ఇటు అవిశ్వాసం అటు ఆర్డినెన్సు.. వచ్చే వారం కేంద్రానికి గడ్డు కాలమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం మొదలు, మణిపుర్ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. మణిపుర్ హింసపై ప్రధాని నరేంద్ర మోీ సభలో ప్రకటన చేయాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు వరసగా రెండవ వారం కూడా పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేశాయి. ఈ రెండు వారాలలో ప్రభుత్వం, విపక్షాలు కొనాగిస్తున్న నిరసనల మధ్యే ఏవో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు మించి, మణిపుర్ సహా,ఏ అంశంపైనా చర్చ జరగలేదు.
మరోవంక ఇటీవల ఐఎన్డీఐఎ (ఇండియ) గా నామకరణం చెసుకున ప్రతిపక్ష పార్టీల కూటమి ప్రదాని మోడీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానం నిబంధనలను అనుసరించి స్పీకర్ ఆమోదించారు. కాగా, విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై పై ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు చర్చ తేదీని, సోమవారం (జులై 31) ఖరారు చేసే అవకాశం ఉంది.
నిజానికి లోక్ సభలో అధికార ఎన్డీఎ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ఖాయంగా వీగిపోతుంది.అందులో సందేహం లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. అలాగే అధికార కూటమి విపక్షాల విమర్శలను, ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతోంది. అలాగే ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశ పెట్టే బిల్లు కూడా దిగువ సభలో సునాయాసంగా నెగ్గుతుంది. సో .. మూడవ వారంలోనూ దిగువ సభకు సంబంధించినంత వరకు సర్కార్ కు చిక్కులేమీ లేవు.
అయితే వచ్చేవారం అటు అధికార కూటమి ఇటు విపక్ష కూటమి అసలు సవాలును పెద్దల సభలో ఎదురు కానుంది. పెద్దల సభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ లేదు. విపక్ష కూటమి ఇండియా పరిస్థితీ అదే. తటస్థులు ఎటు మొగ్గితే అటు అనుకూల ఫలితం వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం జరిగే సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైనవి. ప్రతిపక్షాల తీరుచూస్తుంటే వచ్చే వారం సభ అత్యంత ఆసక్తిగా సాగే అవకాశం కనిపిస్తోంది. సో.. ఆగస్టు 11 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో వచ్చే వారం సర్కార్ కు గడ్డు కాలం కాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.
రాజ్యసభలో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
రాజ్య సభలో మొత్తం సభ్యుల సంఖ్య 243 అయితే ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి, రాజ్య సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 238.. బిల్లు నెగ్గాలంటే 118 మంది మద్దతు అవసరం. కాగా, ఎన్డీఏ కూటమికి 109 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్కు 31 మంది సభ్యులు ఉన్నారు.
ఇతర విపక్ష పార్టీలకు చెందిన 70 మంది సభ్యుల మద్దతును ఆప్ కూడగట్టింది. బిల్లును అడ్డుకోవాలంటే ఈ సంఖ్య సరిపోదు. విపక్ష పార్టీలు ఆప్ (10), టీఎంసీ (12), డీఎంకే (10), బీఆర్ఎస్ (7), ఆర్జేడీ (6), సీపీఐ(ఎం) (6), జేడీయూ (5), ఎన్సీపీ (4), శివసేన -యూబీటీ (3), ఎస్పీ (3), సీపీఐ (2), జేఎంఎం (2), ఐయూఎంఎల్, ఆర్ఎల్డీ నుంచి ఒక్కో సభ్యులు ఆప్కు మద్దతు ఇస్తున్నారు. విపక్ష సభ్యుల సంఖ్య 101 మాత్రమే ఉంటుంది. దీంతో తటస్థంగా ఉన్న బీజేడీ (9), వైసీపీ (9)ల మద్దతు ఎంతో కీలకంగా మారింది.