింది. దీంతో దిగువకు  8,60,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ............................................................................................................................................................ కేటీఆర్ కు మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు 28. తెలంగాణ  మంత్రి కేటీఆర్ పుట్టినరోజు  సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.   మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు నా ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే.   అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ....................................................................................................................................................... జిమ్ పై కప్పు కూలి పది మంది మృతి 29. చైనాలో ఓ స్కూల్‌లో ఉన్న జిమ్ పైకప్పు ఆదివారం ఒక్కసారిగా కూలిపోయిన సంఘటనలో పది మంది మరణించారు.  సోమవారం ఉదయం నాటికి శిథిలాల నుంచి  మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఒకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ..................................................................................................................................................... ధర్నాకు అనుమతి కోసం హైకోర్టుకు బీజేపీ 30. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తాత్సారంపై బీజేపీ మంగళవారం ఇందిరా పార్క్ వద్ద జరపతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.  ధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.  ....................................................................................................................................................... ఇళ్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన 31.కృష్ణాయపాలెంలో 50వేల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించి మోడల్ హౌస్ ను పరిశీలించారు. జగన్ పర్యటన సందర్భంగా రైతుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. .................................................................................................................................................... కార్ఖానాలో ఏటీఎం ధ్వంసం  32. హైదరాబాద్ కార్ఖానాలోని  సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల దిశను మార్చి చోరీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంలోని సొమ్ము సురక్షితంగానే ఉందని తెలిపిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ....................................................................................................................................................... 33.నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం  కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో   శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మురుగు కాల్వల్లోని ప్లాస్టిక్‌ వస్తువులను స్వయంగా తొలగించి  చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.   ................................................................................................................................................... ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 34. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం  బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.1 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం నుంచి డెల్టా పంట కాల్వలకు 12,100 క్యూసెక్కులు  సముద్రంలోకి 8.99 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ....................................................................................................................................................... జ్ణానవాపి మసీదులో సర్వేను ఆపాలంటూ సుప్రీంకు 35.జ్ఞానవాపి మసీదులో  సర్వేను ఆపాలని కోరుతూ ఆ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీం ను ఆశ్రయించింది. సర్వే అంశంపై స్టే విధించాలనీ, ఈ అంశాన్ని గతంలోనే సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసిందనీ ఆ పిటిషన్ లో పేర్కొంది.   ..................................................................................................................................................... తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం 36.  కర్నూలు జిల్లా హోస్పేట్‌లోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం ఇన్ ఫ్లో 55,657 క్యూసెక్కులు కాగా.. ఒక్కరోజులోనే ఐదు టీఎంసీలు డ్యామ్‌లో చేరాయి. డ్యామ్‌లో  నీటిమట్టం ప్రస్తుతం 21.36 టీఎంసీలకు చేరుకుంది. ....................................................................................................................................................... పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా 37. పార్లమెంటు వేదికగా మణిపూర్‌ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా . సోమవారం  ‘ఇండియా’ కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.  మణిపూర్‌పై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. .............................................................................................................................................. బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు 38. బిహార్‌లోని  కులు గ్రామంలో  నాలుగేళ్ల శుభం కుమార్ అనే  బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో  పడిపోయాడు. బోరుబావిలో పడ్డ బాలుడిని రెస్క్యూ బృందం ఆరు గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసింది.  రెస్క్యూటీమ్ ను గ్రామస్థులు అభినందించి, కృతజ్ణతలు తెలిపారు. ....................................................................................................................................................... గుప్త నిధుల కోసం బాలుడి బలి 39. గుప్త నిధుల కోసం 9 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మహారాష్ట్రలోని  పొహనె షివార్‌ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించి తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు.   ............................................................................................................................................................... ఏపీ బీజేపీ  జోనల్ సమావేశాలు 40. ఏపీ బీజేపీ జోనల్‌ సమావేశాలు నేటి నుంచి నిర్వహించనున్నారు.  ఈ సమావేశాల్లో  పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొంటారు.    నేడు గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం, రేపు రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం  27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం జరగనున్నాయి.