పవన్ కొడుకుపై కామెంట్స్..ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీగా ముందుకు సాగుతున్నారు. అయితే వీరికి పుట్టిన పిల్లల్లో అకీరా నందన్ ఇప్పుడు పెద్దవాడు అవుతున్నాడు. తన సినీ ఎంట్రీ కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. తాజాగా రేణూ దేశాయ్, అకీరా నందన్ కలిసి యూరప్ లో ఉన్నారు. అంటే వారేమైనా ట్రిప్ కి వెళ్లారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే అకీరా నందన్, సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు మనవడు అక్కడ ఫిల్మ్ స్కూల్ లో చేరారు. ఈ విషయంపై పవన్ అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం ఉంటుందని వారు పేర్కొన్నారు.