English | Telugu

మొన్న 'జనతా గ్యారేజ్'.. నిన్న 'రంగస్థలం'.. నేడు 'ఉప్పెన', 'పుష్ప'..!!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు అవార్డులు ఒకే సంస్థ నిర్మించిన వేర్వేరు చిత్రాలకుగానూ ఒకే ఏడాది రావడం అరుదనే చెప్పాలి. అయితే, హ్యాట్రిక్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని సుసాధ్యం చేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు) విభాగంలో 'ఉప్పెన'కి గానూ ఒక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకున్న మైత్రీ.. ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్) విభాగాల్లో 'పుష్ప - ది రైజ్'కి గానూ మరో రెండు అవార్డ్స్ క్రెడిట్ చేసుకుంది. మొత్తంగా.. 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో మైత్రీకి 'త్రీ' అవార్డ్స్ దక్కాయి. 

మెగా ఫ్యామిలీకి ఏమైంది?

అదేదో సినిమాలో శాపంతో ఒకే కుటుంబానికి చెందినవారు ఒకరి తర్వాత ఒకరు చనిపోయిన్నట్లుగా.. ఇటీవల మెగా హీరోలు నటించిన సినిమాలు వరుసగా వచ్చినవి వచ్చినట్లు ఫ్లాప్ అవుతున్నాయి. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం బ్రో. జూలై 28న విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తో బయ్యర్లకు రూ.30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకి ఆగస్టు 11న భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నెగటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఫుల్ రన్ లో బయ్యర్లకు రూ.50 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. ఆ సినిమా వచ్చిన రెండు వారాలకి ఈరోజు(ఆగస్టు 25) మరో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున విడుదల కాగా, మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

'గాండీవధారి అర్జున' పబ్లిక్ టాక్.. ఈ దారుణం ఏందయ్యా వరుణ్!?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నుంచి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమైంది. అప్పుడెప్పుడో 'గద్దలకొండ గణేశ్' గా ఆకట్టుకున్న వరుణ్.. ఆ తరువాత వచ్చిన 'గని', 'ఎఫ్ 3'తో భంగపడ్డాడు.  'గని' వంటి డిజాస్టర్ తరువాత వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన సినిమా 'గాండీవధారి అర్జున'. ఇక 'ఏజెంట్' వంటి డిజాస్టర్ తరువాత హీరోయిన్ సాక్షి వైద్య నటించిన చిత్రమిదే. అలాగే 'ది ఘోస్ట్' వంటి ఘోర పరాజయం అనంతరం ప్రవీణ్ సత్తారు నుంచి వచ్చిన మూవీ ఇది. ఇలా.. డిజాస్టర్లతో డీలాపడ్డ ఈ త్రయం నుంచి వచ్చిన 'గాండీవధారి అర్జున'.. శుక్రవారం (ఆగస్టు 25) జనం ముందు నిలిచింది.