పొత్తు పొడుపులపై ఊహాగాన సభలు.. ఢిల్లీ టు గల్లీ ఇదే చర్చ ఇదే రచ్చ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా  సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్.  సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.  రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈరెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్’ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్  ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే,నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్’ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది.  అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల్ వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది.ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ బీహార్ రాజదాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని, ఇటు బీహారు పెద్దాయనకు, దేశ ప్రజలకు విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒకరోజు ముందే ఎన్సీపీ అధినేత  శరద పవార్’  బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా చెప్పారు. అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేందర్ మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాట్నా పర్యటనలో ఇదే  తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయంవచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్’ గా నిలిచింది.  అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ప్పడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే.నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు.  అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ  కమ్యునిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడోనే నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు,అనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్’ను  ఏ బాషలో దూషించారు, అనేది ఇప్పడు అప్రస్తుతం.  అయితే, ఇలా  పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని,  ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!

అమరావతి నా వల్ల కాదు.. అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన జగన్

 ముఖ్యమంత్రి జగన్ అమరావతి నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. కేవలం పదివేల కోట్ల రూపాయలతో విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయవచ్చని మూడేళ్ల తరువాత కనిపెట్టిన ఆయన అమరావతి అభివృద్ధి చేయాలంటే వందేళ్లు పడుతుందని చెప్పారు.   పాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన జగన్  అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవసరమంటూ పాత పాటనే పల్లవించారు. అంత డబ్బు లేదని బేలగా చెప్పారు. ఏపీ బీద రాష్ట్రం అని, రాష్ట్రంలో 80శాతం మంది జనం తెల్ల రేషన్ కార్డుదారులేననీ జగన్ చెప్పారు. ఇంత పేద రాష్ట్రానికి రాజధాని అవసరమేముందన్న అర్ధం వచ్చేలా ఆయన ప్రసంగం సాగింది.  అమరావతిని నిర్వీర్యం చేయడానికి అధికారం చేపట్టిన మూడేళ్లలో జగన్ చేయని ప్రయత్నం లేదు. మూడు రాజధానులంటూ మొదలు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులను నిలిపివేశారు. తన కేబినెట్ మంత్రుల చేత అది ఒక శ్మసానం అంటూ వ్యాఖ్యలు చేయించారు. వరద వస్తే మునిగిపోతుందని ప్రచారం చేయించారు. అమరావతి రైతుల ఆందోళనను పట్టించుకోలేదు. ఇప్పుడు మూడేళ్ల తరువాత   అమరావతి భూముల విషయంలో జగన్ నమ్మశక్యం కాని లెక్కలు చెప్పారు. అమరావతిలో ఉన్న భూములు విలువ లేనివని సూత్రీకరించి ప్రజలను నమ్మించాలని ప్రయత్నించారు.   మూడేళ్ల పాటు అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేసి, అమరావతిని స్మశానంగా అభివర్ణించి.. ఇప్పుడు ఆ భూములను అమ్మకానికి పెట్టి ఎవరూ కొనడం లేదు కనుక అవి విలువలేనివని సూత్రీకరించడానికి జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నించారు.  అసెంబ్లీ సాక్షిగా  జగన్ ఈ మూడేళ్లలో  గ్రామ, వార్డు సచివాలయాలు వినా తాను సాధించినదేమీ లేదని అంగీకరించేశారు. అంతకు మించి  ఏపీకి ఇంకేం అభివృద్ధి కావాలి అన్న చందంగా ఆయన ప్రసంగం సాగింది. మొత్తం మీద అసెంబ్లీ సాక్షిగా  రాజధాని నిర్మాణం తన వల్ల కాదని చేతులెత్తేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబడి ఉన్నానని చెప్పిన జగన్ అందు కోసం ఈ మూడేళ్లలో తాను చేసిందేమిటో చెప్పలేకపోయారు. అన్నిటికీ మించి తన ప్రసంగంలోని డొల్ల తనాన్ని తెలుగుదేశం సభ్యులు సభలోనే ఎత్తి చూపుతారన్న అనుమానమో, భయమో కానీ, జగన్ ప్రసంగం ప్రారంభించే సమయానికి విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ అయిన తరువాతనే ఆయన మైక్ అందుకున్నారు. టీడీపీ సభ్యులు ఉన్నప్పుడు సభ సజావుగానే   వైసీపీ సభ్యుల ప్రసంగాలు, వాటికి తెలుగుదేశం కౌంటర్లు ఇలా సభ  ఎలాంటి అవాంతరాలూ లేకుండానే జరిగింది. అయితే జగన్ ప్రసంగించే సమయంలో ఆయన ప్రసంగానికి తెలుగుదేశం సభ్యులు కౌంటర్ ఇవ్వకూడదనో, లేక వారి ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చుకోలేనో జగన్ వారిని సభ నుంచి బయటకు పంపిన తరువాతే మాట్లాడటం మొదలు పెట్టారు.  

ఏపీలో పారని బీజేపీ పాచికలు కేంద్రంతో జగన్ బంధమే కారణమా?

దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ ప్రయత్నాలు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఎలా సాగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఏపీలో బీజేపీకి ఆదరణ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా దిగజారిపోతున్నది. ఇందుకు కారణం అధికార వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు, పొత్తులు ఉన్నాయన్న భావన ప్రజలలో గట్టిగా ఏర్పడటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తరువాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేశాయి. అయితే పునర్విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్లమెంటులో బీజేపీ ప్రయత్నించిందన్న భావన ఉండటంతో తెలుగుదేశం పార్టీతో పొత్తును ఏపీ ప్రజ హర్షించింది. ఆదరించింది. దాంతో ఏపీలో బీజేపీకి ఓ నాలుగు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అయితే ఆ తరువాత ఐదేళ్లూ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావలసిన ప్రయోజనాలకు  మోడీ సర్కార్ గండి కొట్టిందన్నభావన ప్రజలలో గట్టిగా కలిగింది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఒకటి అనేమిటి, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేరని పరిస్థితిపై ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో 2019 ఎన్నికలలో బీజేపీకి అసెంబ్లీలో స్థానం లేకుండా పోయింది. ఇక వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడేళ్లలో ఏపీ ప్రయోజనాల విషయంలో ఆయన కేంద్రాన్ని కోరింది లేదు.. కేంద్రం పట్టించుకున్నది లేదు.ఏపీలో జగన్ సర్కార్ కు ప్రజాదరణ వేగంగా తగ్గిపోవడాన్ని గమనించిన బీజేపీ.. రాష్ట్రంలో తన పట్టు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టడం ప్రారంభించింది. అయితే ఈ వ్యవహారమంతా నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్లు చేస్తాను అన్న చందంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ బీజేపీ జగన్ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో పలుకుబడి పంచుకోవాలని చూస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆంద్రప్రదేశ్ బీజేపీ ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించింది.  ప్రజాపోరు పేరుతో ఐదు వేల సభలు ఏర్పాటు చేసిప్రజలలో ఆదరణ పెంచుకోవాలని నిర్ణయించింది.   కానీ బీజేపీ యాత్రలు   పర్యటనలు.. ప్రసంగాలు, విమర్శలను ఏపీ జనం ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  జగన్ సర్కార్ కు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంటే.. ఇక్కడి బీజేపీ నేతలు విమర్శిస్తున్నాం, పోరాడుతున్నాం అంటే చేస్తున్న విన్యాసాలను ప్రజలు విశ్వసించకపోవడమే ఏపీలో బీజేపీని జనం పట్టించుకోకపోవడానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలను కేంద్రం తన అధికారాలను ఉపయోగించి ఎలా ఇబ్బందుల పాలు చేస్తున్నదో కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక్క ఏపీకి మాత్రమే కేంద్రం అన్ని రకాలుగా సహకరించడమే..ఇందుకు కారణం. అసలు ఏపీలో ఉన్నది బీజేపీయేతర ప్రభుత్వం కాదా అన్న అనుమానం కలిగేలా కేంద్రం నుంచి సహకారం అందుతోందన్న విమర్శలు విపక్షం నుంచే కాదు..సామాన్య జనం నుంచి కూడా వినవస్తున్నాయి. జగన్ హయాంలో అభివృద్ధి అడుగంటిపోయినా, అన్ని వర్గాలలో అసంతృప్తి ప్రబలుతున్నా..ఆర్థిక అరాచకత్వం పరాకాష్టకు చేరినా కేంద్రం నుంచి మాత్రం ఆయనకు సంపూర్ణ సహకారం అందడం పట్ల జనబాహుల్యంలో ఆగ్రహం వ్యక్తమౌతోందని అంటున్నారు. అందుకే ఏపీలో బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలు పట్టించుకోవడం లేదని విశ్లేషిస్తున్నారు. బీజేపీ అమరావతి యాత్రలో జనం ఆ పార్టీ నేతలను నిలదీయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇక్కడి వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా సహకరిస్తున్నదన్న భావన కారణంగానే ఇక్కడి జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకతే బీజేపీపై కూడా వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటగున్నారు. ఈ పరిస్థితి మారాలంటే.. జగన్ సర్కార్ నిబంధనల ఉల్లంఘధనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించడం ఒక్కటే మార్గమని పరిశీలకులే కాదు, బీజేపీ ఏపీ నేతలు కూడా అంటున్నారు.  నిబంధనలను తుంగలో తొక్కి చేసిన అప్పుల లెక్కలను బయటపెట్టాలని ఏపీ సర్కార్ ను ఆదేశించకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ.. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం చోద్యం చూడడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ బీజేపీ విమర్శలతో విరుచుకుపడడాన్ని రాజకీయ డ్రామాగా జనం భావిస్తున్నారు.  అందుకే ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కార్ పై చేస్తున్న విమర్శలకు, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజలు స్పందించడం లేదు. పట్టించుకోవడం లేదు. ఆ కారణంగానే దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలన్న బీజేపీ పాచికలు ఏపీలో పారడం లేదు.

తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. కేసీఆర్ వేగంతో డిఫెన్స్ లో మోడీ

ఢిల్లీలో కేంద్రం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణలో డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలు పార్టీలతో పాటు గద్దర్ వంటి ప్రముఖులు కూడా అన్ని పార్టీల నేతలను కలిసి పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇదే డిమాండ్‌తో తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే కేసీఆర్ అంతటితో ఆగకుండా కేంద్రాన్ని, మోడీనీ మరింత ఇరుకున పెట్టి.. వారిపై ఒత్తిడి పెంచేందుకు తాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయించారు.ఇలా నిర్ణయించడం, అలా ఉత్తర్వులు ఇచ్చేయడం అనూహ్య వేగంతో జరిగిపోయాయి. తెలంగాణ సచివాలయానికి  అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.. అంతే కాదు ఢిల్లీలోని సెంట్రల్ విస్టాకు కూడా అంబేడ్కర్ పేరు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. అంతే కాదు తెలంగాణ చూపిన బాటలోనే నూతన పార్లమెంటు భవనానికి తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని అంబేద్కర్ పేరును పెట్టాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ఇప్పటి వరకూ పెద్దగా రాలేదు. దానిపై ఎలాంటి చర్చా కూడా జరిగింది లేదు. అయితే నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించి బీజేపీపై ఒత్తిడి పెంచేశారు. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ గౌరవించాలంటే సెంట్రల్ విస్టాకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందేనని.. లేకపోతే అవమానించినట్లేనన్న వాదన టీఆర్ఎస్ ఇప్పుడు తెరపైకి తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.   తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎస్ కు కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన, రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయి.  డా. బిఆర్ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ  నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తున్నది.అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్పూర్తి ని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నది. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా  అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.  భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆషామాషీకి కోరుకున్నది కాదు. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖ కూడా రాస్తాను.  తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.'' అని పేర్కొన్నారు. తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం ఆయన రాజకీయ ప్రత్యర్థులను నిరుత్తరులను చేసిందనే చెప్పవచ్చు. ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది. అన్ని వర్గాల నుంచీ నూతన పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ డిమాండ్ కు తలొగ్గి కేంద్రం నూతన పార్లమంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెడితే.. కేసీఆర్ ఒత్తడి కారణంగానే కేంద్రం దిగి వచ్చిందని అంతా అంటారు. అలా కాకుండా నూతన పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేందుకు కేంద్రం ముందుకు రాకపోయినా..కేసీఆర్ చేయగలిగింది మోడీ చేయలేకపోయారన్న విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. చీటికీ మాటికీ, తెలంగాణ సర్కార్ ప్రతి నిర్ణయంపైనా విమర్శలతో విరుచుకుపడే తెలంగాణ బీజేపీ నేతలకు కూడా ఇకపై ఏ విమర్శ చేసినా ముందు పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టి ఆ తరువాత మాట్లాడండి అంటూ తెరాస నేతలు గట్టిగా ఎదురు దాడి చేసే అవకాశం లభించినట్లైంది.అలాగే కేసీఆర్ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా దళిత బాంధవుడి గుర్తింపు వచ్చే అవకాశం లభించింది. ఈ ఇమేజ్ తో ఆయన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక విధంగా మార్గం సుగమం చేసుకున్నారని కూడా భావించవచ్చు.

ఎలాంటి అడ్డులేక తీసికెళ్లేదే ఆంబులెన్స్‌! 

పిల్ల‌లు స్కూలుకి వెళ్ల‌డానికి లేట‌యితే బ‌స్సు మిస్స‌యి ఎవ‌ర్నియినా దింప‌మ‌ని అడుగుతారు, బ‌స్సు మిస్స‌య్యే ఉద్యోగి టూ వీల‌ర్ మీద వెళ్లే కుర్రాణ్ణి కొంత‌దూరం లిఫ్ట్ అడుగుతాడు.. కానీ ఒక వ్య‌క్తి చెప్పాపెట్ట‌కుండా ఏకంగా 108 బండినే తీసి కెళ్లాడు. అదీ ఇంటికి వెళ్ల‌డానికి డ‌బ్బుల్లేక‌. ఇది త‌ప్ప‌కుండా బాగా ఆలోచించే ఎత్తుకెళ్లాడ‌ని అంద‌రూ అనుమానించారు. ఎందుకంటే 108 వాహ‌నం రోగుల‌ను తీసికెళ్ల‌డానికి ఉప‌యోగించేది. అద‌యితే ట్రాఫిక్ స‌మ‌స్యా ఉండ‌దు. చెవులు చిల్లు ప‌డేలా హార‌న్ కొడుతూంటే లారీ కూడా ఆగి దారివ్వాల్సిందేక‌దా! న‌ల్గొండ జిల్లా హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఈమ‌ధ్య‌నే ఒక మ‌హానుభావుడు ఎక్క‌డ తిరిగాడో ఏమో జేబులో పైసా లేకుండా ఉన్నాడు. ఇంటికి వెళ్లడానికి డ‌బ్బుల్లేవు. ఎంత ఆలోచించినా ఇంటికి చేరే మార్గంతోచ‌డం లేదు. పోనీ న‌డిచి వెళ‌దామంటే ఇల్లు చాలా దూరం. హ‌య‌త్‌న‌గ‌ర్ తాసీల్దార్ కార్యాల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చేడు. అక్క‌డ 108 వాహ‌నం క‌న‌ప‌డింది. కానీ అందులో ఎవ్వ‌రూ లేరు. వాహ‌నం డ్రైవ‌ర్ మూత్ర‌విస‌ర్జ‌న్‌కి వెళ్లాడు. ఇత‌ను చుట్టూరా చూసి మెల్ల‌గా ఆ వాహ‌నం ఎక్కి చూశాడు. ఎవ్వ‌రూ అభ్యం త‌రం చెప్ప‌లేదు. కార‌ణం వారికీ ఈ వాహ‌నం డ్రైవ‌ర్ ఎవ‌రో తెలీదు. ఎవ‌రి ప‌నుల్లో వారు ఉన్నారు. అంతే మ‌నోడు రయ్‌ మంటూ ఈ వాహ‌నాన్ని తీసికెళ్లాడు.  బుద్ధున్న‌వాడెవ‌డూ చేయ‌ని ప‌ని ఈ మ‌హానుభావుడు చేశాడు. ఇంటికి వెళ్లాల‌న్న తొంద‌ర‌లో 108 వాహ‌నాన్ని కొట్టేశాడు. కానీ దాని వ‌ల్ల ఇంట్లోవారు, చుట్టుప‌క్క‌ల‌వారూ, స్నేహితులు ఎంత‌గా ఖంగారు ప‌డ‌తారో ఆలోచించ‌లేదు. బండి ఇంటి ద‌గ్గ‌ర ఆపి ఇంట్లోకి వెళ్లాడు. ప‌క్క‌నే ఉన్న పిన్నిగారు, బాబాయిగారు, పెద్దాయ‌న అంతా ఇంటి ద‌గ్గ‌ర తిరుగుతున్నారు. ఏద‌న్నా దుర్వార్త బ‌య‌టికి వ‌స్తుంద‌ని. కానీ అలాగేమీ జ‌ర‌గ‌లేదు. పైగా , ఆ యింటి అబ్బాయి నిదానంగా బండిని చూస్తుండిపోయాడు. వచ్చిన వారు అత‌న్ని అడిగే ధైర్య‌మూ చేయ‌లేదు. ఏమీ కాలేద‌ని వాళ్లంతా ధైర్యం చెప్పుకుని ఇళ్ల‌ల్లోకి వెళిపోయారు. బుజ్జా..వీడు సామాన్యుడు కాదు...ఆంబులెన్స్‌తో ఇంటికి వ‌చ్చి మ‌రీ అంద‌ర్నీ కుశ‌లాలు అడుగుతున్నాడ్రా... అనుకున్నారంతా!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కి పాక్ జ‌ట్టు...రిజ‌ర్వుగా జ‌మాన్‌!

