English | Telugu

priyanka chopra: ఆరుసార్లు రక్తం మార్పిడి.. ప్రియాంక చోప్రా అసలు విషయం బయటపెట్టేసింది

Publish Date:Feb 5, 2026

  -అభిమానులకి బాధని కలిగిస్తున్న ప్రియాంక మాటలు  -ఎందుకు అలా జరిగిందంటూ కామెంట్స్  -వారణాసి పై భారీ అంచనాలు   పాన్ ఇండియా యాక్ట్రస్ అనే స్థాయి దాటి పాన్ వరల్డ్ యాక్ట్రస్ అనే స్థాయికి ఎదిగిన 'ప్రియాంక చోప్రా(Priyanka Chopra)సినీ జర్నీ తెలిసిందే. ప్రెజంట్  మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(ss Rajamouli)ల 'వారణాసి'(Varanasi)తో బిజీగా ఉంది. ఆ ఇద్దరు ఏరి కోరి మందాకినీ అనే క్యారక్టర్ కి ప్రియాంక ని సెలక్ట్ చేసారు. అంటే తన వల్ల వారణాసి విజయ నాదానికి ఎంత లాభం జరగబోతుందో అర్ధం చేసుకోవచ్చు. వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూడా ప్రియాంక మాయాజాలం వారణాసి కి అదనపు ఆకర్షణ అని  చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చెప్పిన విషయాలు అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కర్ని ఎంతో ఆవేదనకి గురి చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. ప్రియాంక మాట్లాడుతు నా పాప పేరు మాల్తీ మేరీ. నెలలు నిండకుండానే మూడు నెలల  ముందుగానే మాల్తీ జన్మించింది. ఆ సమయంలో తను 765 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో కొన్ని నెలలపాటు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది. పైగా అప్పుడు కరోనా సమయం. దాంతో చావు బతుకల మధ్య మాల్తీ హాస్పిటల్ లోనే పోరాటం చేసింది. మూడు నెలల్లో ఆరు సార్లు రక్తం మార్చారు. ఆ టైంలో చాలా భయంగా బతికాం. చివరకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుని మాల్తీ క్షేమంగా బయటపడిందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ సమయంలో తన భర్త నిక్ జోనస్ కూడా ప్రియాంక పక్కనే ఉన్నాడు.    Also read: Epstein files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!  అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్(Nick Jonas)ప్రియాంక కి 2018 లో వివాహం జరిగింది. ప్రియాంక కి కన్నా పదేళ్ల చిన్నవాడు. సరోగసి ద్వారా మాల్తీ మేరీ కి జన్మనిచ్చారు. అమెరికాలోనే సెటిల్ అయిన ప్రియాంక వారణాసి షూటింగ్ కోసమే ఇండియాలో ఉంది.      

సినిమా చూడాలంటే బ్రహ్మానందం ఇప్పటికీ వణికిపోతారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Jan 31, 2026

