Read more!

English | Telugu

‘లెజెండ్‌’.. అప్పుడు ఎలక్షన్స్‌కి ముందు రిలీజైంది. ఇప్పుడు కూడా ఎలక్షన్స్‌ ముందే.. విజయం మనదే!

Publish Date:Mar 28, 2024

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ‘లెజెండ్‌’ 2014లో రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కొన్ని సెంటర్స్‌లో సంవత్సరం పాటు ప్రదర్శితమైంది. ఈ సినిమా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఈ ఫంక్షన్‌లో చిత్రానికి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు ‘లెజెండ్‌’ 10 ఇయర్స్‌ షీల్డులను బాలయ్య చేతులమీదుగా బహూకరించారు.  ఈ సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నాన్నగారు, నా గురువు, నా దైవం నటరత్న తారకరామారావుగారిని తలుచుకుంటూ.. నాకు చాలా వింతగా ఉంది. ఇది సినిమా రిలీజ్‌కి ముందు జరిగే ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేక్షకులకు, తోటి నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారు, ఇంకా మంచి సినిమాలు తీసేందుకు ప్రోత్సహిస్తారు. మన తెలుగు సినిమా గురించి భారతదేశం అంతటా చెప్పుకుంటున్నారంటే మనం ఇచ్చే సందేశం ప్రభావం ఎంత ఉందో మనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది. సినిమా రికార్డులు నాకు కొత్త కాదు, రికార్డులు సృష్టించాలన్నా నేనే,, వాటిని తిరగ రాయాలన్నా నేనే. ఎందుకంటే ఒక సినిమాకి కథని ఎంచుకోవడంలో, దర్శకుడ్ని ఎంపిక చేసుకోవడంలో, నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో నాకు ఉండే నమ్మకం అలాంటిది. నాకు ముందే తెలిసిపోతుంది. గతంలోకి వెళ్తే.. 30 సెంటర్లలో సిల్వర్‌జూబ్లీ జరుపుకొని భారతదేశంలోనే కొత్త రికార్డు సృష్టించిన సినిమా సమరసింహారెడ్డి. అలాగే ఆరోజుల్లో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు లెజెండ్‌. ఈ సినిమా 400 రోజులు నాలుగు ఆటలతో రెండు సెంటర్స్‌లో ఆడి ఆల్‌ ఓవర్‌ ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన సినిమా మన లెజెండ్‌. అలాగే 1,116 రోజులు నాలుగు ఆటలతో ఆడి మరో రికార్డు సృష్టించింది. నాలుగు అంకెలు దాటి సౌత్‌లో ఆడిన ఏకైక సినిమా ఇది. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు, నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అలాగే రాజకీయంగా జనంలో ఒక చైతన్యం కలిగించాలనే కథాంశం ఎంచుకోవడం జరుగుతుంది. భగవంత్‌ కేసరిలో మహిళలకు ఇచ్చిన సందేశం, వీరసింహారెడ్డిలో అన్నాచెల్లెల అనుబంధం అందర్నీ ఆకట్టుకుంది. ఈరోజు అనుకోకుండా మా హీరోయిన్‌ సోనాల్‌ చౌహాన్‌ పసుపురంగు చీరతో వచ్చింది. పసుపు అనేది శుభానికి సూచకం. పసుపు అనేది ఒక ఆనందకరమైన వేడుకలకు ఆహ్వానగీతం. పసుపు అనేది సంక్షేమానికి నిర్వచనం, పసుపు అనేది అభివృద్ధికి నిదర్శనం. పసుపు అనేది ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం. అలాగే పసుపు అనేది ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. లెజెండ్‌ సినిమా ఎలక్షన్స్‌ ముందు రిలీజ్‌ అయింది. ఇప్పుడు ఈ రీరిలీజ్‌ కూడా ఎలక్షన్స్‌ ముందే అవుతోంది. అంతా కాకతాళీయమే, యాదృశ్చికమే. విజయం మనదే. బోయపాటి గురించి చెప్పాలంటే సింహా తర్వాత లెజెండ్‌ చేస్తున్నప్పుడు సింహా రికార్డుల గురించి మాట్లాడుకోలేదు. అలాగే అఖండ చేస్తునప్పుడు లెజెండ్‌ గురించి మాట్లాడుకోలేదు. మేం మాటలు చెప్పేవాళ్ళం కాదు, చేసి చూపిస్తాం. మా ఇద్దరి  వైబ్రేషన్స్‌ ఒకటే. బోయపాటి గురించి అంతకంటే ఎక్కువ చెప్పను’ అన్నారు. 

