జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు!.. సీబీఐ కోర్టు సై..

జ‌గ‌న్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిన‌ట్టుంది. జ‌గ‌న్ బెయిర్ ర‌ద్దు పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. బ‌య‌ట ఉంటే జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషిన‌ర్‌. వెంట‌నే బెయిల్ ర‌ద్దు చేసి వేగంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. పిటిష‌న్ త‌ర‌ఫు అభ్యర్థ‌న‌లు  విన్న న్యాయ‌స్థానం.. కేసును విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఇంత‌కీ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసింది మ‌రెవ‌రో కాదు.. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు. నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్‌ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్‌ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి నోటీసులు ఇస్తారని రఘురామ తెలిపారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.   ర‌ఘురామ‌కృష్ణంరాజు.. కొన్ని రోజులుగా సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోసం విరామం లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌పై ప్ర‌భుత్వ ప్రోద్బంలంతో ఈడీ రైడ్స్ జరుగుతున్నా..కేసులు పెడుతున్నా.. ఏమాత్రం అద‌ర‌డం లేదు.. బెద‌ర‌డం లేదు.. వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. జ‌గ‌న్ అనుస‌రిస్తున్న‌ విధానాల‌పై, అడ్డ‌గోలు పాల‌న‌పై దాదాపు ప్ర‌తీరోజు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ప్ర‌జ‌లను నిత్యం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఎలాంటి పార్టీ స‌పోర్ట్ లేకున్నా.. వైసీపీ ఎంపీగా ఉంటూనే.. వ‌న్ మ్యాన్ ఆర్మీలా.. జ‌గ‌న్‌రెడ్డిపై మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు ర‌ఘురామ‌. తాజాగా, ఆయ‌న దాఖ‌లు చేసిన జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను సీబీఐ కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డంతో ఆ ప్ర‌య‌త్నంలో తొలి విజ‌యం సాధించిన‌ట్టైంది. ర‌ఘురామ త‌లుచుకుంటున్న‌ట్టుగానే.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు అవుతుందా? జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుక వెళ్ల‌క త‌ప్ప‌దా? ఏమో.... ఏదైనా జ‌ర‌గొచ్చు.

కరోనా పోరులోకి సైన్యం! కేంద్రం తీరుపై సుప్రీం అసహనం 

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకు పెరిగిపోతోంది. కేసులతో పాటు మరణాలు భయంకరంగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రతతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో  కరోనా పరిస్థితులపై సుమోటో విచారణ చేపట్టిన  సుప్రీం కోర్టు.. మరోసారి హాట్ కామెంట్స్ చేసింది.  కరోనా కల్లోలంతో దేశం సంక్షోభంలో చిక్కుకుందని, ఇలాంటి సంక్షోభ సమయంలో తాము నోరు మూసుకుని కూర్చోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభంపై స్పందించే హక్కు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఉందని, ఆయా హైకోర్టుల చర్యలను తాము అనుసంధానం చేసుకుంటూ పోతామని స్పష్టం చేసింది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు ఉండే అధికారాన్ని తాము నివారించలేమని, కరోనా పరిస్థితులపై ఆయా హైకోర్టులకు తమ వంతు సహకారం అందిస్తామని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్  ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులు పరిష్కరించలేని విషయాల్లో తాము సాయం చేస్తామంది.  కరోనాపై పోరాటంలో సైన్యం, పారామిలటరీ బలగాలు, రైల్వేలకు చెందిన వైద్య వనరులను ఏమైనా వాడుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికుందా? అని జస్టిస్ రవీంద్ర భట్ ప్రశ్నించారు. క్వారంటైన్, వ్యాక్సినేషన్, బెడ్ల కోసం ప్రస్తుతం ఆర్మీ సాయం తీసుకోవచ్చని, దీనిపై కేంద్ర ప్రణాళిక ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా టీకాలపై వివిధ సంస్థలు విధించిన ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సిన్లు వేయడమే మేలైన మార్గమని వ్యాఖ్యానించారు. అయితే  వ్యాక్సిన్ల సమీకరణ కోసం ఇప్పటికే సంస్థలతో ధరలపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయని.. ఆ చర్చల్లో చెప్పిన ధరకు, ఇప్పుడు సంస్థలు ప్రకటించిన ధరకు తేడా ఉందని జస్టిస్ రవీంద్ర భట్ అన్నారు. దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.  అంతకుముందు సుమోటోగా కేసు విచారణను చేపట్టిన మాజీ సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కరోనాపై జాతీయస్థాయి ప్రణాళికను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటికే ఆ ప్రణాళికను సుప్రీంకోర్టుకు అందజేశామని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం వెల్లడించారు. దీనిపై మరో రెండు రోజుల్లో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ధర్మాసనం వెల్లడించింది. ప్రతి రోజూ కరోనా పరిస్థితులపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఏబీఎన్ రాధాకృష్ణకు సతీవియోగం.. ప్రముఖుల సంతాపం 

ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి  సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్‌‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.  కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర వేలేరులో కనకదుర్గ జన్మించారు. బిషప్ అజరయ్య స్కూల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుకున్న కనకదుర్గ.. విజయవాడలోనే సిటీ పబ్లిక్ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. అనంతరం బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగం చేశారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్‌లోని పలు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లలో ఆమె విధులు నిర్వర్తించారు. బంజారాహిల్స్ బ్రాంచ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కనకదుర్గ వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. 1983 జూలై 3న వేమూరి రాధాకృష్ణ- కనకదుర్గల వివాహం జరిగింది. 2002లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌గా, 2009లో ఏబీఎన్‌లోనూ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కనకదుర్గకు కుమారుడు ఆదిత్య, కుమార్తె అనూష ఉన్నారు. వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ.. సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. సేవా భావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారని తెలిపారు.  వేమూరి రాధాకృష్ణ సతీమణి, వేమూరి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు  సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వేమూరి కనకదుర్గ మరణం తనను కలిచివేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. వేమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కనకదుర్గ ఆత్మకు శాంతి చేకూరాలని నరసింహన్ ఆకాక్షించారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ కనకదుర్గ మృతితో దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్యాంకు అధికారిణిగా పనిచేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలలో తనదైన ముద్ర వేశారన్నారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కనకదుర్గ మృతిపై తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. టీడీపీ నేతలు, మాజీ మంత్రులు  తమ ప్రగాఢ సానుభుతి తెలిపారు. 

ప‌రీక్ష‌లా.. ప్రాణాలా.. ఏటి? జ‌గ‌న్‌రెడ్డి వింటున్నావా?