(ఫిబ్రవరి 1 బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా..)   - తను చేసిన 1250 సినిమాల్లో బ్రహ్మానందం చూసినవి 20 మాత్రమే - చిరంజీవిని చూస్తే బ్రహ్మానందం భయపడతారు.. ఎందుకంటే? - చిన్నతనంలో బ్రహ్మానందంని తండ్రి ఎందుకు కొట్టేవారు?   నీ ఎంకమ్మా.. తీస్కో.. పండగ చేసుకో.. రకరకాలుగా ఉంది మాస్టారూ.. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయ్.. జఫ్ఫా.. ఇరుకుపాలెం వాళ్లంటే ఎకసెక్కాలుగా ఉందా?.. నా పెర్‌ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఎస్.ఎం.ఎస్. చేయండి.. నన్ను ఇన్‌వాల్వ్ చేయకండి రావుగారు.. ఈ పాపులర్ డైలాగులు వింటే చాలు.. అవి చెప్పి మనల్ని నవ్వించిన కమెడియన్ ఎవరో గుర్తొస్తారు. నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని, తీరికలేని కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది హాస్యనటులు వచ్చారు. తమ నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు. పాతతరంలో రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులు కొన్ని దశాబ్దాలు హాస్యనట చక్రవర్తులుగా ఇండస్ట్రీని ఏలారు.    ఆ తర్వాత వచ్చిన బ్రహ్మానందం తనదైన మార్క్ కామెడీతో, డైలాగులతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ ఎంటర్‌టైన్ చేశారు. 1980వ దశకంలో ఇండస్ట్రీకి వచ్చిన బ్రహానందం.. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించారు. ఒక దశలో బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా బ్రహ్మానందం సినిమాలో ఉన్నాడంటే మినిమం గ్యారెంటీగా భావించేవారు. ఒకప్ప్పుడు రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి ఈ క్రేజ్ ఉండేది.    నలభై ఏళ్ళ తన సినీ కెరీర్‌లో 1250కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా కనిపించిన బ్రహ్మానందంకి సినిమాలంటే ఎంతో భయమట. అందుకే తను చేసిన వందల సినిమాల్లో కేవలం 20 మాత్రమే చూశారు. సినిమా నటుడై ఉండి, తన నటనతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందంకి సినిమాలంటే ఎందుకు విరక్తి కలిగింది? సినిమాల విషయంలో అతన్ని భయపెట్టింది ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.   1956 ఫిబ్రవరి 1న  గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం, చాగంటివారిపాలెంలో కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో ఒకరుగా జన్మించారు కన్నెగంటి బ్రహ్మానందం. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో టెన్త్ వరకు చదువుకున్నారు. పై చదువులకు వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రికి సన్నిహితుడైన సున్నం ఆంజనేయులు సహకారంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇం{ర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్‌లో తెలుగు సాహిత్యంలో ఎం.ఎ. చేశారు. ఆ తర్వాత 9 సంవత్సరాలపాటు అత్తిలిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు బ్రహ్మానందం.    చిన్నతనంలో సినిమాలు చూడాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. కానీ, తండ్రి సినిమాలకు పంపేవారు కాదు. సంవత్సరానికి ఒక సినిమా చూస్తే గగనం అన్నట్టుగా ఉండేది.  అయితే తండ్రికి తెలియకుండా సోదరులతో కలిసి సెకండ్ షోలకు వెళ్లేవారు. అలా వెళ్లినప్ప్పుడల్లా తండ్రి వారిని చితకబాదేవారు. తన్నులు తిన్నా సినిమాలు చూడడం మానేవారు కాదు. ఆ తర్వాతి కాలంలో సినిమా చూడాలంటే తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొచ్చేవి.    ఇక సినిమాల్లోకి వచ్చి గ్రేట్ కమెడియన్ అనిపించుకున్న తర్వాత కూడా సినిమాలంటే భయం పోలేదు. సినిమాల విషయంలో తండ్రి అతన్ని శిక్షించిన తీరు అలా ఉండేది. తను చేసే సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని నవ్విస్తున్నప్పటికీ తను మాత్రం సినిమాలకు దూరంగానే ఉంటారు. అందుకే ఆయన చూసిన సినిమాలు చాలా తక్కువ. సినిమా అనగానే ఇప్పటికీ చిన్నతనంలో తండ్రి కొట్టిన దెబ్బలే గుర్తొస్తాయని అంటారు. అలాగే చిరంజీవిని చూసినా బ్రహ్మానందం భయపడతారు. దానికి కారణం.. తను సినిమాల్లోకి రాకముందు చిరంజీవి వంటి స్టార్ హీరోని కలిసినపుడు మాట్లాడేందుకు ఎంత భయపడ్డారో ఇప్ప్పుడు కూడా ఆయన కలిసినపుడు పైకి బాగానే మాట్లాడినా మనసులో మాత్రం వణుకు పుడుతుందంటారు బ్రహ్మానందం.

Epstein Files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!

