క‌రోనా టైంలో క‌క్ష సాధింపు చ‌ర్య‌లా? జ‌గ‌న్‌ది పైశాచిక ఆనందం..

సీఎం జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. ప్రశ్నించే గొంతులను, ప్రతిపక్షనేతలను తొక్కిపెడుతూ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ప్రజలంతా కరోనాతో బిక్కుబిక్కుమంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఒక బందిపోటును, గూండాను అరెస్ట్ చేసినట్టు.. ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారన్నారు. సంగం డెయిరీని స్థాపించి పాడిరైతులకు అండగా ఉండటమే నరేంద్ర చేసిన తప్పా? సంగం డెయిరీని రూ.1100కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లడమే నరేంద్ర చేసిన తప్పా? ప్రభుత్వం తప్పుడు కేసులను ఎత్తిచూపి, వాస్తవాలు బయటపెట్టడంతో, ముఖ్యమంత్రి ధూళిపాళ్ల‌పై కక్ష కట్టారన్నారు దేవినేని ఉమా.  అమూల్‌ను భుజానికెత్తుకున్న ముఖ్యమంత్రి, నరేంద్రను టార్గెట్‌గా చేసుకున్నారని ఉమా ఆరోపించారు. సంగం డెయిరీలో లేని అవినీతిని ఉన్నట్టు చూపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు, తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి ఒక శాడిజంతో, పైశాచిక ఆనందంతో, సైకోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.  అమరావతి భూముల వ్యవహరంలో చంద్రబాబునాయుడు, మాజీమంత్రి నారాయణలపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనని నరేంద్ర ఆధారాలతో సహా నిరూపించారన్నారు. అందుకే నరేంద్రను సీఎం జ‌గ‌న్ టార్గెట్‌‌ చేశారన్నారు. నరేంద్రను తక్షణమే మీడియాసాక్షిగా కోర్టులో హాజరుపరచాలని, లేకుంటే టీడీపీ తరుపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యముంటే కరోనాతో బాధపడుతున్న రోగుల ద‌గ్గ‌ర‌కు రావాలని, వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రినైనా ముఖ్యమంత్రి ఎందుకు సందర్శించడంలేదని, కరోనా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఎందుకు సమీక్ష చేయడంలేదని ప్రశ్నించారు దేవినేని ఉమా.

కరోనాతో ఉద్యోగిని మృతి.. బ‌ర్త్‌డే రోజే డెత్‌డే..

విజ‌య‌. వ‌య‌సు 26. ప్ర‌భుత్వ ఉద్యోగిని. స్వ‌స్థ‌లం కామారెడ్డి జిల్లా ప‌ద్మాజివాడి. ప్ర‌స్తుతం తాడ్వాయి ఎమ్మార్వో కార్యాల‌యంలో ప‌ని చేస్తోంది. గురువారం ఆమె పుట్టిన‌రోజు. అదే రోజు ఆమె చ‌నిపోవ‌డం తీవ్ర విషాదం నింపింది. ఆమె క‌రోనాతో మృతి చెంద‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపుతోంది. గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా విజ‌య సెలక్ట్ అయ్యారు. ఆపై కొద్దికాలంలోనే తన పనితీరు, విద్యార్హతలతో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పోస్టింగ్ పొందారు. తాడ్వాయి త‌హ‌సీల్దారు కార్యాల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమెకు క‌రోనా సోకింది. అది ముదిరి ప్రాణాంత‌కంగా మారింది. స‌రిగ్గా విజ‌య బ‌ర్త్ డే రోజునే క‌న్నుమూశారు. విజ‌య మ‌ర‌ణంతో కుటుంబ స‌భ్యులు, తోటి ఉద్యోగులు విచారంలో మునిగిపోయారు. 

ఎవ‌రెస్ట్ ఎక్కిన క‌రోనా వైర‌స్‌.. ప‌ర్వ‌తారోహ‌కుల్లో క‌ల‌క‌లం..