ఏపీలో రోజూ వేల‌ల్లో క‌రోనా కేసులు. ప‌దుల సంఖ్య‌లో మృతులు. హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ క‌రువు. రాష్ట్రంలో ఆక్సిజ‌న్ కొర‌త‌. టెస్టుల ఫలితాలు ఆల‌స్యం. సెకండ్ వేవ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సునామీలా చుట్టేస్తోంది. నైట్ క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. అత్య‌వ‌స‌రం ఉంటేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కి రావాల‌ని అంతా హెచ్చ‌రిస్తున్నారు. క‌రోనా క‌ల్లోలం ఈ రేంజ్‌లో ఉంటే.. ఇప్పుడు ఏమంత అత్య‌వ‌స‌రం వ‌చ్చింద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి. క‌నీసం సీఎం జ‌గ‌న్ అయినా.. ఈ నిర్ణ‌యాన్ని ఎలా స‌మ‌ర్థించుకుంటారో మ‌రి.  మేలో కొవిడ్ విజృంభ‌ణ తారాస్థాయికి చేరుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. జూన్‌లోనూ అది కొన‌సాగ‌నుంది. జూన్ మొద‌టి వారంలోనే ఎగ్జామ్స్ అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి స్ప‌ష్టం చేసేశారు. త‌గ్గేదే లే.. అంటూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్ర‌క‌టించేశారు. ప‌రీక్ష‌ల ర‌ద్దు కోసం నారా లోకేశ్ ప్ర‌తిరోజూ ప్ర‌భుత్వంతో ఓ మోస్తారు యుద్ధ‌మే చేస్తున్నా.. జ‌గ‌మొండి జ‌గ‌న్ మాత్రం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుకు ఇంట్రెస్ట్ చూప‌డం లేదు. ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌.. విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మేన‌నే విష‌యం ముఖ్య‌మంత్రికి త‌ల‌కెక్క‌డం లేదు.  ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు, సామాన్యుల‌తో పాటు సుదీర్ఘ పాల‌నా అనుభ‌వం ఉన్న కీల‌క‌మైన వ్య‌క్తులు సైతం త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌స్తుత కొవిడ్ ఎమర్జెన్సీ పీరియ‌డ్‌లో కొన్ని రాష్ట్రాలు స్కూల్ ఎగ్జామ్స్‌ను నిర్వ‌హించాల‌నుకోవ‌డం త‌న‌ను షాక్‌కు గురి చేస్తోందంటూ మాజీ ఐఏఎస్ పీవీ ర‌మేశ్ చేసిన  ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇలాంటి చ‌ర్య‌లు క‌రోనా పాండ‌మిక్‌కు మ‌రింత ఆజ్యం పోస్తాయని ఆయ‌న అన్నారు. అయితే, ఎక్క‌డా ఏపీ పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. పీవీ ర‌మేశ్ చేసిన ట్వీట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఉద్దేశించే అంటున్నారు అంతా.   పీవీ ర‌మేశ్, రిటైర్డ్‌ ఐఏఎస్‌. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి. 35 ఏళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పీవీ రమేష్ ప్రజా సేవ చేశారు. రిటైర్మెంట్ తర్వాత సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. అయితే, కొద్ది నెలలకే పీవీ రమేష్ తన పదవి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ప్రస్తుత జగన్ సర్కారులోనూ నిన్న మొన్నటి వరకూ కీలకంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సీఎంవోలో ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరుగా, కీలకమైన విద్య, వైద్యం వంటి శాఖల బాధ్యతలు చూశారు. గ‌తేడాది కరోనా స‌మ‌యంలో ప్రభుత్వం తరఫున సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయ‌నే.. ఇప్పుడు క‌రోనా కాలంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డాన్ని త‌ప్పుబ‌డుతూ ప‌రోక్షంగా ఏపీ స‌ర్కారును కార్న‌ర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం సీఎంవోలో ఉండి ఉంటే.. బ‌హుషా ఈ నిర్ణ‌యాన్ని త‌ప్ప‌కుండా వ్య‌తిరేకించి ఉండేవారు. పీవీ ర‌మేశ్ ముక్కుసూటి వ్య‌వ‌హారం, నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేసే ప‌నితీరు న‌చ్చ‌కే.. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఆయ‌న ప్రాధాన్య‌త త‌గ్గించారు. ప‌ద‌వి వ‌దిలి వెళ్లిపోయేలా చేశారని అంటారు.  ప‌రోక్షంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పీవీ ర‌మేశ్‌ కాంట్ర‌వ‌ర్సీ ట్వీట్స్ చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోనూ ఆయ‌న చేసిన ప‌లు ట్వీట్స్ జ‌గ‌న్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గ‌తంలో విప్లవ రచయిత వరవరరావు అన్న మాటలను ఉటంకిస్తూ పీవీ రమేష్ ట్వీట్ చేయగా తీవ్ర చర్చనీయాంశమైంది.  “నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే.. ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడు నేరస్తుడే!- వరవరరావు” అన్న కోట్‌ను పీవీ రమేష్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని బాగా ట్రోలింగ్ న‌డిచింది.  ఆ తర్వాత పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ చేసిన ఓ ట్వీట్ను రీ ట్వీట్ చేసి.. మ‌ళ్లీ సంచ‌ల‌నంగా నిలిచారు. 1961 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కేబీఎస్ సిద్ధూ ఓ ట్వీట్ పెట్టారు. అందులో దేశంలో ఐఏఎస్ అనేది రాజకీయ నేతలు, వ్యాపారస్తులను మెప్పించే కస్టమర్ సర్వీస్ గా మారిపోయిందని వాపోయారు. ఆ.. రీ ట్వీట్‌తో మ‌ళ్లీ అగ్గి రాజుకుంది. సీఎం జగన్ సీఎంవోలో తనను ఏరికోరి తెచ్చిపెట్టుకున్న ఏడాదికే బాధ్యతల నుంచి తప్పించిన సందర్భంలో పీవీ ర‌మేశ్ చేసిన ఆ రీ ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. ఆ ట్వీట్ చూస్తే.. జగన్ ఆయ‌న్ను కస్టమర్ సర్వీసులా వాడుకుని వదిలేశారనే అర్దం వచ్చేలా ఉండటం అప్ప‌ట్లో ఏపీలో చ‌ర్చ‌ణీయాంశ‌మైంది.  ఇటా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేశ్ చేసిన ప‌లు ట్వీట్లు ప‌రోక్షంగా జ‌గ‌న్ స‌ర్కారును తూట్లు పొడుస్తున్నాయి. పీవీ రమేష్కు ప్రభుత్వ వర్గాల్లో సమర్ధుడిగా మంచి పేరుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించిన క్లీన్ రికార్డు ఆయనది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో సహజంగానే జగన్ సర్కార్ గతేడాది ఆయన్ను సీఎంవో బాధ్యతల్లోకి తీసుకుంది. చెప్పిన మాట విన‌క‌పోవ‌డ‌మో ఏమో కానీ.. ఏడాది తిరగ్గానే ఆయన బాధ్యతల్లో కోతపెట్టారు.  పీవీ రమేష్‌ను పొమ్మ‌న‌క పొగ బెట్టారు. స‌మ‌ర్థుడైన అధికారిని సీఎంవో నుంచి వెళ్ల‌గొట్ట‌డం వెనుక.. ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రిగింది. జ‌గ‌న్ తీసుకునే అసంబ‌ద్ధ నిర్ణ‌యాల‌ను ర‌మేశ్ అంగీక‌రించే వారు కాద‌ని.. ప‌లు అంశాల్లో ఆయ‌న ముఖ్య‌మంత్రి తీరును త‌ప్పుబట్టారంటూ.. ఏవేవో వార్త‌లు వినిపించాయి. ఆ త‌ర్వాత అంతా స‌ర్దుమ‌నిగింది. అప్పుడ‌ప్పుడూ ఇలా ట్వీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా గిల్లుతూ.. జ‌గ‌న్‌రెడ్డి తీరును ట్విట్ట‌ర్‌లో ఎండ‌గ‌డుతూ.. పీవీ ర‌మేశ్ త‌న ఆక్రోషాన్ని వెళ్ల‌గ‌క్కుతుంటారు. క‌రోనా స‌మ‌యంలో  ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఏంటంటూ.. మ‌రోసారి ఆయ‌న చేసిన ట్వీట్ క‌ల‌క‌లంగా మారింది.  ఒక్క పీవీ ర‌మేశ్ అనే కాదు.. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై జ‌న‌మంతా మండిప‌డుతున్నారు. 50 మందితో ఫంక్ష‌న్లు చేసుకోవ‌డానికే అనుమ‌తి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం.. వేలు, ల‌క్ష‌ల్లో ఉండే విద్యార్థుల‌తో ప‌రీక్ష‌లు ఎలా నిర్వ‌హించాల‌ని అనుకుంటుందో అస్స‌లు అర్థం కావ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంద‌ని ఓవైపు నిపుణులు చెబుతుంటే.. ఒకే రూమ్‌లో అంత మంది స్టూడెంట్స్‌ను కూర్చొబెట్టి ఎగ్జామ్స్ ఎలా జ‌రుపుతార‌ని అడుగుతున్నారు?  కేంద్ర స్థాయి బోర్డులైన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సైతం ప‌ది ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌గా.. అనేక రాష్ట్రాలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయ‌గా.. ఒక్క ఏపీలో మాత్రం ఎందుకంత మొండిత‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌రీక్ష‌ల‌కు త‌మ పిల్ల‌ల‌ను పంపాలంటే త‌ల్లిదండ్రులు బెదిరిపోతున్నారు. ఇవి ప‌ది ప‌రీక్ష‌లు కాద‌ని.. త‌మ పిల్ల‌ల ప్రాణాల‌కు ప‌రీక్ష అని వాపోతున్నారు. ప‌రీక్ష‌లు వ‌ద్దంటూ పేరెంట్స్‌, స్టూడెంట్సే అడుగుతుంటే.. ఇక ప్ర‌భుత్వానికి ఇబ్బంది ఏముంది?  ప్ర‌జ‌ల కోస‌మేగా పాల‌కులు ఉండేది? మ‌రి, ప‌రీక్ష‌ల‌పై ఎందుకంత పంతం? బ‌హుశా.. ఇప్పుడు వెన‌క్కి త‌గ్గితే ఆ క్రెడిట్ టీడీపీకి వెళ్తుంద‌నే అక్క‌సు కావ‌చ్చు. ఎగ్జామ్స్‌పై నిత్యం ప్ర‌శ్నిస్తున్న నారా లోకేశ్‌కు మైలేజ్ వ‌స్తుంద‌నే భ‌యం కాబోలు.. ఇలాంటి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ల‌క్ష‌లాది విద్యార్థుల ప్రాణాల‌ను ప‌ణంగా పెడ‌తారా జ‌గ‌న్‌రెడ్డి గారు? అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏటి. విన‌బ‌డుతోందా....

