English | Telugu

తలైవా 170వ సినిమాలో రానా దగ్గుబాటి.. ఎలాంటి క్యారెక్టర్‌ అంటే!

Publish Date:Oct 3, 2023

‘జైలర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేయబోయే 170వ సినిమాకి సంబంధించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ ఎంతో భారీగా నిర్మించనుంది. ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం గురించి గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రితికా సింగ్‌, దుషారా విజయన్‌, మంజు వారియర్‌ ఎంపికయ్యారు.  ఇక ఈ సినిమాలో టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి ఒక కీలక పాత్ర పోషిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని లైకా ప్రొడక్షన్స్‌ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ సినిమాలో రానా క్యారెక్టర్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. రానా అయితేనే ఆ క్యారెక్టర్‌కి సరిపోతారని మేకర్స్‌ భావించారట. ‘జైలర్‌’ సినిమాలో కన్నడ నుంచి శివరాజ్‌కుమార్‌, మలయాళం నుంచి మోహన్‌లాల్‌, బాలీవుడ్‌ నుంచి జాకీ ష్రాఫ్‌ వంటి స్టార్స్‌ నటించడం సినిమాకి ఒక స్పెషల్‌ అట్రాక్షన్‌ అయింది. ఇప్పుడు రజనీ 170వ సినిమాలో కూడా ఇదే సెంటిమెంట్‌ను కొనసాగించే అవకాశం ఉన్నట్టుంది. మరి ఈ సినిమాలో ఇంకా ఎవరెవరిని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ‘జైలర్‌’ సినిమా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ చేసిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించనున్నారు. 

చిరంజీవిని తన సినిమాలో వద్దన్న దాసరి 

Publish Date:Oct 3, 2023

తెలుగు చలన చిత్ర పరిశ్రమ బతికి ఉన్నంత కాలం దాసరి నారాయణ రావు  అనే పేరు మాత్రం ఎప్పటికి  చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది.ఎన్నో మంచి సినిమాలు ఆయన నుండి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో రంజింప చేసాయి.అలాగే ఎంతో మంది కొత్తవాళ్ళకి తన సినిమాలో అవకాశాలు ఇచ్చి వాళ్ళ సినిమా కెరియర్ కి ఎంతగానో తోడ్పాటుని అందించారు. అలాగే తెలుగు చిత్ర సీమలో చిరంజీవి కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. తనకి మాత్రమే సాధ్యమయ్యే డాన్సులు ఫైట్స్ ,యాక్టింగ్ తో తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతూ వస్తున్నారు.మరి  చిరంజీవిని  దాసరి నారాయణ రావు తన సినిమాలో వద్దన్నాడన్న విషయం మీకు తెలుసా? కొత్త వాళ్ళని  ప్రోత్సహించి  తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు సుస్థిర  స్థానాన్ని పొందేలా వాళ్ళకి నటనలో మెరుగులు దిద్హేలా చేసే దాసరి చిరంజీవిని తన సినిమాలో ఎందుకు వద్దన్నాడు. అవి దాసరి నారాయణ రావు దర్శకత్వం లో సినిమా వస్తే చాలు జనం థియేటర్స్ కి ఎగబడి  వెళ్తున్న రోజులు. వరుస హిట్ లతో నెంబర్ వన్ డైరెక్టర్ గా దాసరి అప్రహాతీతంగా ముందుకు  దూసుకుపోతూ సినిమా హీరోయిన్ కధాంశంతో శివ రంజని అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీలో టైటిల్ రోల్ పాత్రలో జయసుధని దాసరి ఫిక్స్ చేసారు. ఇంక తాను రాసుకున్న కథ ప్రకారం జయసుధ సరసన నటించబోయే  హీరో కోసం దాసరి అన్వేషణలో పడ్డారు.కథ డిమాండ్ ప్రకారం హీరో క్యారక్టర్ కి కొత్త కుర్రోడు కావాలని దాసరి ఫిక్స్ అయ్యాడు.హీరో కి సంబంధించి అన్వేషణలో పడిన దాసరికి  తెలిసిన వాళ్ళ ద్వారా ముగ్గురు కొత్త  కుర్రోళ్ళు సినిమాల కోసం ప్రయతిస్తు ఉన్నారని తెలిసింది .దీంతో దాసరి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి కబురు పెట్టారు. ఇంక ఆ ముగ్గురు కుర్రోళ్ళ విషయాన్ని వస్తే ఆ ముగ్గురు కూరోళ్ళు ఎవరో కాదు. ఒకరు మెగా స్టార్ చిరంజీవి ఐతే ఇంకొకరు కామెడీ యాక్టర్ సుధాకర్ అలాగే హరి ప్రసాద్ .ఈ హరి ప్రసాదే  తర్వాత రోజుల్లో చిరంజీవితో యముడికి మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ని నిర్మించాడు.ఇంక అసలు విషయంలోకి వస్తే దాసరి తన శివరంజని సినిమా కోసం ముగ్గురు కురాళ్ళ ఉన్నారని తెలిసి చిరంజీవి వాళ్ళకి కబురు పంపాడు.ఆ సమయం లో చిరంజీవి ,సుధాకర్ లు రూమ్ లో  లేరు. హరిప్రసాద్  ఒక్కడే ఉన్నాడు. దాసరి నుంచి కబురు వచ్చిందని తెలిసి హరిప్రసాద్ దాసరి దగ్గరకి వెళ్ళాడు.హరి ప్రసాద్ ని  చూసిన దాసరి తన సినిమా హీరోగా హరి ప్రసాద్ ని ఫిక్స్ చేసుకున్నాడు  ఆ తర్వాత  చిరంజీవి దాసరి నుంచి కబురు వచ్చిన విషయం తెలుసుకొని దాసరి ని  కలిస్తే దాసరి చిరంజీవి తో హరిప్రసాద్ ని తీసుకున్నానని  చెప్పటంతోచిరు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు .ఇలా దాసరి చిరంజీవిని  తన సినిమాకి వద్దని అన్నాడు.    