ఆసియా కప్‌లో పేలవంగా ఆడిన‌ ఫఖర్ జమాన్ రిజర్వ్‌ల జాబితా లోకి దిగజారాడు. టెస్టు ఓపెనర్ షాన్ మసూద్‌తో పాటు ఇఫ్తి కర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, ఆసి ఫ్ అలీ, ఖుష్దిల్ షా తదితరు లతోపాటు జట్టులో చోటు దక్కిం చుకున్నాడు. త్వరలో జరగను న్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టును గురువారం ప్రకటించింది. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు ఇటీవల ఆసియా కప్‌లో పాల్గొన్న జట్టును పోలి ఉంటుంది. ఆసియా కప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత రీకాల్ కోసం చాలా మంది మాజీ క్రికెటర్లు మద్దతు ఇస్తున్న వెటరన్ బ్యాటర్ షోయబ్ మాలిక్‌కు ఎలాంటి ఆనందం లేదు. షాదాబ్ ఖాన్‌ను బాబర్ డిప్యూటీగా ఎంపిక చేయగా, ప్రీమియర్ పేస్‌మెన్ షాహీన్ షా ఆఫ్రిది జట్టులో చోటు దక్కించుకు న్నాడు. అఫ్రిదీతో పాటుగా నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్ వంటి వారితో పాకిస్థాన్‌కు అద్భుతమైన పేస్ బౌలింగ్ విభాగం ఉంది. రిజర్వ్‌లో షానవాజ్ దహానీ పేరు పెట్టారు. ఆసియా కప్‌లో పేలవంగా ఉన్న ఫఖర్ జమాన్ రిజర్వ్‌ల జాబితాలోకి దిగజారాడు. టెస్టు ఓపెనర్ షాన్ మసూద్‌తో పాటు ఇఫ్తి కర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా తదితరులతో పాటు జట్టులో చోటు దక్కించుకున్నాడు. 15 మంది ఆటగాళ్లతో కూడిన ప్రపంచ కప్ జట్టులో, టాప్-ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ షా అఫ్రిదీతో పాటు మొదటిసారి పొట్టి ఫార్మాట్‌లో జట్టులో చేర్చబడ్డారు, ఫఖర్ జమాన్, మహ్మద్ హారిస్ ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా షానవాజ్ దహానీ పేరు పెట్టారు. ఏసిసి టీ-20 ఆసియా కప్ సమయంలో అతను ఎదుర్కొన్న గాయం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత వసీమ్ జూనియర్‌ని చేర్చారు, అయితే లండన్‌లో మోకాలి గాయంతో పునరావాసం పొందుతున్న షహీన్, వచ్చే నెల ప్రారంభంలో బౌలింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాడు, బ్రిస్బేన్‌లో జట్టులో చేరనున్నాడు. అక్టోబర్ 15న అని పిసిబి ప్రకటన తెలిపింది.  బాబ‌ర్ అజామ్ నాయ‌క‌త్వంలో టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే పాక్  జట్టులో షాదాబ్ ఖాన్ (వైస్‌కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ అఫ్రి , షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్. ఉన్నారు. జ‌ట్టు రిజర్వ్‌లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ.

జెలెన్‌స్కీ కారు ప్ర‌మాదం.. త‌ప్పిన ప్రాణాపాయం

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పై హ‌త్యాయ‌త్నం వార్త విని ప్ర‌పంచ‌దేశాలు నిర్ఘాంత‌పోయిన వెంట‌నే ఉక్రేనియ‌న్ అధ్య‌క్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ కారు ప్ర‌మా దం విని మ‌రింత ఆశ్చ‌ర్య‌ పోతు న్నాయి ప్ర‌పంచ‌దేశాలు. కైవ్‌లో తన కారు ట్రాఫిక్ ప్రమా దంలో చిక్కుకున్న తర్వాత ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడి మిర్ జెలెన్స్కీకి తీవ్రగాయాలు కాలే దని ఆయ‌న‌ ప్రతినిధి సెర్హి నైకిఫోరోవ్ గురువారం తెల్లవారు జామున ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలి పారు. జెలెన్‌స్కీ కారు ఒక ప్రైవే ట్ వాహనాన్ని ఢీకొట్టిందని నికి ఫోరోవ్‌ చెప్పారు, అయితే ప్రమాదం ఎప్పుడు జరిగిందో అతను వెల్లడించలేదు. జెలెన్స్కీతో పాటు వైద్యులు ప్రైవేట్ కారు డ్రైవర్‌కు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్‌కు అత్యవసర చికిత్స అందించి వైద్యులు అంబులెన్స్‌లో ఎక్కించారు. ఫేస్‌బుక్‌లో తెల్లవారుజామున 1:22 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో నైకీఫోరోవ్, కైవ్‌లో, ఉక్రెయిన్ అధ్యక్షుడి కారు, ఎస్కార్ట్ వాహనాలను ప్యాసింజర్ కారు ఢీకొట్టింది. ప్రెసి డెంట్‌తో పాటు వచ్చిన వైద్యులు ప్యాసింజర్ కారు డ్రైవర్‌ను అందించారు. అత్యవసర సహాయంతో మరియు అతనిని అంబు లెన్స్‌కు తర లించారు. అధ్యక్షుడిని వైద్యుడు పరీక్షించారు, తీవ్రమైన గాయాలు ఏవీ కనుగొనబడలేదు. చట్టం అమలు అధికారులు ప్రమాద పరిస్థితు లను పరిశీలిస్తారని అన్నారాయన. బుధవారం, జెలెన్‌స్కీఖార్కివ్ ప్రాంతంలో ఇజియంకు  ఆకస్మిక పర్యటన చేశారు. వ్యూహా త్మక నగరాన్ని సందర్శించిన సందర్భంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 'విజయం' హామీ ఇచ్చారు. యుక్రెయిన్ తూర్పు ప్రాంతాల నుండి రష్యన్ దళాలను బహిష్కరిస్తున్నందున, మొత్తం డాన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకో వాలనే క్రెమ్లిన్ ఆశయాన్ని తీవ్రంగా సవాలు చేస్తున్నందున, ఈ సందర్శన యుద్ధం కీలకమైన సమయంలో వచ్చింది. జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో త‌మ‌ నీలం-పసుపు జెండా ఇప్పటికే ఆక్రమించబడిన ఇజియంలో ఎగురుతోంది.  ప్రతి ఉక్రేనియన్ నగరం, గ్రామంలో ఇది ఉంటుంది. మేము ఒకే దిశలో ముందుకు, విజయం వైపు వెళ్తున్నామన్నారు.

టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన‌ సూప‌ర్ స్టార్ ఫెద‌ర‌ర్ 

స్విస్ టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెదరర్ గురువారం అంతర్జాతీయ టెన్ని స్కి రిటైర్మెంట్ ప్రకటిం చాడు, వచ్చేవారం ఆడే లావర్ కప్ తన చివరి ఏటీపి టోర్నమెం ట్ అని చెప్పాడు. 20 గ్రాండ్స్లామ్ టైటి ల్స్ గెలిచిన తర్వాత 41 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఫెదరర్ ఒక ప్రకటనలో ప్రకటించా డు. తన వీడ్కోలు కార్యక్రమం వచ్చేవారం లండన్‌లో జరిగే లావర్కప్‌గా ఉంటుందని ఫెదరర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది అతని మేనేజ్మెంట్ కంపెనీ నిర్వ హించే టీమ్ ఈవెంట్. 23 సార్లు మేజర్ ఛాంపియన్ అయిన సెరెనా విలియమ్స్ కెరీర్‌లో చివరి టోర్నమెంట్‌గా భావించే యుఎస్‌ ఓపెన్ ముగిసిన కొద్ది రోజులకే అతని రిటైర్మెంట్ గురించి ప్రకటన వెలువడింది. నా టెన్నిస్ కుటుంబానికి, వెలుపల. సంవత్సరాలుగా టెన్నిస్ నాకు అందించిన అన్ని బహుమతులలో, గొప్పది, నిస్సం దేహంగా, నేను దారిలో కలిసిన వ్యక్తులే: నా స్నేహితులు, నా పోటీదారులు,  క్రీడకు ప్రాణం పోసిన అభిమానులందరూ . ఈ రోజు నేను మీ అందరితో కొన్ని విశేషాలు పంచుకోవాలనుకుంటున్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. చాలా మందికి తెలిసినట్లుగా, గత మూడు సంవత్సరాలుగా గాయాలు, శస్త్రచికిత్సల రూపంలో ఫెద‌ర‌ర్‌కు ఎన్నోసవాళ్లు ఎదుర య్యాయి. పూర్తి పోటీ ఫారమ్‌కి తిరిగి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ నా శరీర సామర్థ్యాలు, పరిమితులు కూడా నాకు తెలుసు, దాని సందేశం ఇటీవల నాకు స్పష్టంగా ఉంది. నా వయస్సు 41 సంవత్సరాలు. నేను 24 ఏళ్లలో 1500 కు పైగా మ్యాచ్లు ఆడాను. లివర్ కలలు కన్న దానికంటే టెన్నిస్ నాతో చాలా ఉదారంగా వ్యవహరించింది ఇప్పుడు నా పోటీ జీవితాన్ని ముగించే సమయం వచ్చినప్పుడు నేను గుర్తించాలి, అని అతను చెప్పాడు. ఒక స్విస్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు, రోజర్ ఫెదరర్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపి) ద్వారా 310 వారాల పాటు ప్రపంచ నం.1 ర్యాంక్‌ను పొందాడు, అందులో రికార్డు 237 వారాల పాటు, ఐదుసార్లు సంవత్సరాంతపు నం. 1గా నిలిచా డు. ముఖ్యమైన విషయం ఏమిటంటే, రోజర్ ఫెదరర్ 103 ఏటీపి సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు, జిమ్మీ కానర్స్ తర్వాత అత్యధికంగా 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్, రికార్డు ఎనిమిది పురుషుల సింగిల్స్ వింబుల్డన్ టైటిల్స్, ఓపెన్ ఎరా రికార్డ్-టైలింగ్ ఐదు పురుషుల సింగిల్స్ యుఎస్‌ ఓపెన్ టైటిల్స్,రికార్డు ఆరు సంవత్సరాంతపు ఛాంపియన్‌షిప్‌లు.

