English | Telugu

నన్ను క్షమించండి.. స్త్రీ అంటే ఒక మహాశక్తి 

Publish Date:Dec 23, 2025

        -క్షమాపణ కోరిన శివాజీ -ఏం చెప్పాడు -వీడియో వైరల్        శివాజీ(Sivaji)నిన్న తన అప్ కమింగ్ మూవీ 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  హీరోయిన్ల వస్త్రధారణపై కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, మహిళా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్ గా తన వ్యాఖ్యలపై శివాజీ వివరణ ఇస్తూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది.     సదరు వీడియోలో శివాజీ మాట్లాడుతు 'నేను అమ్మాయిలందరి గురించి ఆ విధంగా మాట్లాడలేదు. ఇటీవల కాలంలో హీరోయిన్లు పలు విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశ్యంతో నాలుగు మంచి మాటలు చెప్పాలనే తాపత్రయంలో ఆ విధంగా మాట్లాడాను. ఈ ప్రాసెస్ లో ఊరు భాషలో రెండు అన్ పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి. ఆ విధంగా నేను మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ మాటలకి ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయి.     also Read:  శివాజీ వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఇదే      నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహా శక్తి ఒక అమ్మవారిలాగా అనుకుంటాను. ఈ రోజు మన సమాజంలో ఆడవాళ్ళని ఎంత తక్కువగా చూస్తున్నారో తెలిసిందే. మనం ధరించే బట్టల ద్వారా  అటువంటి అవకాశం ఇవ్వకుడదనేదే నా ఇంటెన్షన్. నా మాటలు ఇండస్ట్రీలో ఆడవాళ్లకి, బయట మహిళల్ని బాధ పెడితే క్షమించండి అని సదరు వీడియోలో చెప్పాడు.       https://x.com/ActorSivaji/status/2003445418160787592?s=20

20 ఏళ్లలో 600 సినిమాలు చేసిన జయమాలిని.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడానికి రీజన్‌ ఇదే!

Publish Date:Dec 22, 2025

(డిసెంబర్‌ 22 జయమాలిని పుట్టినరోజు సందర్భంగా..) ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘నీ ఇల్లు బంగారంగానూ..’, ‘గు గు గుడిసుంది..’, ‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ 1970వ దశకంలో వచ్చిన ఇలాంటి పాటలు అప్పటి కుర్రకారుకి పిచ్చెక్కించాయి. ఈ ఐటమ్‌ సాంగ్స్‌లో జయమాలిని డాన్స్‌, అందాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పించాయి. అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాల్లో జయమాలిని ఐటమ్‌ సాంగ్‌ కంపల్సరీగా ఉండాల్సిందే. అక్క జ్యోతిలక్ష్మీ అప్పటికే తన డాన్స్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్నారు. ఆ సమయంలో వచ్చిన చెల్లెలు జయమాలిని.. ఐటమ్‌ సాంగ్స్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.    1958 డిసెంబర్‌ 22న మద్రాస్‌లో జన్మించారు జయమాలిని. ఆమె అసలు పేరు అలమేలు మంగ. 8 మందిలో జ్యోతిలక్ష్మీ మొదటి సంతానం కాగా, అలమేలు మంగ చివరి సంతానం. ఈ ఇద్దరికీ 10 సంవత్సరాల గ్యాప్‌ ఉంది. తల్లికి చెల్లెలైన ధనలక్ష్మీకి పిల్లలు లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా ఆమె దగ్గరే జ్యోతిలక్ష్మీ పెరిగారు. అక్క డాన్స్‌ నేర్చుకుంటూ ఉండగా దగ్గరే ఉండి చూసేవారు అలమేలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్‌ నేర్చుకున్నారు.    అలమేలు మేనమామ టి.ఆర్‌.రామన్న ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో రవిచంద్రన్‌, లత  జంటగా రూపొందుతున్న ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ సినిమాలో లత స్నేహితురాలిగా అలమేలును చిత్ర రంగానికి పరిచయం చేశారు. అప్పటికి అలమేలు వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత దర్శకుడు బి.విఠలాచార్య చేస్తున్న ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ఒక ఐటమ్‌ సాంగ్‌ ద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు జయమాలిని అని పేరు పెట్టింది కూడా ఆయనే.   అదే సంవత్సరం అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించారు జయమాలిని. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ కంటే ఐటమ్స్‌తోనే జయమాలిని ఎక్కువ పాపులర్‌ అయ్యారు. 1977లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన యమగోల చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను, గుంటూరు పొయ్యాను..’ పాటతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్‌ చేశారు జయమాలిని.  ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాల్లో వరసగా ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. అందరు టాప్‌ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసినప్పటికీ ఎన్టీఆర్‌ సినిమాలతోనే ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనేది వాస్తవం.    1980వ దశకం వచ్చేసరికి జ్యోతిలక్ష్మీ హవా తగ్గింది. జయమాలిని జోరు పెరిగింది. ఆ తర్వాత సిల్క్‌ స్మిత వచ్చినప్పటికీ జయమాలిని ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆమె కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాల్లో నటించారు.    ఐటమ్‌ సాంగ్స్‌తోపాటు విఠలాచార్య డైరెక్షన్‌లో వచ్చిన జగన్మోహిని, గంధర్వకన్య వంటి సినిమాలు జయమాలినికి నటిగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా జగన్మోహిని రిలీజ్‌ అయిన టైమ్‌కే ఎన్టీఆర్‌ సింహబలుడు, కృష్ణ సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.    నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1994 జూలై 19న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు జయమాలిని. వీరి కుమార్తెకు చిన్నతనం నుంచే డాన్స్‌ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినిమా రంగానికి మాత్రం తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు జయమాలిని. పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. అంతేకాదు, మీడియాకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈమధ్యకాలంలోనే అక్కడక్కడా జయమాలిని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.    జయమాలినిది ఒక విభిన్నమైన మనస్తత్వం. సినిమాల్లో కనిపించే జయమాలినికి, బయట కనిపించే జయమాలినికి అసలు పొంతనే ఉండదు. తెరపై ఐటమ్‌ గళ్‌గా కనిపించే ఆమె నిజజీవితంలో ఒక సాధారణ మహిళ అనిపిస్తుంది. మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన కెరీర్‌ని ఎంతో వైవిధ్యంగా కొనసాగించారు. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నానని, అందుకే సినిమాలకు స్వస్తి పలికానని చెబుతారామె. ఏది ఏమైనా తన ఐటమ్‌ సాంగ్స్‌తో 20 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన జయమాలిని అందరి మనసులు గెలుచుకున్నారు.     

