Read more!

English | Telugu

జాన్ విజయ్ మీద లైంగిక ఆరోపణలు 

Publish Date:Jul 27, 2024

జాన్ విజయ్(john vijay)చిరంజీవి(chiranjeevi)వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ(balakrishna)భగవంత్ కేసరి, ప్రభాస్(prabhas)సలార్, రామ్ పోతినేని(ram potineni)స్కంద లతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుల్లో ఒకడిగా మారాడు. 2006  లో  శరత్ కుమార్, నయనతార జంటగా తమిళంలో తెరకెక్కిన  తలై మగన్ తో  సినీ రంగ ప్రవేశం చేసిన ఈ తమిళ నటుడు  తాజాగా లైంగిక ఆరోపణలని ఎదుర్కొంటున్నాడు. చిన్మయి శ్రీపాద(chinmayi sripaada)అమృత దారని  కురిపించే ఎన్నో పాటలు ఆమె నోటి నుంచి జాలు వారాయి. కొన్ని వందల పాటలు పాడింది. ప్రముఖ నటి సమంతకి తన గొంతుని అరువుగా ఇచ్చి సమంత నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి కూడా  దోహపడింది. ఇప్పుడు  జాన్ విజయ్ మీద లైంగిక ఆరోపణలు చేస్తుంది. కొంత మంది  మహిళలను జాన్  లైంగికంగా వేధించాడంటూ  సోషల్ మీడియాలో వరుసగా  పోస్టులు పెడుతుంది. కొన్ని రోజులు క్రితం  ఇంటర్వ్యూకు వెళ్లిన ఒక  మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడని,గతంలోను  చాలా మంది  మహిళలతో ఇలాగే  వ్యవహరించాడని పలు స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్  చేసింది. ఇప్పుడు ఈ విషయం తమిళ ఇండస్ట్రీ తో పాటు  ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. రావణన్, సమర్, డేవిడ్, నీరం, కబాలి, వీర శివాజీ, సాగసం, పట్టతు యానై, తిరుడాన్ పోలీస్, కో 2 నంబియార్, భూమి.కొలై, పార్టనర్, సోలో, కామ్రేడ్ ఇన్ అమెరికా, లూసిఫర్, బిగ్ బ్రదర్, గజ కేసరి,డేవిడ్, ఇలా తమిళ తెలుగు హిందీ కన్నడ భాషలో ఇప్పటివరకు 70 కి పైగా సినిమాలు చేసాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి.   

ఆ విషం కైకాల సత్యనారాయణ పాలిట వరంగా మారింది.. హీరోను చేసింది!