Publish Date:Feb 5, 2026

  -వరల్డ్ వైడ్ గా హీట్ ని కలిగిస్తున్న ఎప్ స్టీన్  -ఎప్ స్టీన్ ఏం చేసేవాడు  -ఫైల్స్ లో ఉన్న పేర్లు ఎవరివి  - అసలు అవన్నీ నిజాలేనా!   ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరో... ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు... ఎక్కడికి నీ పయనం.. అనే ఈ మూడు సాంగ్స్ వినాలంటే సోషల్ మీడియాని సంప్రదించాల్సిందే. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ఈ మూడు సాంగ్స్ ని పాడుకోవాల్సిన పరిస్థితి. ఆ అవకాశం ఎప్ స్టీన్ ఫైల్స్(Epstein Files)ద్వారా రావడమే కాకుండా ఆ సంస్థ మరిన్ని రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటపెట్టి కాస్తో కూస్తో ఉన్న తన పరువుని బజారున వేస్తుందేమో అని సోషల్ మీడియా దిగులుతో ఉంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం..ప్రస్తుతం వరల్డ్ మొత్తాన్ని హీట్ ఎక్కిస్తున్న మ్యాటర్. ఇప్పటికే ఊహించడానికి కూడా అవకాశం లేని ప్రముఖుల పేర్లు బయటకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినీ సెలబ్రటీస్ పేర్లు ఉన్నాయనే న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఎప్ స్టీన్ ఏర్పాటు చేసిన విందుకి కొంత మంది బాలీవుడ్ సెలబ్రటీస్ హాజరయ్యారని, ఈ మేరకు ఎప్ స్టీన్ కి మెయిల్స్ కూడా చేసారనే కథనాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయో, సదరు కుంభకోణం మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రముఖ భారతీయ, అమెరికన్ రచయిత దీపక్ చోప్రా(Deepak Chopra)పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బయటకి వచ్చింది. ఈ విషయంపై ఆయన స్పందిస్తు ఎప్‌స్టీన్ తో నా పరిచయం చాలా సన్నితమైంది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు సంబంధం లేదని చెప్పాడు.   also read: madhavan:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా ప్రకటించారు ఎప్‌స్టీన్ అనే వ్యక్తి  అమెరికాకి చెందిన కుబేరుడు తో పాటు లైంగిక నేరస్తుడు. 2002 ,2005 సంవత్సరాల మధ్య మైనర్ బాలికలని లైంగికంగా వేధించి పలువురు అమెరికా అగ్రనేతలు, సంపన్నులకి వారిని సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న ఈ కేసులో కోర్టుకు సమర్పించిన దాదాపు 30 లక్షల పేజీల పత్రాలని  అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగానే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.ఎప్‌స్టీన్  పూర్తి పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. 2019 లోనే జైలు శిక్ష అనుభవిస్తుండగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు.    

Brahmamudi : చక్రవర్తిని పట్టుకోవడానికి కావ్య ప్లాన్.. మినిస్టర్ ఏం చేయనున్నాడు!