మూడొచ్చినా మొక్కుబడి తంతే!

ఇటు చూస్తే మూడు రాజధానులు. అటు చూస్తే సంక్షేమ పథకాలు, ఎటు పోవడమో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దిక్కులు చూస్తున్నారు. నిజానికి, ఎటు వెళ్ళినా వైసీపీ నేతలకు అష్టమ దిక్కే దర్శన మిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మూడు రాజధానులు, సంక్షేమ మీటలు, ఏ అంశం మీద ఎన్నికలకు వెళ్ళినా, వైసీపీ ఓటమి ఇప్పటికే ఖారారై పోయిందనే అభిప్రాయం జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది. అయినా, ప్రజలు మాత్రం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.  ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కుంటున్న కష్టాల నుంచి బయట పడాలంటే, ఒకే ఒక్క మార్గం, ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని ఒక్క ఛాన్స్ తోనే ఇంటికి పంపేయడమే అనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంలో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం లేదు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా నిజం ఏమిటో తెలుసు. అయితే, కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడడం లేదు అనుకున్నట్లుగా, ముఖ్యమంత్రి ఒక విధమైన భ్రమల్లో ఉన్నారు. ఓ వంక రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని అంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ మరో మారు తెర మీదకు తెచ్చింది.   గురువారం(సెప్టెంబర్15) నుంచి మొదలైన  శాసన సభ వర్షాకాల సమావేశాల్లోనే  మూడు రాజధానుల బిల్లును మళ్ళీ ప్రవేశ పెడతామని, మంత్రులు ఒకరి వెంట ఒకరు బింకాలుపోతున్నారు. సవాళ్ళు విసురుతున్నారు. అయితే, ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు చద్రబాబు నాయుడు, అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానులకు ప్రజామోదం పొందాలని చేసిన సవాలు స్వీకరించేందుకు మాత్రం అధికార పార్టీకి ధైర్యం సరిపోవడం లేదు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ మూడు రాజదానుల అంశాన్ని ఎక్కడా ప్రస్తావించ లేదు. అంతే కాదు, అమరావతే రాజధానిగా ఉంటుందని వైసీపీ ఎన్నికల పత్రంలో పేర్కొంది. ఆమేరకు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చింది.నిజంగానే జగన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులకే  కట్టుబడి ఉంటే చంద్రబాబు నాయుడు సూచించిన విధంగా, అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పు కోరడమే సమంజమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు,అయితే, బింకాలు పోతున్న మంత్రులు మాత్రం, ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, అసలు విషయం తప్పింది ఇతర విషయాలు అన్నీ మాట్లాడుతున్నారు.  మంత్రి ఆర్కే రోజా అయితే, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు పెడతామని చెప్పారు. సరే, గత ఐదారు నెలలుగా వైసీపే నేతలంతా అదే మాట చెపుతున్నారు. కానీ, చిత్రంగా మంత్రి రోజా,ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలుకు మూడు రాజధానులు కావాలో లేదో అప్పుడు అర్ధమవుతుందని అన్నారు. నిజానికి రాష్ట్ర ప్రజల అభిప్రాయం తెలియాలంటే, ఒక కుప్పంలోనూ, ఒక పులివెందులలోనో కాకుండా,అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ మాత్రమే, కాదు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, సామాన్య ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. కోరుకుంటున్నారు. అయితే, ఆ ధైర్యం లేకనే, వైసీపీ మంత్రులు అసలు సమస్యను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.   అదొకటి అలా ఉంటే, కొద్ది కాలం క్రితం వరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా  సంక్షేమ పథకాలే తమను మరో మారు అధికార పీఠం ఎక్కిస్తాయనే భ్రమల్లో ఉన్నారు. అయితే ‘గడప గడపకు ...’ కార్యక్రమంతో ఆ భ్రమలు చాలా వరకు తొలిగి పోయాయని, రాజకీయ పరిశీలకులు,అధికార పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కూడా తత్త్వం బోధ  పడిందని, అందుకే ఆయన ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలపై చిర్రు బుర్రులాడు తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి ప్రజల దృష్టిని అసలు సమస్య నుంచి తప్పించేందుకే, మరో మారు మూడు.. బిల్లును తెరపైకి తెచ్చారని. ఈ సమావేశాల్లో అసలు బిల్లు రాక  పోయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. మరోవంక  కేంద్ర మంత్రి నారాయణ స్వామి, అసెంబ్లీ ఎక్కడుంటే అదే రాజధానని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి చాలా పనులకు అనుమతులు పొంది.. 40 శాతం పూర్తయ్యాక కాదనడానికి వీల్లేదని తెలిపారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఒక వేళ ముఖ్యమంత్రి ప్రస్టేజికి పోయి మళ్ళీ బిల్లు తెచ్చినా, పాత కథే  పునరావృతం అవుతుంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అది మొక్కుబడి తంతుగానే మిగులుతుందని అంటున్నారు

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పై హ‌త్యాయ‌త్నం

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌పుతిన్ పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అయితే ఆయ‌న ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల‌తో ర‌ష్యా మిల‌ట‌రీకి భారీ న‌ష్టం వాటి ల్లింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ర‌ష్యా రాజ‌కీయ‌వేత్త‌లు పుతిన్ రాజీనామాను డిమాండ్ చేశాడు. ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున‌నారు. ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలి జెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కిరిలో బుదనోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం మధ్య ఉన్న కౌకసస్ ప్రాంతంలో పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం.  యూరో వీక్లీ న్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ప్ర‌కారం ఈ విష‌యం వెల్ల‌డైంది. జ‌న‌ర‌ల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛాన‌ల్‌ లో దీన్ని రిలీజ్ చేశారు. అయితే ఎప్పుడు ఈ అటాక్ జ‌రిగింద‌న్న విష‌యాన్ని దాంట్లో తెలుప‌లేదు. ఫిబ్ర‌వ‌రి లో ఉక్రెయిన్‌పై దాడి జ‌రిపిన త‌ర్వాత పుతిన్ ఆరోగ్యం, జీవితానికి సంబంధించి అనేక క‌థ నాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో అయిదు సార్లు త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద ని, వాటి నుంచి త‌ప్పించుకున్న‌ట్లు 2017లో ఓసారి పుతిన్ వెల్ల‌డించారు. పుతిన్ ప్ర‌యాణించే లిమౌసైన్ వాహనాన్ని ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆ వాహ‌నానికి చెందిన లెఫ్ట్ ఫ్రంట్ వీల్ ధ్వంస‌మైంది. ఢీకొట్టిన స‌మ‌యంలో భారీ శ‌బ్ధం కూడా వ‌చ్చిన‌ట్లు టెలిగ్రామ్ ఛాన‌ల్‌ రిపోర్ట్‌లో తెలి పారు. లిమౌసైన్ కారును ఢీకొన్న స‌మ‌యంలో భారీగా పొగ‌లు కూడా వ‌చ్చాయని, కానీ సుర‌క్షితంగా ఆ కారును చేర్చిన‌ట్లు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు ఎటువంటి గాయం కాలేదు. కానీ ఈ ఘ‌ట‌న‌లో అనేక మందిని అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. పుతిన్ ప్ర‌యాణించే వాహ‌నాన్ని ఢీ కొట్టి న‌ట్లు మ‌రో సైట్‌లోనూ న్యూస్ రాశారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లోని రాజకీయ‌వేత్త‌లు పుతిన్‌పై దేశ‌ద్రోహం కేసు పెట్టాల‌ని భావిస్తున్నారు. పుతిన్‌ ను అధికారం నుంచి తొల‌గించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు యూరో వీక్లీ త‌న క‌థ‌నంలో తెలిపింది. పీట‌ర్స్‌బ‌ర్గ్‌లోని 65 మంది మున్సిప‌ల్ ప్ర‌తినిధులతో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన నేత‌లు పుతిన్ రాజీనామా కోరుతూ పిటిష‌న్‌పై సంత‌కం చేశారు. ఉక్రెయిన్ మీడియాతో బుదనోవ్ ఈ విషయాన్ని ప్రకటించారు. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందని, కౌక సస్‌కు చెందిన ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేశారని బుదనోవ్ తెలిపారు. అయితే హత్యాయత్నం విఫల మైందన్నారు. కాగా, మరోవైపు పుతిన్ సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.  దీంతో పుతిన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అలాగే తనకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు ఓ రష్యా సంప న్నుడు వెల్లడించారు. కాగా, గతంలోనే తనపై అయిదుసార్లు హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు పుతిన్ ప్రకటిం చారు.