షారుఖ్ పై సంచలన కామెంట్స్ చేసిన నటి 

Publish Date:Oct 3, 2023

దశాబ్దంన్నర కాలం క్రితం ఆమె హీరోయిన్ గా తెలుగు ,తమిళ భాషలకి సంబంధించిన  సినిమాల్లో నటించి అద్భుతమైన నటిగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది.అంతే కాకుండా ఏ కొంత మందికో మాత్రమే సాధ్యమయ్యే జాతీయ అవార్డు ని సైతం ఉత్తమ నటి కేటగిరిలో పొంది నేషనల్ లెవెల్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకుంది.ప్రస్తుతం క్యారక్టర్ రోల్స్ లో  నటిస్తూ తన నటనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది.పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఆ నటి ఇటీవల  ఒక బాలీవుడ్ బాద్షా షారుఖ్ గురించి సంచలన వ్యాఖ్య చేసింది. అసలు విషయం లో కి వస్తే..ప్రియమణి ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా తన నటన ఉంటుంది.ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే ప్రియమణి  తెలుగులో జగపతి బాబు,నాగార్జున ఎన్టీఆర్ ల సరసన అలాగే తమిళంలో విక్రమ్ లాంటి  పెద్ద హీరోల సరసన కూడా  నటించి అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ కి  వెళ్ళింది.ఆ తర్వాత తన సినిమా కెరీర్ పెద్దగా సాగలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలు నటనకి దూరంగా ఉండి లేటెస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లేటెస్టుగా ప్రియమణి  షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసింది.వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జవాన్ మూవీ లో చాలా ప్రాముఖ్యత ఉన్న క్యారక్టర్ లో నటించి సినిమా విజయంలో తను కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది తాజాగా ప్రియమణితో ఒక జర్నలిస్ట్ మీ క్రష్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే  ఏ మాత్రం తడుముకోకుండా షారుఖ్ ఖాన్ నా క్రష్ అని సమాధానం ఇచ్చి అందర్నీ షాక్ కి గురి చేసింది. కొంత మంది అయితే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ప్రియమణి అలా చెప్పడంతో ప్రియమణి కి గట్స్ ఎక్కువే అని అనుకుంటున్నారు.    

'సీనియర్ నటి అపార్ట్ మెంట్‌'లో సూసైడ్!

