నేషనల్ అవార్డ్స్ .. మెగా హీరోల డామినేషన్
కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈసారి తెలుగు సినిమా హవా ఓ రేంజ్లో కొనసాగింది. ట్రిపుల్ ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకోగా పుష్ప ది రైజ్ సినిమాకు రెండు, కొండ పొలం, ఉప్పెన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులపై మెగా హీరోల సినిమాలదే డామినేషన్ క్లియర్గా కనిపిస్తోందని కొందరు అంటున్నారు. గమనిస్తే ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా అయితే ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుని సత్తా చాటింది.