షమీని కాద‌న‌డం ప‌ట్ల మాజీల ఆగ్ర‌హం

టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో పేసర్‌ మహ్మద్‌ షమి పేరు లేకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు. అనుభవం కలిగిన అతడిని స్టాండ్‌బైగా ఎంపిక చేయడం సరికా దని మదన్‌లాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత షమిని ఈ ఫార్మాట్‌ లో పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఆసియాక్‌పలో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత అతడిని దక్షిణా ఫ్రికా, ఆసీస్‌లతో సిరీస్‌ల‌కు ఎంపిక చేశారు. ‘షమి మ్యాచ్‌ విన్నర్‌. అందులోనూ ఆసీస్‌ గడ్డపై అతడు చాలా ఉపయోగపడతాడు. తొలి మూడు ఓవర్ల లోనే వికెట్‌ తీయగల సత్తా ఉన్నవాడు. అందుకే 15 మందితో కూడిన వరల్డ్‌కప్‌ జట్టులో షమి ఎందుకు లేడనే విషయం అర్థం కావడం లేదు. కప్‌ గెలవాలంటే బౌలింగ్‌ కూర్పు అద్భుతంగా ఉండాలి. బ్యాటిం గ్‌లో 180 పరుగులు చేయడం గొప్ప కాదు. ప్రత్యర్థిని నిలువరించడం అంతకన్నా ముఖ్యం.  టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌కి పేస‌ర్ బుమ్రాను తీసుకున్న భార‌త్ సెల‌క్ట‌ర్లు ష‌మీని వ‌దిలేయ‌డం ప‌ట్ల అభిమా నులు మండిప‌డుతున్నారు. గ‌త టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడిన ష‌మీని 2022 క‌ప్‌కి వెళ్లే జ‌ట్టుకు రిజ‌ర్వుగా తీసుకోవ‌డం అత‌న్ని అవ‌మానించ‌డ‌మే అంటున్నారు. ఆసియాక‌ప్‌కి దూరంగా పెట్టిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలి యాలో జ‌రిగే పెద్ద‌టోర్నీకి రిజ‌ర్వుల్లోకి తీసుకోవ‌డ‌మేమిట‌ని సీనియ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ష‌మీ ఇటీవ‌లి కాలంలో అంత‌ర్జాతీయక్రికెట్‌లో అంత చురుగ్గా పాల్గొన‌లేద‌న్న కార‌ణం కూడా సెల‌క్ట‌ర్లు చూపుతున్నారు. అత‌ని చివ‌ర‌గా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో ఒక వ‌న్డే, ఒక టెస్టు మాత్ర‌మే ఆడాడు. ఇత‌నికి బ‌దులుగా కుర్రాడు అర్ష‌దీప్‌సింగ్‌, సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్‌ను బుమ్రాకు మ‌ద్ద‌తుగా జ‌ట్టులోకి తీసుకున్నారు.  కేవ‌లం ఇటీవ‌ల ష‌మీ అంత గొప్ప‌గా చురుగ్గా ఏ టోర్నీలోనూ ఆడ‌క‌పోవ‌డ‌మే అత‌న్ని వెన‌క్కి పెట్టిన‌ట్టు సెల‌క్ట‌ర్లు చెబుతున్నారు. కానీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌కి ష‌మీ వంటి సీనియ‌ర్ల‌ను తీసుకోవ‌డం జ‌ట్టుకు మేలు జ‌రుగుతుంద‌ని చాలామంది అభిప్రాయం. టోర్నీకి వెళ్లే ముందు ఎలాగూ ఆసీస్‌, ద‌క్షిణా ఫ్రికాల‌తో టీ20 సిరీస్‌లు ఆడ‌తారు. అది ష‌మీకి మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. కానీ సెలెక్ట‌ర్లు ఆ ప‌రంగా ఆలోచించ‌క‌, అత‌న్ని రిజ‌ర్వులోనే పెట్టారు. 

కోతే... కానీ  అమ్మ‌!

కాస్తంత స్వ‌యంగా ఆడుకోవ‌డం వ‌చ్చినా పిల్ల‌లు త‌మ ప‌రిస‌రాల్లోనే త‌ల్లి ఉండాల‌ని కోరుకుంటారు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఆమె ద‌గ్గ‌రికి ప‌రుగులు పెడ‌తారు. త‌ల్లి ఓ ధైర్యం, త‌ల్లి ఓ న‌మ్మ‌కం, త‌ల్లి దైవం! పిల్ల‌లు త‌ల్లుల‌తో ఆడ‌తారు, త‌ల్లుల్లిన ఆట‌ప‌ట్టిస్తుంటారు.. వారికి అదో ఆనందం. ప‌డి దెబ్బ‌త‌గిలినా, వేగంగా ప‌రుగులు తీసినా అమ్మే స‌మాచార‌కేంద్రం.. అదేవిట్ర పిచ్చివెధ‌వా.. అలా ప‌రిగెడితే ప‌డ‌వూ! అంటే పిల్ల డికి వేయి ఏనుగుల బ‌లం.. త‌ల్లి త‌న‌ను ప‌ట్టించుకుంటోంద‌ని, గ‌మ‌నిస్తోంద‌ని. కానీ అది మ‌నుషుల‌కి మాత్ర‌మే సంబంధించిన‌ది కాదు.. ఆ ప్రేమ కోతుల్లోనూ ఉంటుంది.  పిల్ల‌ల్ని ఒంటికి అంటిపెట్టుకుని ఏకంగా చెట్లు, గోడ‌లూ దూకేస్తుంటాయి. చూసిన‌వారికి ఒక్కింత భ‌య‌మేస్తుంది.. ఈ పిచ్చిముండ ఆ పిల్ల‌ముండ‌ని కింద ప‌డేస్తుందేమోన‌ని లోలోప‌ల తిట్టుకుం టుంటాం! కానీ అలా జ‌ర‌గ‌నే జ‌ర‌గ‌దు.. మ‌న‌కి భ‌యం.. త‌ల్లిని అంటిపెట్టుకున్న‌ పిల్ల‌కోతికి  స‌ర‌దా! చెట్టూ చేమా బాగా ఉన్న‌ప్రాంతాల్లో, కాల‌నీల్లో మాత్రం కాస్తంత కోతుల హ‌డావుడి ఉంటుంది. రోడ్డు దాటే ప్పు డు ఎంతో జాగ్ర‌త్త‌గానే చూసుకుని మ‌రీవెళుతూంటాయి. కానీ ఎప్పుడో గాని ప్ర‌మాదానికి గురికావు. అలా ప్ర‌మాదానికి గుర‌యింది ఓ త‌ల్లి కోతి మొన్నీమ‌ధ్య‌నే. రోడ్డు దాటుతుండ‌గా ఒక వాహ‌నం గుద్దేసి వెళిపో యింది. ఆ బండివాడు మ‌నిషిని గుద్ది ఉంటే.. బ‌హుశా ఆగేవాడేమో.. కానీ కోతి, దాని పిల్ల కదా.. లైట్ తీసు కున్నాడు. కానీ త‌ల్లి కోతి మాత్రం పిల్ల‌ని ర‌క్షించుకోవ‌డంలో దాదాపు ప్రాణం పోయినంత స్థితిని అనుభ వించింది.  ఈమ‌ధ్య‌నే క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడిమండ‌లం, చిన్న‌ముల్క‌నూర్‌లో ఒక కోతి త‌న పిల్ల‌కు పాలిస్తూ నే రోడ్డు దాట‌బోయింది. ఒక వాహ‌నం వేగంగా వ‌చ్చి గుద్దేసింది. పిల్ల‌తో స‌హా త‌ల్లి కోతి దూరంగా వెళ్లి ప‌డిం ది. త‌ల్లి కోతికి వెన్నెముక దెబ్బ‌తిని లేవ‌లేకుండా ప‌డిపోయింది. చిత్ర‌మేమంటే త‌ల్లి పాలు తాగుతోన్న పిల్ల కోతికి మాత్రం చిన్న దెబ్బా త‌గ‌ల్లేదు. ఆ దృశ్యం చూసి మ‌న‌సు చ‌లించి వెంక‌ట్ అనే వ్య‌క్తి ఆ త‌ల్లి పిల్ల‌ని ద‌గ్గ‌ర‌లోని పొలంలోకి తీసికెళ్లి అక్క‌డ ఉంచాడు. త‌ల్లి ప్రాణంతోనే ఉంది. పిల్లని చూస్తూనే ఉంది. పిల్ల మాత్రం పాల‌కి ఇంకా ఎగ‌బ‌డుతోంది. 

