స్టూడెంట్ కోతి!

పిల్ల‌వాడు బాగా అల్ల‌రి చేస్తు న్నాడ‌ని, నిమిషం కుదురులే కుండా ఉన్నాడ‌ని బ‌డిలో వేశారు. అక్క‌డ బాగా అల్ల‌రి చేస్తున్నాడ‌ని, మీవాడు మ‌రీ కోతిలా త‌యార‌య్యాడ‌ని టీచ‌ర్ ఆ పిల్ల‌వాడి త‌ల్లికి ఫోన్ చేసి మ‌రీ చెప్పింది. మీ వాడిని మీరు అదుపులో పెట్టా ల‌ని, మాట అస్స‌లు విన‌డం లేద‌ని ఫిర్యాదు చేసింది. మ‌నం చేసే పిచ్చి ప‌నుల‌న్నిటికీ కోతిని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని దాన్ని అవ‌మాని స్తున్నామ‌నుకోం. కానీ జార్ఖండ్‌లో ఒక కోతి మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా చ‌క్క‌గా రోజూ ఓ క్లాసులో బుద్ధిగా కూచు ని పాఠాలు వింటోంది.  మొద‌ట క్లాసులో పిల్ల‌లు భ‌యంతో ఒణికారు. కానీ క్ర‌మేపీ ఏది ఈ కోతి ఇంకా రాలేదే అని ఎదురుచూస్తున్నారు, టీచ‌ర్‌తో స‌హా! పుస్త‌కాలు, పెన్నులు, పెన్సిలు, కంపాస్ బాక్స్ ఏమీ లేకుండా క్లాసులోకి చాలా విన‌యంగా వ‌చ్చి ఏదో ఒక వ‌రుస‌లో టీచ‌ర్‌కి క‌నిపించేలా కూచుని శ్ర‌ద్ధ‌గా పాఠాలు వింటోంది. మ‌నోడు కంటే ఇదే నయం మావా! అనుకున్నారు చాలామంది.  పిల్లలే బుద్ధిగా స్కూల్‌కు వెళ్లరు. కానీ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే కోతి మాత్రం ఎంతో క్రమశిక్షణతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తోంది. అంతేకాదూ.. తరగతి గదుల్లో కూర్చుని.. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి గోకారా?.. గోకించుకున్నారా?

ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం అవుతుంది .. ఇంకొన్ని సందర్భాలలో అదే ఆలస్యం విషాన్ని అమృతంగా మారుస్తుంది. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులు ఉక్కిరి బిక్కిరి చేయడంలో, ఆరితేరిన దిట్ట. అందులో ఎవరికీ ఎలాంటి సందేం లేదు. అయితే, అప్పుడప్పుడు అంతటి ఆయన కూడా, తెలిసో  తెలియకో తప్పులో కాలేసిన సందార్భాలు లేక పోలేదు. గతాన్ని అలా పక్కన పెట్టినా, ఇప్పడు ఫ్రెష్ గా  ముఖ్యమంత్రి గారు మరోమారు తప్పులో కాలేశారు. నిజానికి, ఈ మధ్య కాలంలో ఆయన తప్పులో కాలేయడమే అలవాటుగా మార్చుకున్నారని అనేవాళ్ళు ఉన్నారు, కానీ,, అది వేరే విషయం, అనుకోండి. అదలా వుంచి విషయంలోకి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్  కి ఎందుకో ఏమో కానీ, ఒక్కసారిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర మీద ఎక్కడ లేని గౌరవం పుట్టుకొచ్చాయి.అంతే కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడం ఏమిటి, మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆమేరకు ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతటితో ఆగకుండా నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయానికి, అంబేద్కర్ పేరు, పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించి, ఆదేశాలు జారీ చేశారు.అయితే మోడీని ఇరకాటంలో పెడుతున్నాననే సంతోషంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. అయన్నే ఇరకాటంలోకి నెట్టిందని అంటున్నారు.  ఎప్పుడో కాదు, కొద్ది రోజుల క్రితమే ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గురించి,భారత రాజ్యాంగం గురించి తమ ‘అమూల్య’ అభిప్రాయం బహిరంగంగా వ్యక్తపరిచారు. వెనకటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ఆమోదించిన అర్దినెన్స్’ పత్రాలను పబ్లిక్’గా చించి పోగులు పెట్టిన విధంగా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేసేఆర్ చేతులతో, చేతలతో కాకున్నా, నోటీ మాటలతో చించి అవతల పారేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలని, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మూడు భాషల్లో డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం చెల్లని నోటు, చిత్తు కాగితం అన్న రీతిలో అవహేళన చేశారు.  అసలు అంబేద్కర్ ఎవరు? హూ ఈజ్ హీ? అన్న రీతిలో మాట్లాడారు. దళిత సంఘాలు.. అభ్యతరం చ్జేపితే..దళిత సంఘాలకు ఏమి పని, అంటూ విలేకరలపై ఎదురు దాడి చేసి నోరు మూయించారు. ఇప్పడు అప్పుడు ఆయన అంబేద్కర్ గురించి, అంబేద్కర రచించిన రాజ్యాంగం గురించి, దళితిల గురించి వెలిబుచ్చిన అమూల్య అభిప్రాయాలతో పాటుగా ఎనిమిదేళ్ళుగా, ముఖ్యమంత్రి హోదాలో ఒక్క నాడు అంబేద్కర విగ్రహానికి ఓ దండేసి, దండం పెట్టింది లేదనే నగ్న సత్యం మొదలు దళితులకు ఆయన చేసివదిలేసిన వాగ్దానాల వరకు ఒకటొకటిగా ఏకరువు పెడుతూ, విపక్షాలు ఆయని నిలదీస్తున్నాయి.  నిజానికి, అది ముఖ్యమంత్రి డీఎన్ఎ ప్రభావమో, మరేమో కానీ, దళిత ముఖ్యమంత్రి మొదలు మూడెకరాల భూమి వరకు దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలుకోలేదనే దృఢమైన అభిప్రయం దళితులలో బలంగా పటుకు పోయింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో ముఖ్యమంత్రి, అంబేద్కర్ పేరున దళితులపై కొత్తగా ఎత్తుకున్న ప్రేమపై ప్రతిపక్షాలు స్పందించక ముందే సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎనిమిదేళ్ళ తెరాస పాలనలో దగాపడిన దళితులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, ముఖ్యంత్రి ఏమో కానీ, తెరాస నాయకులు మాత్రం ప్రజల్లో పలచనవుతున్నామని అంటున్నారు.  ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.  అదొకటి అలా ఉంటే, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదు, నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కుర్చీలో దళితుని కూర్చో పెట్టాలని విపక్షాలతో పాటుగా దళిత సంఘాలు కూడా డిమాండ్  చేస్తున్నాయి.అంతే కాదు దళిత ముఖ్యమంత్రి  విషయంలో ఇచ్చిన మాట తప్పడమే కాకుండా,  ‘దళిత సీఎం కానందుకు ప్రజలు నన్ను ఓడించారా.. రెండోసారి కూడా అధికారం ఇచ్చారు. అలాంటప్పుడు దళిత సీఎం హామీకి విలువ ఎక్కడిది. అది ముగిసిన అధ్యయనం’ అని కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో దళితులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు విపక్షాలు ఈ హామీని పదేపదే గుర్తుచేస్తున్నాయి. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి.ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి, తెరాస నాయకులూ సమాధానం చెప్పవలసిన చిక్కు ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు స్థిమితంగా ముఖ్యమంత్రి  అనవసరంగా దళితుల గోక్కున్నామని అంటున్నారు.  కొద్ది రోజుల క్రితం  ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, తనను గోకినన గోకకున్నా, తాను మాత్రం మోడీని గోకుతూనే ఉంటనని అన్నారు. ఇప్పడు ఆ అలవాటులో పొరపాటుగా దళితుల గాయాలను గోకారు. దీంతో ముఖ్యమంత్రి గోకారా, గోక్కున్నారా? అనేది ఇప్పడు తెరాస నాయకులకు చిక్కు ప్రశ్నగా మిగిలింది.

గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో కేసీఆర్ భేటీ

జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అడ్డంకులు, అవాంతరాలు, పరాభవాలు, ప్రతి కూలతలూ ఎదురౌతున్నా ఇసుమంతైనా లేక్క చేయకుండా ముందుకే సాగుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఈడీ దాడుల  ప్రకంపనలను ఇసుమంతైనా పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలకు సంబంధించి వరుస చర్చలలో మునిగిపోతున్నారు. ఇరత రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, రైతు ప్రతినిథులు, రాజకీయ పార్టీల నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్16) ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ బేటీలో దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపైనా ఇరువురి మధ్యా చర్చ జురిగిందని చెబుతున్నారు.  జాతీయ స్థాయిలో రాజకీయాలలో మార్పు రావాలంటే.. కేంద్రంలో అధికారం మారాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా అందరితో జరుపుతున్న సమాలోచనలలో భాగంగానే శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ నేతతో కేసీఆర్ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా తాను కొత్తపార్టీ పెట్టగబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన పార్టీ తరఫున రాష్ట్రంలోని మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ(182) అభ్యర్థులను నిలుపుతానని ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించడమే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.   బీజేపీ ముక్త భారత్ నినాదంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ఇప్పటికే  బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో   భేటీ అయ్యారు.  బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలతో   చర్చలు జరిపారు. అలాగే  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోనూ ఇటీవలే భేటీ అయ్యారు.  ఇప్పుడు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో చర్చలు జరిపారు. దసరా లోపుగానే  కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కలసివచ్చే పార్టీలూ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న సీసీఐ జాతీయ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. సీపీఐ జాతీయ సమావేశాలలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్సేతర నాయకులతో సీపీఐ నేతలు ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశానికే కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. 