Publish Date:Feb 5, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -947 లో.. రాజ్, కావ్య ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడని మినిస్టర్ కోపంతో రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి అందరు భయంగా ఉన్నారు. ఈ రోజు జరిగిన దానికి కారణం ఈ రాజ్, కావ్యనే.. అనవసరంగా నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. ఇప్పుడు ఏమైందో చూసావ్ కదా.. ఇక చూడడాలు ఉండవని మినిస్టర్ వార్నింగ్ ఇస్తాడు. అసలు ఏమైంది రాజ్ అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో బాగా అర్థమైంది అనుకుంటా.. ఇక నన్ను మీ ఇంటికి రప్పించుకునే ఛాన్స్ ఇవ్వవులే అని వార్నింగ్ ఇచ్చేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు. అసలు ఏమైంది రాజ్ వాడు అలా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఏం కాలేదు కాబట్టి మంచిది అయింది.. లేదంటే ఎలా ఉండేదని ధాన్యలక్ష్మి అంటుంది. వాడితో ఎంట్రా గొడవ.. వాళ్ళ ఫ్యామిలీ జోలికి అంటున్నాడని ప్రకాష్ అడుగుతాడు. రాజ్ బిజినెస్ గురించా లేక మీ స్వార్థం కోసమా అని స్వప్న అడుగుతుంది. దాంతో రాజ్ కోపంగా మీకేం తెలుసని మాట్లాడుతున్నారని కోప్పడుతాడు. దాంతో రాజ్ నిజం చెప్పబోతుంటే కావ్య తనని ఆపి. వాడు బిజినెస్ పరంగానే పగ పట్టాడని కావ్య కవర్ చేస్తుంది. ఇంకొకసారి ఎలాంటి సమస్య రానివ్వమని కావ్య అందరికి సారీ చెప్తుంది. మరొకవైపు మినిస్టర్, రుద్రాణి ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. నువ్వు ఇచ్చిన ఐడియాతో ఆ రాజ్, కావ్యలకి దిమ్మతిరిగిపోయిందని మినిస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ ఫూల్స్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య మినిస్టర్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ డాక్టర్ చక్రవర్తిని పట్టుకుంటే అంతా నిజం బయటపడుతుంది. వాడే ఎక్కడో దాచాడు.. చక్రవర్తిని కనిపెట్టడానికి ఇద్దరు ఒక ప్లాన్ చెస్తారు. మరుసటిరోజు తులసి ఇంట్లో కన్పించకపోవడంతో మినిస్టర్ కంగారుపడుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నీ భార్యని చక్రవర్తి దగ్గరకి తీసుకొని వెళ్తున్నాం.. అక్కడే అతను నీ గురించి చెప్తాడని రాజ్ అనగానే మినిస్టర్ భయంతో చక్రవర్తి దగ్గరికి పరుగులు తీస్తాడు. మినిస్టర్ ని ఫాలో అవుతూ వెనకాలే రాజ్ వెళ్తాడు. అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది. సిచువేషన్ ఒకే అంత మనం అనుకున్నట్లు గానే జరుగుతుందని రాజ్ చెప్తాడు.  మినిస్టర్ చక్రవర్తి ఉన్న దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు ఎందుకు కావ్య నన్ను హాస్పిటల్ కి రమ్మన్నావని కావ్యని తులసి అడుగుతుంది. మీకు పాలు సరిపోవడం లేదని అన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ వస్తున్నారు. ఆ మందులు వాడితే బాగుంటుందని కావ్య అనగానే కావ్య మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు.. నేను మీకు ఏదైనా చెయ్యాలని తులసి అంటుంది. టైమ్ వచ్చినప్పుడు మీరు చేస్తారని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

మార్కో డైరెక్టర్ తో బాలయ్య.. మాస్ సంభవం!

Publish Date:Feb 1, 2026

  ఒక్కోసారి ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. ఆ కాంబినేషన్ ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు అలాంటి కాంబోనే సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), 'మార్కో' దర్శకుడు హనీఫ్ అదెని(Haneef Adeni) చేతులు కలుపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.   బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. వాటిలో దిల్ రాజు బ్యానర్ లో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి సహా పలువురు పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.   రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మలయాళ సినిమాలలో 'మార్కో' ఒకటి. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. మోస్ట్ వయలెంట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా పేరు పొందింది. అలాంటి వయలెంట్ డైరెక్టర్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ గతేడాది ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది. కానీ హీరోను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రాజెక్ట్ లో నటించనున్న హీరో బాలకృష్ణనే అని ప్రచారం జరుగుతోంది.   బాలకృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన మాస్ ఇమేజ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అలాంటి బాలకృష్ణను వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఆసక్తిని కలిగిస్తోంది. ఇక నిజంగానే ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు షేక్ అవుతాయి అనడంలో డౌట్ లేదు.