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

శివాజీ కామెంట్స్ పై చిన్మయి ఫైర్..కాలికి మెట్టెలు పెట్టుకో..!

Publish Date:Dec 23, 2025

ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  హీరో శివాజీ రీసెంట్ గా హీరోయిన్ ల వస్త్రాల గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు శివాజీ కామెంట్స్ మీద చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయ్యారు. ఆమె ఒక పోస్ట్ పెట్టారు. "తెలుగు నటుడు శివాజీ 'దరిద్రపు ముండా' వంటి పదాలను ఉపయోగిస్తూ హీరోయిన్ లు తమ సామానులు కవర్ చేసుకోవడానికి చీరలు ధరించాలి అంటూ  అనవసరమైన సలహా ఇవ్వడం ఏమిటి. నటుడు శివాజీ ఒక అద్భుతమైన చిత్రంలో విలన్‌గా నటించాడు మరియు చివరికి  హీరోగా మారాడు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్ ప్రదేశాలు..అక్కడ ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా. ఆయన జీన్స్,  హూడీలు వేసుకోకుండా ధోతీలు మాత్రమే కట్టుకుని భారతీయ సంస్కృతిని అనుసరించాలి కదా. బొట్టు పెట్టుకోవాలి అలాగే అతనికి వివాహం అయ్యుంటే పెళ్లి ఐనందుకు గుర్తుగా కంకణం, కాలికి మెట్టెలు ధరించాలి కదా. ఇక్కడ మహిళల్ని ఎంతో ఘోరంగా చూస్తున్నారో" అంటూ ఆమె పెట్టిన ఒక వ్యంగ్యాత్మక ఘాటైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  https://twitter.com/Chinmayi/status/2003308949257470105

Balakrishna: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

Publish Date:Dec 23, 2025

  నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో పాటలు పాడి అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. అలాగే 'పైసా వసూల్' సినిమాలో 'మామ ఏక్ పెగ్ లా' అనే సాంగ్ పాడి మెప్పించారు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఓ సినిమా కోసం గాయకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది.   అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ-2 .. ఇలా వరుసగా ఐదు 100 కోట్ల గ్రాస్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్.   అనౌన్స్ మెంట్ తోనే 'NBK111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ సింగర్ గా మారుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ సాంగ్ కి బాలయ్య వాయిస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీం అడగగా.. ఆయన ఓకే చెప్పినట్లు వినికిడి.   Also Read: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి.. నిజమేనా..?   అసలే బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో తెలిసిందే. అలాంటిది స్వయంగా బాలయ్యనే సింగర్ గా మారితే.. ఇక తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969