ఆరోగ్య మంత్రి ఎన్నికల ర్యాలీ.. జనాలకు ఇచ్చే సందేశం ఏంటీ?

దేశంలో కరోనా మహమ్మారి మరణ మదృంగం మోగిస్తోంది. రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోనూ కరోనా పంజా విసురుతోంది. సోమవారం ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 52 మంది చనిపోయారు. ఇప్పటికే బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గాలిలో కూడా వైరస్ విస్తరిస్తుందని, జనాలెవరు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా జనాలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాని మంత్రిగారు చెప్పేదొకటి, చేసేది ఒకటిలా ఉంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు మంత్రి ఈటల రాజేందర్.  సోమవారం నగరంలోని పలు డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాస్కు లేకుండానే ప్రసంగించారు. ప్రచార రథంపై ఈటల పక్కన నిల్చున్న నేతలు కూడా మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ఈటల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా కల్లోల సమయంలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. వందలాది మందితో ర్యాలీలు తీస్తూ.. మాస్క్ లేకుండా ప్రసంగిస్తూ.. ఈటల జనాలకు ఏం సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా అయితే జనాలకు కొవిడ్ రూల్స్ ఎలా పాటిస్తారని నిలదీస్తున్నారు.  మంత్రి ఈటల ఎన్నికల ప్రచారానికి రావడమే కాదు..  ప్రచారానికి ‘టీఆర్‌‌‌‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై.. విజయవంతం చేయాలి’ అని ఆదివారం రాత్రి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా కల్లోల సమయంలో ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన ప్రకటనపై డాక్టర్లు, హెల్త్ ఎక్స్ పర్ట్స్ మండిపడుతున్నారు. కరోనాతో జనాలు చస్తుంటే, స్వయంగా హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై డాక్టర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనాలు చస్తుంటే.. ఇదేం పనంటూ ఫైరవుతున్నారు.  హెల్త్ మినిస్టరే ఇలా జనాలను పోగు చేస్తుంటే, ప్రజలను కాపాడేదెవరు.. ఇక ప్రజలకు ఆ దేవుడే దిక్కు’ అని డాక్టర్ విజయేందర్ పోస్ట్ చేశారు. ‘ప్రభుత్వ దవాఖాన్లలో హాస్పిటల్స్ లో క్యాథల్యాబ్ లేక జనాలు చస్తున్నారు. హెల్త్ మినిస్టర్ ఏదో  కష్టపడుతున్నాడనే ఉద్దేశంతో.. వీటన్నింటిపై మేం కంప్లయింట్స్ చేయకుండా సర్దుకుపోతున్నాం. కానీ, ఇప్పుడు ఆయనే ఇలా జనాలను గ్యాదర్ చేస్తుంటే చాలా బాధగా ఉంది’ అని డాక్టర్ నాగార్జున అన్నారు. ‘వాస్తవ పరిస్థితులు ఏంటో జనాలకు తెలియకపోవచ్చు. కానీ, మంత్రులు.. లీడర్లకు తెల్వదా’ అని ప్రశ్నించారు. ‘మంత్రి పిలుపుతో ప్రచారానికి వెయ్యి మంది వస్తారనుకుంటే, అందులో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రెండు కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారు”అని ఆవేదన వ్యక్తం చేశారు.  కరోనా పేషెంట్లను కాపాడేందుకు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కష్టపడుతుంటే.. వైరస్ ను నియంత్రించాల్సిన నాయకులు ఇలా మీటింగ్ లు పెట్టడం దారుణమంటున్నారు వైద్యులు. రాజకీయ నాయకులు ర్యాలీలు, ప్రచారాలతో ఓ వైపు వైరస్ వ్యాప్తికి కారణమవుతూ.. మరోవైపు మొసలి కన్నీరు కారుస్తున్నారని  మండిపడుడుతున్నారు. ఇలాంటి మైండ్ లెస్ రాజకీయాలపై నిరసన వ్యక్తం చేయాలన్నారు.   

దేశంలో వ్యాక్సిన్ ధర ఎక్కువ! మోడీ సర్కారే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లోని కడియం పూలకు ప్రసిద్ధి. అక్కడి నర్సరిలో స్థానికులు, ఏపీలో వాసులు కొనుగోలు చేస్తే రేటు తక్కువ. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో అయితే కడియం పూలకు డబుల్ రేట్. ఇలాంటి పరిస్థితే ఎక్కడైనా ఉంటుంది. పంటలు కూడా అంతే స్థానికంగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వస్తుంది.. బయట మాత్రం ఎక్కువ రేటు ఉంటుంది. కాని కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇండియాలో సీన్ రివర్సైంది. ఇండియాలోనే టీకాలు తయారవుతున్న మనకు ఇతర దేశాల కంటే వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ప్రపంచాన్ని గడగడలాస్తున్న కరోనా మహ్మమారి కట్టడి కోసం వ్యాక్సినే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో రెండు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. పుణెలోని సీరం ఇన్సిట్యూట్ లో ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారవుతుండగా.. హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ లో కోవాగ్జిన్ తయారవుతోంది. సీరమ్ సంస్థ ఇప్పటివరకు కేంద్ర సర్కార్ కు మాత్రమే ఒక్క డోసును 150 రూపాయలకు అందిస్తోంది. అయితే మే 1 నుంచి మాత్రం రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించనుంది. ఇందుకోసం వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది సీరమ్. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాను 4 వందల రూపాయలకు, ప్రైవేట్ సంస్థలకు 6 వందల రూపాయలకు ఇస్తామని తెలిపింది. అయితే ఈ ధరలు .. కొన్ని విదేశాలకు సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ ధర కంటే ఎక్కువ.  ఇండియాలో వ్యాక్సిన్ తయారవుతున్నా.. విదేశాల కంటే ఎక్కువగా ఉండటం ఏంటనే చర్చ వస్తోంది. సీరమ్ తీరును కొందరు తప్పుబడుతున్నారు.విదేశాలతో పోలిస్తే.. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎందుకు ఎక్కువగా ఉందన్న నిలదీత మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎక్కువైంది. ఇండియాలో తాము ప్రకటించిన వ్యాక్సిన్ ధరలపై వివాదం సాగుతుండటంతో సీరం సంస్థ వివిరణ ఇచ్చింది. అసలు కారణం చెప్పేసింది. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన విధానమేనని సీరమ్ సీఈవో పూనావాలా చెప్పారు. ఎందుకంటే.. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నప్పుడే నిధులు సమకూర్చుకోవటం.. ఒప్పందాలు చేసుకోవటమే కారణమని తెలిపారు. అందుకు భిన్నంగా భారత ప్రభుత్వం ఎలాంటి నిధులు అందంచలేదు. ఈ కారణంగానే ఒప్పందంలో భాగంగా కొన్ని దేశాలకు తక్కువ ధరకు తాము వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. రిస్కు తీసుకొని.. ప్రయోగ దశల్లోనే వారు నిధుల్ని సాయంగా అందించారని.. తమ పరీక్షలు ఫలించాయని చెప్పారు. భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని స్పష్టం చేశారు.  పునావాలా చెప్పినదాన్నిబట్టి మోడీ సర్కార్ అస్తవ్యస్థ విధానం వల్లే వ్యాక్సిన్ ధర ఇండియాలో ఎక్కువగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రధాని మోడీ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అంటూ జబ్బలు చరుకుంటున్నారు. కొవిడ్ కట్టడి కోసం మన దగ్గరే టీకా తయారవుతుందంటూ గొప్పలు చెప్పారు. సీరమ్, భారయ్ బయెటెక్ కు వెళ్లి పరిశీలించి.. ఫోటోలు కూడా దిగారు. కాని ఇతర దేశాల మాదిరి ఆలోచన మాత్రం చేయలేదు. పీఎం కేర్ లో వేల కోట్ల రూపాయలు ఉన్నా.. టీకా తయారీ సంస్థలకు పరిశోధనల సమయంలో అడ్వాన్సులు మాత్రం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు టీకా ధర పెరిగిపోయింది. మోడీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎంతసేపు పబ్లిసిటి రాజకీయాలు తప్ప.. అవసరమైన ఆలోచనలు మాత్రం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  మిగిలిన దేశాల మాదిరి.. కరోనా టీకాలపై జరుగుతున్న ప్రయోగాల సందర్భంలోనే మోడీ సర్కారు సీరంతో పాటు మిగిలిన సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి ఉంటే.. ఈ రోజున ఈ స్థాయి ధరల్ని భరించాల్సి వచ్చేది కాదు. మిగిలిన దేశాలు ఆలోచించిన తరహాలో కేంద్రం ఎందుకు ఆలోచించనట్లు? అన్నది ప్రశ్న. ఈ లెక్కన చూస్తే.. మోడీ సర్కారు చేసిన తప్పునకు దేశ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భావన కలుగక మానదు. 