పోలేర‌మ్మను ద‌ర్శించుకున్న పి.వి.సింధు

ఏ వృత్తిలో ఉన్నా చాలామందికి కొన్ని న‌మ్మ‌కాలు ఉంటాయి. కొంద‌రికి భ‌క్తి ఎక్కువ ఉంటుంది, కొంద‌రు కేవ‌లం నామ‌స్మ‌ర‌ణ చేస్తుంటారు. మ‌రికొంద‌రు త‌ర‌చూ దైవ‌ద‌ర్శ‌నానికి వెళుతూంటారు. క్రీడాకారులూ ఇం దుకు మిన‌హాయింపుకాదు. అస‌లా మాట‌కి వ‌స్తే, పెద్ద పెద్ద పారి శ్రామిక‌వేత్త‌ల‌కు, అంత‌ర్జాతీయ క్రీడా కారుల‌కూ భ‌క్తితో కూడిన న‌మ్మ‌కాలు బాగానే ఉంటాయి. పొద్దుటే చిన్న‌పాటి పూజ చేసిగాని బ‌య‌ట ప‌డ‌ని వారు చాలామంది ఉంటారు. కొంద‌రు ఉన్న‌చోట‌నే ఏదో ఒక గుడికి వెళుతూంటారు. మ‌రికొంద‌రికి ఫ‌లానా దేవ‌త ద‌ర్శ‌నం అంటూ ప‌ర్య‌ట‌న‌కు వెళ‌తారు. ఎవ‌రి ఇష్టం వారిది. ఆటల్లో అందు లోనూ అంత ర్జాతీయ స్థాయిలో నిత్యం ఉన్న‌త స్థాయిలోనే ఉండ‌డం క‌ష్టం. బ్యాడ్మింట‌న్ స్టార్ పి.వి.సింధూ అయినా స‌రే! పోలేర‌మ్మ జాత‌ర సంద‌ర్భంగా పి.వి.సింధు నెల్లూరు జిల్లా  వెంక‌ట‌గిరి పోలేర‌మ్మ‌ను  కుటుంబ స‌మేతం గా ద‌ర్శించుకున్న‌ది. పోలేరమ్మ అమ్మ వారి దేవస్థానం లొ ప్రత్యేక పూజలు చేసారు పి వి సింధు. అమెకు సాదరంగా ఆహ్వానం పలికారు మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి. అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌రింత బాగా రాణించాలంటే అమ్మ‌వారి ఆశీస్సులు అవ‌స‌ర‌మ‌ని భావించి ఉం డవ‌చ్చు. అందుకే ఆమె అమ్మ‌వారికి ద‌ర్శ‌నానికి వ‌చ్చివెళ్లింది సింధు. ఎప్పుడూ ఒకేలా అత్యంత అద్భు తంగా స‌త్తా ప్ర‌ద‌ర్శించ‌డం క‌ష్టం. క‌ష్ట‌ఫ‌లి అన్నారు. కానీ ఆట‌ల్లో ఎంత క‌ష్ట ప‌డి నా ఒక్కోసారి చిన్న‌పొర పాటుకు ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. అపుడు మాన‌సికంగా ప్లేయ ర్లు కుంగి పోతారు. అదు గో అలాంటి ప‌రిస్థితుల్లో మ‌న‌శ్శాంతి అవ‌స‌రం. అందుక‌నే ధ్యానం, దైవ‌ద‌ర్శ‌నం చేస్తుంటారు, ఎంత‌టి స్టార్ ప్లేయ‌ర్ల‌యినా. సింధూ కూడా అంతే.

పీకే, నితీష్ తిట్టుకున్నారు ..కలుసు కున్నారు!

రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును. ఎవరు ఎవరితో అయినా చేతులు కలపవచ్చును.  కొత్త కాపురం పెట్టవచ్చును. అలాగే, ఎవరు ఎవరితో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా తలాక్ చెప్పి విడాకులూ తీసుకోవచ్చును. నిజనికి, నడుస్తున్న చరిత్రలో ఇలాంటి ఉదంతాలు ఒకటీ రెండు కాదు,  కోకొల్లలుగా వినిపిస్తున్నాయి.  అలాంటిది, ఇక్కడ ఎన్నికల వ్యూహాలు అమ్మబడున  అని బోర్డు పెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న ప్రశాంత్ కిశోర్ నిన్నటి వరకు బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను విమర్శించి, ఈరోజు అదే నితీష్ కుమార్ తో భేటీ ఏమిటి, అంటే. అది అస్సలు .. బాగోదు.  ఇక విషయంలోకి వస్తే గత కొంత కాలంగా,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహారు ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత  నితీష్‌ కుమార్ పై  వరస విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్  బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో జట్టు కట్టిన తర్వాత, ప్రశాంత్ కిశోర్, చీటికి మాటికి పొత్తులు మార్చే ఆయన (నితీష్), రేపు మళ్ళీ బీజేపీ పంచన చేరరని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. అంతే కాదు, నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖాయంగా మళ్ళీ పొత్తులు మారుస్తారని బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చారు,. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో నితీష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని కూడా స్పష్ట చేశారు. భవిష్యవాణి వినిపించేశారు. అయితే, తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నే రెండిస్తా’ అన్నట్లు నితీష్ కుమార్ కూడా పీకేని  ఓ రేంజిలో ఏకి పారేశారు. తన నాయకత్వంలో ప్రభుత్వ పాలన గురించి కానీ, చేసిన పనుల గురించి కానీ ఏబీసీలు కూడా ప్రశాంత్ కిషోర్‌కు తెలియవని నితీష్ విమర్శించారు. దీనిపై పీకే వెంటనే కౌంటర్ ఇచ్చారు. బహుశా ఆయన ఒక్కరే చదువుకున్న వ్యక్తి కావచ్చని, అందువల్లే తన వంటి వాళ్లకు ఏబీసీలు తెలియవంటున్నారని, బహుశా ఆయనకు ఏ టు జడ్ తెలిసి ఉండొచ్చని అన్నారు. అభివృద్ధి పరంగా అట్టడుగు స్థానంలో బీహార్ ఉందని లెక్కలు చెబుతున్న నీతి ఆయోగ్‌తో ఆయన తెలివితేటలు పంచుకుంటే బాగుంటుందంటూ నితీష్‌పై  సెటైర్లు వేశారు. ఇలా ఒకరిపై ఒకరిపై విమర్శలతో విరుచుకు పడిన నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అది కూడా అనుకోకుండా, యాదృచ్ఛికంగా కాదు. ముందుగా అనుకుని, ముహూర్తం కుదుర్చుకుని మరీ పాట్నాలో భేటి అయ్యారు. ఇంచు మించుగా రెండు గంటలకు పైగా, ఆ ఇద్దరూ ముచ్చట్లాడుకున్నారు. ఆ ఇద్దరితొ పాటుగా మాజీ ఎంపీ పవన్ వర్మ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. వీరి సమావేశం ఎజెండా కానీ, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేది కానీ వెంటనే తెలియలేదు. పవన్ వర్మ ఇటు నితీష్ కుమార్ కు అటు ప్రశాంత్ కిశోర్ కు చాలా చాలా సన్నిహితుడని అంటారు. వర్మ పౌరోహిత్యంలోనే ఈ భేటి జరిగి ఉంటుందని అంటున్నారు. నిజానికి, ఒక్కప్పుడు జేడీయూలో కీలక బాధ్యతలు నిర్వహించిన వర్మ, ఆ తర్వాత జేడీయూ, బీజేపీతో జట్టు కట్టడంతో బయటకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అయితే, నితీష్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత, తృణమూల్ కు రాజీనామా చేసి  మళ్ళీ, నితేష్ చెంతకు చేరారు. ఇంకా జేడీయూలో చేరారో లేదో తెలియదు కానీ, నితీష్ కుమార్ కు మాత్రం దగ్గరయ్యారు.  ప్రశాంత్ కిషోర్ కూడా గతంలో జేడీయూ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ విజయానికి దోహదపడ్డారు.  జేడీయూలో చేరి కొద్దికాలం తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు  ముగ్గురు మాజీ మిత్రులు కలిసి మంత్రాంగం సాగిస్తున్నారు. అయితే, ఇంతకీ ఆ ముగ్గురు  ఏమి చర్చించారు? ఏమి చేయబోతున్నారు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.. అంటున్నారు, అయితే ఇప్పడు బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా వారు మాట్లాడుకుంది ఒకటే ఉంటుంది.  2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎలా? మోడీని గద్దెదించడం ఎలా? నితీష్, కేసీఆర్ కలిసినా, నితీష్ పీకే కలిసినా, లేదా మరో ఇద్దరు మహా నాయకులు కలిసినా మోడీ చుట్టూనే మంతనాలు సాగుతాయి. అనేది వేరే చెప్పనకరలేదు.

సెప్టెంబ‌ర్ 17ని ఏంచేయ‌ద‌ల‌చుకున్నారు?