రజినీకాంత్‌ రిజెక్ట్‌ చేసిన రెండు కథలతో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన శంకర్‌!

Publish Date:Mar 28, 2024

ఒక్క ఫ్లాప్‌ కూడా ఇవ్వకుండా వరసగా హిట్‌ సినిమాలు చెయ్యడం సాధ్యమేనా.. మన రాజమౌళి సాధ్యమని నిరూపించాడు. కానీ, ఎంత టాలెంటెడ్‌ డైరెక్టర్‌కైనా అది సాధ్యం కాదు.. ఈ విషయాన్ని డైరెక్టర్‌ శంకర్‌ ప్రూవ్‌ చేశాడు. ‘జెంటిల్‌మెన్‌’ చిత్రంతో చలనచిత్ర పరిశ్రమను తనవైపు తిప్పుకున్న శంకర్‌ ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో టాప్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. అప్పట్లో ‘జెంటిల్‌మెన్‌’ ఒక సెన్సేషన్‌. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు జీన్స్‌, ఒకేఒక్కడు.. ఇలా వరసగా అన్నీ బ్లాక్‌బస్టర్స్‌ చేశాడు. అప్పటివరకు శంకర్‌ చేసిన ప్రతి సినిమాను తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తూ వచ్చిన ఎ.ఎం.రత్నం ‘భారతీయుడు’ చిత్రాన్ని ఎంతో భారీ బడ్జెట్‌తో నిర్మించి విజయాన్ని అందుకున్నాడు. తమిళ్‌, తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఒకేఒక్కడు’ చిత్రాన్ని తమిళ్‌లో శంకర్‌, మాదేష్‌ కలిసి నిర్మించారు. తెలుగులో ఎప్పటిలాగే ఎ.ఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమాని హిందీలో చేస్తే వరల్డ్‌ మార్కెట్‌ను అందుకోవచ్చనే ఆలోచన వచ్చింది రత్నంకి. వెంటనే అనిల్‌ కపూర్‌ హీరోగా ఒకే ఒక్కడు చిత్రాన్ని హిందీలో నాయక్‌ పేరుతో నిర్మించారు. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాతో నష్టాల్లో కొట్టుకుపోయాడు. శంకర్‌కు మొదటి ఓటమిని రుచి చూపించింది నాయక్‌. ఆ దెబ్బతో పెద్ద హీరోలెవరూ శంకర్‌తో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలోనే అందరూ కొత్త కుర్రాళ్లతో బోయ్స్‌ చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ద్వారా నిర్మాత ఎ.ఎం.రత్నంని నష్టాల నుంచి బయటపడేద్దామనుకున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అవ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని శంకర్‌ తన శిష్యుడు బాలాజీ శక్తివేల్‌ దర్శకత్వంలో ఒక యదార్థ ఘటన ఆధారంగా ‘కాదల్‌’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ విజయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. సమాజంలో జరిగే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపుతూ ఒక కథని సిద్ధం చేసుకున్నాడు. అదే ‘అపరిచితుడు’. ఒకే వ్యక్తికి మూడు రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదే మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌. ఈ రకమైన వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో మార్పు తీసుకొస్తాడు. అదే కథ. ఈ కథని తీసుకొని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ దగ్గరకు వెళ్లాడు. కథ వినిపించాడు. కానీ, రజినీకి అది నచ్చలేదు. తను చేయలేనని తిరస్కరించాడు. శంకర్‌ చెప్పిన కథను రజినీ రిజెక్ట్‌ చేయడం అది రెండోసారి. మొదట ‘ఒకే ఒక్కడు’ కథను రజినీకే వినిపించాడు. అది అతనికి అంతగా రుచించలేదు. ‘అపరిచితుడు’ కథను విక్రమ్‌కి చెప్పాడు. ఒకే వ్యక్తి మూడు రకాలుగా ప్రవర్తించడం అనేది విక్రమ్‌కి బాగా నచ్చింది. ఆ మూడు రకాల క్యారెక్టర్లకు సంబంధించి ఎంతో హోం వర్క్‌ చేశాడు విక్రమ్‌. అతని నుంచి శంకర్‌ ఏం ఆశిస్తున్నాడో గ్రహించి దానికి తగ్గ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమాలో మొదట ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత సిమ్రాన్‌ని కూడా అనుకున్నారు. అదీ వర్కవుట్‌ కాలేదు. ఆప్పుడా అదృష్టం సదాకి దక్కింది. ఇది భారీ బడ్జెట్‌ సినిమా అని శంకర్‌ ముందే ఎనౌన్స్‌ చేశాడు. ఎంత బడ్జెట్‌ అయినా నిర్మించేందుకు ఆస్కార్‌ రవిచంద్రన్‌ సిద్ధపడ్డాడు. 2003లో సినిమా ప్రారంభమైంది. ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తానని సినిమా ఓపెనింగ్‌లో చెప్పాడు శంకర్‌. కానీ, ఆరు నెలల్లో షూటింగ్‌ పార్ట్‌ కూడా పూర్తవ్వలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2005లో చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి రూ.26 కోట్లు బడ్జెట్‌ అయింది. తమిళ్‌లో ‘అన్నియన్‌’ పేరుతో, తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో, హిందీలో ‘అపరిచిత్‌’గా రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. ‘నాయక్‌’, ‘బోయ్స్‌’ ఫ్లాపులతో వెనకపడిపోయిన శంకర్‌ ‘అన్నియన్‌’ ఒక్కసారిగా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నాడు. విక్రమ్‌ తన అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో తన రేంజ్‌ని మరింత పెంచుకున్నాడు. 

