English | Telugu

మెగాస్టార్‌, అనిల్‌ రావిపూడి సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది.. రిలీజ్‌ ఎప్పుడంటే!

మెగాస్టార్‌, అనిల్‌ రావిపూడి సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది.. రిలీజ్‌ ఎప్పుడంటే!

Publish Date:Mar 26, 2025

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ ముహూర్తాన్ని ఉగాది రోజున నిర్ణయించారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ను బుధవారం దర్శకుడు అనిల్‌ రావిపూడి తన ట్విట్టర్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తయిందని, ఆల్రెడీ చిరంజీవికి నేరేషన్‌ కూడా ఇచ్చానని తెలిపారు. అంతేకాదు ఈ కథలోని శివశంకర వరప్రసాద్‌ పాత్రను చిరంజీవికి పరిచయం చేశానని తన ట్వీట్‌లో పేర్కొన్నారు అనిల్‌. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో.. ‘చిరు’నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం.. అంటూ ఎంతో హ్యాపీ మూడ్‌లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది.  షైన్‌ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 30 ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం జూన్‌ నుంచి జరిగే అవకాశం ఉంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అందుకే నాన్‌స్టాప్‌గా వరస షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేయాలని అనిల్‌ రావిపూడి భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డైరెక్టర్లలో అనిల్‌ రావిపూడి ఎంతో స్పీడ్‌గా సినిమా పూర్తి చేస్తారనే పేరు ఉంది. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేయడమే కష్టంగా మారింది. కానీ, అనిల్‌ రావిపూడి స్కూల్‌ వేరు. ప్రీ ప్రొడక్షన్‌ గానీ, షూటింగ్‌గానీ ఎంతో వేగంగా పూర్తి చేస్తారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని కేవలం 72 రోజుల్లో పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అనిల్‌ రావిపూడి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉన్న సినిమాల్లో మెగాస్టార్‌ చిరంజీవి పెర్‌ఫార్మెన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, డాన్సులు ఎంత అద్భుతంగా చేయగలరో, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా ఉన్న సన్నివేశాలను కూడా అంతే అద్భుతంగా చేస్తారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది. ఇది ప్రేక్షకులకు ఒక ఫుల్‌ మీల్స్‌ లాంటిది. ఎందుకంటే ఈ కథలో కుటుంబ నేపథ్యం, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఒక పాత్ర కోసం అదితిరావు హైదరి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.  ఒక విభిన్నమైన కథను చిరంజీవి కోసం అనిల్‌ సిద్ధం చేశాడట. ఈ సినిమాలో మెగాస్టార్‌ రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అనిల్‌ రావిపూడి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కథ ఏదైనా అందులో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది పూర్తి స్థాయిలో ఉండేలా ప్లాన్‌ చేస్తారు. ఆ విధంగానే వరస విజయాలు అందుకుంటున్న అనిల్‌.. ఈ సినిమాలో మంచి మెసేజ్‌తోపాటు ప్రేక్షకులు, మెగాస్టార్‌ అభిమానులు మెచ్చే అన్ని అంశాలు ఉంటాయని తెలుస్తోంది. 
ఒకే కథతో గుణశేఖర్‌, కృష్ణవంశీ సినిమాలు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

ఒకే కథతో గుణశేఖర్‌, కృష్ణవంశీ సినిమాలు.. ఏది హిట్‌? ఏది ఫట్‌?

