English | Telugu
మాస్ ఆడియన్స్ కి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో దర్శకుడు బోయపాటి శ్రీనుకి తెలిసినంతగా మరొకరికి తెలియదనడంలో అతిశయోక్తి లేదు. తాజా చిత్రం 'స్కంద' విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారాయన. ఈమధ్య ప్రచార హడావిడి కాస్త తగ్గినట్లు అనిపిస్తున్న తరుణంలో.. సాలిడ్ ఐటమ్ నంబర్ తో మళ్ళీ బజ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు బోయపాటి.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వివిధ నేరారోపణలపై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు ఎంతో మంది సంఫీుభా
ఇండియన్ ఏస్ మూవీ డైరెక్టర్స్లో ఒకరైన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన నెక్ట్స్ ఏ సినిమా చేస్తారనే దానిపై పక్కా క్లారిటీ ఉంది. కమల్ హాసన్ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాయకుడు సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానే లేదు. చాలా ఏళ్లకు ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటం అభిమానులకే సినీ సర్కిల్స్కు సైతం ఆనందాన్నిచ్చే విషయమే. అయితే మణిరత్నం ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకుండానే మరో సినిమాను కూడా ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
మాస్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను తీరే వేరు. మొదటి సినిమా 'భద్ర' నుంచి గత చిత్రం 'అఖండ' వరకు బోయపాటి ఈ తరహా కథాంశాలనే రూపొందించారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. తనకంటూ ఓ భారీ అభిమానగణాన్ని అందించాయి. త్వరలో ఈ స్టార్ కెప్టెన్.. 'స్కంద'తో పలకరించబోతున్నారు.
జాతీయ అవార్డ్ గ్రహీత నటి ప్రియమణి ఓ దర్శకుడిపై కోపంగా ఉంది. ఇంతకీ ఆమెకు కోపం తెప్పించిన సదరు దర్శకుడు ఎవరా అని అనుకుంటున్నారా?.. తనే డైరెక్టర్ అట్లీ. అదేంటి రీసెంట్గా రిలీజైన జవాన్ సినిమాలో ప్రియమణి నటించిందిగా. మళ్లీ ఇప్పుడు తనపైనే ప్రియమణి ఎందుకు కోపంగా ఉందనే సందేహం రావచ్చు. వివరాల్లోకి వెళితే, జవాన్ సినిమాలో షారూఖ్ పాత్రను సపోర్ట్ చేసే లేడీ ఆర్మీలో కీలకమైన లక్ష్మి అనే పాత్రలో ప్రియమణి నటించింది. యాక్షన్ ఎలిమెంట్స్లో ఆమె చాలా కష్టపడి నటించింది. ఆమె పాత్రకు మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఈ పాత్రను చేయాలంటూ ప్రియమణి దగ్గరకు అట్లీ వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె ఓ కండీషన్ పెట్టింది.
సొసైటీకి ఏదో చెయ్యాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ, దానికి కావాల్సిన శక్తి, సంపాదన, స్థాయి, ధైర్యం కావాలి. అవన్నీ నాకు సమకూర్చిన అమ్మ నాన్నలకు, తెలుగు ప్రజలకు,
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి బావమరిది, హిందూపూర్ ఎం.ఎల్.ఎ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఘటన అనంతరం గత కొద్ది రోజులుగా పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు.
'భాగమతి' తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్కకి విజయాన్ని అందించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. వినూత్న కథాంశంతో పి. మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో 'జాతిరత్నాలు' స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ సినిమా.. శుక్రవారంతో 9 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పలువురు కథానాయికలు సందడి చేశారు. అయితే, వారందరిలోనూ లేడీ సూపర్ స్టార్ అనుష్కది ప్రత్యేక స్థానం. ప్రభాస్ కటౌట్ కి స్వీటీ మ్యాచ్ అయినట్లుగా మరెవరూ కాలేదన్నది కాదనలేని మాట. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల సంగతి సరేసరి.
నయనతార, త్రిష ఇద్దరూ దాదాపు అటు ఇటుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారే. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్టార్ హీరోయిన్స్గా పీక్స్ను చూసినవారే. ఒకానొక సమయంలో త్రిష, నయన్ మధ్య నువ్వా నేనా? అనేంతగా పోటీ కూడా జరిగింది. అయితే క్రమంగా త్రిష కంటే నయన్తే పైచేయిగా కనిపిస్తూ వచ్చింది. నయనతార వరుస సినిమాలను అందిపుచ్చకుంటూ లేడీ సూపర్స్టార్ ఆప్ సౌత్గా ఎదిగింది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ను వసూలు చేసింది. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకే కేరాఫ్గా మారింది. త్రిష కెరీర్ కూడా పీక్స్లోనే ఉన్నప్పటికీ నయన్ కంటే కాస్త వెనుకబడుతూనే వచ్చింది. అయితే ఇప్పుడు నయనతారకు త్రిష అనుకోని షాకిచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా రెమ్యూనరేషన్ విషయంలో.
రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన మూవీస్ లో మంచి కలెక్షన్స్ ని సంపాదిస్తోంది "జవాన్" మూవీ. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రానికి
‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ తన హవా కొనసాగిస్తోంది
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలవుతుందనే వార్తలు సినీ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళ హీరోలకు పెద్ద పీట వేస్తూ వారితోనే సినిమాలు చేస్తూ వచ్చిన శంకర్ తొలిసారి తెలుగు హీరో, నిర్మాతలతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్గా అలరించనుంది. శంకర్ సినిమా విషయంలో ఎంత కేర్ తీసుకుంటారనేది ప్రత్యేకం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న 'ఓజీ' శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా.. హరీశ్ శంకర్ డైరెక్టోరియల్ 'ఉస్తాద్ భగత్ సింగ్', క్రిష్ సినిమా 'హరిహర వీరమల్లు' కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి.
మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత దళపతి విజయ్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. భారీ ఎక్స్పెక్టేషన్స్తో సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు విజయ్ అభిమానులతో పాటు ఆడియెన్స్, ట్రేడ్ వర్గాలు సైతం ‘లియో’ రిలీజ్ కోసం చాలా ఎగ్జయిటెడ్గా వెయిట్ చేస్తున్నాయి. అందుకు కారణం.. రిలీజ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందోనని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.