కరోనా గుప్పిట్లో దేశం.. 

కరోనా గుప్పిట్లో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నిత్యం వేల కేసులతో దేశం విలవిలలాడుతుంది. కరోనా మరణాలతో కలకలం రేపుతోంది. మరణాలు రేటు ఆకాశాన్ని అంటుంది. వరుసగా 6వ రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 3,52,991 పోలిస్తే 8.4 శాతం తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 2771 మంది మరణించారు. ఇది నిన్నటి మరణాల సంఖ్య 2812 కన్నా తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఇక మొత్తం మరణాల సంఖ్య 2లక్షలకు దగ్గరగా ఉంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,97,894కు చేరింది. తాజాగా 2,51,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణాలో కరోనా పంజా..  తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా… తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి పదివేల మార్క్ దాటాయి. తాజాగా ఈరోజు 10,122 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 52 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,11,905 కరోనా కేసులు నమోదు అవగా, మొత్తం 2094 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 69,221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. 

మామిడి కాయల దొంగలు అరెస్ట్..  

కోడి కత్తికి వ్యక్తి మృతి. ఎదురుగా ఉన్న ఇంట్లో పాల పాకెట్ దొంగతనం. షావుకారి షాప్ లో బెల్లం దొంగతనం. అని అప్పుడప్పుడు  ఇలాంటి  వింత వార్తలు వింటుంటాం. ఇప్పుడు మీరు చదివే వార్త కూడా వింత వార్తనే.. కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది.  దొంగతనం అందరు చేస్తారు. కొందరి దొంగతనం వృత్తి. మరి కొందరికి అదే దొంగతనం అవసరం. ఇంకొందరికి  అదే దొంగతనం అలవాటు. దొంగతనం అంటే అందరికి గుర్తుకు వచ్చేది. ఏ బంగారమే. డబ్బులు దొంగతనం చేయడమో అనుకుంటారు. కొంత మంది  దొంగతనం చేస్తారు.  కానీ కొందరు చాలా ఈజీ గా దొరికిపోతారు.. మరి కొందరు అయితే చాలా ముదుర్లు చిక్కారు దొరకరు. ఒక్కోసారి చేసింది చిన్న దొంగతనం అయినా, ఆ దొంగ దొరికితే,  ఆ దొంగతనం వల్ల పెద్ద శిక్షలే పడుతాయి. నేరం ఏదైనా  చివరికి శిక్ష తప్పదు. వీళ్ళు కూడా దొంగతనం చేశారు. దొంగ తనం అంటే అలాంటిలాంటి దొంగతనం కాదు.. మామిడి కాయలు దొంగతనం చేశారు. అందుకు వారు భారీ మూల్యం చెల్లించుకున్నారు..  పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దొంగలు పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంబడించి పట్టుకోగా.. చివరకు మామిడికాయ దొంగలు అని తేలింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ శివారులోని మొర్రి విజయ్ అనే రైతు తన మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మామిడి కాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చల్‌గల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో ఒక ప్యాసింజర్ ఆటోలో మామిడికాయలతో నలుగురు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా మామిడి కాయలను దొంగతనం చేశామని ఒప్పుకోవడంతో వారి నుండి రెండు క్వింటాళ్ల మామిడి కాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.  

ఏపీలో అంతా రివర్స్! కొవిడ్ కట్టడిలోనూ సేమ్ సీన్ 

ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లుగా అంతా రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దేశమంతా ఒక దారి అయితే... ఏపీది మరో దారిలా ఉంది. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా... ఆయన వైఖరి మాత్రం మారడం లేదు. కరోనా మహమ్మారి కల్లోల సమయంలోనూ రివర్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు జగన్ రెడ్డి. దేశమంతా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తే.. ఏపీలో మాత్రం నిర్వహించి తీరుతానంటూ పంతం పట్టి కూర్చున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఎవరూ చెప్పినా పట్టించుకోవడం లేదు జగన్ రెడ్డి. తాజాగా దేశమంతా మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తుండగా... ఏపీలో మాత్రం అది అమలు కావడం లేదు. నెల రోజుల తర్వాత అంటే జూన్ లో టీకాలు ఇస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్.  కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే ఏపీలో మాత్రం జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడమే పరిష్కారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎంత వేగంగా వ్యాక్సినేషన్ చేపడితే అంత త్వరగా మహమ్మారి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. అందుకే కేంద్రం కూడా వ్యాక్సినేషన్ పైనే మొత్తం దృష్టి సారించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా టీకాలు వేసే అవకాశం కల్పించింది. దేశమంతా వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ చేసింది. మే1 నుంచి జరిగే వ్యాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏపీ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. నెల రోజుల ఆలస్యంగా అంటే జూన్ 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి టీకాలు ఇస్తామని ప్రకటించింది. జగన్ సర్కార్ తీరుపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.  