ఎక్క‌డ చూసినా క‌రోనా. ఏ ప్రాంతం వెళ్లినా క‌రోనా. అక్క‌డ‌, ఇక్క‌డ అనే తేడా లేకుండా.. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌రోనా కేసులు. యావ‌త్ దేశం కొవిడ్ మ‌హ‌మ్మారితో అల్లాడిపోతోంది. లేటెస్ట్‌గా.. ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎక్కే బేస్ క్యాంప్‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసు వెలుగుచూడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. వైర‌స్ వ్యాప్తికి నిద‌ర్శ‌నంగా మారుతోంది. కరోనా లక్షణాలు ఉన్న‌ వ్యక్తిని ఎవరెస్ట్ బేస్ క్యాంపులో కనుగొన్నారు. అతడిని వెంటనే హెలికాఫ్టర్ ద్వారా ఖాట్మండులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పర్వతారోహకుల్లో సాధారణంగా `పల్మనరీ ఎడీమా`, `కుంభ్`దగ్గు, `ఆల్టిట్యూడ్ సిక్‌నెస్`, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయినా, ఎందుకైనా మంచిద‌ని.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఖాట్మాండు హాస్పిటల్‌లో టెస్ట్ చేయగా అతనికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బేస్ క్యాంప్‌లో మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం కోసం పర్వాతారోహకుల ప్రాణాలతో నేపాల్ ప్రభుత్వం ఆటలాడుతోందని పలు అంతర్జాతీయ పత్రికలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

న్యాయ‌వాదుల‌కు నో ఎంట్రీ.. ధూళిపాళ్ల‌ను విచారిస్తున్న ఏసీబీ..

తెల్ల‌వారుజామున వంద మందికి పైగా పోలీసులు టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర ఇంటిపై దాడి చేశారు. అక్క‌డిక‌క్క‌డ ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. గొల్ల‌పూడి ఏసీబీ కార్యాలయానికి త‌ర‌లించి న‌రేంద్ర‌ను విచారిస్తున్నారు. ధూళిపాళ్లను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులను.. లోనికి అనుమతించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. నరేంద్రను విచారిస్తున్నామని.. విచారణ పూర్తి అయిన తరువాతే కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.  మరోవైపు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణని, కార్యదర్శి గురునాధాన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  కాగా.. సంగం డెయిరీలో అవకతవకలు జగిగాయంటూ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ తెలిపింది. సంగం డెయిరీకి చైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయ‌డం క‌క్ష్య సాధింపు చ‌ర్య అంటూ టీడీపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి. సంగం డెయిరీని అమూల్ మిల్క్‌కు క‌ట్ట‌బెట్టేందుకు కుట్ర చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని.. ఆ విష‌యం నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే న‌రేంద్ర‌ను అరెస్ట్ చేశారంటూ విమ‌ర్శించారు. 

వ్యాక్సిన్ దొంగ‌.. టీకా రిట‌ర్న్స్‌.. ఎలాగంటే...

ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో క‌ల‌క‌లం. 1,700 వ్యాక్సిన్లు మాయం. ఓ దొంగ వాటిని ఎత్తుకెళ్లాడు. సిబ్బంది హ‌డావుడి ప‌డ్డారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ్యాక్సిన్ దొంగ కోసం గాలిస్తున్నారు. అస‌లే దేశంలో వ్యాక్సిన్ల కొర‌త వేధిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఏకంగా 17వంద‌ల టీకాల‌ను ఎత్తుకెళ్ల‌డం అంటే చిన్న విష‌య‌మేమీ కాదు. అందుకే పోలీసులు ఆ కేసును సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న హ‌రియాణాలోని జింద్ జిల్లా కేంద్రంలో జ‌రిగింది.  క‌ట్ చేస్తే.. వ్యాక్సిన్లు తిరిగొచ్చాయి. పోలీసులేమీ దొంగ‌ను పట్టుకొని టీకాల‌ను స్వాధీనం చేసుకోలేదు. పాపం.. ఆ దొంగ.. మంచి దొంగ‌లా ఉన్నాడు. తాను వాటిని క‌రోనా వ్యాక్సిన్లు అనుకోలేద‌ని.. పొర‌బాటు జ‌రిగిందంటూ టీకాల‌ను తిరిగిచ్చేశాడు. నేరుగా పోలీసుల చేతికి ఇస్తే త‌న‌ను ప‌ట్టుకుంటార‌ని తెలిసిన ఆ దొంగ.. తెలివిగా ఆ టీకాల బాక్స్‌ను పోలీస్ స్టేష‌న్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో ఇచ్చాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పని ఉండటంతో ఈ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.    ఆ టీ షాప్ అత‌ను ఆ బాక్స్‌ను పోలీసులకు ఇచ్చాడు. ఖాకీలు పెట్టెను తెరవగా వారికి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. ‘‘ క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు’’ అని రాశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్మీ విమానాల్లో హైద‌రాబాద్‌కు ఆక్సిజ‌న్‌..