Publish Date:Mar 24, 2025

ఒక సినిమా రూపుదిద్దుకోవడానికి రచయిత మనసులో పుట్టిన ఆలోచన ప్రధాన కథావస్తువుగా ఉంటుంది. తను జీవితంలో చూసిన సంఘటనలు కావచ్చు లేదా ఎవరి జీవితంలోనైనా జరిగిన ఆసక్తికర సంఘటనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. దాన్ని సినిమాకి అనుగుణంగా మార్చి పూర్తి స్థాయి కథను సిద్ధం చేయడంలోనే ఆ రచయిత ప్రతిభ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి కూడా రావచ్చు. ఆ ఇద్దరికీ స్ఫూర్తి ఒకే సంఘటన కావచ్చు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు ఆ సంఘటన నేపథ్యాన్నే తీసుకొని సినిమాను రూపొందిస్తే ఏం జరుగుతుంది? అలాంటి ఆసక్తికరమైన అంశం రెండు సినిమాల విషయంలో చోటు చేసుకుంది. ఆ రెండు సినిమాలు గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చూడాలని వుంది’, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘అంత:పురం’. ఈ రెండు సినిమాల ప్రధాన కథాంశం ఒక్కటే. దూరమైన బిడ్డను తనతోపాటు తీసుకెళ్లాలని ‘చూడాలని వుంది’ చిత్రంలో ఓ తండ్రి తపిస్తాడు. అలాగే ‘అంత:పురం’ చిత్రంలో తన బిడ్డను తనతో తీసుకెళ్లాలని ఓ తల్లి సాహసం చేస్తుంది.  ‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల కథలు ఒకటే అనే విషయం ఇద్దరు దర్శకులకు తెలిసింది. అదెలాగంటే.. ‘చూడాలని వుంది’ సినిమా రిలీజ్‌కి వారం రోజుల ముందు నంది అవార్డుల ఫంక్షన్‌ జరిగింది. ఆ సమయంలో కలిసిన గుణశేఖర్‌, కృష్ణవంశీ మాటల సందర్భంలో వారు చేస్తున్న సినిమాల కథల గురించి ప్రస్తావన వచ్చింది. ఒకరి కథ ఒకరు విని షాక్‌ అయ్యారు. అయితే ఇద్దరూ ప్రతిభావంతులైన దర్శకులు కాబట్టి పాయింట్‌ ఒకటే అయినా దాన్ని రెండు విభిన్నమైన సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు. ఈ రెండు సినిమాలకూ మూలం 1991లో వచ్చిన ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే హాలీవుడ్‌ మూవీ. ‘అంత:పురం’ చిత్రంలో మాదిరిగానే తన బిడ్డ కోసం ఓ తల్లి చేసిన సాహసమే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా. అయితే ‘చూడాలని వుంది’ చిత్రంలో మాత్రం బిడ్డ కోసం తండ్రి పోరాటం చేస్తాడు. అసలు ఈ కథ ఎలా పుట్టింది.. జరిగిన యదార్థ సంఘటన ఏమిటి అనేది తెలుసుకుందాం. ఇరాన్‌కు చెందిన డాక్టర్‌ మహ్మదీ.. అమెరికాకు చెందిన బెట్టీని వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ఒక పాప. ఒకరోజు ఇరాన్‌ వెళ్లాలని, తన ఫ్యామిలీ నీ కోసం, పాప కోసం ఎదురుచూస్తోందని, మళ్ళీ రెండు వారాల్లో వచ్చేద్దామని బెట్టీతో చెప్పాడు మహ్మదీ. దాంతో ముగ్గురూ ఇరాన్‌ బయల్దేరారు. కానీ, అక్కడి వాతావరణం, ఇస్లామిక్‌ పద్ధతులు బెట్టీకి నచ్చలేదు. అయినా రెండు వారాలే కదా అని ఓపిక పట్టింది. అయితే మనం తిరిగి అమెరికా వెళ్లడం లేదని, ఇరాన్‌లోనే ఉంటున్నామని చెప్పాడు భర్త. దాన్ని బెట్టీ వ్యతిరేకించింది. దాంతో ఆమెను శారీరకంగా హింసించాడు భర్త. అలాగే మహ్మదీ కుటుంబం నుంచి కూడా బెట్టీపై వ్యతిరేకత వచ్చింది. అమెరికా వెళ్లాలంటే పాపను వదిలి వెళ్లాలని ఆర్డర్‌ వేసాడు భర్త. అప్పటి నుంచి పాపను తీసుకొని అమెరికా వెళ్లడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్నీ చేసింది. ఆ ప్రయత్నంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో పాస్‌పోర్ట్స్‌ రెడీ చేసే ఓ వ్యక్తి సాయంతో పాపతోపాటు అమెరికా చేరుకుంది బెట్టీ. ఇదీ ఆ యదార్థగాధ. అమెరికా వెళ్లిన తర్వాత ఇరాన్‌ నుంచి అమెరికా వచ్చే క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలను ఓ పుస్తకరూపంలో తీసుకొచ్చింది బెట్టీ. ఆ పుస్తకం ఆధారంగానే ‘నాట్‌ వితౌట్‌ మై డాటర్‌’ అనే సినిమా రూపొందింది.  అదే కథతో తెలుగులో రూపొందిన ‘చూడాలని వుంది’, ‘అంత:పురం’ చిత్రాల విషయానికి వస్తే.. దాదాపుగా యదార్థంగా జరిగిన ఘటనే ‘అంత:పురం’ చిత్రంలో మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకొని ఆ కథను తెరకెక్కించారు కృష్ణవంశీ. తల్లి పాత్రలో సౌందర్య అద్భుతమైన నటనను ప్రదర్శించింది. రాయలసీమ నుంచి ఆమెను తప్పించే పాత్రలో జగపతిబాబు విలక్షణమైన నటనను ప్రదర్శించారు. ఇక ‘చూడాలని వుంది’ సినిమా విషయానికి వస్తే.. అదే పాయింట్‌ని తీసుకొని కొడుకును వెతుక్కుంటూ తండ్రి కలకత్తా వెళ్ళడాన్ని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు గుణశేఖర్‌. ఈ రెండు సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రను ప్రకాష్‌రాజ్‌ ధరించడం విశేషం. ‘చూడాలని వుంది’ చిత్రంలో కూడా సౌందర్య హీరోయిన్‌గా నటించడం మరో విశేషం. ఈ పాయింట్‌కి ‘అంత:పురం’లో ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకుంటే.. ‘చూడాలని వుంది’ చిత్రంలో అండర్‌వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌ని తీసుకున్నారు.  1998 ఆగస్ట్‌ 27న ‘చూడాలని వుంది’ చిత్రం రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి ఎన్నో సెంటర్స్‌లో శతదినోత్సవాలు జరుపుకుంది. ముఖ్యంగా మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ‘యమహా నగరి కలకత్తాపురి..’ అనే పాట చిరంజీవి కెరీర్‌లోని టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, 3 నంది అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రాన్ని ‘కలకత్తా మెయిల్‌’ పేరుతో తెలుగులో నిర్మించిన అశ్వినీదత్తే హిందీలో అల్లు అరవింద్‌తో కలిసి రీమేక్‌ చేశారు. ఇక ‘అంత:పురం’ విషయానికి వస్తే.. 1998 నవంబర్‌ 30న ఈ సినిమా విడుదలైంది.  కృష్ణవంశీ రూపొందించిన మోస్ట్‌ ఎమోషనల్‌ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు హై ఎమోషన్స్‌తో యదార్థ ఘటనను తలపించే విధంగా ఉంటుంది. ఇళయరాజా సంగీత సారధ్యంలో ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా సినిమా కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రానికి 3 ఫిలింఫేర్‌ అవార్డులు, 9 నంది  అవార్డులు లభించాయి. ప్రకాష్‌రాజ్‌ నటనకు జాతీయ ప్రత్యేక ప్రశంస అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘శక్తి’ పేరుతో బోనీకపూర్‌ రీమేక్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీదేవి నటించాల్సి ఉంది. కానీ, అప్పటికి ఆమె ప్రెగ్నెంట్‌ కావడంతో కరిష్మా కపూర్‌ను తీసుకున్నారు. ప్రకాష్‌ రాజ్‌ పాత్రలో నానా పాటేకర్‌ నటించారు. తమిళ్‌లో ‘అంత:పురం’ పేరుతోనే పార్తీబన్‌ రీమేక్‌ చేశారు. 