అక్షయ్‌ కుమార్ 'బడే మియాన్‌ చోటే మియాన్‌' ట్రైలర్ రిలీజ్

Publish Date:Mar 28, 2024

బాలీవుడ్‌ యాక్టర్స్ అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’(Bade Miyan Chote Miyan). ఈ మూవీకి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజు సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మానుషి ఛిల్లార్‌, అలయ హీరోయిన్లగా నటిస్తున్నారు. ఈ మూవీని ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్‌ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ను గమనిస్తే... స్టన్నింగ్ యాక్షన్‌ సీన్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఆర్మీ పాత్రలో ఫూల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుల్తాన్, టైగర్ జిందా హై వంటి పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. వశు భగ్నానీ, దీప్షికా దేశముఖ్, జాకీ భగ్నానీ నిర్మించారు. రంజాన్ ఈద్ కానుకగా ఈ చిత్రం.. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం పక్కా అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

నాకు పెళ్లి వద్దు..కానీ బ్రిట్టో లాంటి అబ్బాయి కావాలి

Publish Date:Mar 28, 2024

నీతోనే డాన్స్ 2 .0 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రిట్టో-సంధ్య పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. వీళ్ళ డాన్స్ స్టైల్ కి జడ్జెస్ ఫిదా ఐపోయారు. బాహుబలి మూవీ నుంచి "ధీవర" అనే సాంగ్ కి కొత్త స్టైల్ లో వీళ్ళు డాన్స్ చేసి అందరినీ మెప్పించారు. ఇక బ్రిట్టో చేసిన డాన్స్ కి శుభశ్రీ ఫుల్ ఖుషీ ఐపోయింది. "చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాన్స్..నా లైఫ్ లో కూడా ఒక బ్రిట్టో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా" అని అనేసరికి "ఓ మై గాడ్" అని శ్రీముఖి, జడ్జెస్ అంతా షాకైపోయారు. "బ్రిట్టో లాంటి హజ్బెండ్ కావాలని కోరుకుతున్నావన్నమాట" అని శ్రీముఖి అడిగేసరికి "హజ్బెండ్ కాదు అబ్బాయి..పెళ్ళొద్దు నాకు" అని చెప్పేసింది శుభశ్రీ. ఇక బ్రిట్టో వచ్చిరాని తెలుగులో "నో నో సారీ థిస్ జన్మ నో.. నెక్స్ట్ జన్మ ఓకే" అనేసరికి సదా అంతా కూడా నవ్వేశారు. ఇక లాస్ట్ వీక్ నీతోనే డాన్స్ సీజన్ 2 లాంచింగ్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో 10 పెయిర్స్ ని టు టీమ్స్ గా డివైడ్ చేసి ఆ టీమ్స్ కి కూడా రెండు పేర్లు పెట్టింది శ్రీముఖి. తగ్గేదెలా టీమ్ లో శిశిర్ - సిరీన్, మానస్ - శుభశ్రీ, బ్రిట్టో - సంధ్య , నితిన్ - అక్షిత, కుమార్ సాయి - శ్వేతా ఉండగా తస్సాదియ్యా టీమ్ లో యావర్ - నయనిపావని, బాలాదిత్య - పూజ, ప్రిద్వి శెట్టి - దర్శిని గౌడ, విశ్వ - నేహా చౌదరి, ఏక్నాథ్- హారిక ఉన్నారు. ఇక వీళ్ళ మధ్య ఈ సీజన్ నడవబోతోంది. ఈ సీజన్ లో రీల్ , రియల్, సీరియల్ , బిబి జోడీస్ పార్టిసిపేట్ చేశారు. నీతోనే డాన్స్ సీజన్ 1 చాలా హ్యాపీగా ఎండ్ అయ్యింది ఇందులో ఆట సందీప్- జ్యోతి టైటిల్ గెలుచుకుని వెళ్లారు.  

