English | Telugu

చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్: భగవంత్ కేసరి రిలీజ్ వాయిదా.. నిజమెంత?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి బావమరిది, హిందూపూర్ ఎం.ఎల్.ఎ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఘటన అనంతరం గత కొద్ది రోజులుగా పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే.. బాలయ్య కొత్త చిత్రం 'భగవంత్ కేసరి' అనుకున్న సమయానికి థియేటర్స్ లోకి వస్తుందా? అనే అనుమానం రాకమానదు. సోషల్ మీడియాలోనూ ఇదే ముచ్చట సాగింది. ఈ క్రమంలోనే.. భగవంత్ కేసరి దసరా రేసు నుంచి తొలగిందంటూ కథనాలు కూడా వచ్చేశాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదట. అనుకున్న ప్రకారంగానే.. అక్టోబర్ 19న విజయదశమికి ఈ సినిమా రావడం పక్కా అనే వినిపిస్తోంది. మేకర్స్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారని టాక్. మరి.. సకాలంలోనే రాబోతున్న భగవంత్ కేసరి బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే, భగవంత్ కేసరిలో బాలయ్యకి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. క్రేజీ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.