లోకీ..ఐ ల‌వ్ యూ!

చాలామందికి చిరంజీవంటే యిష్టం. కొంద‌రికి అర్జున్ అంటే యిష్టం, మ‌రికొంద‌రికి ప్ర‌బాస్ అంటే మ‌రీ యిష్టం. ఓ చిన్నారికి లోకీ అంటే మ‌హాయిష్టం! చూసే సినిమాలు, చ‌దివే క‌థ‌లు వాటిల్లో పాత్ర‌లు, పోనీ న‌టులు ఆటోమాటిక్‌గా ఆక‌ట్టేసుకుంటారు. అలానే మాట్లాడాల‌ని, స‌ర‌దాలు చేయాల‌ని అభిమానులు ప్ర‌య‌త్నిస్తుంటారు. క‌ల‌వాల‌ని, నాలుగు మాట‌లు, ఓ సెల్ఫీకోసం తెగ ఆరాట‌ప‌డుతుంటారు. కానీ  ఈ పాప మాత్రం మార్వ‌ల్ అనే వెబ్ సిరీస్‌లోని లోకి  ఏకంగా ఐ ల‌వ్ యూ అంటూ ఉత్త‌రం రాసింది!  ఇప్ప‌టి పిల్ల‌లు వీడియోగేమ్‌లు, వెబ్ సిరీస్‌లంటే చెవి కోసుకంటున్నారు, క‌ళ్ల‌ప్ప‌గించేస్తున్నారు. గ‌డి యారంలో ముల్లు తిర‌గ‌డానికి వీరి కాల‌క్షేపానికి సంబంధం ఉండ‌దు. అమ్మ గిన్నెలో అన్నం పెట్టు కుని వారి చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తూనే ఉంటుంది. ఈ పాప‌లాంటి వారు మాత్రం వాళ్ల సూప‌ర్‌హీరోతో అలా తిరుగు తూంటారు!  వీర‌హ‌నుమాన్‌, స్పైడ‌ర్‌మాన్, లోకీ వంటి పాత్ర‌లు పిల్ల‌ల మ‌న‌సులో ముద్ర‌వేసుకున్నాయి. డిస్నీ సిరీస్ ల్లో టామ్ అండ్ జెర్రీ అన‌గానే టీవీకి అతుక్కుపోతుంటారు. పిల్లీ ఎలుక చెల‌గాటమే అన్ని ఎపిసోడ్లు. కానీ వాటిలో ఎంతో ట్విస్టులు, స‌ర‌దాలూ ఉంటాయి. స్పైడ‌ర్‌మాన్ ఫ‌లానా ప‌ట్ట‌ణంలో  మేడ నుంచి ప‌డి పోతున్న వ్యక్తిని ఎలా కాపాడో తెలుసుకోవాలి, హ‌నుమాన్ అంత వేగంగా ఎలా వెళుతున్న‌దీ చూడాలి.. అంతా వింతే.. అంతా హృద్య‌మే. పిల్ల‌ల‌కు అన్నీ మ‌హాద్భుతాలే! వాటినే చూడాల‌ని మ‌రీ మ‌రీ కోరు కుంటారు.  అమెరికా టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మైకేల్ వాల్డ్ర‌న్ రూపొందించిన  సిరీస్ మార్వెల్ కామిక్స్‌. దానిలోని పాత్ర లోకీ. అది అక్క‌డి పిల్ల‌ల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ పాప‌ని కూడా. అందు క‌నే ఈ పాప ఒక కాయితం మీద ఐ ల‌వ్ యూ అని రాయ‌డ‌మే కాకుండా క‌ష్ట‌ప‌డి ఆ పాత్ర బొమ్మ కూడా వేసింది. వేళ్లు నొప్పులు పుట్టే ఉంటాయి.. కానీ అదో ఆనందం! మ‌రి బోల్డు ప్రేమ‌తో రాసిన ఉత్త‌రాన్ని ఎవ‌ర‌న్నా లోకీ పాత్ర‌ధారికి అందించారా లేదా అన్న‌దే తెలియ‌లేదు. చేర‌వేస్తే అంద‌రం సంతోషిం చొచ్చు.. ఈ పాప‌తో పాటు!

అనుకున్నావ‌ని జ‌ర‌గ‌వు అన్నీ!

