English | Telugu

ఆ విష‌యంలో అట్లీ మోసం చేశాడు: ప్రియ‌మ‌ణి

జాతీయ అవార్డ్ గ్ర‌హీత న‌టి ప్రియ‌మ‌ణి ఓ ద‌ర్శ‌కుడిపై కోపంగా ఉంది. ఇంత‌కీ ఆమెకు కోపం తెప్పించిన స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని అనుకుంటున్నారా?.. త‌నే డైరెక్ట‌ర్ అట్లీ. అదేంటి రీసెంట్‌గా రిలీజైన జ‌వాన్ సినిమాలో ప్రియమ‌ణి న‌టించిందిగా. మ‌ళ్లీ ఇప్పుడు త‌న‌పైనే ప్రియ‌మ‌ణి ఎందుకు కోపంగా ఉందనే సందేహం రావ‌చ్చు. వివ‌రాల్లోకి వెళితే, జ‌వాన్ సినిమాలో షారూఖ్ పాత్ర‌ను స‌పోర్ట్ చేసే లేడీ ఆర్మీలో కీల‌క‌మైన ల‌క్ష్మి అనే పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టించింది. యాక్ష‌న్ ఎలిమెంట్స్‌లో ఆమె చాలా క‌ష్ట‌ప‌డి న‌టించింది. ఆమె పాత్ర‌కు మంచి ఎమోష‌న‌ల్ ట‌చ్ కూడా ఉంటుంది. ఈ పాత్ర‌ను చేయాలంటూ ప్రియ‌మ‌ణి ద‌గ్గ‌ర‌కు అట్లీ వెళ్లి రిక్వెస్ట్ చేసిన‌ప్పుడు ఆమె ఓ కండీష‌న్ పెట్టింది.

ఇంత‌కీ అట్లీకి ప్రియ‌మ‌ణి ఏం కండీష‌న్ పెట్టిందో తెలుసా.. ప్రియ‌మ‌ణికి జ‌వాన్ క‌థ‌ను అట్లీ నెరేట్ చేసేట‌ప్పుడు అందులో ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ కనిపిస్తార‌ని చెప్పాడు. విజ‌య్‌కి పెద్ద ఫ్యాన్ అయిన ప్రియ‌మ‌ణి, త‌న‌తో క‌లిసి న‌టించ‌టానికి అవ‌కాశం ఇవ్వాల‌ని క‌నీసం ఓ సీన్‌లో అయిన విజ‌య్‌తో క‌లిసి న‌టిస్తాన‌ని రిక్వెస్ట్ చేసింద‌ట‌. అలాగే చేస్తాన‌ని ప్రియ‌మ‌ణికి అట్లీ మాటిచ్చాడు. కానీ ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌వాన్ చిత్రంలో న‌టించ‌లేదు. దీంతో ప్రియ‌మ‌ణి కోరిక తీర‌నేలేదు. ఆ విష‌యంలో అట్లీ త‌న‌ను మోసం చేశాడంటూ ప్రియ‌మ‌ణి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది మ‌రి.

ఇక జ‌వాన్ విష‌యానికి వ‌స్తే షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజైంది. ఇప్ప‌టికే ఈ సినిమా రూ.700 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల దిశ‌గా అడుగులు వేస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప‌ఠాన్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు జ‌వాన్‌తో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు మ‌రి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.