షాకింగ్‌.. 14 ఏళ్ళు ఖాళీగా ఉన్న డైరెక్టర్‌తో నయన్‌ సినిమా.. ఎందుకో మరి!

Publish Date:Mar 28, 2024

కమర్షియల్‌ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వైపు దృష్టి సారించింది నయనతార. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అయితే ఈమధ్యకాలంలో వచ్చిన ఆ తరహా సినిమాలు ఆమెకు ప్లస్‌ అవ్వలేదు. కొన్నాళ్ళు అలాంటి సినిమాలను పక్కన పెట్టి కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మంచి కథ, డైరెక్టర్‌ కుదిరితే లేడీ ఓరియంటెడ్‌ మూవీతో మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తవ్వకాల్లో బయటపడిన ఒక డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. తమిళ్‌లో నటుడిగానే కాదు దర్శకుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్న శశికుమార్‌తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. శశికుమార్‌కి తమిళ్‌లో మంచి పేరు వుంది. అయితే ఈమధ్య నటుడిగా కూడా అతనికి ఎక్కువ సినిమాలు లేవు. ఇక డైరెక్టర్‌గా అతను చేసింది రెండు సినిమాలే. అందులో ‘సుబ్రమణ్యపురం’ మాత్రం పెద్ద హిట్‌ అయి దర్శకుడిగా శశికుమార్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ తర్వాత రెండేళ్ళకు మరో సినిమా చేసినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో డైరెక్షన్‌ని పక్కన పెట్టి నటుడిగానే కొనసాగుతున్నాడు. అతను మెగా ఫోన్‌ పట్టుకొని 14 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు అతనితో నయన్‌ సినిమా చేయబోతోందని తెలుస్తోంది. అయితే అతన్ని డైరెక్టర్‌గా ఎంపిక చేసుకోవడానికి రీజన్‌ ఏమిటనేది తెలియదు. శశి చెప్పిన కాన్సెప్ట్‌ నయన్‌కు నచ్చిందా? లేక డైరెక్టర్‌ మార్పు కోసం అతన్ని సెలెక్ట్‌ చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్‌గానే కాదు, నటుడుగా కూడా అతను అంత బిజీగా లేడు. గతంలో కమిట్‌ అయిన సినిమాలనే పూర్తి చేస్తున్నాడు తప్ప కొత్త ప్రాజెక్ట్‌ ఒక్కటి కూడా చెయ్యడం లేదు.  లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్‌తో మరో బ్లాక్‌బస్టర్‌ సాధించాలన్న పట్టుదలతో ఉన్న నయన్‌తో శశికుమార్‌ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం నయన్‌ రెండు సినిమాలు చేస్తోంది. ఒక సినిమా పూర్తవగా, మరో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అది కూడా పూర్తవుతుందని తెలుస్తోంది. నయన్‌, శశి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని సమాచారం. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

ఆడు జీవితం

Publish Date:Mar 28, 2024

రజాకార్

Publish Date:Mar 15, 2024

లంబసింగి

Publish Date:Mar 15, 2024

ప్రేమలు

Publish Date:Mar 8, 2024