ప్యాలెస్ లోనే సీఎం.. ప్రాబ్లమ్స్ లో జనం.. చంద్రబాబు ఉంటేనా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఏమైంది? ఈ క‌రోనా క‌ల్లోలం ఏంటి? ఒక్క‌రోజులో దాదాపు 10వేల కేసులు రావ‌డ‌మేంటి? ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప్ర‌జ‌ల ప్రాణాలు పోవ‌డ‌మేంటి? బెడ్స్ లేక బెజ‌వాడ‌, ఒంగోలు ఆసుప‌త్రుల్లో ఆ దారుణ ప‌రిస్థితులేంటి? ఆఖ‌రికి కొవిడ్ ప‌రీక్షా ఫ‌లితాలు అంత ఆల‌స్యంగా ఇవ్వ‌డ‌మేంటి? ఏంటి? ఇదంతా ఏంటి? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ అరాచ‌క‌మేంటి? ఇది ఎవ‌రి వైఫ‌ల్యం? ఇంకెవ‌రి నిర్ల‌క్ష్యం? త‌ప్పంతా ప్ర‌జ‌ల‌దా? లేక‌, ఈ పాపం పాల‌కులదా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు. ఇవి ప్ర‌శ్న‌లు మాత్ర‌మే కావు. ప్ర‌జ‌ల ఆక్రంద‌న‌. రోగుల క‌న్నీటి మంట‌. ఏపీకి యువ ముఖ్య‌మంత్రి ఉన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న చేసిన సుదీర్ఘ పాద‌యాత్రం చూసి.. యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అనుకున్నారు. అధికారం కోస‌మే అప్పుడాయ‌న అంత యాక్టివ్‌గా ఉన్నార‌ని.. ఒక‌సారి అంద‌లమెక్కాక‌.. ఇక మొద్దు నిద్ర‌లోకి జారుకున్నార‌ని ఎప్పుడో తెలిసొచ్చింది. ప్ర‌స్తుత కొవిడ్ స‌మ‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. ఓవైపు ఏపీ ప్ర‌జ‌లు క‌రోనాతో పిట్ట‌ల్లా రాలిపోతున్నా.. ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ లేక చ‌నిపోతున్నా.. అస‌లు హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ దొర‌క్క న‌ర‌క‌యాత‌న ప‌డుతున్నా.. మ‌న ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. తాడేప‌ల్లిలోని ప్యాల‌స్ వీడి.. కొవిడ్ కోసం క‌దలి రావ‌డం లేదు. ఎంత చేత‌గాని త‌నం? ఎంత చేవ‌లేని ప్ర‌భుత్వం? అంటున్నారు ప్ర‌జ‌లు.  మొక్కుబ‌డిగా కొవిడ్ స‌మీక్ష మిన‌హా.. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డంపై గ‌ట్టిగా మ‌న‌సు పెట్టి ప్ర‌య‌త్నించింది లేదు. ప‌క్క రాష్ట్రం ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.. 74 ఏళ్ల వ‌య‌సులోనూ చ‌లాకీగా పని చేస్తున్నారు. తాజాగా, భువ‌నేశ్వ‌ర్‌లోని ఆసుప‌త్రిలో ఆక‌స్మిక త‌నిఖీ నిర్వ‌హించారు. కొవిడ్ ప‌రిస్థితిని స‌మీక్షించారు. స్వ‌యంగా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌కే హాస్పిట‌ల్‌కు త‌ర‌లిరావ‌డంతో అంతా అల‌ర్ట్ అయ్యారు. ముఖ్య‌మంత్రి ఎప్పుడు ఏ ఆసుప‌త్రిని త‌నిఖీ చేస్తారోన‌నే భ‌యంతో వైద్య సిబ్బంది అంతా మ‌రింత చిత్త‌శుద్ధిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అటు, క‌ర్నాట‌క సీఎం యడ్యూర‌ప్ప సైతం 78 ఏళ్ల వ‌య‌సులో ఉత్సాహంగా ప‌ని చేస్తున్నారు. త‌న‌కు క‌రోనా సోకినా వెర‌వ‌లేదు. ఆయ‌న కూడా ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని త‌నిఖీ చేసి.. సిబ్బందికి కొవిడ్ చ‌ర్య‌ల‌పై సూచ‌న‌లు ఇచ్చారు.  ఇలా వ‌య‌సు పైబ‌డిన ముఖ్య‌మంత్రులే క‌రోనాపై క‌ద‌న‌రంగంలోకి దిగితే.. మ‌న ఏపీ ముఖ్య‌మంత్రివ‌ర్యులు మాత్రం ఇంత వ‌ర‌కూ ఒక్క ఆసుప‌త్రినైనా సంద‌ర్శించ‌లేదు. కొవిడ్ చికిత్స లోటుపాట్ల‌ను ప‌రిశీలించ‌లేదు. రోగుల‌కు ధైర్యం చెప్ప‌లేదు. జ‌గ‌న్‌రెడ్డికి పేటెంట్ అయిన‌.. ఓదార్పు యాత్ర చేప‌ట్ట‌లేదు. విజ‌య‌వాడ‌, ఒంగోలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల కోసం రోగులు రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్నా.. ఆఖ‌రికి శ‌వ‌ద‌హ‌నానికీ ఇబ్బందులు ఎదుర‌వుతున్నా.. ప‌ట్టించుకోవ‌డం లేదు. విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ స‌మ‌స్య‌తో రోగులు చ‌నిపోయినా.. త‌గు చ‌ర్య‌లు లేవు. ఇంత ఉదాసీన ముఖ్య‌మంత్రి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేదు ఏపీ ప్ర‌జ‌లు అని వాపోతున్నారు.  సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి ప్యాలెస్‌ను వ‌దిలి ప్ర‌జాక్షేత్రంలోకి వ‌స్తే.. వాస్త‌వ‌ ప‌రిస్థితులు తెలుస్తాయి. యంత్రాంగంలో బాధ్య‌త పెరుగుతుంది. తిరుప‌తిలో ఉప ఎన్నిక ఉంటే.. ప్ర‌చారానికి సిద్ధ‌మైన జ‌గ‌న్‌.. ప్ర‌స్తుతం ఆంధ్ర రాష్ట్ర‌మంతా కొవిడ్‌తో అల్లాడిపోతుంటే మాత్రం క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌కు పూనుకోవ‌డం లేదు. కొవిడ్ ప‌రీక్ష‌లో ఆల‌స్యాన్ని నివారించ‌డం లేదు. ఆక్సిజ‌న్ కొర‌త‌ను తీర్చ‌డం లేదు. హాస్పిట‌ల్‌లో బెడ్స్ లేక రోగులు అవ‌స్థ‌లు ప‌డుతుంటే ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కరోనా కోర‌ల్లో చిక్కుకుపోయి ఇంత‌గా అల్లాడిపోతుంటే.. మ‌రీ, ఇంత నిర్ల‌క్ష్య‌మా? మ‌రీ, ఇంత లెక్క‌లేని త‌న‌మా? అని అడుగుతున్నారు ప్ర‌జ‌లు.  ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. ఆ త‌ర్వాత న‌మ్మి మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. అందుకు ఫ‌లితం రెండేళ్లుగా అనుభ‌విస్తున్నారు. ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలో తాము చేసిన త‌ప్పునకు పెద్ద శిక్షే అనుభ‌విస్తున్నారు. ఏపీలో కొవిడ్ కేసులు విజృంభిస్తున్నా.. స‌ర్కారులో ఉలుకూప‌లుకు లేదు. ముఖ్య‌మంత్రి నుంచి స‌రైన చ‌ర్య‌లు లేవు. మ‌రో తెలుగురాష్ట్రం తెలంగాణకంటే ఆల‌స్యంగా లాక్‌డౌన్ పెట్టారు. మొన్న‌టి వ‌ర‌కూ స్కూల్స్‌ తెరిచే ఉంచారు. రేపోమాపో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పెట్టేందుకూ సిద్ధ‌మ‌వుతున్నారు. దేశ‌మంతా ఎగ్జామ్స్ ర‌ద్దు చేస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం ఏం ఉద్ద‌రిద్దామ‌నో గానీ ప‌రీక్ష‌ల‌పై పంతానికి పోతున్నాడు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నాడు. పాపం.. నారా లోకేశ్‌.. రోజూ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ప‌రీక్షలు వ‌ద్దంటూ సీఎంను అడుగుతూనే ఉన్నాడు. ఇదేమి తుగ్ల‌క్ చ‌ర్య‌లంటూ నిల‌దీస్తూనే ఉన్నాడు. గ‌వ‌ర్న‌ర్‌కు సైతం లెట‌ర్ రాశాడు. అయినా.. స‌ర్కారుకు తెలిసి రావ‌డం లేదు. ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు పెట్ట‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో జ‌గ‌న్‌రెడ్డికి అర్థం కావ‌డం లేదు. మ‌రో నీరో చ‌క్ర‌వ‌ర్తి క‌దా మ‌న ముఖ్య‌మంత్రి.. అనుకుంటున్నారు ప్ర‌జ‌లు. అప్పుడు ఆయ‌న‌కు ఎందుకు ఓటేశామా అని ఇప్పుడు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.  గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో జ‌గ‌న్‌ను పోల్చి చూసుకొని బాధ‌ప‌డుతున్నారు జ‌నాలు. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండి ఉంటేనా.. అంటూ ఆయ‌న ప‌నితీరును గుర్తు చేసుకుంటున్నారు. సీఎం చంద్ర‌బాబు డ్యాష్ బోర్డులో.. ఏపీ కొవిడ్ సిట్యూయేష‌న్ మొత్తం నిక్షిప్తం అయి ఉండేది. ఎక్క‌డ ఏ హాస్పిట‌ల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.. ఏ జిల్లాలో ఎంత మంది పేషెంట్స్‌కి బెడ్స్ అవ‌స‌రం.. ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఎన్ని కిట్స్ అద‌నంగా ఉన్నాయి.. ఎక్క‌డ ఆక్సిజ‌న్ అవ‌స‌రం.. అద‌న‌పు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి.. ఇలా నిత్యం.. ఆప‌రేష‌న్ కొవిడ్ నిర్వ‌హిస్తూ  ఉండేవారు చంద్ర‌బాబు. అధికారుల‌ను, వైద్య సిబ్బందిని ఉరుకులు ప‌రుగులు పెట్టించే వారు. తాను నిద్ర పోకుండా.. ఆఫీస‌ర్ల‌ను నిద్ర‌పోనీకుండా.. రాష్ట్రంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్త‌య్యే వర‌కు విశ్ర‌మించ‌క‌పోయేవారు చంద్ర‌బాబు. అలాంటి వ‌ర్క్ హాలిక్ చంద్ర‌బాబును కాద‌ని, జ‌గ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నందుకు ఇప్పుడీ అవ‌స్థ‌లు అంటున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు. కొవిడ్ క‌ల్లోల ప‌రిస్థితి మ‌రింత దిగ‌జార‌క ముందే.. జ‌గ‌న్‌రెడ్డి.. రాజ‌ప్ర‌సాదం వీడి.. వీధుల్లోకి వ‌స్తేనే.. అధికారులు, వైద్య సిబ్బందిలో బాధ్య‌త పెరిగేది.. కొవిడ్ క‌ష్టాల నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగేది. మ‌రి, జగ‌న్‌రెడ్డి వ‌స్తాడా?ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తాడా? 