ఆక్సిజ‌న్‌. ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలో దేశానికి మోస్ట్ వాంటెడ్‌. భారీగా కేసులు న‌మోదు అవుతుండ‌టంతో మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా క్ష‌ణం ఆగిపోయినా ప్రాణాలు పోతున్నాయి. అందుకే, ప‌రిమిత కేంద్రాల్లో మాత్ర‌మే ఉత్ప‌త్తి అయ్యే మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కోసం రాష్ట్రాలు పోటీప‌డుతున్నాయి. తాజాగా, తెలంగాణకు విమానాల్లో ఆక్సిజ‌న్ తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది స‌ర్కారు. ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్ నుంచి సైనిక విమానాల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. 14.5 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన 8 ట్యాంకుల‌తో ఆర్మీ ఫ్లైట్స్‌లో ఆక్సిజ‌న్‌ను తెలంగాణ‌కు తీసుకు రానున్నారు. 

అమూల్ కోస‌మే ధూళిపాళ్ల‌ అరెస్ట్‌.. చంద్ర‌బాబు ఫైర్‌

టీడీపీ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌పై పార్టీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర‌లో భాగంగానే ధూళిపాళ్ల‌ను అరెస్టు చేశార‌ని ఆరోపించారు. న‌రేంద్ర‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.  సంగం డెయిరీని గుజ‌రాత్‌కు చెందిన అమూల్‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర‌లో భాగంగానే ఈ విధ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కొచ్చిన ప్ర‌తీసారి అక్ర‌మ కేసుల‌తో వేధిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఈ అక్ర‌మ కేసులంటూ చంద్ర‌బాబు మండిప‌డ్డారు.

శ్వాస ఇబ్బంది ఉంటే ఇలా చేయండి! 

కరోనా పంజాతో దేశం అల్లాడిపోతోంది.రోజురోజుకూ ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరతతో పాటు, మహమ్మారి సోకిన వారికి అవసరమైన మందులు కూడా లభించని పరిస్థితి. అన్ని  హాస్పిటల్స్ అన్న నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. తమ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి.  కరోనా కల్లోలం, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో  వ్యాధి సోకిన వారు, వ్యాధి సోకకున్నా ముందస్తు జాగ్రత్తగా శ్వాస సక్రమంగా ఆడేలా స్వీయ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం 'ప్రోనింగ్' విధానాన్ని పాటించాలని సిఫార్సు చేసింది. మరింత సులువుగా శ్వాస ఆడటంతో పాటు, శరీరానికి అవరమైన ఆక్సిజన్ స్థాయిని ఈ విధానం పెంచుతుందని, దీన్ని వైద్య పరంగానూ ఆమోదించారని తెలిపింది.  ప్రోనింగ్ విధానంలో తొలుత బోర్లా పడుకోవాల్సి వుంటుంది. కడుపు మంచంపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుని, ముఖం బోర్లా పెట్టి కనీసం 2 గంటలు పడుకోవాల్సి వుంటుంది. దీంతో శ్వాస పీల్చుకోవడం సులువవుతుంది. ఈ ప్రక్రియ శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94 శాతానికి మించి తగ్గితే, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత కుడివైపునకు, ఎడమ వైపునకు తిరిగి పడుకుంటూ సాధ్యమైనంత సమయం ఉండాలని, దీని ద్వారా జ్వరం తగ్గుతుందని, బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలో ఉంటుందని, హోమ్ ఐసొలేషన్ లో ఉండే వారికి 'ప్రోనింగ్' ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపింది. సమయానుసారంగా ప్రోనింగ్ చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియకు నాలుగు పిల్లోలను వాడాలని, ఒకటి మెడికింద, రెండు గుండెల కింద, ఆపై మోకాళ్ల కింద పెట్టుకుంటే, మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపింది.అయితే, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఈ విధానాన్ని పాటించరాదని తెలిపింది. భోజనం చేసిన వెంటనే కూడా ఈ ప్రక్రియ చేయరాదని సూచించింది. ప్రోనింగ్ విధానానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 

