English | Telugu

చంద్రబాబు విషయంలో నోరు విప్పని ఎన్టీఆర్‌... కారణం తెలుసా?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వివిధ నేరారోపణలపై అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడాయన రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత ఆయనకు ఎంతో మంది సంఫీుభావం తెలుపుతూ ప్రకటనలు చేశారు. కొంతమంది ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండిపోయారు. వారిలో ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఉండడంతో సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆరే కాదు, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూడా దీని గురించి స్పందించలేదు. అయితే హరికృష్ణ కుమార్తె సుహాసిని మాత్రం స్పందించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది సుహాసిని.
14వ తేదీ రాత్రి ఎన్టీఆర్‌ కుటుంబం దుబాయ్‌ ప్రయాణమైంది. ఎయిర్‌పోర్ట్‌లో కొడుకుతో ఉన్న ఎన్టీఆర్‌ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. చంద్రబాబు జైలులో ఉంటే ఆయనకు సంఫీుభావం తెలపకుండా ఫ్యామిలీతో కలిసి షికారుకు వెళ్తున్నారని టిడిపి వర్గాలు విమర్శించాయి. సోషల్‌ మీడియాలో వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ఈ విషయంపై రాద్ధాంతం చేశారు.
ఎన్టీఆర్‌ దుబాయ్‌ ప్రయాణం వెనుక కారణం వేరే వుందని వారికి తెలిసి వుండకపోవచ్చు. దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనేందుకే ఎన్టీఆర్‌ వెళ్లారు. సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ అవార్డు ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. 15వ తేదీ జరిగిన కార్యక్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటనకుగాను ఎన్టీఆర్‌ ఉత్తమనటుడు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘నా ఒడిదుడుకుల్లో, నేన కింద పడినప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి కన్నీటి చుక్కకి బాధ పడినందుకు నా అభిమానులందరికీ తలవంచి పాదాభివందనం చేస్తున్నాను’’ అన్నారు.
దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా చంద్రబాబుకి సంఫీుభావం తెలియజేస్తాడా? అనే డౌట్‌ అందరికీ వుంది. అప్పుడు కూడా ఎన్టీఆర్‌ మౌనంగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు మనకు వద్దు అనుకొని ఉండొచ్చని ఆయన సన్నిహితులు అంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .