స్పీడ్ న్యూస్- 3

31.ప్రస్తుతం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్‌ సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో టెస్టులో లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బబుల్‌ గమ్ పడిపోయిన నేపథ్యంలో క్షణం కూడా ఆలోచించకుండా.. అతడు కింద పడిపోయిన చూయింగ్‌ గమ్‌ను తీసుకుని మళ్లీ నోట్లోకి వేసుకున్నాడు. 32.పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది. ఓ తోటలో జింక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 33. ఓ జొమాటో డెలివరీ బోయ్ పుట్టిన రోజుని రొటీన్ కు భిన్నంగా జరుపుకున్నాడు. తాను డెలివరీ చేసిన ప్రతీ ఆర్డర్ తోపాటు ఉచితంగా  5స్టార్ చాక్లెట్ ఇచ్చాడు.  34.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక హమీ ఇచ్చారు. దీంతో పాటు ప్రజలకు సరిపడా ఇంటి రేషన్ కూడా ఇస్తామన్నారు. 35.వెన్నీపుమీద తెల్లని నామం దిద్ది, మధ్యలో ఎర్రని తిరుచూర్ణం పెట్టినట్టున్న ఈ తొండ తిరుమల కొండల్లో అరుదుగా కనిపిస్తుంటుంది.  తిరుపతి అలిపిరి సమీపంలో ఒక బండమీద దర్శనమిచ్చింది. 36.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేజల్‌ను   ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ పరామర్శించారు. నైతిక బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్  రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  37.రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని అన్నారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి. జనాలు మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ‌కు అధికారం ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. 38.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ కాలెండర్ తెస్తామని తెలిపారు టీడీపీ యువనేత నారా లోకేష్. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వేరే రాష్ట్రాలకి వెళ్లేలా చేస్తోందని, అలాంటి పరిస్థితి రానివ్వకుండా చేస్తామన్నారు.  39.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై  వైసీపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. 40.ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ అంత్యక్రియలు ముగిసాయి. సాయి చంద్ కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి.

టీబీజేపీ నాయకత్వానికి ఎలాంటి ట్రీట్ మెంట్ కావాలంటే?

తెలంగాణ బీజేపీకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా అంటే ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితిని గమనిస్తే ఎవరైనా ఔననే అంటారు.  గత తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దిగజారుతుంటే ఆ స్థానాన్ని బీజేపీ చాకచక్యంగా ఆక్రమించే పని చేసింది. ఇందుకోసం తమ పార్టీ సిద్ధాంతాలను సైతం తుంగలో తొక్కేసింది. రాజకీయ నిరుద్యోగులు ఎక్కడ ఉంటే  అక్కడ వారిని గాలమేసి తన పార్టీలోకి చేర్చుకుంది. అయితే, ఇప్పుడు అదే ఆ పార్టీకి నష్టం చేకూరుస్తోంది. కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ మాంచి ఊపు మీదుంటే.. ఇప్పుడు ఆ ఊపు చూసిన కొందరు బీజేపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా కమలానికి గుడ్ బై చెప్పేసి హస్తం రెక్కలు కట్టుకుని దూకేయడానికి సిద్ధపడుతున్నారు.  ఈ క్రమంలోనే బీజేపీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తెలంగాణలో బీజేపీలో నేతల మధ్య సఖ్యత లేదని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. పార్టీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నదని సొంత పార్టీ నేతలే  పలు సందర్భాలలో చెప్పారు. ప్రస్తుతం చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అధ్యక్షడిగా నియమించనున్నారని ముందుగా కథనాలు రాగా.. అది ఇప్పటి వరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే ఇక ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా బీజేపీలోనే మిగతా నేతల మధ్య కూడా ఆధిపత్య వార్ జరుగుతున్నదన్నది కూడా బహిర్గతమే. అయితే, దీనిపై ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. అక్కడా ఇక్కడా పార్టీ నేతల మధ్య సంభాషణలే ఇంతవరకు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఇప్పుడు తొలిసారి ఓ బీజేపీ నేత చేసిన ట్వీట్ తెలంగాణలో బీజేపీలో వివాదాల కుంపటి రగులుతున్నదని తేటతెల్లం చేసింది. బీజేపీ సీనియర్ నేత జితేంద‌ర్ రెడ్డి చేసిన ఓ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో క‌ల‌క‌లం రేపింది. సంచలనంగా కూడా మారింది. దున్న‌పోతు తోక గ‌ట్టిగా లాగి.. డొక్క‌లో త‌న్ని మ‌రీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన జితేందర్ రెడ్డి..  బీజేపీ తెలంగాణ నాయకత్వానికి కూడా ఇటువంటి ట్రీట్మెంట్ అవసరమని కామెంట్ చేశారు.  అంతేకాదు.. ఈట్వీట్‌ను ఆయ‌న బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా, మ‌రో నేత బీఎల్ సంతోష్‌, బ‌న్సాలీల‌కు కూడా ట్యాగ్ చేశారు. దీంతో ఇది తీవ్ర స్థాయిలో చ‌ర్చకు దారి తీసింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ ఆ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే జితేంద‌ర్ రెడ్డి దాన్ని డిలీట్ చేశారు. కానీ, అప్పటికే ఆ ట్వీట్   అప్ప‌టికే వైర‌ల్ అయిపోయింది. అప్పటికే దాన్ని రీ ట్వీట్లు, స్క్రీన్ షాట్స్ రూపంలో తెగ వైరల్ చేశారు.దీంతో డిలీట్ చేసి తక్కువ అవ్వడమెందుకు అనుకున్నారో ఏమో జితేందర్ రెడ్డి  దానిని మళ్లీ ట్వీట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎక్కడ చూసినా ఈ ట్వీట్ గురించే చర్చ సాగుతుంది.  రాష్ట్ర బీజేపీకి కీల‌క నేతలైన వారిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తుండగా.. వారు స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌ని.. వారిని స‌రైన దారిలో పెట్టాలంటే ఇలా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేననే  అర్ధం వ‌చ్చేలా జితేంద‌ర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశార‌ని స్పష్టంగా తెలిసిపోతున్నది. మరి ఆ కీలక నేత ఎవరు? ఆ నేతకి జితేందర్ కి మధ్య సఖ్యత ఎందుకు చెడింది? అసలు జితేందర్ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశారు అన్న చర్చ ఇప్పుడు ఎక్కడ చూసినా జరుగుతుంది. ఇప్పటికే పార్టీచీఫ్ బండి సంజయ్ కి వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఈటల, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడు జెండా కింద పడేస్తారో తెలియడం లేదు. మరోవైపు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ లాంటి వాళ్ళు కూడా సరైన సమయం కోసం చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో పార్టీలో నేతల మధ్య పెరుగుతున్న ఈ అంతరం కమలనాథులకు కునుకు లేకుండా చేయడం గ్యారంటీ!  ఇదిలా ఉంటే రాజకీయవర్గాల్లో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరే ఉద్దేశంతోనే ఈ ట్వీట్ చేశారన్న చర్చ జరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం ద్వారా  బీజేపీ హైకమాండ్ తనపై క్రమశిక్షణ చర్య తీసుకుని సస్పెండ్ చేస్తే వెంటనే హస్తం గూటికి చేరే వ్యూహంతోనే బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ట్రీట్మెంట్ కావాలంటూ వివాదాస్పద ట్వీట్ చేశారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉన్న సంగతి తెలిసిందే. ఆ బహిరంగ సభా వేదిక మీద నుంచే  పొంగులేటి, జూపల్లి తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. జితేందర్ రెడ్డి కూడా అదే ముహూర్తానికి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని వారంటున్నారు. అందుకే బీజేపీకి  ఆగ్రహం కలిగి తనపై చర్య తీసుకునే విధంగా వివాదాస్పద ట్వీట్ చేసి పార్టీ హైకమాండ్ కే ట్యాగ్ చేశారనని అంటున్నారు. 

స్పీడ్ న్యూస్ 2

11.ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో రెండో సారి ఫైనల్లో బోల్తాపడ్డ టీమిండియా.. కొత్త డబ్ల్యూటీసీపై ఫోకస్ పెట్టనుంది. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తో డబ్ల్యూటీసీ కొత్త సీజన్ ను ప్రారంభించనుంది. 12. భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ దంపతులకు శుక్రవారం బారసాల కార్యక్రమం జరుగనున్న నేపథ్యంలో  అద్భుతమైన బహుమతిని పంపించినట్టు సమాచారం. రూ. 1.20 కోట్ల విలువైన బంగారు ఊయలను గిఫ్ట్ గా పంపించినట్టు తెలుస్తోంది.  13. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలపై తెలుగుదేశం పార్టీ 'ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు' అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుస్తకాన్ని విడుదల చేస్తున్న సమయంలో జగన్, వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. 14.ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించనున్న నేపథ్యంలో విద్యార్థులకు యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులెవరూ నలుపు రంగు దుస్తులు ధరించి రావద్దని, అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. 15. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండల కేంద్రానికి చెందిన దర్వేష్‌ సాహెబ్ రెండు రోజుల క్రితం కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో, పట్టణ ప్రజలు, ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 16. విశాఖలో గన్ లైసెన్సులపై నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ స్పందించారు. విశాఖలో 620 గన్ లైసెన్సులు ఉన్నాయని,  2020 నుంచి కేవలం 15 మందే తుపాకీ కావాలని దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 17.భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) స్టాక్స్ స్థిరంగా కదులుతున్నాయి. ఈ స్టాక్ ఇటీవల పరుగులు పెడుతోంది. 18.జపాన్‌లోని నాగో నగరం ప్రజలు ఉదయం లేస్తూనే షాకయ్యారు. అక్కడి నది ఒక్కసారిగా ఎర్రగా మారిపోవడంతో ఏం జరిగిందో అర్థంకాక భయభ్రాంతులకు గురయ్యారు. 19.ఆర్టిఫీషియల్ స్వీట్ నర్  ఆస్పర్ టేమ్ కేన్సర్ కారకం కావచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వచ్చే నెలలో ప్రకటించనుంది. దీన్ని దీర్ఘకాలం పాటు తీసుకున్నప్పుడు కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని తెలుస్తోంది. 20. ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈరోజు ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఔను డీఎంకే కుటుంబ పార్టీయే.. సీఎం స్టాలిన్ కొత్త భాష్యం

తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్  తమ పార్టీ కుటుంబ పార్టీయే నంటూ కుండ బద్దలు కొట్టారు. ఆవిర్భావం నుంచీ డీఎంకే కుటుంబ పార్టీయేనని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ కుటుంబ పార్టీ ఎందుకు అయ్యిందీ, ఎలా అయ్యిందీ అన్న దానికి మాత్రం ఆయన కొత్త భాష్యం చెప్పారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ నేతలనూ, కార్యకర్తలను తమ్ముడూ అంటూ పిలిచేవారని గుర్తు చేసిన స్టాలిన్, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిథి కూడా పార్టీ సభ్యులను తోబుట్టువులారా అని సంబోధించే వారని గుర్తు చేసిన ఆయన ఆ విధంగా డీఎంకే కుటుంబపార్టీయే అన్నారు. కుటుంబ పార్టీ అంటూ విపక్షాల విమర్శలకు ఆయనీ విధంగా చెక్ చెప్పారు.  మరీ ముఖ్యంగా కుటుంబ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డీఎంకే సభ్యులమంతా ఒకే కుటుంబమని చెప్పారు.   డీఎంకే ఉన్నత కార్యాచరణ మండలి సభ్యుడు గుమ్మిడిపూండి వేణు మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రధాని మోడీ.. డీఎంకే కుటుంబ పార్టీ అనీ,   ఏ డీఎంకే కుటుంబ రాజకీయాలు నడుపుతోందని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే  డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహానాడు వంటి కార్యక్రమాలకు, ప్రజాందోళనా కార్యక్రమాలకు డీఎంకే కీలక నేతలందరూ కుటుంబ సమేతంగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తున్న సంగతిని స్టాలిన్ గుర్తు చేశారు.   డీఎంకేకి ఓటేస్తే కరుణానిధి కుటుంబమే అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించడమే కాకుండా కరణానిథి కుటుంబం అంటే మొత్తం రాష్ట్ర ప్రజలు అని అన్నారు.    ఐదు దశాబ్దాలుగా తమిళనాట ద్రావిడ పార్టీలే అధికారంలో ఉన్నాయనీ,  వారి ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందనీ స్టాలిన్ అన్నారు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిస్తున్న రాష్ట్రమైన మణిపూర్లో 50 రోజులకు పైగా కల్లోల పరిస్థితులు నెలకొన్నా ఇప్పటివరకు ప్రధాని అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. మోడీ దృష్టిలో  దేశం అంటే కేవలం గుజరాతేనా అని ప్రశ్నించారు.  విపక్షాల ఐక్యతా యత్నాలు మోడీని భయపెడుతున్నాయనీ, బీజేపీ పార్టీలు ఐక్యంగా ఉంటే కేంద్రంలో తన అధికార పీఠం కూలిపోతుందన్నఆందోళన నుంచే మోడీ నుంచి అసందర్భ విమర్శలు వస్తున్నాయన్నారు. 

స్పీడ్ న్యూస్ 1

1.అవినీతి ఆరోపణలతో జైలుపాలైన మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సంచలనం సృష్టించిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తగ్గారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచనలతో తన ఆదేశాలతో నిలుపుదల చేశారు.  2.తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. చరిత్రలో తొలిసారి ఒక తీర్పును తెలుగులో వెలువరించింది. 3.మంచంపై నోట్ల కట్టలతో తన భార్యాపిల్లలు దిగిన సెల్ఫీ ఓ పోలీసు అధికారిని చిక్కుల్లో పడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది 4.కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. యూసీసీపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు న్యాయ కమిషన్, న్యాయ మంత్రిత్వశాఖతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జులై 3న సమావేశం కానుంది.  5.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం ప్రజలపై అద్భుతమైన ప్రభావం చూపించిందని కొనియాడారు. 6.తనకూ, రసమయి బాలకిషన్‌కు రాజకీయాలు తెలియవని ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. జగపతిబాబు ప్రధాన పాత్రలో డా. రసమయి బాలకిషన్ నిర్మించిన ‘రుద్రంగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6.మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కంగ్‌పోంక్పి జిల్లాలో చనిపోయిన మరో వ్యక్తిని రాజధాని ఇంఫాల్‌కు తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.  7.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందేభారత్ రైలు సర్వీసులకు ప్రజల్లో మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. వేగవంతమైన ప్రయాణం, అద్భుతమైన వసతులు వెరసి ఈ రైళ్లకు ప్రజాదరణ దక్కింది. 8.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 141వ రోజు గూడూరు నియోజకవర్గం కాకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... బల్లవోలు కొత్తపాలెం క్రాస్, చింతవరం, మొగలి కొత్తపాలెం, అల్లీపురం, ఏరూరు, మోమిడి మీదుగా వరగలి విడిది కేంద్రానికి చేరుకుంది. 9.కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణలో రూ.10 లక్షల కోట్ల అప్పులు అవుతాయని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. 10.కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 ఏళ్ల డిమాండ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని, ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంపై గతంలో ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు.  

విశాఖలో కిడ్నాప్ కల్చర్

అహ్లాదకర వాతావరణానికి, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం. ఓ వైపు సముద్రం, మరోవైపు రిషికొండ....తోట్లకొండ, ఇంకోవైపు యారాడ కొండ ఇలా ప్రకృతి సోయగాల నడుము విశాఖనగరం సురక్షితంగా ఉంది. అయితే అలాంటి శాంతియుత, సుందర నగరంలోకి మైనింగ్, ప్యాక్షన్, రియాల్టీ, గంజాయి, డ్రగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. మాఫియాల గ్రాండ్ ఎంట్రీతో.. వాటి పడగ నీడలో ఉక్కు నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.    విశాఖపట్నం ఎంపీ, అధికార జగన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఘటన మరపుకు రాకముందే   తాజాగా అదే  విశాఖలో  మరో రియల్టర్ శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య లక్ష్మీ కిడ్నాపయ్యారు. వీరిని విడుదలకు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయితేనే.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళనలో గడిపారు.  తాజాగా ఆ మహనగరంలో మరో కిడ్నాప్ చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఇలాంటి వేళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు గన్ లైసెన్స్‌లు తీసుకోవాలంటూ స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే సూచించడం... అందుకు సంబంధించిన వార్తలు సైతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం.. అందులో ఇప్పటికే 600 మందికి గన్‌లైసెన్స్‌లు ఉన్నాయని పోలీస్ అధికారులు గణాంకాలతో సహా చెబుతున్నారు.   మరోవైపు అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీని రౌడీషీటర్ కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత తాను విశాఖ వేదికగా వ్యాపారం చేయలేనని సదరు ఎమ్మెల్యే చేతులు ఎత్తేయడం.. అనంతరం సాక్షాత్తూ సీఎం జగన్‌తో బేటీ అయి.. విశాఖలో చోటు చేసుకొన్న వరుస పరిణామాల గోడును ఆయన వద్ద వెళ్లబోసుకోవడం చూస్తుంటే.. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే  దిక్కు లేకుండా ఉండే పరిస్థితి నెలకొందనే ఓ ప్రశ్న అయితే సామాన్యుల మదిలో మొలకెత్తింది. అంతేకాదు గన్ లైసెన్స్ తీసుకోవాలంటూ వీఐపీలకు పోలీసులే స్వయంగా సూచించడడం  గమనార్హం. ఇంకోవైపు విశాఖపట్నం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరిపాలన సాగిస్తామంటూ సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. మరి ఆ లోపు.. సదరు మహానగరంలో శాంతి భద్రతలు కట్టడి చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందా? లేకుంటే.. చూసి చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు పాటు ఓపిక పట్టాల్సిన పరిస్థితి నెలకొందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.  2014 రాష్ట్ర విభజన సమయంలో విశాఖపట్నం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మ.. లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి.. పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం విదితమే. ఆ క్రమంలో వైయస్ విజయమ్మను గెలిపిస్తే.. శాంతి భద్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశాఖనగరం ప్యాక్షన్ రాజకీయానికి అడ్డాగా మారుతుందని.. అలాగే శాంతి భద్రతల సమస్యలు సైతం తలెత్తుతాయంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు .. తన ఎన్నికల ప్రచార వేళ.. తన దార్శనికతతో చెప్పారు.  దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కంభంపాటి హరిబాబు గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల వేళ.. జగన్ వేవ్‌లో శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఫ్యాన్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులే గెలుపొందిన విషయం విధితమే. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే కాదు.. శాంతి భద్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఉత్తరాంధ్రలోని విశాఖనగరంలో మళ్లీ అలజడి రేగడం.. ఆ నగరంలోని సామాన్య పౌరుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనేది సుస్పష్టంగా గోచరిస్తుందనే ఓ చర్చ సైతం హల్ చల్ చేస్తోంది.

అంబటి vs జనసేన.. ట్వీట్లతోనే ఏకిపారేస్తున్నారు!

వైసీపీ ఈ మధ్య కాలంలో టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేయాలంటే సరిగ్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మైంటైన్ చేస్తుంది. చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏదైనా విమర్శిస్తే.. కొడాలి నాని లాంటి వాళ్ళు రంగంలోకి దిగి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్తారు. అదే జనసేన నుండి పవన్ కళ్యాణ్ మీదకి అయితే పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కౌంటర్ల యుద్ధం మొదలు పెడతారు. ప్రతిపక్షాల నుండి ఎవరైనా వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తే వాళ్ళు స్పందించకుండా.. విమర్శించిన వారి కులానికి సంబంధించిన వైసీపీ నేతలు వచ్చి విరుచుకుపడుతుంటారు. నిజానికి ఇది గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో మొదలవగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటి  కుల రాజకీయం పూర్తిగా ఓపెన్ అయిపొయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్రలో ఎక్కడిక్కడ వైసీపీ ప్రభుత్వంపై  విమర్శల యుద్ధం కురిపించారు. కురిపిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో వైసీపీ నుండి పవన్ పై పెద్దగా ఎదురుదాడి లేదు. ఏమనుకున్నారో ఏమో కానీ గతంలో కంటే ఈ మధ్య ఈ ఎదురు దాడి చాలా తగ్గింది. కానీ  మంత్రి అంబటి రాంబాబు మాత్రం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట అంబటి.. పవన్ ను రోత స్టార్.. బూతు స్టార్ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు.   సినిమా స్టార్.. ప్యాకేజి స్టార్.. కామెడీ స్టార్.. కోతల స్టార్.. రోత స్టార్.. బూతు స్టార్.. బా..గా.. పడిపోయావు పవన్ కళ్యాణ అంటూ రాసుకొచ్చారు. దీంతో జనసైనికులు అంబటిపై మండిపడ్డారు. తాజాగా అంబటి రాంబాబు... పవన్ కల్యాణ్ పేరులో అర్ధాన్ని తనదైన శైలిలో వివరిస్తూ "సార్థక నామధేయుడు" అని ట్వీట్ చేశారు. పవన్ + కళ్యాణ్.. పవన్ = గాలి, గాలి, గాలి.. కళ్యాణ్ = కళ్యాణాలు.. సార్థక నామధేయుడు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అంబటి చేసిన ఈ ట్వీట్ కు జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి అంబటిపై గట్టి కౌంటర్ వేసింది. గతంలో అంబటి రాంబాబు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారంటూ హల్ చల్ చేసిన ఆడియో క్లిప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జనసేన.. దీనితో పాటు... పలువురు మహిళలతో అంబటి చాట్ చేసినట్లు ఉన్న కొన్ని వాట్సప్ చాట్ లను పోస్ట్ చేశారు. అనంతరం "సంబరాల రాంబాబు + సంజన + సుకన్య = ఆంబోతు కాంబాబు"... "సంబరాలు = వాట్సప్ రాసలీలలు.. అంబటి రాంబాబు = ఆంబోతు కాంబాబు" అని జనసేన బృందం ట్వీట్ చేసింది.  అంతేకాదు, ముక్తసరిగా మహిళల గురించి ఊహాగానాలు చేయకుండా ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మంత్రి అంబటికి చురకలంటించారు. మొత్తంగా చూస్తే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో  ట్వీట్ల ద్వారా అంబటిని తరిమి తరిమి కొడుతున్నారు. ఈ ట్వీట్ల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కూడా లేదు. అయితే జనసేన, వైసీపీ కార్యకర్తలు, నేతల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఒకరకంగా సాంప్రదాయ రాజకీయాలను  దాటేసి జుగుప్సాకరంగా మారిపోయింది. దీంతో బయట నుండి చూసే వారికి ఇది వెగటు కలిగిస్తోంది. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో మరెన్నో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మంత్రి ఇలా బజారుకెక్కి చిల్లర యుద్ధం చేయడం  మంత్రి అంబటిని మరింత దిగజారుస్తోంది. చూడాలి మరి అంబటి ఇంకెంత దిగజారే స్థాయికి వెడతారో?!

జనంపై స్పీకర్ శివాలు.. ఖర్మరా రాష్ట్రానికి!

జగన్ ఏ ముహూర్తాన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో కానీ అప్పటి నుంచీ వైసీపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి పరాభవాలు ఎదురయ్యాయి. వారి నిరసనాగ్రహాన్ని తట్టుకోలేక  చాలా మంది ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. లేదా ఏదో చేశామన్నట్లుగా మమ అనిపించేశారు. అయితే ఆ కార్యక్రమంపైనే ఆశలు పెట్టుకున్న జగన్ వర్క్ షాపులు పెట్టి, టికెట్టివ్వబోనని ఎమ్మెల్యేలనూ, పదవులు ఊడబెరికేస్తానని మంత్రులను హెచ్చరించి, బెదరించి మరీ వారిని జనం ముందుకు తోలారు. ఒక ఒక విధంగా బలవంతంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల ముందుకు తోశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు  మాత్రం ఆ కార్యక్రమంలో ప్రజాగ్రహాన్ని చవిచేసి కొన్ని చోట్ల పారిపోతే, మరికొన్ని చోట్ల ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసి చులకన అయ్యారు. తాజాగా ఆ కోవలోకి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేరారు. ఆ జాబితాలోకి మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చేరారు.  వీరిరువురూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రజలపై విరుచుకుపడిన తీరును గమనించిన వారంతా ఇదేం ఖర్మరా బాబూ మన రాష్ట్రానికి అంటూ తలలు బాదుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ ప్రచారాలకు దూరంగా ఉండాల్సిన స్పీకర్ తమ్మినేని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏకంగా తనకు ఓటేయని వారు తనను ప్రశ్నించేందుకు అర్హత లేని వారేనని బాహాటంగా చెప్పేశారు. అంతే కాదు ఈ విషయం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో పో అంటే ఓ మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ విలువలకూ, విధానాలకూ తిలోదకాలిచ్చేసినట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయకుండా సంక్షేమ సొత్తు పందేరాలపైనే పూర్తి ఆశలు పెట్టుకుందని పరిశీలకులు అంటున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదరింపులకు దిగడానికి కూడా వెనుకాడటం లేదు.   ఆంధ్ర ప్రదేశ్ లో  ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పార్టీలు తమ అస్త్రాలను బయటకి తీస్తున్నారు. టీడీపీ పాదయాత్రలు, జనసేన వారాహి యాత్ర, వైసీపీ గడప గడపకి కార్యక్రమాలతో ప్రజలలోకి వెడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కార్యక్రమాలకు, యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. గడప గడపకి మన ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు వెడుతున్న  వైసీపీ నాయకులకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చక పోగా,మంత్రులు, ఎమ్మెల్యేలు,వచ్చి హడావుడి చేస్తున్నారు తప్పితే ప్రజలకి ఉపయోగపడే ఒక్క పనికూడా ప్రభుత్వం అమలు చేయలేదని ప్రజలు  బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు , నవరత్నాలు,సంక్షేమ పథకాలు , ప్రజలకి ఉపయోగ పడే ఏఒక్క పనిని కూడా చేయలేదంటూ మండిపడుతున్నారు.   మంత్రి ఆదిమూలపు సురేష్ కు సొంత నియోజక వర్గం రామాసముద్రంలో నిరసన సెగలు తగిలాయి. రైతులకు ఇచ్చే ఉపకరణాలు పంపిణి జరిగాక, తిరిగి వెళ్తున్న క్రమంలో చేదు అనుభవ ఎదురైంది. ఏ మొకం పెట్టుకొని వచ్చారు అని మహిళలు చుట్టూ ముట్టారు, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాక గ్రామంలోకి అడుగు పెట్టాలని, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేసారు.  ఊహించని పరిణామంతో కంగు తిన్న మంత్రి అక్కడనుండి  జారుకున్నాడు. సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ నాయకులే తమ జేబులు నింపుకున్నారని, ప్రజలకి వైసీపీ చేసిందేమి లేదని జనం నిర్బయంగా మంత్రుల ఎదుటే చెబుతుండటంతో వైసీపీ నేతలు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ప్రజల ముందుకు వెళ్ల లేక.. జగన్ కు సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు. 

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ.. కాలి దగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లుగా తయారైంది. జగన్ సర్కార్ అస్తవ్యవస్థ విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలలోనూ  తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతున్నది. జగన్ సర్కార్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోందన్నది రాజకీయ విశ్లేషకులే కాదు, వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ మాట పట్టుకుని గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళుతున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయి. ముందస్తు ప్రణాళిక వేసుకుని జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపాలని నిర్ణయించుకున్న నాటి నుంచే వైసీపీలో బయటపడకపోయినా తీవ్ర అసంతృప్తి నెలకొందన్నది వాస్తవం. ఆ విషయాన్ని జగన్ ఒక్కడే గ్రహించడం లేదని పార్టీలో కీలక నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో బయటపడిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం తరువాత జగన్ ధోరణి బెదరింపుల నుంచి బుజ్జగింపుల వరకూ రావడంతో.. ఇక గడపగడపకూ నరకం నుంచి బయటపడినట్లేనని మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఊపిరి పీల్చుకున్నారు.  ముందస్తు ప్రశక్తే లేదని జగన్ తనను తాను సమాధాన పరుచుకుని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాం అని ప్రకటించారు. సరిగ్గా ఈ ప్రకటన తరువాత నుంచే ఇంకా తొమ్మదినెలలకు పైగా సమయం ఉంది కనుక ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించారు. అన్ని రోగాలకూ ఒకటే మందు జిందా తిలస్మాత్ అన్నట్లు అన్ని  వర్గాల ప్రజలలో నెలకొన్న ఆగ్రహం, అసంతృప్తిని పారద్రోలడానికి గడపగడపకూ  మన ప్రభుత్వం కార్యక్రమమే దివ్యఔషధమన్న ఐ ప్యాక్ సూచనలకు అనుగుణంగా మళ్లీ జగన్ ఎమ్మెల్యేలను ప్రజాగ్రహానికి బలి చేసి వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కాలంటే.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం మనసులు గెలుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ 19 మందిని గుర్తించాననీ, వారు తమ తీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్ ఉండదనీ ఇటీవల హెచ్చిరించి పంపారు.  దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ముందుకు వెడితే నుయ్యి వెనక్కు వెడితే గొయ్యి అన్న చందంగా తయారైంది. పార్టీలోనూ, ప్రజలలోనూ కూడా వారు ముఖం చూపలేక, ముఖం చాటేయలేకా నానా యాతనకు గురౌతున్నారు. మొండిగా ప్రజలలోకి వెళ్లిన వారు జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సహనం కోల్పోతున్నారు. వార్నింగ్ లకు, బెదరింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.  సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికే ఈ పరిస్థితి ఎదురైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రజాగ్రహ జ్వాలను ఎదుర్కొన్నారు. ఇరువురూ కూడా జనంపై ఆగ్రహం వ్యక్తం చేసి వారిలోని ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగేందుకు మాత్రమే దోహదపడ్డారు.  స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే.. మా తీరు ఇంతే మేం మారం మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ ను..అదీ ఓ మహిళా ఓటర్ పై అగ్రహంతో విరుచుకుపడ్డారు. దాదాపు ఇదే సీన్  రాష్ట్రం అంతా కనిపిస్తోంది. జగన్ ను ఏం అనలేని ఎమ్మెల్యేలు.. ప్రజలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తమ ఓటమిని.. అలాగే పార్టీ ఓటమిని ఇప్పుడే కన్ఫర్మ్ చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ బాధలన్నీ పడలేక కేవలం లబ్ధిదారుల ఇళ్లకే వెడదామని నిర్ణయించుకుని ఆ ప్రకారమే చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతుండటం ఎమ్మెల్యేలు, మంత్రులకు మింగుడుపడటం లేదు.   రూ. పదివేలు ఇచ్చి.. రూ. ఇరవై వేలు లాక్కుంటున్నారని లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేల ముఖం మీదే అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ మద్యం విధానంపై కూడా ఓ రేంజ్ లో నిరసన వ్యక్తం అవుతోంది.  రోడ్లు, నీళ్లు, విద్యుత్, పన్నులు ఇలా ఒక్క విషయం అని కాదు.. అన్ని అంశాలలోనూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ బాధ పడలేక గడపగడపకూ కార్యక్రమానికి వెళ్లకుండా డుమ్మా కొట్టేద్దామంటే అడుగడుగునా ఐ ప్యాక్ నిఘా. వెళ్లి ప్రజా వ్యతిరేకత చవిచూసినా, ప్రజలలో ఆదరణ లేదన్న ఐప్యాక్ నివేదికలు క్షణాల్లో జగన్ చేతికి వెళ్లిపోతున్నాయి.  దీంతో ఎమ్మెల్యేలు ఏ రాయి అయితేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అన్న నిర్వేదంలో పడిపోయారు. వీటన్నిటికంటే ఐప్యాక్ సభ్యులను మేనేజ్ చేసుకుంటే మేలన్న ఉద్దేశంతో కొందరు ఆ ప్రయత్నాలూ చేశారు, చేస్తున్నారు.   మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాడర్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న భావనే వ్యక్తమౌతోంది. 

నెల్లూరు సిటీ తెలుగుదేశం ఇన్ చార్జిగా నారాయణ- అనీల్ యాదవ్ పనైపోయినట్లేనా?

నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ  తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యాప్తికి దోహదపడిన ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపకల్పన, నిర్మాణంలో అప్పటి  మునిసిపల్  శాఖ మంత్రిగా  కీలక పాత్ర పోషించారు.   గత తెలుగుదేశం హయాంలో  మునిసిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పొంగూరు నారాయణ, నారాయణ విద్యాసంస్థల అధిపతి అన్న సంగతి విదితమే. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం కోసం విశేషంగా కృషి చేసిన నారాయణ.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం తరువాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా చంద్రబాబు కేబినెట్ లో అత్యంత కీలకమైన మునిసిపల్ శాఖను నిర్వహించారు. అంతేనా  చంద్రబాబుఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలను అప్పగించారు. సీఆర్డీయే బాధ్యతలూ ఆయనే నిర్వహించారు.  అమరావతి అద్భుత రాజధానిగా రూపొందేందుకు అవసరమైన పునాదులు వేయడంలో చంద్రబాబుకు కుడి భుజంగా వ్యవహరించారు. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి, జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సీన్ మారిపోయింది. అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించింది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించిన నారాయణ పార్టీకీ, రాజకీయాలకూ కూడా ఒకింత దూరమయ్యారు. కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో ఆయన రాజకీయ యవనికపై పెద్దగా కనిపించలేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరించింది. ఆయన విద్యాసంస్థలపై దృష్టి సారించింది. టెన్త్ పేపర్ లీకేజీ సాకుతో ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసింది. అయితే ఆ కష్ట సమయంలో ఆయనకు తెలుగుదేశం అండగా నిలిచింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందలం ఎక్కించిన పార్టీకి అధికారం కోల్పోగానే దూరమయ్యారన్న విమర్శలను నారాయణ ఎదుర్కొన్నారు.   ఆ విమర్శలన్నిటినీ పంటిబిగువున భరించిన నారాయణ కేసుల దాడి నుంచి ఒకింత ఊరట లభించగానే.. మళ్లీ క్రియాశీలంగా మారారు.   2014 నుంచి 2019 వ‌ర‌కు.. నవ్యాంధ్రప్రగతిలో తన వంతు బాధ్యత నిర్వహించిన నారాయణ  నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చారు. జిల్లా ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు. అటువంటి నారాయణను  జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. అమ‌రావ‌తి, సీఆర్‌డీఏలో అక్ర‌మాలంటూ కేసులు పెట్టింది. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌పై ప్ర‌భుత్వ‌ దాడులు జ‌రిగాయి.  వాటన్నిటినీ తట్టుకుని నిలబడి మళ్లీ నెల్లూరు రాజకీయాలలో క్రియాశీలం అవుతున్నారు. స్థానికంగా మంచి పేరు ఉన్న నారాయణను నెల్లూరు సిటీ తెలుగుదేశం ఇన్ చార్జిగా నారాయణను  ప్రకటించడం ద్వారా స్థానికంగా బలమైన బీసీ నేతగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ కు తెలుగుదేశం చెక్ పెట్టిందనే చెప్పాలి. 

వైసీపీ కనుమరుగు ఖాయం.. బాబు సీఎం తథ్యం!

ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారు. సైకో జగన్ పాలనకు చరమ గీతం పాడాలని నిర్ణయించేసుకున్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందన్న సంగతి ఎంత నిజమో.. ఎన్నికల అనంతరం వైసీపీ కనుమరుగు అవ్వడం కూడా అంతే నిజం. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం (జూన్ 29) తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు.  తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే  కురుపాం నియోజకవర్గ సమస్యలన పరిష్కరిస్తామన్నారు.   రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్న శత్రుచర్ల అమ్మ ఒడి కార్యక్రమంపై, ఆ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం సమస్మలను విస్మరించి సూడో సంక్షేమంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. పార్వతీపురం జిల్లాలో గత కొంత కాలంగా ఏనుగుల బెడద తీవ్రంగా ఉన్నా ఆ సమస్య పరిష్కారం దిశగా జగన్ ఏ చర్యా తీసుకోలేదన్నారు. కురుపాంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ విపక్షాలపై విమర్శలు గుప్పించడానికే పరిమితమయ్యారు తప్ప, నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించలేదని ఎత్తి చూపిన శత్రుచర్ల.. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ విమర్శలకే పరిమితమవ్వడం జగన్ లోని ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిన విషయాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు.  

వైసీపీ అరాచకత్వానికి పరాకాష్ట

వైసీపీ అరాచకత్వానికి హద్దులు చెరిగిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయన్న అక్కసుతో జర్నలిస్టులపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కొండపిలో గురువారం (జూన్ 29) నియోజకవర్గ ఇన్ చార్జి అశోక్ బాబు మిట్టపాలెంలో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించారు. ఆయన యాత్రకు అడుగడుగునా ప్రజా నిరసన సెగ తగిలింది. ప్రజలు అశోక్ బాబును సమస్యలపై నిలదీయడాన్ని చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై ఆయన అనుచరులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. కెమేరా లాక్కొని ధ్వంసం చేశారు. అంతే కాకుండా స్థానిక విలేకరిపై అశోక్ బాబు అనుచరుడి చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు.   ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉన్న చట్టాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగం చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై కూడా ఈ కేసు బనాయించిన సంగతి తెలిసిందే.  అప్పట్లో దళిత రైతులపైనే ఈ కేసు బనాయించిన సంగతి విదితమే. కాగా విలేకరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇలా ఉండగా ప్రజా నిరసనే కాకుండా అశోక్ బాబుకు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సొంత పార్టీ నేతలే బహిష్కరించారు. పోలీసులు అశోక్ బాబును తన కార్యక్రమం వాయిదా వేసుకోవాల్సిందిగా కోరినా ఆయన వినలేదు. పార్టీ స్థానిక నాయకత్వం లేకుండానే కొద్ది మంది అనుచరులతో ఆయన గడపగడపకూ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మా ఇంటికి రావద్దంటే స్టిక్కర్లు అతికించాయి. ఈ నేపథ్యంలో మిట్టపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ వర్గాల మధ్యే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. ఈ వ్యవహారాన్నంతా రిపోర్టు చేసినందుకు అశోక్ బాబు వర్గీయులు జర్నలిస్టులపై దాడులకు దిగారు. 

బెలారస్ లో వాగ్నర్ దళాలు.. ఉక్రెయిన్ కు పెరిగిన ముప్పు!

రష్యాలో  కిరాయి సైనిక మూక వాగ్నర్ బృందం తిరుగుబాటు తరువాతి పరిణామాలతో నాటో కూటమిలో ఆందోళన ఆరంభమైంది. పుతిన్ పై తిరుగుబాటు  ప్రకటించిన గంటల వ్యవధిలోనే వెనక్కు తగ్గిన వాగ్నర్ సేన ఇప్పుడు బెలారస్ లో అడుగుపెట్టింది.  అక్కడ వాగ్నర్ బృందం, ఆ బృంద నేత ప్రిగోజిన్  ఆశ్రయం పొందడానికి పుతిన్ అనుమతి ఇవ్వడమే నాటో కూటమి ఆందోళనకు కారణం. బెలారస్ భద్రతపై నాటో కూటమిలో ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో నాటో కూటమి దేశాలు జులై 11న  నాటో దేశాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి. మొత్తం 31 సభ్య దేశాలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. వాగ్నర్ దళాలు బెలారస్ లో ఆశ్రయం పొందడం అంటే అది నాటో దేశాల భద్రతకు ముప్పుగానే భావిస్తున్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.   నాటో సభ్యదేశాల భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామనీ, అన్ని దేశాల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడే ప్రశక్తే లేదనీ నాటో దళాల చీఫ్  ఇప్పటికే విస్పష్ట ప్రకటన చేశారు.   రష్యా ప్రభుత్వంపై వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు వార్తలతో నాటో దేశాలలో హర్షం వ్యక్తం అయ్యింది. ఆ తిరుగుబాటుతో తమకెటువంటి సంబంధం లేదని ప్రకటిస్తూనే విస్తరణ కాంక్ష కారణంగానే రష్య పతనం కాక తప్పదని జోస్యాలు కూడా చెప్పాయి.  అయితే వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు గంటల్లోనూ చల్లారిపోయినా.. ఈ తిరుగుబాటు ప్రభావం రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనీ, రష్యాదళాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయనీ నాటో దేశాలు అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలకు భిన్నంగా పుతిన్ కు మద్దతుగానే వాగ్నర్ గ్రూపు నిలవడం, పుతిన ఆ తిరుగుబాటు గ్రూప్ పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కాకుండా  బెలారస్ లో  ఆశ్రయం తీసుకోవటానికి పుతిన్‌, బెలారస్‌ అంగీకరించటంతో  బెలారస్‌ను ఆనుకొని ఉన్న నాటో కూటమి సభ్య దేశాలైన  పోలండ్‌, లాత్వియా, లిథువేనియాలకు ముప్ప ఏర్పడింది. అలాగే రష్యాతో రణం చేస్తున్న  ఉక్రెయిన్‌  కూడా బెలారస్‌ సరిహద్దు దేశమే.  అయితే ఇప్పుడు నాటో కూటమిని వేధిస్తున్న అనుమానం ఏమిటంటే పుతిన్, ప్రిగోజిన్ లు వ్యూహాత్మకంగానే  వ్యవహరించి వాగ్నర్ మూకలను బెలారస్ లో మోహరించారని నాటో దేశాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఈ పరిణామంతో ఉక్రెయిన్ కు ముప్పు మరింత పెరిగిందని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పుతిన్ పై వాగ్నర్ దళాల తిరుగుబాటు విషయంలో ఉన్న అనుమానాలు ఇప్పటికిప్పుడు నివృత్తి అయ్యే అవకాశాలు లేకపోయినప్పటికీ..  బెలారస్‌లోకి వాగ్నర్‌ మూకల రాక మాత్రం ఏ విధంగా చూసినా ఆందోళనకరమేననీ,   రష్యా గడ్డపై నుంచి కంటే బెలారస్‌ నుంచి ఉక్రెయిన్‌పై దాడి తేలిక అని సైనిక నిపుణులు అంటున్నారు.  అన్నిటికంటే ప్రధానంగా ఈ తిరుగుబాటుకు రోజుల ముందే రష్యా కొన్ని అణ్వాయుధాలను బెలారస్ కు తరలించడాన్ని నిపుణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 

ఈటలకు ప్రాణహాని నిజమే!

ఈటల రాజేందర్  భద్రతకు ముప్పు ఉందని నిర్ధారణ అయ్యింది. డీజీపీ అంజనీకుమర్ ధృవపరచుకున్నారు. ఇటీవల ఈటల రాజేందర్ తన సతీమణి జమునతో కలిసి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ విలేకరుల సమావేశంలో ఈటల జమున తన భర్త రాజేందర్ కు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణ హాని ఉందని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ ఈటలకు వై కేటగిరి భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒకటి రెండు రోజులలో ఉత్తర్వులు వెలువడనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో  ఈటలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే భద్రత కల్పించాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ అధికారిని ఈటల ఇంటికి పంపించి భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించాలని డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు గురువారం (జూన్ 29) మేడ్చల్ డీసీపీ సందీప్,  ఏసీపీ వెంకట్ రెడ్డి  ఈటల ఇంటికి వెళ్లి అరగంటపాటు ఆయనతో మాట్లాడారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉన్నట్టుగా ఈటల డీసీపీకి తెలిపారు. హుజురాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు వెళ్ళినపుడు అనుమానాస్పద కార్లు వెనక వస్తూ కనిపిస్తున్నాయని ఈటల వారికి చెప్పారు. ఆ తర్వాత డీసీపీ ఈటల ఇంటి పరిసరాలను పరిశీలించి, అందుకు సంబంధించిన సమాచారాన్ని   సీల్డ్ కవర్‌లో డీజీపీకి అందచేశారు. ఈ క్రమంలో ఈటలకు భద్రతను పెంచుతూ త్వరలోనే రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

స్పీడ్ న్యూస్- 4

31.బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలతో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని లక్నో ఈద్గా ఇమామ్ స్కాలర్, మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి   ముస్లింలకు విజ్ఞప్తి చేశారు.  32.ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశానికి అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలుపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. మోదీ చెపుతున్న ఉమ్మడి ఎంతవరకు ఉమ్మడిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 33.కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. 34.టీమిండియా కోచ్‌లపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌ల పేరు ప్రతిష్ఠలకు క్రికెటర్లే కారణం అన్నాడు. 35.బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గొర్రెలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లో చూరూ జిల్లాలో ఓ పొట్టేలు ఏకంగా రూ.కోటి ధర పలికింది. 36.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని  కర్టాటకలో     కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.  ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని సిద్ద రామయ్య ప్రభుత్వం  తెలిపింది. 37.బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. 38.కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ప్రణామ్, యూరియో గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు పచ్చజెండా ఊపింది. 39.కాంతి కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేసే సరికొత్త లేజర్ టెక్నాలజీ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ లేజర్ ఆధారిత ఇంటర్నెట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది.  40.అమెరికాలో ఓ వ్యక్తికి అద్భుతమైన ఆఫర్ లభించింది. విమానంలో ఫస్ట్ క్లాస్ లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. 

మోడీ వరంగల్ పర్యటన ఖరారు.. 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. వచ్చే నెల 8న ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా వరంగల్ నగరంలో టెక్స్ టైల్ పార్కుకు కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత వరంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందు కోసం బీజేపీ తెలంగాణ నాయకత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జనాలను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇలా ఉండగా ప్రధాని మోడీ పర్యటన కారణంగా అదే రోజు అంటే జూలై 8న హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన జరగాల్సి ఉన్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. ఈ సమావేశం ఎప్పుడు జరిగేదీ తరువాత ప్రకటిస్తామని బీజేపీ పేర్కొంది. 

స్పీడ్ న్యూస్- 3

21.ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు. 22.చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీసు స్టేషన్‌లో 45 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదైంది. ఎస్సై బెదిరింపులకు వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినందుకు కేసులు పెట్టారు. 23.తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.  24.రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానని సీఎం జగన్ చెప్పుకోవడం పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఏ కుటుంబంలో కూడా జగన్ వంటి మేనమామ ఉండకూడదని అన్నారు. 25.ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతపరమైన అంశాలపై ఫిలింమేకర్లు సినిమాలు తీయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. 26.ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో 2011లో ధోనీ నేతృత్వంలో రెండోసారి ప్రపంచ కప్ నెగ్గిన క్షణాలను వీరేంద్ర సెహ్వాగ్ పంచుకున్నాడు. సచిన్ ను భుజాలపైకి ఎత్తుకొని మైదానంలో మొత్తం కలియదిరిగారు. 27.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.  సాధారణంగా వృద్ధాప్యంలో స్లీప్ అప్నియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. 28.ఇక నుంచి తాను పాత పద్ధతిలో మాట్లాడనని, ఇక నుంచి కొత్త పద్ధతిలో మాట్లాడతానని జన సేన అధినేత వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక నుంచి ఇలా ఇలా ఇలా అని మాట్లాడుతా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా  కనుక్కుందాం అని వ్యాఖ్యానించారు. 29. కర్ణాటక‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సర్వీసు పథకం ఆటోవాలాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. కస్టమర్లు లేక, రోజంతా ఆటో తోలినా ఆశించిన డబ్బులు రాక ఆటోడ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. 30. తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌‌రెడ్డి చేసిన ట్వీట్‌ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.  దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.

కార్యకర్తలకే విసుగొచ్చేసిన జగన్ స్పీచ్!.. ఫక్తు రొటీన్

రాజకీయ నాయకులలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ స్పీచ్ ఉంటుంది. కొందరు వినమ్రంగా మాట్లాడుతూనే చురకలు అంటిస్తారు. ఇంకొందరు అర్ధవంతమైన ప్రసంగంతో ఎదురువారిని ఆలోచింపజేస్తారు. మరికొందరు ఆవేశంతో మాట్లాడి ఎదుటివారిలో పౌరుషాన్ని రగిలిస్తారు. అయితే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలలో మాత్రం ఇందులో ఏదీ కనిపించదు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర నుండి ఇప్పుడు సీఎంగా వివిధ సభలలో,  బటన్ నొక్కుడు కార్యక్రమాలలో ఎక్కడైనా జగన్ ప్రసంగాలు   ఒకే విధంగా ఉంటాయి. ఓదార్పు యాత్ర చేస్తుండగా వాహనం పైన ప్రసంగిస్తూ పేపర్ లో రాసుకున్నది ముక్కలు ముక్కలు చూసుకొని చెప్పేవారు. పాదయాత్ర సందర్భంగా సభలలో పెద్ద పుస్తకమే తెచ్చుకొని చదివేవారు. ఇక సీఎం అయ్యాక లైవ్ మీడియా సమావేశాలకు వస్తే మాట్లాడిన మాటలు భీభత్సంగా ట్రోల్ అవడంతో ఇక లైవ్ కి రావడమే మానేశారు. సీఎం అయ్యాక బహిరంగ సభలలో మాట్లాడే సమయంలో పేపర్ చూసే తమ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని చెప్పేవారు. అది ఆయనే రాసుకొచ్చారా? ఎవరో రాసిచ్చిందే చదివే వారో కానీ.. సభ ఏదైనా పేపర్ చూసే మాట్లాడతారు. అయితే, ఈ పేపర్ స్క్రిప్ట్ లో కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుండి ఇప్పటి సభల వరకూ ఎలాంటి మార్పులు లేవు. చివరికి ప్రతిపక్షాలపై చేసే విమర్శలలో సైతం ఒకటే పంథా. అదే నాలుగు మీడియా ఛానెళ్లను తిట్టడం.. అదే టీడీపీని విమర్శించడం. తనకు పొత్తులు ఎవరూ లేరని సానుభూతి కోసం ప్రయత్నించడం.. తనకూ అన్నీ మీరేనని దగ్గరయ్యే ప్రయత్నం చేయడం. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి నాలుగు పెళ్లిళ్లు డైలాగ్ కూడా ఐదేళ్ల క్రితం నుండి అప్పుడప్పుడు అంటున్నదే. పవన్ మీద జగన్ చేసిన నాలుగు పెళ్ళిళ్ళు,  అవేశాలు, పూనకాలు, ఊగిపోవడాలు అంటూ పేల్చిన డైలాగ్ కూడా పేపర్ చూసి చదవడంతో కిక్కు లేకుండా పోయింది. నిజానికి రాజకీయ నేతలకు ప్రజల మధ్యకి వెళ్ళినపుడు హావభావాలు చాలా ముఖ్యం. ఉదాహరణకి ప్రధాని నరేంద్ర మోడీని తీసుకుంటే సందర్భాన్ని బట్టి హ్యాండ్ మూమెంట్ ఒక్కోలా ఉంటుంది. చంద్రబాబును చూస్తే అక్కడ పరిస్థితిని బట్టి యువతతో ఒకలా పెద్దవారిని ఉద్దేశించి మరోలా మాట్లాడతారు. అప్పుడప్పుడు చంద్రబాబు కూడా   కామెడీ చేస్తుంటారు.. సీరియస్ అవుతుంటారు. కానీ, జగన్ సీరియస్ గా మాట్లాడినా, సెటైర్లు వేసినా, తన పనితనం గురించి చెప్పినా అన్నిటికీ ఒక్కటే నవ్వు కనిపిస్తుంది. దీంతో ప్రజలు  ఆయన ప్రసంగాలకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతున్నారు. చివరికి వైసీపీ కార్యకర్తలే ఎప్పుడూ ఒక్కటేలా కాకుండా కాస్త స్టైల్ మార్చి మాట్లాడితే చూడాలని ఉందని తెగ ఇదైపోతున్నారు. ఉదాహరణకి జనసేన పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తే ఈ మధ్య చాలా తేడా కనిపిస్తుంది. పంచ్ డైలాగులతో పవన్ కార్యకర్తలలో హుషారు నింపుతున్నారు. ఎంత రాసిచ్చిన స్క్రిప్ట్ అయినా ప్రజలను ఆకట్టుకొనేలా మాట్లాడగలగాలి. అలా పవన్ గత ఎన్నికలకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ అయ్యారు. గతంలో స్పీచ్ మధ్యలో ఆవేశంతో కంట్రోల్ తప్పిపోయే పవన్ ఇప్పుడు ఒద్దికగా ఉంటూనే సెటైర్లతో అధికార పార్టీని ఆగమాగం చేస్తున్నాడు. 'ఏపీ బాగుపడాలి అంటే వైసీపీ ఓడాలి'.. 'జనం బాగుండాలంటే జగన్ పోవాలి'.. 'హలో ఏపీ బై బై వైసీపీ' ఇలా కొన్ని స్లొగన్స్ కూడా పవన్ స్వయంగా ప్రకటిస్తూ ప్రజలలోకి వెళ్లేలా చేస్తున్నారు.  మరోవైపు నారా లోకేష్ సైతం ప్రసంగాలలో చాలా పరిణితి సంపాదించుకున్నారు. సింపుల్ గా మాట్లాడుతూనే అర్ధవంతంగా ఉండేలా లోకేష్ స్పీచ్ సాగిపోతుంది. తనపై వైసీపీ నేతలు వేసే సెటైర్లకు నొచ్చుకున్నట్లు ఎక్కడా కనిపించకుండా అవే సెటైర్లను గుర్తు చేస్తూనే వారికి కౌంటర్లు ఇవ్వడంలో లోకేష్ ఎప్పుడో మాస్టర్స్ చేశారు. ఇక ఇప్పుడు ఎటు తిరిగీ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే స్పీకర్ గా వెనకబడి ఉన్నారు. ఫక్తు రోటీన్ గా మారిన ఈ స్పీచ్ లతో విసిగిపోయిన వైసీపీ కార్యకర్తలే.. ఒక్కసారి ఈ స్పీచ్ మారిస్తే చూడాలని ఉందని మాట్లాడుకుంటున్నారు.