చిన్న‌ప్పుడు గాంధీ జ‌యంతి, బాల‌ల‌దినోత్స‌వాలు స్కూళ్ల‌ల్లో బ్ర‌హ్మాండంగా జ‌రిగేవి. వాటి మ‌ధ్య మంచి ఆరోగ్య‌క‌ర పోటీయే ఉండేది. దూష‌ణ‌భూష‌ణ‌లకు ఆస్కారం ఉండేది కాదు. ఒకే పండుగ‌ను వేరు వేరు దృష్టితో నిర్వ‌హించ‌డ‌మే స‌మాజంలో గొడ‌వ‌ల‌కు, స్ప‌ర్ధ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొ న్న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో బీజేపీవారి భక్తిత‌త్వానికి, ఇత‌రులు అనుస‌రించేదానికి ఎంతో తేడా ఉం టోంది. వారు మాట్లాడిన‌ది, వారు చేసే ప‌నులు, వారు ప్ర‌క‌టించేదే అస‌లు సిస‌లు దేశ‌భ‌క్తి అని స్వ‌యం గా బీజేపీవారే ప్ర‌చారం చేసుకోవ‌డం హాస్యాస్ప‌దంగా మారింది.   తాము నిర్వ‌హించేదానికే అత్యంత విలువ ఉంటుంద‌న్న భావ‌న నుంచి బీజేపీవారు బ‌య‌ట‌ప‌డాల‌నే అంతా ఆకాంక్షిస్తున్నారు. ఎందు కంటే, దేశ‌భ‌క్తి లో కొట్టుకుపోతున్న స‌ద‌రు బీజేపీ వారు సెప్టెంబ‌ర్ 17ను చరిత్ర‌లో ప్ర‌పంచదేశాలు చెప్పుకునేట్టు చేయ డానికి కంక‌ణం క‌ట్టుకున్నారు.    సెప్టెంబర్ 17.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌ గా మారింది. సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్న తెలంగాణ సర్కార్..తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతామన్న బీజేపీ చెబు తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లు  పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నా యి. సెప్టెంబర్ 17 శనివారం పెరేడ్ గ్రౌండ్‌లో‌ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం సభ నిర్వహించనుంది.  కాగా గురువారం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం‌ వద్ద నుంచి ఆరెంజ్ బ్రిగేడ్ ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరుగుతుంది. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించ నుంది. అమృత మహో త్సవాల్లో భాగంగా పార్టీ తరుపున బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.   చిత్ర‌మేమంటే తెలంగాణా ప్ర‌జ‌లు మాత్రం క‌మ‌లం, కారు వేగాల మ‌ధ్య న‌లిగిపోతున్నారు. త‌మ ప్రాంత ప్రాధాన్య‌త‌ను దేశ‌మంతా తెలిసేలా చేయ‌డానికి ఇపుడు అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. కానీ కొత్త‌గా రాజ‌కీ యాల్లోకి వ‌చ్చిన వారికి ఉండే అత్యుత్సాహాన్నే బీజేపీ, టిఆర్ ఎస్ సీనియ‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. గిస్మంటి ర‌చ్చ బ‌డికిబోయిన్ప‌టి సందీ జూడ్నేలే.. అనుకుంటున్నారు తెలంగాణా ప్ర‌జ‌లు. 

ఏపీపై రేణుకా చౌదరి ఫోకస్!

పరిచయం అక్కర్లేని పేరు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం   దివంగత నందమూరి తారక రామారావు హయాంలో రేణుకా చౌదరి  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మనసులో ఉన్నది ఉన్నట్లు సూటిగా సుత్తి లేకుండా చెప్పడం, రాజకీయంగా  ప్రత్యర్థులు ఎంతటివారైనా తన పదునైనా  వాగ్బాణాలతో  వెరుపులేకుండా విమర్శలు గుప్పించడం రేణుకా చౌదరి నైజం. అదే స్పీడును, అదే నిక్కచ్నితనాన్ని, అదే ధైర్యాన్ని ఆమె కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగిస్తున్నారు. అయితే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలైన రేణుకా చౌదరి ఇప్పుడు ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు రేణుకా చౌదరి రెడీ అవుతున్నారని సమాచారం. ఏపీ రాజధాని అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని,  ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  అమరావతి అంశాన్ని అవకాశంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఏపీ ప్రజలకు సుపరిచితురాలైన రేణుకా చౌదరి చరిష్మా ఇందుకు బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ఏపీలో రేణుకా చౌదరి పార్టీ సభలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఏఐసీసీ ఓ సరికొత్త ప్రణాళికను రెడీ చేసిందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని రైతుల అమరావతి టూ అరసవిల్లి 2.O మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి రేణుకా చౌదరి హాజరయ్యారని చెబుతున్నారు. అమరావతి రైతులతో రేణుకా చౌదరి కొంతదూరం నడిచి మరీ వారికి మద్దతు తెలిపారు.   రైతులు కూర్చున్న ట్రాక్టర్ ను రేణుకా చౌదరి స్వయంగా డ్రైవ్ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిందనే కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలు అనేక మంది తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైసీపీ, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఏపీలో అత్యంత దీన స్థితిలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఓ లైట్ హౌస్ మాదిరిగా కనిపించినట్లు చెబుతున్నారు.  రేణుకా చౌదరి సభల ద్వారా ఏపీలో మళ్లీ తన ఉనికిని రాబట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని ప్రధాన నగరాల్లో రేణుకా చౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది. అమరావతి టూ అరసవిల్లి రైతుల మహా పాదయాత్ర సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఏపీ సీఎం ఓ మూర్ఖుడు అని, ఆయనకు పరిపాలన చేతకాదంటూ నేరుగా నిప్పులు చెరిగారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మూర్ఖపు పాలనపై రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. జగన్ కు ఎందుకు ఓటు వేశామా? అని ఏపీ ప్రజలు చాలా రోజులుగా బాధపడుతున్నారన్నారు. ఏపీలో తనకు ఎందరో తెలుసని, వారిని పలకరించినప్పుడల్లా జగన్ ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు.  ఏపీ రాజధాని అమరావతి ఎక్కడికీ పోదని ఆమె ధీమాగా చెబుతున్నారు. కొన్ని నెలల్లోనే జగన్ పాలన అంతం అవుతుందని, తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని రేణుక అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు కూడా రేణుకా చౌదరి వచ్చి రైతులకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

గాలి మళ్లీ జైలుకు?

బళ్లారి గనులను అక్రమంగా కొల్లగొట్టిన మైనింగ్ టైకూన్ గాలి జనార్ధన్ రెడ్డి త్వరలో మళ్లీ జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. గాలి మైనింగ్ అక్రమాల కేసు విచారణ ఇక వేగవంతం కాక తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. గాలి జనార్ధన్ రెడ్డి కేసు విచారణలో ఆమోదయోగ్యం కాని జాప్యంపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు  తాజా పరిస్థితిపై ఈ నెల 19లోగా సీల్డ్ కవర్ లో నివేదిక పంపాలని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సుప్రీం  ఆదేశించింది. దీంతో కొంత కాలంగా షరతులతో కూడిన  బెయిల్ పై    స్వేచ్ఛగా ఉన్న గాలి మళ్లీ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణులు అంటున్నారు.  గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై  సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ 12 ఏళ్లుగా ఆలస్యం కావడం సహించరానిదని సుప్రీం కోర్టు   వ్యాఖ్యానించింది. తాము గతంలో విచారణను వేగవంతం చేయాలని ఆదేశించినా  జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉంది? ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడంలేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై సీబీఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011సెప్టెంబర్ 5న జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్ లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లకూడదనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న జనార్ధన్ రెడ్డికి బెయిలు మంజూరు చేసింది.  కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున బెయిలు షరతులను సడలించాలంటూ జనార్ధన్ రెడ్డి 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చని గత ఏడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్14) విచారించింది. గాలి జనార్ధన్ రెడ్డి బళ్లారిలో ఉంటే సాక్షులకు ముప్పు అంటూ సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు.  గాలి జనార్ధన్ రెడ్డి స్వస్థలం బళ్లారి. ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు. సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు. మాధవి దివాన్ వాదనపై స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు. విచారణ సాగడం లేదని మాధవి దివాన్ బదులిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్ జీ సమాధానం ఇచ్చారు. గతం విషయం తాను అడగటం లేదని, ప్రస్తుతం స్టే ఉందా? అని జస్టిస్ షా ప్రశ్నించారు. దీనికి ఏఎస్ జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తీవ్రమైన అభియోగాలున్న ఈ కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ సీబీఐ కేసులు న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట సాగకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని సుప్రీం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఆదేశాలతో   గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఒకే గూటి ప‌క్షులు..ఒకే రాగం!