Publish Date:Jul 25, 2024

పాతతరం నటుల్లో ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత చెప్పుకునే పేరు ఎస్‌.వి.రంగారావు. ఆయన తర్వాత నిస్సందేహంగా వినిపించే పేరు కైకాల సత్యనారాయణ. ఆయన ఒక పరిపూర్ణ నటుడు. నవరసాలనూ అవలీలగా పోషించగల సమర్థుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు కైకాల. అందుకే ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదుతో ఆరోజల్లోనే సత్కారాలు అందుకున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కైకాలకు సినిమాల్లో అవకాశం రాక మునుపు ఆయన జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని ప్రభావితుడ్ని చేసింది. జీవితంలో ముందుకు వెళ్ళగలను, అనుకున్నది సాధించగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. జూలై 25 కైకాల సత్యనారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ ఘటన గురించి తెలుసుకుందాం.  చిన్నతనం నుంచి నటన అంటే మక్కువ ఏర్పరుచుకున్న కైకాలకు చదువుకునే రోజుల్లోనే సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆయనకు నటన అంటే ఎంత ఇష్టమో, చదువుపట్ల కూడా అంతే గౌరవం ఉండేది. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా డిగ్రీ పూర్తయ్యే వరకు సినిమాల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. తను అనుకున్నట్టుగానే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాస్‌ చేరుకున్నారు. అయితే ఆయనకు ఎప్పుడూ అదృష్టం ఆమడదూరంలో ఉండేది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయేవి. అయినా ఆయన నిరాశ నిస్పృహలకు లోనవ్వలేదు, తన ప్రయత్నాలు మానలేదు. కైకాల ఉండేందుకు రూమ్‌ కూడా లేకపోవడంతో 15 రోజులపాటు ఒక పార్కునే ఇల్లుగా భావించి అక్కడే గడిపారు. ఆ తర్వాత భాగస్వామ్యంలో ఒక రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. ప్రతిరోజూ అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యడం, రూమ్‌కి వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉండేది.  అలా ఓ రోజు ఎప్పటిలాగే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి రూమ్‌కి చేరుకున్నారు కైకాల. అలసటగా అనిపించడంతో పనిమనిషిని కాఫీ తీసుకు రమ్మని పంపించారు. కాఫీ పూర్తిగా తాగిన తర్వాత కప్పు అడుగున చనిపోయిన సాలెపురుగు కనిపించింది. ఒక్కసారిగా కైకాల మనసు వికలమైపోయింది. చచ్చిన సాలె పురుగు విషంతో సమానమని, వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలని రూమ్‌లోని మిత్రులు చెప్పినా కైకాల వినలేదు. అప్పుడే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తనకు అదృష్టం ఉంటే, నటుడిగా రాణించగలను అని తన నుదుటన రాసి ఉంటే ఈ సాలెపురుగు నన్నేమీ చెయ్యలేదు అనుకున్నారు. అలాగే పడుకున్నారు. ఉదయం ఎప్పటిలాగే నిద్ర లేచారు. తనకు ఎలాంటి అనారోగ్యం కలగలేదు. దాంతో ఆయన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.  అదే ఉత్సాహంతో మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరిగేందుకు బయల్దేరారు. నిర్మాత డి.ఎల్‌.నారాయణ ఒక సినిమా నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆయన్ని కలిసి ఏదైనా వేషం ఇవ్వమని రిక్వెస్ట్‌ చేశారు కైకాల. ‘చిన్న వేషం ఏమిటి.. హీరో వేషమే ఉంది వేస్తావా’ అని అడిగారు డి.ఎల్‌.నారాయణ. దానికి కైకాల ఆశ్చర్యపోయారు. తనను ఎగతాళి చేస్తున్నారు అనుకున్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదనాలి అనే ఉద్దేశంతో సరేనన్నారు. ఆ సినిమా పేరు ‘సిపాయి కూతురు’. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ అయింది. దీంతో ఆయన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత అడపా దడపా అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ఉండేవి కాదు. ఆ సమయంలోనే బి.విఠలాచార్యకు కైకాలలో ఒక మంచి విలన్‌ కనిపించాడు. తన డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ‘కనకదుర్గ పూజా మహిమ’ చిత్రంలో కైకాలకు మొదటిసారి విలన్‌ వేషం ఇచ్చారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. విలన్‌గానే కాదు, అన్ని రకాల క్యారెక్టర్లు పోషించగల నటుడు అని పేరు తెచ్చుకున్నారు. ఎస్‌.వి.రంగారావు పోషించిన ఎన్నో పాత్రల్లో ఆ తర్వాత కైకాల సత్యనారాయణ నటించడం విశేషంగా చెప్పుకోవాలి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో దాదాపు 777 చిత్రాల్లో నటించారు కైకాల. నవరస నటనా సార్వభౌమగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది తెలుగువన్‌. 

మద్యం మత్తులో దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించిన స్టార్‌ రైటర్‌!