స్థలం కోసం.. అన్నను చంపిన తమ్ముడు 

అది తెలంగాణ. చేవెళ్ల మండలం. కౌకుంట్ల గ్రామానికి చెందిన దివిటి ఎల్లయ్య అనే వ్యక్తికి  ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్, చిన్న కుమారుడు రాజు. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎల్లయ్య ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలం కోసం అన్న దమ్ముల మధ్య గొడవ పడ్డారు.   ఆ విషయంలో తండ్రి మాట వినలేదు ఇద్దరు కొడుకులు.  స్థలం విషయమై గ్రామ సర్పంచ్ సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయినా ఫలితం లేదు. ఆ అన్నదమ్ముల నిప్పు రాజుకుంటూనే ఉంది. మధ్య చిన్న చిన్న విషయాలకే తరుచు గొడవలు జరిగేది.   సోమవారం సాయంత్రం తమ్ముడు రాజు తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కర్రలు పాతేందుకు గుంతలు తవ్వుతుండగా అన్న అశోక్ గుంతలు ఎందుకు తవ్వుతున్నావ్ అంటూ ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంకా అంటే అంతలో తీవ్ర కోపానికి గురైన తమ్ముడు. అటు ఇటు చూశాడు. అన్న తనపని తాను చేసుకుంటున్నాడు. ఒక్కసరిగా రాజు బండరాయితో అన్న అశోక్ తలపై బలంగా కొట్టాడు.. అశోక్ కుప్పకూలి పడిపోయాడు.. తల నుండి  తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు.   దీంతో సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లి హత్యకు పాల్పడిన రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమాజం లో తన మన తేడా లేకుండా పోయింది. ఆస్తి కోసం, అత్యాశ కోసం, అధికారం కోసం, అయినా వాళ్ళనే కడతేరుస్తున్నారు. సొంత వాళ్ళనే కన్నీటి సంద్రంలో ముంచుతున్నారు. ఏం చేసిన ఎంత సంపాదించినా.. జానెడు పొట్ట కోసం.. ఆరడుగుల నెల కోసమే అని తెలుసుకోవాలి.     

సీజేఐ పేరుతో ఫేక్ ట్వీట్ ఖాతా! పోలీసులకు జస్టిస్ ఎన్వీ రమణ ఫిర్యాదు 

సోషల్ మీడియాలో ఫేక్ బాగోతం దారుణంగా తయారైంది. ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి పేరుతోనే నకిలీ ఖాతా స్పష్టించారు కేటుగాళ్లు. తన పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో పోస్టులు వస్తున్న విషయాన్ని గుర్తించిన సీజేఐ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్విట్టర్‌లో తన పేరిట నకిలీ ఖాతా సృష్టించి పోస్టులు పెడుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  సీజేఐ పేరుతో పేక్ ఖాతా పెట్టిన ఫేక్ వ్యక్తి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి ఈ ఫేక్ ఖాతాలో చేసిన ఓ పోస్టు వివాదాస్పదంగా ఉండడంతో జస్టిస్ ఎన్వీ రమణ వెంటనే అప్రమత్తమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.  ‘‘జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నెరిపిన దౌత్యంతోనే అమెరికా భారత్‌కు ముడిపదార్థాలు పంపాలని నిర్ణయించుకుంది’’ అంటూ పీఎంఓను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు 98 సార్లు ఈ నకిలీ ఖాతా నుంచి వివిధ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణ ఈనెల 24న సుప్రీంకోర్టు 48వ  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 

వంద‌ల కోట్ల దోపిడీ.. క‌రోనాతో వ్యాపార‌మా? ప్ర‌భుత్వాల చేత‌గాని త‌న‌మా?

పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఆక్సిజ‌న్ పీలుస్తూనే బ‌తుకుతున్నాం. క‌రోనా వ‌స్తే మాత్రం కృత్రిమంగా ఆక్సిజ‌న్ పెడితేనే బ‌తికే ప‌రిస్థితి. సెకండ్ వేవ్‌ కొవిడ్ క‌ల్లోలంలో ఆక్సిజ‌న్‌కు ఫుల్ డిమాండ్‌. అందుకే అదిప్పుడు వ్యాపార వ‌స్తువు.  రెమ్‌డెసివిర్‌. ఇది క‌రోనాకు క‌చ్చిత‌మైన మెడిసిన్ కాకపోయినా.. ప్ర‌స్తుత స‌మ‌యంలో కొవిడ్ నుంచి ప్రాణాల‌ను కాపాడే సంజీవిని. క‌రోనాతో ప్రాణాపాయంలో ఉన్న రోగిపై రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు బాగా ప‌ని చేస్తున్నాయి. కొవిడ్‌కు చికిత్స వ‌చ్చేలోగా.. రెమ్‌డెసివిరే మెరుగైన మందు. అందుకే, ఈ ఇంజెక్ష‌న్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ వేల‌కు వేలు దండుకుంటున్నారు. క‌రోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉంది. చాలా మందికి ప్రాణాంత‌కంగా మారింది. హాస్పిట‌ల్‌లో చేరాల్సిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. అందుకే, హాస్పిట‌ల్ బెడ్స్‌కు బాగా గిరాకీ. అందుకే, ప్రైవేట్‌ హాస్పిట‌ల్స్.. బిజినెస్ సెంట‌ర్స్‌గా మారాయి. కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి.   ఆక్సిజ‌న్‌, రెమ్‌డెసివిర్‌, బెడ్స్‌.. ఈ మూడు ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌లో అంగ‌ట్లో వ‌స్తువులు. కాయ్ రాజా కాయ్ అన్న‌ట్టు.. ఎవ‌రు ఎక్కువ ధ‌ర పెడితే వారికే ఆ సేవ‌లు. అంతా కృత్రిమ కొర‌త‌. అడ్డ‌గోలు దందా. రెమ్‌డెసివిర్‌. ఒక్కో ఇంజెక్ష‌న్ ధ‌ర సుమారు 3వేలు. కానీ, 3వేలు పెడితే మార్కెట్లో రెమ్‌డెసివిర్ దొర‌క‌దు. డౌట్ ఉంటే ఓసారి ట్రై చేసి చూడండి. మీకే తెలిసొస్తుంది. 3వేలు ఇస్తే.. ఇంజ‌క్ష‌న్లు స్టాక్‌ లేవ‌నే స‌మాధానం వ‌స్తుంది. అదే, ధ‌ర ఎంతైనా ప‌ర్లేదు అని చెప్పి చూడండి. వెంట‌నే.. ఎన్ని కావాలి? సార్‌.. అనే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఒక్కో రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్‌ను బ్లాక్‌మార్కెట్‌లో సుమారు 30వేల‌కు అమ్ముతున్నారు. 3వేలు ఎక్కడ‌? 30 వేలు ఎక్క‌డ‌? ఎంత తేడా.. ఎంత ప్రాణాపాయం ఉన్నా.. మ‌రీ అంత నిలువుదోపిడీ చేయాలా?  రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ను ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే.. ప్ర‌భుత్వాలు ఏం చేస్తున్న‌ట్టు?  మందుల‌తో ఇలా అడ్డ‌గోలు వ్యాపార‌మేంటి? అని అడిగినా.. పట్టించుకునే పాల‌కుడే లేడు. అందుకే వాళ్లు అలా బ‌రితెగిస్తున్నారు.  కేవ‌లం రెమ్‌డెసివిర్ మాత్ర‌మే కాదు.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ది అంత‌కు మించి దగా. క‌రోనా కాలంలో కాదేదీ అక్ర‌మ వ్యాపారానికి అన‌ర్హం. కొవిడ్ పాజిటివ్‌తో ఆసుప‌త్రుల్లో చేరుతున్న వారిలో పావు వంతు మందికి ఆక్సిజ‌న్ అవ‌స‌రం అవుతోంది. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ షార్టేజ్ వ‌ల్ల చాలా హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ను రోగుల‌నే తెచ్చుకోమంటున్నారు. ఇదే ఇప్పుడు మంచి వ్యాపార అవ‌కాశంగా మారింది. ఏపీ, తెలంగాణ‌లో  ఆక్సిజ‌న్ దొర‌క‌డం క‌ష్ట‌త‌ర‌మైంది. ఆక్సిజ‌న్ అందించే ప్లాంట్లు త‌క్కువ‌గా ఉండ‌టం.. వాటి ముందు భారీ క్యూ లైన్లు క‌నిపిస్తున్నాయి. డిమాండ్ అమాంతం పెరిగిపోవ‌డంతో.. ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు.. హాస్పిటల్ మేనేజ్ మెంట్లు.. ఎవ‌రికి వారే.. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను బ్లాక్ చేస్తున్నారు కేటుగాళ్లు. నో స్టాక్ బోర్డులు పెట్టి.. బ్లాక్ మార్కెట్లో అడ్డ‌గోలు ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు.  విజ‌య‌న‌గ‌రం మ‌హారాజా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ అంద‌క ప‌లువురు చ‌నిపోయారు. అర్థ‌రాత్రే ఆ ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ నిలిచిపోయింద‌ని అంటున్నారు. తాము అప్ప‌టిక‌ప్పుడు బ‌య‌టికి వెళ్లి.. 16వేల‌కు ఒక సిలిండ‌ర్ చెప్పున.. 32వేలు పెట్టి రెండు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కొని తెచ్చామ‌ని రోగి బంధువులు చెప్పారు. ఏపీలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల బ్లాక్ మార్కెటింగ్ ఏ రేంజ్‌లో సాగుతోందో చెప్ప‌డానికి ఈ ఘ‌ట‌న ఓ ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌మే ఇలా అక్ర‌మార్కులు బ‌రితెగించ‌డానికి కార‌ణం. ప్ర‌స్తుత పాండ‌మిక్ సిట్యూయేష‌న్‌లోనూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల అమ్మ‌కంపై స‌ర్కారు స‌రైన విధానం అవ‌లంభించ‌క‌పోవ‌డం.. అక్ర‌మార్కుల‌పై ఉక్కుపాదం మోప‌క‌పోవ‌డం వ‌ల్లే ఇలా ప్రాణాలు నిల‌పాల్సిన ప్రాణ‌వాయువు అంగ‌డి స‌రుకుగా మారింద‌నే విమ‌ర్శ వినిపిస్తోంది.  ఇక‌, ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దోపిడీ అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. చిన్నా, పెద్దా తేడా లేదు.. గ‌ల్లీలో ద‌వాఖానా అయినా.. కార్పొరేట్ హాస్పిట‌ల్ అయినా.. ఒక‌టే బాదుడు. ముందు నో బెడ్స్ అంటారు. బాధితుడు ప్రాణ‌భ‌యంలో ఉంటాడు. బిల్‌ ఎంతైనా క‌డ‌తానంటాడు. ఇదే క‌దా వారికి కావ‌ల‌సింది. పేషెంట్‌ని అడ్మిట్ చేసుకోకుండానే.. ల‌క్ష‌ల్లో డిపాజిట్ చేయిస్తారు. అలా, ల‌క్ష‌లు క‌ట్టించుకున్నాకే.. బెడ్ ఇస్తారు. ఆ త‌ర్వాత ఎన్ని రోజులు హాస్పిట‌ల్స్‌లో ఉంటే.. అన్ని ల‌క్ష‌ల బిల్లు కామ‌న్‌. ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తారు. ఎవ‌రైనా బిల్లు క‌ట్టలేక‌పోతే.. దౌర్జ‌న్యాల‌కు తెగ‌బ‌డుతున్నారు. త‌మ‌కు అధికంగా బిల్లు వేశారంటూ.. మంత్రుల‌ ట్విట్ట‌ర్ ఖాతాల‌కు నిత్యం అనేక ఫిర్యాదులు వ‌స్తుంటాయి. అయినా, ఏ పాల‌కుడూ వాటిని ప‌ట్టించుకోడు. ఇలా, కోట్ల‌లో సాగుతోంది కార్పొరేట్ హాస్పిట‌ల్స్ దందా. ప్రాణం పోసే వాడు దేవుడే.. మ‌రి, ప్రాణం పోయేంత బిల్లు వ‌సూలు చేసేవాడిని ఏమ‌నాలి? ఈ దారుణాల‌ను అడ్డుకోని పాల‌కుల‌ను ఎవ‌రు నిల‌దీయాలి? ఇలా.. క‌రోనా కాలంలో మందులు, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఆసుప‌త్రి బెడ్లు.. అన్నిటినీ వ్యాపార వ‌స్తువుగా మార్చేశారు. వీటి బ్లాక్ మార్కెటింగ్ విలువ‌.. వంద‌ల కోట్ల‌లోనే ఉంటుంది. పాల‌కులు క‌న్నెర్ర చేస్తేనే గానీ.. ఈ పాపం ఆగ‌దు? మ‌రి, మొద్దు నిద్ర‌లో ఉన్న నాయ‌కులు.. ఈ దారుణాల‌ను అడ్డుకుంటారా? క‌రోనాతో క‌ష్ట‌కాలంలో ఉన్న త‌మ ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటారా?   

ఒక రోగితో 406 మందికి వైరస్! ఇంట్లో కూడా మాస్క్ మస్ట్..

దేశంలో కరోనా మహ్మమారి ఊహంచని విధంగా విలయ తాండవం చేస్తోంది. మొదటి దశతో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో కోవిడ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  ఢిల్లీ, ముంబై వంటి నగరాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.  మహారాష్ట్ర, యూపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్  రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కల్గిస్తోంది.  కరోనా విజృంభణతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కోవిడ్ బాధితులు వైద్యుల సలహా మేరకే హాస్పిటల్స్ లో చేరాలని చెప్పింది. కొందరు రోగులు లక్షణాలు లేకున్నా  అనవసర భయాలతో హాస్పిటల్స్ కు వెళుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వార్ అన్నారు. దీంతో కచ్చితంగా చికిత్స అవసరమైన బాధితులకు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకడం లేదు. కరోనా బాధితులు ఖచ్చితంగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు లవ్ అగర్వాల్. ఒక రోగి నుంచి నెలలో 406 మంది వైరస్ సోకుతుందన్నారు.  మరోవైపు బయటికి వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం వచ్చిందని నీతి అయోగ్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో నీతి అయోగ్ ఆరోగ్య విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వీకే పాల్ ఈ సూచన చేశారు. ‘‘కోవిడ్ తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో ఉన్న సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచింది’’ అని ఆయన చెప్పారు. 

వీఆర్ఏ సూసైడ్.. ఎందుకో తెలుసా? 

