షాకింగ్.. ప్రముఖ హీరోలపై నిషేధం!
తమిళ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు తమిళ హీరోలపై నిషేధం విధించింది. ఆ నలుగురు హీరోలు ఎవరో కాదు.. ధనుష్, శింబు, విశాల్, అధర్వ. వీరు కొత్త సినిమాల్లో నటించకుండా నిర్మాతల మండలి నిషేధం విధించింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న ధనుష్, శింబు, విశాల్, అధర్వ వంటి ప్రముఖ హీరోలపై నిషేధం విధించడం హాట్ టాపిక్ గా మారింది.