కరోనా కల్లోలంలో కక్షరాజకీయాలా! ఏపీలో అరాచక పాలన? 

దేశమంతా కరోనాతో వణికిపోతోంది. ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. గురువారం ఏపీలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో తమ ప్రాణాలు కాపాడుకోవటానికి జనాలు కష్టాలు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. కరోనా కల్లోల పరిస్థతుల్లోనూ జగన్ రెడ్డి సర్కార్ మాత్రం కక్ష రాజకీయాలకు దిగింది. టీడీపీ నేతలను వరుసబెట్టి అరెస్టులు చేస్తోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసింది. తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు నరేంద్ర ఇంటిని చుట్టుముట్టి... అతన్ని తీసుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో వందలాది మంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.  దూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్ తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్ లు మాత్రం ఉంటున్నాయి. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్ లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని సూచించారు. దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి అని నారా లోకేష్ మండిపడ్డారు. ధూళిపాళ్ల కుటుంబం నలుగురికి సాయం చేసే చరిత్ర ఉన్న కుటుంబం.. మీలాంటి దోపిడీ కుటుంబం కాదు జగన్ రెడ్డి అంటూ ఆయన ట్వీట్ చేశారు.  సంఘం డైరీ ద్వారా వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచింది ధూళిపాళ్ల కుటుంబమని చెప్పారు. ప్రభుత్వ అసమర్ధతను,దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పై జగన్ రెడ్డి కక్ష కట్టారని లోకేష్ ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామా ని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి జగన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలని ధ్వజమెత్తారు. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదన్నారు నారా లోకేష్.               కరోనా విలయతాండవం చేస్తుంటే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇవ్వడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్ష నేతలపై వేధింపులకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారనే అక్కసుతోనే  ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ జీవితంలో మచ్చలేని ధూళిపాళ్ల నరేంద్రను ఏదో ఒక విధంగా జైలుపాలు చేయాలని కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందనిఅచ్చెన్నాయుడు ఆరోపించారు. ధూళిపాళ్ల ఏం తప్పు చేశారని ఆయన ఇంటికి 100 మంది పోలీసులను పంపారు? ఆయనేమైనా తీవ్రవాదా లేక ఏ1, ఏ2 లాగా ఆర్థిక ఉగ్రవాదా? అని ప్రశ్నించారు. గుజరాత్ కు చెందిన అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.   ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు  అచ్చెన్నాయుడు.  

కేటీఆర్‌కు క‌రోనా..

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఆయ‌న ట్వీట్ చేశారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇటీవల తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కేటీఆర్ఆ కోరారు. కొద్దిరోజుల క్రితమే సీఎం కేసీఆర్‌కూ కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. నిత్యం కేసీఆర్ వెంటే ఉండే ఎంపీ సంతోష్ కుమార్‌కు సైతం పాజిటివ్ వ‌చ్చింది. తాజాగా, కేటీఆర్ సైతం కొవిడ్ బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌లే ఆయ‌న వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించి వ‌చ్చారు. ప‌లు కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌య్యారు.