Publish Date:Jul 26, 2024

సలీమ్‌`జావేద్‌.. 1971లో మొదలైన ఈ రచయితల ద్వయం ప్రస్థానం 1987 వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఒక విధంగా బాలీవుడ్‌ సినిమాల తీరు తెన్నులను మార్చింది వీరిద్దరే అని చెప్పాలి. షోలే, యాదోంకి బారాత్‌, డాన్‌, క్రాంతి, దీవార్‌, దోస్తానా, మిస్టర్‌ ఇండియా.. వంటి చరిత్ర సృష్టించిన సినిమాలకు కథలు అందించింది వీరిద్దరే. వారి కెరీర్‌లో చేసిన సినిమాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఆ తర్వాత సలీమ్‌ నుంచి విడిపోయిన జావేద్‌ ఆ తర్వాత బేతాబ్‌, డకాయిట్‌, మేరి జంగ్‌, అర్జున్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌కి కథలు సమకూర్చారు. సలీమ్‌, జావేద్‌ కలయికలో వచ్చినన్ని సూపర్‌హిట్‌ సినిమాలు మరే ఇతర రచయితల కెరీర్‌లో లేవంటే అతిశయోక్తి కాదు. కథా రచయితగానే కాదు, గేయ రచయితగా కూడా ఎన్నో సినిమాలు చేశారు జావేద్‌. గత సంవత్సరం వరకు ఎన్నో సూపర్‌హిట్‌ పాటలకు సాహిత్యాన్ని అందించారు. 79 ఏళ్ళ జావేద్‌ తన జీవితంలోని కొన్ని విశేషాల గురించి, కొన్ని వ్యసనాల వల్ల కోల్పోయిన జీవితం గురించి ఒక సందర్భంలో వివరించారు.  ‘ఒకప్పుడు నేను మద్యానికి విపరీతంగా బానిసనైపోయాను. మందులో ఏముందోగానీ అది తాగగానే నేను రాక్షసుడిలా అయిపోతాను. విపరీతమైన కోపం వస్తుంది. నా కెరీర్‌ ప్రారంభంలోనే 10 సంవత్సరాలు మందు మత్తులోనే బ్రతికాను. మందు తాగితే నా అంత ప్రమాదకారి మరొకరు ఉండరు అనిపిస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు ఉండేది. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. ఆరోజు నుంచి ఇప్పటివరకు మళ్ళీ మందు జోలికి వెళ్ళలేదు. మద్యం వల్ల చిన్న వయసులోనే నా జీవితం నాశనం అయిపోయింది. వృధా అయిపోయిన ఆ పదేళ్ళలో ఎంతో చేసి ఉండొచ్చు. కానీ, అలా జరగలేదు.  ప్రస్తుతం సొసైటీలో పార్టీ కల్చర్‌ విపరీతంగా నడుస్తోంది. అది అంత మంచిది కాదు. నా స్వానుభవంతో యువతకు చెబుతున్నాను. మీ జీవితంలో ఎంతో విలువైన యుక్త వయసును మద్యం మత్తులో ఉంచకండి’ అంటూ యువతకు తన సందేశాన్ని అందించారు జావేద్‌ అక్తర్‌. 

బూచోడిని చూసి భయపడ్డ శౌర్య.. వాడే మీ నాన్న!

Publish Date:Jul 27, 2024

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -107 లో......కార్తీక్, జ్యోత్స్నల ఎంగేజ్ మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటారు. అప్పుడే పారిజాతం వచ్చి నువ్వు అనుకున్నది ఆపాలని చూసావ్.. నేను జరగాలని చూసాను.. నాదే గెలిచింది.. నా అనుభవం ముందు నీ ఆవేశం ఎంత అని పారిజాతం అంటుంది. నేను తగ్గింది గెలవడం కోసమేనని కార్తీక్ అంటారు. ఏంటి మనవడితో ఏదో మాట్లాడుతున్నావంటూ శ్రీధర్ అంటాడు. ఏం లేదు నాకు వీడిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదని పారిజాతం అంటుంది. ఆ తర్వాత శౌర్య, కార్తీక్ దగ్గరికి వచ్చి.. నేను నీ దగ్గర కూర్చుంటానని అంటుంటే వద్దని దీప పిలుస్తుంది. పర్లేదు కూర్చోమను అని  కార్తిక్ అంటే.. ఇదేం గెట్ టూ గెదర్ కాదు అందరు కలిసి కూర్చొవడానికి ఇక్కడ మనం ఇద్దరమే కూర్చోవాలని జ్యోత్స్న అంటుంది. దాంతో సుమిత్ర శౌర్యని పిలిచి తన ఒళ్ళో కూర్చో పెట్టుకుంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీప వంక చూస్తుంటే.. నువ్వు ఇక్కడున్నావ్ నీ మనసు ఎక్కడో ఉందని జ్యోత్స్న అంటుంది. కొన్నిచోట్ల మనిషి ఉంటే చాలు మనసుతో పని లేదని కార్తీక్ అంటాడు. నాకు మనసు కూడా కావాలని జ్యోత్స్న అంటుంది. ఇది రెండో పెళ్లి అని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ షాక్ అవుతాడు. అంటే నేను పుట్టక ముందే నన్ను పెళ్ళాన్ని చేసుకున్నావ్ కదా ఇది రెండవసారి అంటున్నా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏంటి అమ్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నావని దీపతో శౌర్య అంటుంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు తాంబులాలు మార్చుకుంటుంటే.. అప్పుడే నర్సింహా వస్తాడు. నర్సింహాని చూసి బూచోడని శౌర్యా అరుస్తుంది. దంతో తాంబులాలు మార్చుకోకుండా ఆగుతారు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నరసింహాతో పాటు అనసూయ కూడా వస్తుంది. నా కొడుకు బిడ్డని తీసుకొని వెళ్ళడానికి వచ్చానని అనసూయ అంటుంది. ఆ తర్వాత అందరూ వద్దని అంటారు. మీరందరు కలిసి కార్తీక్ అన్న మాట నిజం చేసేలా ఉన్నారని నరసింహా అనగానే.. ఏం అన్నాడని అడుగుతారు. శౌర్యకి తండ్రి అతనేనట అని నరసింహా అనగానే.. అందరు షాక్ అవుతారు. కార్తీక్ నువ్వు అన్నావా అని ఇంట్లో వాళ్ళు అడుగగా.. అన్నానని చెప్తాడు. ఆ తర్వాత నా మనవరలు ఎక్కడ అంటూ అనసూయ.. శౌర్య పైన దాక్కొని ఉన్నా శౌర్యా దగ్గరికి వెళ్తుంది. నానమ్మ అంటూ అనసూయ దగ్గరకి వస్తుంది శౌర్య. మీ నాన్న అని అంటావ్ కదా తీసుకోని వచ్చానంటూ కిందకి తీసుకొని వెళ్తుంది. ఆమ్మో బూచోడు అని శౌర్య భయపడుతుంటే.. బూచోడు కాదు అతనే మీ నాన్న అని అనసూయ చెప్పగానే.. శౌర్య ఏడుస్తూ‌.. బూచోడు మా నాన్న కాదంటూ దీప దగ్గరకి వెళ్తుంది. బూచోడు నాన్ననా అమ్మ అని దీపని శౌర్య అడుగుతుంది. అడుగుతుందిగా చెప్పమని అందరు అనగానే.. వాడే మీ నాన్న అని దీప అంటుంది. దాంతో శౌర్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