సల్మాన్,షారుఖ్ నన్నుతొక్కేయ్యడానికే ఆ కథని నా వద్దకు పంపించారు

Publish Date:Mar 26, 2025

భారతీయ సినీ చరిత్రలో 'దంగల్'(Dangal)మూవీకి ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే.అమీర్ ఖాన్(Aamir Khan)కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ 2016 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితీష్ తివారి దర్శకత్వంలో సుమారు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 2200 కోట్ల దాకా రాబట్టి నేటికీ అత్యధిక కలెక్షన్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.బెస్ట్ ఫిల్మ్,బెస్ట్ యాక్టర్,బెస్ట్ డైరెక్టర్,బెస్ట్ యాక్షన్ వాటితో పాటు,చైనా,ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాల్లో కూడా ఎన్నో ప్రతిష్ఠాత్మక    అవార్డ్స్ గెలుచుకుంది.68 th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏషియన్ బ్రిలియంట్ స్టార్స్ కేటగిరీ లో కూడా చోటుసంపాదించుకుంది.  రీసెంట్ గా అమీర్ ఒక ఇంటర్వ్యూలో దంగల్ గురించి మాట్లాడుతు ఈ మూవీ స్క్రిప్ట్ నా దగ్గరకి వచ్చినప్పుడు నా కెరీర్ ని దెబ్బ తియ్యడానికి సల్మాన్(Salman khan)షారుక్(sharukh Khan)లు ఈ కథని పంపించారని అపార్ధం చేసుకున్నాను.దర్శకుడు నితీష్ తివారి(Nitesh Tiwari)మాత్రం నేనే ఈ సినిమా చెయ్యాలని, నా కోసం 15 సంవత్సరాలు అయినా ఎదురుచూస్తానని చెప్పాడు.స్కిప్ట్ చదివాక చాలా శక్తివంతమైనదని అనిపించింది.దంగల్ కి ముందు చేసిన 'ధూమ్ 3 'లో యంగ్ లుక్ లో కనిపించాను.కానీ దంగల్ స్క్రిప్ట్ నచ్చడంతో  రిస్క్ చేసైనా దంగల్ లో చెయ్యాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.అమీర్  చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం ఇండియన్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నిలిచాయి మహా వీర్ సింగ్ ఫోగట్(Mahavir Singh Phogat)క్యారక్టర్ లో అమీర్ ఖాన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.కుస్తీ క్రీడాకారుడు అయిన ఫోగట్ ఆ రంగంలో ఇండియా తరుపున గోల్డ్ మెడల్ సాధించాలని చూస్తాడు.కానీ ఆ కల నెరవేరదు.దీంతో తన ఇద్దరు కూతుళ్ళకి కుస్తీ రంగంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆ రంగంలో తిరుగులేని వాళ్ళలాగా తయారు చేస్తాడు.దాంతో ఆ ఇద్దరు కూతుళ్లు ఇండియా తరుపున గోల్డ్ మెడల్ ని సాధించి తన తండ్రి కోరిక నెరవేరుస్తారు.   అమీర్ ఖాన్ నే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు.దంగల్ కథ హర్యానా రాష్ట్రంలో  మహావీర్ సింగ్ ఫోగట్,ఆయన ఇద్దరు కూతుళ్ళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందనే విషయం తెలిసిందే.    