పూజారికి క‌రోనా.. అస‌ద్ ఉదార‌త‌..

ఎమ్ఐఎమ్ ముస్లింల పార్టీ. వాళ్లు హిందూ వ్య‌తిరేకులు అనే అపోహ ఉంది. కానీ, ఇప్ప‌టికే ప‌లుమార్లు ఎమ్ఐఎస్ అధినేత అస‌దుద్దీన్ హిందువుల ప‌ట్ల త‌న అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా, క‌రోనా బారిన ప‌డిన ఓ ఆల‌య పూజారికి ఆసుప‌త్రిలో బెడ్ ఇప్పించి.. కీల‌క స‌మ‌యంలో గొప్ప సాయం చేశారు. త‌న మంచి మ‌న‌సును మ‌రోసారి చాటుకున్నారు. పాతబస్తీలోని ఓ ఆలయ పూజారి(75)కి గత శనివారం కరోనా నిర్ధారణ అయింది. అప్ప‌టి నుంచి హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంట‌నే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించడానికి కుటుంబ స‌భ్యులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఎక్కడా పడకలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందారు.  పూజారి ప‌రిస్థితి తెలుసుకున్న స్థానిక మజ్లిస్‌ నాయకుడు ఆ విష‌యాన్ని ఎంఐఎం అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకొచ్చాడు. అస‌ద్ వెంటనే స్పందించి ఆల‌య పూజారిని శాలిబండలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి, ప‌డ‌క‌ ఏర్పాటు చేయించారు. ప్ర‌స్తుతం పూజారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. క‌రోనా ముందు మ‌తాలు లేవు. మ‌నుషులంతా ఒక‌టే.

ఆసుప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 13మంది మృతి

వ‌రుస ప్ర‌మాదాలు కొవిడ్ ఆసుప‌త్రుల్లో డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొన్న ఓ హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా లీక్ అయి ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు విడిచారు. శుక్ర‌వారం మ‌హారాష్ట్ర‌లోని ఓ కొవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పాల్ఘర్‌ జిల్లా వాసాయిలోని విజయ్‌ వల్లభ్‌ ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. మంట‌లు అంటుకొని, పొగ‌తో ఊపిరాడ‌క‌.. 13 మంది రోగులు మృతిచెందారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కార‌ణం తెలియాల్సి ఉంది.

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌.. ఇంటిపై పోలీస్ యాక్ష‌న్‌

టీడీపీ నేత‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఏపీలో ఆప‌రేష‌న్ టీడీపీ కంటిన్యూ అవుతోంది. తాజాగా, టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం ద‌గ్గ‌ర తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనంతరం నరేంద్రను అరెస్ట్ చేసి వాహనంలో తీసుకెళ్లారు. అరెస్ట్‌కు గల కారణాలు.. ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాలు మాత్రం వెల్లడించలేదు పోలీసులు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నరేంద్రను అరెస్ట్‌ చేయడమేంటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని భూముల వ్యవహారంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఐడీ కేసు నమోదు చేసి తీసుకెళ్లారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నరేంద్ర  ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. 

