English | Telugu

శెట్టి అండ్ శెట్టి.. 9 రోజుల్లో కొల్లగొట్టింది ఎంతో తెలుసా!

'భాగమతి' తరువాత లేడీ సూపర్ స్టార్ అనుష్కకి విజయాన్ని అందించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. వినూత్న కథాంశంతో పి. మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో 'జాతిరత్నాలు' స్టార్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ సినిమా.. శుక్రవారంతో 9 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిందీ చిత్రం. అలాగే, ఇప్పటివరకు రూ. 4. 66 కోట్ల లాభాలు చూసింది. సెకండ్ వీకెండ్ (శని, ఆదివారాల)తో పాటు సోమవారం వినాయకచవితి సెలవు కావడం.. శెట్టి అండ్ శెట్టికికలిసొచ్చే అంశమే. సో.. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్ళు ఆర్జిస్తుందో చూడాలి.

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 9 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 5.68 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 93 లక్షల షేర్
ఆంధ్రా: రూ. 3.73 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.10.34 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.42 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.6.40 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల కలెక్షన్స్ : రూ.18.16 కోట్ల షేర్ (రూ. 35.10 కోట్ల గ్రాస్)

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.