రోడ్డుమీద ఇద్ద‌రు తాగి గొడ‌వ‌ప‌డుతూ ఛండాలంగా తిట్టుకుంటున్నారు...త‌లుపులు భ‌డాల్న మూసేసి ఎదురింటావిడ ఇంట్లోకి వెళ్లింది. మ‌ధ్యాన్నం టీవీ పెట్ట‌గానే ఒక ఛాన‌ల్లో ఒక ప్ర‌జాప్ర‌తినిధి తిట్ల దం డ‌కం వ‌స్తోంది...వంటింట్లోంచి ప‌రుగున వ‌చ్చి ఓ క్ష‌ణం చూసి, విని.. పొద్దుట‌వాడే న‌యం అనుకుం దామె!  అదీ మ‌న భాషా ప్ర‌యోగం తాలూకు ఎఫెక్ట్‌! చ‌దువు, సంస్కారం, భాషా ప్ర‌యోగాల‌కు బొత్తిగా సంబంధ‌మేలేని కాలంలో ఉన్నామ‌న్న‌ది మ‌న ప్ర‌జాప్ర‌తినిధులే రుజువు చేస్తున్నారు. చాలా రోజుల క్రిత‌మే వైసీపీ మాజీ మంత్రి కోడాలి నాని మాంఛి సంస్కృతంలో ఎవ‌ర్నో తిట్టారు. అది తెలుగే అని అర్ధ‌ మ‌య్యేస‌రికి  చెవులు చిల్లులు ప‌డి, టీవీ క‌ట్టేసి తిండి స‌యించ‌క ఓ పెద్దామె ఈయ‌న‌కా ఓటు వేసింది అనుకుందామె. ఇలాంటి వారిని తోబుట్టువులా ఇపుడు వెన‌కేసుకొచ్చారు మంత్రి రోజా.  రాంగ్‌రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్, సీఎం జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలార‌ట‌. అవాకులు చెవాకుల‌కీ ప‌చ్చి బూతుల‌కీ తేడా తెలీని స్థితిలో ఉన్నారు మంత్రి రోజా. అధికార‌ప‌క్షంవారు, విప‌క్షాల వారూ ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధం చేయ‌డం మామూలే. ఇది అనాదిగా ఉన్న‌దే.కానీ కాల‌క్ర‌మంలో వారి భాషా ప్ర‌యోగంలో స‌ర‌దాలు పోయి దారుణంగా మారి బ‌య‌ట‌క‌న‌ప‌డితే కొట్టుకు చ‌చ్చేంత‌గా  కొత్త రంగులోకి మారడ‌మే ఎవ్వ‌రూ భ‌రిచ‌లేక‌పోతున్నారు. ప్ర‌జాప్ర‌తినిధులుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నపుడు  ఆ హుందాత‌నం, గౌర‌వం ఇచ్చిపుచ్చుకోవ‌డం పోతున్నాయ‌న్న‌ది ఓట‌రు బాధ‌.  ఓటు వేసిన త‌ర్వాత మ‌ర్చి పోయేలా ప్ర‌జాప్ర‌తినిధులే చేసుకుంటున్నారు.  గ‌తంలో వైసీపీ విప‌క్ష స్థానంలో ఉండ‌గా, ఆర్‌.కె.రోజా అసెంబ్లీలో చాలా అస‌హ్య‌క‌ర భాషా ప్ర‌యోగ‌మే చేశారు. అది చూసి, వినీ మ‌హిళ‌లే తిట్టుకున్నారు. ఒక‌ మ‌హిళ మంత్రిగా ఇంత ఛండాలమ‌యిన  భాష మాట్లాడందేమిటా అని ఆశ్చ‌ర్య‌పోయారు, అస‌హ్యించుకున్నారు. ఇటీవ‌లి కాలంలో రోడ్డుషోల్లో, మీడియా స‌మావేశాల్లోనే కొడాలి నాని విప‌క్షాల మీద ఆయ‌నే మాట్లాడ‌గ‌లిగిన భాష‌తో విరుచుకుప‌డ‌టం మ‌రి ఆర్‌.కె. రోజా వంటివారికి పెద్ద ఘోరంగా ఏమీ అనిపించ‌దు. ఒకే రకంగా ఆలోచించేవారు, ఒకే ర‌కంగా మాట్లాడేవారు ఇలా ఒకే పార్టీలో ఉండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. అందువ‌ల్ల, ఒక‌రి భాష ఒక‌రికి త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వారి అధినేత‌కీ న‌చ్చ‌వ‌చ్చు. అంచేత‌, వారి దృష్టిలో టీవీ ప్రేక్ష‌కుల‌కు, అందునా ఓట‌రుకి న‌చ్చాల‌ని ఉండ‌దు. ఉండాల‌నీ అనుకోరు. 

ప్రహసనంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. సర్వాధికారాలూ సోనియాకే..!?

అవున్రా..ఇంత‌కీ పిల్ల‌డికి ఏం పేరుపెట్టాల‌నుకుంటున్నావ్‌? అని అడిగారు ఆ యింటి పెద్దామె. మెగాస్టార్ పేరు.. అన్నాడు మ‌న‌వ‌డు విసుగ్గా..ఇంత‌ప‌నీ చేస్తాడ‌ని పెద్దామె వంటింట్లోకి వెళ్లి వాళ్ల బంధువులంద‌రికీ ఫోన్ చేసింది.. నా మునిమ‌న‌వ‌డి పేరు మా ఆయ‌న పేరే ఉండేట్టు ఫోన్ చేసి మ‌రీ చెప్ప‌మ‌ని! ఎంత‌యినా ఇంత పెద్ద కుటుంబాన్ని నిల‌బెట్టినోడుగ‌దా.. అందుకు అంది పెద్దామె ఆన‌క‌. ఈలోగా బంధువ‌ర్గం అంతా త‌లా ఒక పేరు కాయితాల మీద రాసేసుకుని ఫోన్ చేసి చెప్పాల‌ని సిద్ధ‌ప‌డ్డారు. ఇంత‌లో ఒక‌రిత‌ర్వాత ఒక‌రికి పెద్దామె ఫోన్ రావ‌డంతో స‌ద‌రు కాయితాల‌న్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. ఇక చేసేదేముంది.. డివివి బిఎస్‌వి..అంటూ పేద్ధ‌పేరు ఆ బుడ్డోడికి పెట్టాల్సి వ‌చ్చింది. దీంతో ఆ పిల్లాడి నామకరణ మహోత్సవం కాస్తా ఒక ప్రహసనంగా మారిపోయింది. సరిగ్గా అలాగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం ఒక ప్రహసనంగా సాగుతోంది. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. పోటీ అనివార్యమైతే వచ్చే నెల 17న జరుగుతుంది.  దీంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ నెహ్రూ కుటుంబం బయటి నుంచి ఎన్నికయ్యేది ఎవరన్న ఆసక్తి కాంగ్రెస్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా అందరిలోనూ నెలకొంది. వాస్తవానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, ఆ పార్టీ అధ్యక్ష స్థానం ఖాళీగానే వుంది. అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె ఆ బాధ్యతలను తాత్కాలికంగానే, తప్పని సరి పరిస్థితుల్లోనే చేపట్టారు.  వయో భారం, మ అనారోగ్యం కారణంగా ఆమె తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను కూడా సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితుల్లోనే పార్టీ అధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది.  అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.  అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినవస్తున్నా, అందుకు సంబంధించిన స్పష్టత అయితే లేదు. ఇక గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ మరో సారి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్నా.. ఆ విషయంలో ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదని అంటున్నారు.  అయితే రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై మాత్రం పార్టీలోనే కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జీ23 నేతలు ఈ విషయంలో సీరియస్ గా విమర్శలు చేస్తున్నారు. జీ 23 నేతలకు నాయకత్వం వహించిన గులాం నబీ ఆజాద్ ఇటీవలే పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకునే హడావుడిలో ఉన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ  విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, అదే సస్పెన్స్ కొనసాగించారు. దీంతో అంతటా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులను నామినేట్‌ చేసే అధికారం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకే కట్టబెట్టేలా   తీర్మానాలు చేయాలని అన్ని రాష్ట్రాల శాఖలకు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అంతా నామమాత్రంగా మారిపోయింది. గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అగ్రనాయకత్వం యోచిస్తోంది. రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వంటి విధేయులకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ తదుపరి అధ్యక్షుడిని ప్రకటించే అధికారాన్ని సోనియా గాంధీకి కట్టబెడుతూ రాష్ట్రాల ప్రతినిధులు తీర్మానం చేయడం అంటే.. సోనియాగాంధీ అభీష్టం మేరకు ఆమె ఆశీస్సులు ఉన్న వారే పార్టీ అధ్యక్షపగ్గాలను అందుకుంటారు. పోటీ ఉండదు. కొత్త అధ్యక్షుని హయాంలో కూడా గాంధీ, నెహ్రూ కుటుంబం ఆధిపత్యం ఇప్పటిలాగే కొనసాగుతుంది.  ఆపలేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 22న విడుదల కానుంది. 24 నుంచి 30 వరకు నామినేషన్లు దాఖలుకు గడువు ఉంది. అక్టోబరు 17న ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ నెల 20లోగానే సర్వ అధికారాలనూ తీర్మానాలు చేయాలని అన్ని పీసీసీలకు అగ్రనాయకత్వం ఆదేశించింది.