పది, ఇంటర్ పరీక్షలు రద్దు? దిగొస్తున్న ఏపీ సర్కార్ 

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి , ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కానున్నాయా? విపక్షాల డిమాండ్ కు జగన్ సర్కార్ తలొగ్గిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అందరు విద్యార్థులకు పై తరగతులకు ప్రమోట్ చేసిన ఏపీ సర్కార్.. ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని ప్రకటించింది. సర్కార్ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనూ పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు కాగా.. సెకండియర్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. అయినా జగన్ సర్కార్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమే కాదు షెడ్యూల్ కూడా ఇచ్చింది.   జగన్ రెడ్డి సర్కార్ పై తీరుపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డాయి. కరోనా భయానికి దేశమంతా పరీక్షలు రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగితే.. జగన్ రెడ్డి మాత్రం పంతానికి పోయి పరీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలు జనాల నుంచి కూడా వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ అయితే కొన్ని రోజులుగా ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టుకు వెళ్లడానికి న్యాయవాదులతో చర్చలు కూడా జరిపారు.  పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని... విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా? అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా ప్రశ్నించారు. లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్..  విద్యా సంవత్సరాన్ని కాపాడే ప్రయత్నాన్ని కూడా రాజకీయం చేసే రీతిలో లోకేశ్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. నారా లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎక్కడో హైదరాబాదులో ఉంటున్న లోకేశ్... ఏపీలోని విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణపై మరో సమీక్ష తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి తాజా ప్రకటనతో పరీక్షల రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసి.. సెకండియర్ పరీక్షను వాయిదా వేయనున్నారని సమాచారం. రెండు, మూడు రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. దీంతో పరీక్షలు రద్దు కావడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి. 

సీఎంపై సొంత పార్టీ ఎంపీ పోరాటం.. దేశంలోనే  ఏపీ స్పెషల్ 

దేశంలో అన్ని రాష్ట్రాలు వేరు.. ఆంధ్రప్రదేశ్ వేరు అన్నట్లుగా  ఉంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో అంతా స్పెషలే. మూడు రాజధానులు.. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. ఇలా అన్ని రాష్ట్రాలకు భిన్నం. పాలనలో అంతా రివర్స్ పాలనే అనే ఆరోపణలు ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి పెట్టుబడిదారులు రావాలంటే జంకే పరిస్థితి ఉందంటున్నారు. గతంలో మొదలైన ప్రాజెక్టులు చాలా వరకు జగన్ రెడ్డి దెబ్బకు మూత పడ్డాయి. పాలనలోనే కాదు రాజకీయంగానే ఏపీలో అంతా స్పెషలే. ఎంతగా అంటే.. సొంత పార్టీ ఎంపీనే ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసేంత.   నర్సాపురం ఎంపీగా వైసీపీ నుంచి గెలిచిన  రఘురామకృష్ణరాజు... వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు కోసం పోరాటం చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణ ధాఖలు చేసిన పిటిషన్‌పై  సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్‌పై 11 చార్జ్‌షీట్‌లను సీబీఐ నమోదు చేసిందని పిటీషనర్ వాదనలు వినిపించారు.  పిటీషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారాయణ రావువాదనలు వినిపించారు. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు కొనసాగాయి. పిటీషన్‌ను విచారించాలా లేదా అన్నదానిపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం తెలుపనుంది. సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం ఆయన పార్టీకి చెందిన ఎంపీనే పిటిషన్ వేయడంపై దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.  రఘురామ వైసీపీ ఎంపీగా గెలిచినా.. కొన్ని రోజులకే ఆ పార్టీకి రెబెల్ గా మారారు. గత కొన్ని నెలలుగా జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు ఇతర వైసీపీ నేతలను మాత్రం చీల్చి చెండాడుతున్నారు. ఢిల్లీలో రోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. జగన్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మూడు రాజధానులు, రివర్స్ టెండరింగ్. ఇసుక, మద్యం పాలసీ, మైనింగ్, వాలంటీర్ వ్యవస్థ ఇలా ఏ అంశాన్ని వదలిపెట్టకుండా వైసీపీ సర్కార్ కు పక్కెంలో బల్లెంలా మారిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గత ఎస్ఈసీ నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య వార్ జరుగుతున్న సమయంలో నిమ్మగడ్డకు మద్దతుగా నిలిచారు రఘురామ.  చాలా కాలంగా తమను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నా రఘురామపై యాక్షన్ తీసుకోలేకపోయింది వైసీపీ అధిష్టానం. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నా సస్పెండ్ చేయలేకపోయింది. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నా అలా ఎందుకు వదిలేస్తున్నారన్నది ప్రశ్నగా మిగిలింది. జగన్ ను రఘురామ టార్గెట్ చేయడానికి కారణం ఉందంటున్నారు. ఎంపీగా ఆయనకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. వైసీపీకి రెబెల్ గా మారారు కాబట్టి.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రఘురామ కోరుకుంటున్నారు. అలా అయితేనే ఆయన పదవికి గండం ఉండదు. అందుకే సీఎం జగన్ సహా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. అయితే రఘురామ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్న వైసీపీ.. ఆయనకు కౌంటర్ గా ఎత్తులు వేస్తోంది. అతను ఎంతగా విమర్శించినా సస్పెండ్ చేయడం లేదని తెలుస్తోంది. దీంతో సొంత పార్టీ నుంచే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటూ జనాల్లో వైసీపీ చులకన అవుతుందనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది.  రఘురామను సస్పెండ్ చేస్తే వైసీపీకి ఒక ఎంపీ సీటు తగ్గడం తప్ప పెద్దగా నష్టం ఉండదు. కాని ఆ పని చేయలేకపోతోంది. అదే సమయంలో వైసీపీ ఎంపీగానే ఆయన వైసీపీ సర్కార్ పై విమర్శలు చేయడం మాత్రం ఆ పార్టీకి నష్టం కల్గిస్తుందని చెబుతున్నారు. ఒక ఎంపీపై అనర్హత వేటు వేయించడం కోసం .. పార్టీకి నష్టం కలుగుతున్నా వేచిచూడటం మంచిది కాదనే చర్చ వైసీపీ నేతల్లోనూ జరుగుతుందని తెలుస్తోంది. కాని వైసీపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న జగన్ కాబట్టే.. ఎవరూ ఏమి చేయడానికి వీల్లేదు.. జగన్మోహనుడి ఎలా చెబితే అలా నడుచుకోవడమే...  