పెళ్లికొడుకు రెడీ.. అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిటింగ్‌!

Publish Date:Jul 26, 2024

2005లో ‘సూపర్‌’ చిత్రం ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన అనుష్క చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అనుష్క తప్ప ఆ క్యారెక్టర్‌ ఎవ్వరూ చెయ్యలేరు అనేంతగా ప్రేక్షకుల్ని తన నటనతో మెప్పించింది. 2017 వరకు బిజీ హీరోయిన్‌గా ఉన్న అనుష్కకు ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ సినిమాల్లో మాత్రమే నటించింది అనుష్క. కర్ణాటక నుంచి వచ్చిన ఆమె ఒక్క కన్నడ సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. ‘కథనార్‌’ పేరుతో మలయాళంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తోంది అనుష్క. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది. అనుష్క కెరీర్‌ ఇలా ఉంటే.. వ్యక్తిగతంగా జీవితంలో ఆమె ఇప్పటివరకు స్థిరపడలేకపోయింది.  రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్‌లో కలిసి నటించిన అనుష్క అతన్నే పెళ్ళి చేసుకోబోతోందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. అప్పుడప్పుడు గ్యాప్‌ తీసుకొని ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆమధ్య ప్రభాస్‌, అనుష్కల పెళ్లి జరిగిపోయింది అన్నట్టుగా క్రియేట్‌ చేసిన ఫోటోలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తలపై స్పందించిన అనుష్క.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొస్తోంది. అయితే ప్రేక్షకులు, అభిమానులు మాత్రం అనుష్క చెప్పిన మాటల్ని నమ్మడంలేదు. ఎందుకంటే ఇప్పుడామె వయసు 42 సంవత్సరాలు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉందంటే అది ప్రభాస్‌ కోసమేననే వార్తలు కూడా మనకు వినిపిస్తుంటాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభాస్‌ నోరు విప్పకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.   ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ కొత్త వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అనుష్క కుటుంబ సభ్యులు ఆమె పెళ్లి కోసం తొందరపడుతున్నారట. అందుకే గత కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఫైనల్‌గా ఓ బిజినెస్‌ మేన్‌ని సెలెక్ట్‌ చేశారట. అనుష్క కుటుంబ సభ్యులందరికీ ఈ సంబంధం నచ్చిందని తెలుస్తోంది. వరుడు కూడా అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడట. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇప్పటివరకు ఈ విషయంలో అనుష్క అవునని, కాదని చెప్పలేదట. అందుకే అంతా అనుష్క ఇచ్చే గ్రీన్‌ సిగ్నల్‌ కోసమే ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. 

రాయన్

Publish Date:Jul 26, 2024

కల్కి 2898 AD

Publish Date:Jun 27, 2024

మహారాజ

Publish Date:Jun 14, 2024