Publish Date:Oct 3, 2023

  ఈ జనరేషన్ లో పిల్లల్ని చూస్తుంటే రోజురోజుకి భయమేస్తుంది. ఒక పిల్లాడు సొసైటీలోని 35 వ ఫ్లోర్ నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. అసలు లైఫ్ అంటే ఇంతేనా అంటూ షానూర్ సనా.. తనకి ఎదురైన ఒక సంఘటనని యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ద్వారా పంచుకుంది. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఏదో డిప్రెషన్ లో ఉండి, చాక్లెట్ తినుకుంటూ 35వ ఫ్లోర్ కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడంట. " వాళ్ళ అమ్మానాన్నలకి ఎంత బాధగా ఉంటుంది అసలు, మరీ చనిపోయేంత ప్రాబ్లమ్స్ ఏం ఉంటాయి. ఎందుకో తెలియదు పిల్లలు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైనా ఉంటే అమ్మ నాన్నలతోనో, స్నేహితులతోనో పంచుకోవాలి. కౌన్సిలింగ్ కి వెళ్ళాలి గానీ ఇలా సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ అనేది ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కాదు కదా" అంటూ సనా ఈ వ్లాగ్ లో చెప్పింది. సీనియర్ నటి షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి  సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది. సనా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సన. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా.  తాజాగా తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా. ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తన యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా.. కెరీర్ లో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా. కొన్ని రోజుల క్రితం ' మా ఇంట్లో విచిత్రాలు జరుగుతున్నాయి' అంటు పోస్ట్ చేసిన వ్లాగ్  అత్యధిక వీక్షకాధరణ పొందింది. ఇప్పుడు ' ప్రాణం వదులుకోవడం సొల్యూషన్ కాదు' అంటూ సనా పోస్ట్ చేసిన ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.  

చైతన్యకి మళ్ళీ పెళ్లి..ఈ సారైనా నిలబడేనా?

Publish Date:Oct 3, 2023

  కొణిదల వారి అమ్మాయి నిహారిక పెళ్లి రెండు సంవత్సరాల క్రితం చైతన్య  జొన్నలగడ్డ తో అత్యంత వైభవంగా జరిగింది. మెగా అభిమానులతో పాటు మెగా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరు కూడా నిహారిక,చైతన్యలని ఆశీర్వదించి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కొనియాడారు. కానీ ఎవరు ఊహించని  విధంగా నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకొని అందర్నీ షాక్ కి గురి చేసారు .ఇప్పుడు తాజాగా చైతన్య గురించి వస్తున్న ఒక రూమర్  సోషల్ మీడియాని షేక్ కి గురి చేస్తుంది . రాను రాను సినిమా వాళ్ళ నిజ పెళ్లిళ్లు సినిమాలో లాగానే అబద్ద పెళ్లిళ్లు గా మారుతున్నాయి.పెళ్ళికి ముందు ఒకరి కోసమే ఒకరం పుట్టాం..జీవితాంతం ఒకరి చేయి ఒకరం విడవం అనే లెవల్లో పబ్లిక్ గా తిరగడమే కాకుండా సోషల్ మీడియాలో ఇద్దరి అందమైన పిక్స్ తో ఒక లెవెల్లో రచ్చ రచ్చ చేస్తారు.పెళ్లి కూడా చాలా ఘనంగా జరుగుతుంది అంతేనా పెళ్ళికి  వారం రోజుల ముందు నుంచే రక రకాల ఈవెంట్స్ తో ఫుల్ హడావిడి చేస్తారు. ఆ తర్వాత కారణం కూడా చెప్పకుండా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని విడిపోతారు. అదేం విచిత్రమో గాని పెళ్లి కి చాలా టైం ఉన్నప్పుడే ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు కదా అప్పుడు గుర్తుకు రాని మనోభావాలు పెళ్లయ్యాకే గుర్తుకు వచ్చి విడాకులు తీసుకుంటారు.ఇది ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు చేస్తున్న పని. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు నీహారిక మాజి భర్త చైతన్య గురించి ఒక తాజా వార్త బయటకి వచ్చింది .ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో గాని  చైతన్య కి పెళ్లి సెటిల్ అయ్యిందని  తన దగ్గరి  బంధువుల అమ్మాయితో  త్వరలోనే పెళ్లి జరగబోతుందనే వార్త బయట షికారు చేస్తుంది. కొన్నాళ్ల క్రితం చైతన్య బాగా డిప్రెషన్లోకి వెళ్లి మాములు మనిషి అవ్వడం  కోసం రకరకాల గుడులు, ప్రదేశాలు తిరిగిన విషయం చాలా మందికి తెలిసిందే. చైతన్య ఇప్పుడు డిప్రెషన్ లో నుంచి బయటకి వచ్చాడని పెళ్ళికి కూడా  ఒప్పుకున్నాడని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు. చైతన్య పెళ్లి విషయంలో వస్తున్న వార్తల్లో నిజమెంతో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అలాగే నిహారిక రియాక్షన్ కూడా తెలుస్తుంది.  

పెదకాపు - 1

Publish Date:Sep 29, 2023

స్కంద

Publish Date:Sep 28, 2023

జవాన్

Publish Date:Sep 7, 2023