ఆక్సిజన్ సరఫరాకు మోడీ యాక్షన్ ప్లాన్

కరోనా పంజాతో దేశంలోని హాస్పిటల్స్ అన్న నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. తమ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే ఉపాయాలపై చర్చించారు. ఆక్సిజన్ సప్లైను ఎలా వేగవంతం చేస్తున్నామన్న దానిపై అధికారులు ప్రధానికి వివరించారు. ఆక్సిజన్ కొరత విషయంలో ఇప్పటికే తాము అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నామని, వారి అవసరాలను గుర్తించామని అధికారులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 20 రాష్ట్రాలకు ప్రస్తుతం రోజుకు 6,785 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని, ఈ నెల 21 వ తేదీ నాటికి 6,822 మెట్రిక్ టన్నులను కేటాయించామని అధికారులు వివరించారు. కొన్ని రోజులుగా లిక్విడ్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగిందని, దీంతో పరిశ్రమలకు, స్టీల్ ప్లాంట్లకు ఆక్సిజన్ సరఫరాను నిషేధించామని అధికారులు మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతటి క్లిష్ట సమయంలో అధికారులందరూ సమిష్టిగా పనిచేయాలని పీఎం కోరారని అధికారిక వర్గాలు తెలిపాయి.  ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, దీన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి పెంచడానికి తగిన మార్గాలను అన్వేషించి, తర్వితగతిన ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు సరఫరా చేయాలని మోడీ ఆదేశించారు. నైట్రోజన్ ఆర్గాన్ కోసం నిర్దేశించిన క్రయోజనిక్ ట్యాంకర్లను కూడా ఇటు వైపు మళ్లించి, ఆక్సిజన్ సరఫరా కోసం అందుబాటులోకి తేవాలని ప్రధాని సూచించారు. ఆక్సిజన్ సరఫరా కోసం రైళ్లను కూడా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించడం పూర్తైన తర్వాత ఖాళీ ట్యాంకర్లను విమానంలో వెనక్కి తీసుకురావాలని మోడీ సూచించారు.  ‘‘ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత సమీక్ష సమావేశం జరిగింది. దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత గురించి చర్చించారు. ఆక్సిజన్ ఉత్పత్తిని ఎలా పెంచాలి? అన్న దానిపై సమాలోచనలు జరిపారు. డిమాండ్‌కు తగ్గ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఎలా కష్టపడుతున్నామన్న విషయాన్ని అధికారులు మోదీకి వివరించారు’’ అని పీఎంవో  వెల్లడించింది. 

ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై చిరంజీవి ట్వీట్‌..

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం? అంటూ ప్ర‌శ్నించారు మెగాస్టార్ చిరంజీవి. విశాఖ ఉక్కు రోజుకు 100 ట‌న్నుల ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేస్తోంది. ఎన్నో రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ అందించి.. ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడుతోంది. స్పెష‌ల్ ట్రైన్‌లో 150 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను విశాఖ నుంచి మ‌హారాష్ట్ర‌కు పంపించారు. అలాంటి విశాఖ ఉక్కు క‌ర్మాగారం న‌ష్టాల్లో ఉంద‌ని ప్రైవేటు ప‌రం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం???  మీరే ఆలోచించండి.. అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.  అయితే, ఎక్క‌డా కేంద్రం పేరు ప్ర‌స్తావించ‌కున్నా.. ప‌రోక్షంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారు మెగాస్టార్‌. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మేము సైతం అంటూ చిరంజీవి స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 

గ్రేటర్ లో మళ్లీ కంటైన్ ‌మెంట్ జోన్లు.. లిస్ట్ ఇదిగో..

హైద‌రాబాద్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో జీహెచ్ఎమ్‌సీ అల‌ర్ట్ అయింది. కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టింది. 30 స‌ర్కిళ్ల ప‌రిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయ‌నున్నారు. ఆయా జోన్ల‌లో నిరంత‌రం శానిటేష‌న్ చేప‌డ‌తారు. 5 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను మినీ కంటైన్‌మెంట్ జోన్లుగా ప‌రిగ‌ణిస్తారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో కేసులు వ‌స్తే హౌజ్ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేస్తారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు శానిటేష‌న్‌తో పాటు వైద్య సిబ్బందిని, మందుల‌ను అందుబాటులో ఉంచుతారు. జీహెచ్ఎమ్‌సీ సిబ్బంది నిత్యం ఆయా జోన్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు.

ప‌రీక్ష‌ల పంతం.. ప్ర‌భుత్వం మొండిఘ‌టం!

స‌ర్కారు మ‌రీ మొండికేస్తోంది. ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై పంతానికి పోతోంది. ఓవైపు ఏపీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. ప‌రీక్ష‌ల ర‌ద్దుపై నిర్ణ‌యానికి వెన‌కాడుతోంది. ప‌రీక్ష‌ల పేరుతో విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోందంటూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వ స‌బ్ క‌మిటీ స‌మావేశ‌మైనా.. ఎగ్జామ్స్ ర‌ద్దుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంపై త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు. మ‌రోసారి స‌మీక్ష త‌ర్వాతే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామంటూ మంత్రి సురేశ్ ప్ర‌క‌టించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.  అంత‌కుముందు, ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిప‌డ్డారు. ప‌ది, ఇంట‌ర్ విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రై క‌రోనా బారిన ప‌డితే.. సీఎం జ‌గ‌న్ బాధ్య‌త తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం మొండిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చూస్తోంది. విద్యార్థుల జీవితాల‌కే ప‌రీక్ష పెడుతోంది. దేశంలో అనేక ప్ర‌భుత్వాలు ప‌రీక్ష‌లు వాయిదా వేస్తున్నా.. జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు నిర్ణ‌యంలో మాత్రం మార్పు రావ‌డం లేద‌ని నిల‌దీశారు.  ప్ర‌భుత్వం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80శాతం విద్యార్థులు కొవిడ్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని స‌ర్కారును హెచ్చ‌రించారు నారా లోకేశ్‌.