ఆమె పేరు మహంకాళి దివ్య. ఆమె పెద్దపల్లిలో నివాసం ఉంటుంది. ఆమె నిమ్మనపల్లి గ్రామ వీఆర్ఏ. ఆమెకు గతంలో పెళ్లి అయింది. కుటుంబంలో గొడవల కారణంగా విడాకులు కూడా అయ్యాయి. పనిచేసే చోట్ల ఈ వేధింపులకు గురి అయింది. తోటి ఉద్యోగులే మహిళల పాలిట చాలా నీచంగా వ్యవహరించారు. అయితే సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు మహిళ ఉద్యోగులు ఇలాంటి వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొందరైతే వేధింపులు భరించలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ వీఆర్‌ఏ తోటి ఉద్యోగి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఓపెన్ చేస్తే.. ఆమెకు పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన శేఖర్‌తో కొన్నెళ్ల కిందట వివాహం జరిగింది. దివ్య నిమ్మనపల్లి వీఆర్‌ఏ‌గా విధులు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు పొందిన దివ్య ను తోటి ఉద్యోగి అయితే కొద్దికాలంగా కొత్తపల్లి గ్రామ వీఆర్‌ఏ పెర్క వెంకటేశ్.. ప్రేమ పేరుతో వెంటపడి వేధించడం స్టార్ట్ చేసిశాడు. ఆమె నో చెప్పింది.. ఈ విషయమై దివ్య కుటుంబసభ్యులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా వెంకటేష్ వినలేదు అక్కడితో ఆగకుండా.. తనను పెళ్లి చేసుకోవాలంటూ కార్యాలయంలోని ఓ తాత్కాలిక ఉద్యోగి ద్వారా మధ్యవర్తిత్వం కూడా నడిపాడు. శనివారం రాత్రి నేరుగా దివ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు ఆ నీచుడు..  కట్ చేస్తే.. చీకటి పడింది.. ఆ తర్వాత తెల్లారింది.. దివ్య తమ్ముడు నిద్రలేచి చూసే సరికి.. ఇంట్లో రెండు కాళ్ళు వేలాడుతున్నాయి.. అక్క అక్క అని అరిచాడు ఆ తమ్ముడు.. ఎంత అరిచినా ఆ తమ్ముడి అరుపులు ఆ అక్కకి వినిపించలేదు.. ఎందుకంటే ఆ అక్క ప్రాణం అప్పటికే గాలిలో కలిసిపోయింది.. వెంకటేష్ ఆ ముందు రోజు రాత్రి దివ్య ఇంటి దగ్గర చేసిన రచ్చకి.. మనస్తాపంచెంది.. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దివ్య..దివ్య సోదరుడు దిలీప్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు దివ్యకు తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్‌ ఉన్నారు.

కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్ రిక్రూట్ చెయ్! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. వైద్యశాఖలో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయంపై ఆమె సెటైర్లు వేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ కాదు దొర.. పర్మినెంట్ ఉద్యోగాలు రిక్రూట్ చేయ్ అంటూ తెలంగాణ యాసలో కేసీఆర్ పై ఘాటుగా కామెంట్ చేస్తూ షర్మిల ట్వీట్ చేశారు.  ‘‘రోజురోజుకు తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దొర కేసీఆర్‌కు పట్టింపు లేదు. సిబ్బంది కొరతతో వైద్యారోగ్యశాఖ ఇబ్బంది పడుతుంటే సారుకు కనపడటం లేదు’’ అంటూ తెలంగాణ యాసలో ట్వీట్ చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్‌లో ఉన్న 23512 ఖాళీపోస్ట్‌లను నింపు జర అంటూ నిరుద్యోగానికి షర్మిల లింక్ పెట్టారు. అవి నింపితే ప్రజల ప్రాణాలతో పాటూ నిరుద్యోగులు సైతం ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారంటూ కేసీఆర్‌కు షర్మిల ట్వీట్ చేశారు. కొంత కాలంగా  సీఎం కేసీఆర్‌ టార్గెట్ గా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు  వైఎస్ షర్మిల. తెలంగాణలో వెంటనే 1.9 1లక్షల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇటీవలే ఉద్యోగ దీక్షకు దిగిన షర్మిల.. తన అనుచరులు కోవిడ్ బారిన పడటంతో ప్రజాసమస్యలపై పోరుకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. తర్వాత తెలంగాణ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సందించేందుకు ట్విట్టర్‌ను వేదికగా ఎంచుకున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు.

ఒక్కరోజులో 10,00,000 కేసులు! 'మే'లో మ‌రింత ముప్పు..

సెకండ్ వేవ్ సునామీలా చుట్టేస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ముందుముందు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంటుంద‌ని అంత‌ర్జాతీయ శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.  మే నెలలో కొవిడ్‌ ఉద్ధృతి తారస్థాయికి చేరుతుందంటూ.. మిచిగాన్ యూనివ‌ర్సిటీ చెబుతుండ‌టం ఆందోళన రేపుతోంది. భారత్‌లో మే నెల మధ్యనాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షలకు చేరుతాయని మిచిగాన్‌ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. మే 23 నాటికి రోజుకు 4,500 మంది మరణించే అవకాశం ఉందట‌.  యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ మెట్రిక్స్‌ ఇవాల్యువేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) మాత్రం మే నెల ప్రారంభంలోనే.. అధికారిక, అనధికారిక లెక్కలతో కలిపి రోజుకు 10 లక్షల కన్నా ఎక్కువగానే కేసులు నమోదవుతాయని అంచనా వేసింది.   ఏప్రిల్‌ 1 నుంచి కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. కొవిడ్‌ వేరియంట్లు కాకుండా మరేమైనా కారణాలున్నాయా? అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ కరోనా కేసులు తగ్గిన త‌ర్వాత‌ మాస్కులు పెట్టుకోకపోవడం కూడా తీవ్రతకు కారణం కావచ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు. క‌రోనాని జయించామనే భావన ప్రజల్లో రావడం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరగ‌క‌పోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందని అంచ‌నా వేస్తున్నారు.  గ‌తేడాది చివ‌ర్లో తగ్గిన వైరస్‌.. ఆ త‌ర్వాత‌ చాపకింద నీరులా దేశాన్ని చుట్టేసింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూ అనే ఇన్‌ఫ్లూయంజా సైతం అమెరికా, యూకేలలో ఈ తరహాలోనే విజృంభించింది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో అలసత్వం కూడా వైరస్‌ తీవ్రరూపానికి కారణమవుతోంది.   మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో మరణాల సంఖ్య అధికంగా ఉండనుందని మిచిగాన్‌ విశ్వవిద్యాలయ అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు. రానున్న ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఊహించిన దానికంటే అధిక మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపింది.  ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఢిల్లీలో కేసులు పెరిగే అవకాశం ఉందట‌. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, కర్ణాటకలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. బెంగాల్‌, యూపీ, బిహార్‌, కేరళలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగాన్ని బట్టే మూడో దశ వస్తుందా, రాదా.. అనేది ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితిని తట్టుకునేందుకు మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థ అవసరమని సూచించింది.  

మారుతి సుజికి మాజీ డైరెక్టర్ మృతి.. 

ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్ ఇకలేరు. సోమవారం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. జగదీష్ 1993 నుంచి 2007 వరకు మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1993లో మారుతీ సుజుకిలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరారు. అనంతరం 1999లో ఎండీగా ఎదిగారు. మొదట ప్రభుత్వ నామినీగా, తర్వాత 2002లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీగా ఎదిగారు. మారుతీ సుజుకితో ఒప్పందానికి ముందు ఖట్టర్ సుమారు 37 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా అనుభవం కలిగి ఉన్నారు. 2008లో ఖట్టర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్రంగా మల్టీ బ్రాండెడ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీసెస్ నెట్‌వర్క్ కారేషన్‌ను ప్రారంభించారు. కార్నేషన్ ఆటో ఇండియా బ్యాంకుకు రూ. 110 కోట్ల మోసం చేసినట్టు నిందలు  కూడా జగదీష్ ఖట్టర్ ఎదుర్కొన్నారు. జగదీష్ ఖట్టర్ మరణం పట్ల మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. జగదీష్ మరణం వ్యక్తిగతంగా కోలుకోలేని నష్టమన్నారు. పరిశ్రమ వర్గాలు సైతం ఖట్టర్ మృతి ఆటో రంగానికి తీరనిలోటు అని అభిప్రాయపడ్డాయి.

రెండు వారాలు సంపూర్ణ లాక్ డౌన్ 

దేశంలో కరోనా మరణ మదృంగం మోగిస్తుండటంతో ఎక్కడికక్కడ రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నారు. వైరస్ చైన్ బ్రేకే చేసేందుకు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతోంది. మొదట వారం రోజులకే లాక్ డౌన్ పెట్టినా.. తర్వాత మరో వారానికి పొడిగించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ అని చెప్పకున్నా... అలాంటి తరహాలోనే కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో నెైట్ కర్ప్యూ ఉంది. వీకెండ్ లాక్ డౌన్ విధించారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఈనెల 27 మంగళవారం నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.  కర్ణాటకలో ఆదివారం అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. మంత్రులు, నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యడియూరప్ప ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ప్రజలను అనుమతిస్తామన్నారు.