డాన్స్ ఐకాన్ షోకి "కోర్ట్" మూవీ టీమ్...

Publish Date:Mar 26, 2025

  డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఇది జడ్జిమెంట్ ఎపిసోడ్ . అందుకే యాంకర్ ఓంకార్ ఇద్దరు సెన్సేషనల్ గెస్టులని పిలిచారు. వాలేవారంటే రీసెంట్ గా రిలీజై హిట్ కొట్టిన "కోర్ట్" మూవీ హీరోహీరోయిన్స్ ఐన రోషన్, శ్రీదేవి. వాళ్ళను అలాగే వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకొచ్చారు. రాగానే వాళ్ళతో ఆ మూవీలో సాంగ్ కి డాన్స్ చేయించారు. అలాగే శేఖర్ మాష్టర్, ఫారియా కూడా వెళ్లి స్టెప్పులేశారు. తర్వాత వాళ్లిద్దరూ కలిసి సినిమాలో ఉన్న "మనసనే మెటీరియల్" డైలాగ్ ని రిక్రియేట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేశారు.   ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆ ప్రౌడ్ మూమెంట్ కి డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో పేరెంట్స్ మధ్యలో సెలెబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాడు ఓంకార్. జడ్జ్మెంట్ ఎపిసోడ్ కాబట్టి రోషన్, శ్రీదేవికి కోర్ట్ లో జడ్జ్ వేసుకుని డ్రెస్ ని పైన హాట్ ని పెట్టి ఆహా తరపున ఒక సర్టిఫికెట్ ప్రెజెంట్ చేసాడు. ఇక కోర్ట్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చ్ 14 న చిన్న మూవీగా పోక్సో చట్టం నేపథ్యంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది. శ్రీదేవి, రోషన్ జోడిగా నటించిన ఈ మూవీలో వీళ్ళ నటన శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ అనే కాన్సెప్ట్ లేనే లేదు..కంటెంట్ మాత్రమే ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది.  

ప్రభాస్ స్పిరిట్ లో మరో స్టార్ హీరో..!

Publish Date:Mar 23, 2025

  ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజి సినిమాలతో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. తన తదుపరి చిత్రం 'స్పిరిట్' (Spirit)ను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న సంగతి విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా మరో బిగ్ యాక్టర్ పేరు తెరపైకి వచ్చింది.   స్పిరిట్ కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దింపుతున్నాడట సందీప్ రెడ్డి. ఇటీవల విజయ్ ని కలిసి సందీప్ స్క్రిప్ట్ చెప్పాడని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చిన సేతుపతి.. ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇందులో విజయ్ సేతుపతి విలన్ గానో లేదంటే ప్రత్యేక పాత్రలోనో కాదని.. ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడని టాక్.   స్పిరిట్ స్క్రిప్ట్ అదిరిపోయేలా వచ్చిందట. ప్రభాస్ రోల్ తో పాటు పలు రోల్స్ గుర్తుండిపోయేలా ఉంటాయట. అందుకే ఆర్టిస్ట్ ల విషయంలో సందీప్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని అంటున్నారు.  

కోర్ట్

Publish Date:Mar 14, 2025

దిల్‌ రూబా

Publish Date:Mar 14, 2025

శబ్దం

Publish Date:Feb 28, 2025

అగథియా

Publish Date:Feb 28, 2025

మజాకా

Publish Date:Feb 26, 2025