వందే భారత్ రైలు అసలు రంగులోకి..
posted on Jul 10, 2023 @ 10:00AM
వందేభారత్ ఎల్స్ ప్రెస్ రైళ్లంటూ..పేదోళ్ళకి అందనంత ఎత్తులో..జెండా ఊపుతూ.. అదే పనిగా ప్రారంభత్సవాలు చేస్తూ.. జనాలకు విదూషకుడిగా కనిపించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి హాస్యాన్ని పండించారు.
తాజాగా వందేమాతరం ఎక్స్ ప్రెస్ ల రంగు మార్చి.. తమ అసలు రంగును చాటుకున్నారు.వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడు కొత్త రంగులో దర్శనిమమివ్వనుంది. ఇప్పటివరకూ నీలం, తెలుపు రంగులో ఉన్న వందేభారత్ రైళ్లు ఇక కషాయ రంగులోకి మారనున్నాయి. ఈ రైళ్లకు అదనంగా కాషాయ రంగులు వేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.
చైన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో కషాయ రంగుతో ఉన్న వందేభారత్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.వందే భారత్ రైలు తెలుపు రంగులో ఉండడం వల్ల దుమ్ము ధూళి ఎక్కువగా అంటుకోవడంతో, దీంతో రంగు మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నిర్ణయంతో వందే భారత్ రైలు ఇక కషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి.
జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు ఇప్పటి వరకు 25రైళ్లలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయని, జాతీయ జెండా స్ఫూర్తితోనే వందేభారత్ రైళ్లకు కాషాయ రంగు వేయాలని నిర్ణయించుకున్నామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
త్వరలో పర్యాటక మార్గాలను అనుసంధానం చేస్తూ 'టీ ట్రైన్' లను ప్రవేశపెట్టాలే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ తర్వాత.. దక్షిణాదిలో మరెన్నో వందేభాదర్ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. చైన్నైలోని ఐసీఎఫ్లో ఇప్పటివరకూ 70వేల బోగీలు తయారయ్యాయి. ఫీడ్ బ్యార్ ఆధారంగా రైళ్లకు అనేక మార్పులు చేస్తున్నారు. భద్రతా ఫీచర్ యాంటీ-క్లైంబర్స్పై కూడా దృష్టి సారించారు.2023-24లో ఈ కార్మాగారంలో 736 వందే భారత్ రైలు బోగీలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజాభివృద్ధే తమ సర్కార్ అభిమతమని చెప్పుకుంటూ.. పురాతన కూడళ్లు..రోడ్లకు పేర్లు మార్చి.. తమ నైజాన్ని చాటుకున్న కేంద్రం.. ఇప్పుడు రైళ్లకు సైతం.. రంగులు మార్చడం.. కాషాయమే తమ అసలు అభిమతం..ఉద్దేశమని తెలపకనే తెలిపింది కదా అని పరిశీలకులు అంటున్నారు. ఇదే మరి..మోడీ మార్క్ రాజకీయాలంటే..!