మారుతి సుజికి మాజీ డైరెక్టర్ మృతి..
posted on Apr 26, 2021 @ 3:41PM
ఆటోమోటివ్ సేల్స్ అండ్ సర్వీస్ కంపెనీ కార్నేషన్ ఆటో ఇండియా వ్యవస్థాపకుడు, మారుతి సుజుకి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ఖట్టర్ ఇకలేరు. సోమవారం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. జగదీష్ 1993 నుంచి 2007 వరకు మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన 1993లో మారుతీ సుజుకిలో మార్కెటింగ్ డైరెక్టర్గా చేరారు. అనంతరం 1999లో ఎండీగా ఎదిగారు. మొదట ప్రభుత్వ నామినీగా, తర్వాత 2002లో సుజుకి మోటార్ కార్పొరేషన్ నామినీ ఎండీగా ఎదిగారు. మారుతీ సుజుకితో ఒప్పందానికి ముందు ఖట్టర్ సుమారు 37 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా అనుభవం కలిగి ఉన్నారు.
2008లో ఖట్టర్ ఆటోమొబైల్ రంగంలో స్వతంత్రంగా మల్టీ బ్రాండెడ్ ఇండియా సేల్స్ అండ్ సర్వీసెస్ నెట్వర్క్ కారేషన్ను ప్రారంభించారు. కార్నేషన్ ఆటో ఇండియా బ్యాంకుకు రూ. 110 కోట్ల మోసం చేసినట్టు నిందలు కూడా జగదీష్ ఖట్టర్ ఎదుర్కొన్నారు. జగదీష్ ఖట్టర్ మరణం పట్ల మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్ సి భార్గవ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. జగదీష్ మరణం వ్యక్తిగతంగా కోలుకోలేని నష్టమన్నారు. పరిశ్రమ వర్గాలు సైతం ఖట్టర్ మృతి ఆటో రంగానికి తీరనిలోటు అని అభిప్రాయపడ్డాయి.