మావా, ఆ శెట్టిగార‌బ్బాయి ఐద్రాబాద్‌లో కంపూట‌ర్ ప‌నిచేస్తా కోట్లు గ‌డిస్త‌న్నాడంట‌? ఏంది సంగ‌తి? ఒకా నొక మ‌ధ్యాన్నం టీకొట్టు ద‌గ్గ‌ర ఒకాయ‌న మ‌రో పెద్దాయ‌న్ని అడిగాడు.  దీనికేంది, చెరువుకాడ ఇడ్లీల‌మ్మే ముస‌లాముందా.. ఆమె కొడుకు దుబాయ్ యెల్లాడు.. తెలిసిందా? అన్నాడా పెద్దాయ‌న‌. చుట్టు ప‌క్క‌ల వారంతా టీలు, కాఫీలు తాగ‌డం ఆపేసి మ‌రీ ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదెలా సాధ్య‌మ‌న్నారు. హౌ అను కున్నా డు టెన్త్ నాలుగోసారి పాస‌యిన కుర్రాడు. మ‌నిషి ఎప్పుడూ ఒకేలా ఉండ‌డుగ‌దా.. కాలంతో పాటు ముం దడుగేస్తే ఇదేశాల‌కీ యెల్తాడు, తెల్సా అన్నాడు చుట్టెలిగించుకుంటూ మ‌రో వ్య‌క్తి.  ఏవిటి ఇన్ని అసాధ్యాలు సాధ్య‌మ‌య్యాయా?  ప్ర‌శ్న‌లు స‌తాయిస్తుంటే మ‌రో వ్య‌క్తి  ఆ శెట్టిగార‌బ్బాయి గురించే ఆలోచించి బుర్ర‌పాడుచేసుకున్నాడు. ల‌క్ష్యం గ‌ట్టిద‌యిన‌పుడు అన్నీ సాధ్య‌మేన‌న్నారు పెద్ద‌ లు.ఎదురింటి అబ్బాయి చిన్న‌పుడు అల్ల‌రచిల్ల‌ర‌గా తిరిగేడని అలానే ఉంటాడ‌నుకోవ‌డానికి వీలు లేనికాలం ఇది. కాస్తంత చ‌దువు, బోలెడు తెలివి, కొండంత ధైర్యం అన్ని నూర్చితే ఎంత పెద్ద స్థాయి క‌యినా వెళ్లొచ్చని అనేక‌మంది నిరూపించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దురా నాన్నా.. అంటూ పాత సినిమాలో రంగారావు చెప్పిన‌ట్టు ఎప్పుడూ ఎవ్వ‌రూ ఒకేలా ఉండ‌రు. సామాజికంగా, ఆర్ధికంగా ఎద‌గ‌డానికే ప్ర‌య‌త్ని స్తారు. న‌లుగురిలో శ‌భాష్ అనిపించుకోవాల‌నే తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. కాబోతే బ‌హు కొద్దిమందికే అంతకంటే ఉన్న‌తస్థాయి ప్రాప్తిస్తుంది. కొంద‌రు  ఆశ‌ల‌కు త‌గ్గ స్థితిలో క‌దుర్చుకోగ‌ల్గుతారు. ల‌క్ష్యం ఎప్పుడూ ఉన్న‌తంగానే ఉండాలి. అది సాధ్య‌మా అసాధ్య‌మా అన్న‌ది ప్ర‌య‌త్నాల మీద ఆధార‌ ప‌డీ ఉంటుంది.  అలాగ‌ని మ‌రీ తాహ‌త‌కు మించీ ఆలోచించ‌కూడ‌దు. కొంద‌రికి వ్యాపారం న‌ప్పుతుంది, మ‌రికొంద‌రికి ఉద్యోగాలే సుఖ‌మ‌నిపిస్తే, ఇంకొంద‌రికి రాజ‌కీయాలూ వృత్తిగా చేసుకుంటారు. కానీ ఆయా రంగాల్లో ఆశిం చిన స్థాయికి చేరుకునేది మాత్రం ఏ ఒక్క‌రిద్ద‌రికో ద‌క్కుతుంది. క‌ల‌లు క‌నొచ్చు, క‌లలు క‌న‌మంటారు. వాటిని సార్ధ‌కం చేసుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు, అనుస‌రిస్తున్న మార్గాలే కీల‌కం.  ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌కీయాలు అంద‌రికీ స‌రిప‌డ‌వు. కొంద‌రికే అచ్చోస్తాయి. అలాగ‌ని ప్ర‌తీ ఒక్కరూ ప్ర‌ధానో, ముఖ్య‌మంత్రో కాలేరు. అయితే  ఆమ‌ధ్య,  మోదీ ప్ర‌ధాని కావ‌టం గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకోసా గారు. ఎక్క‌డో గుజ‌రాత్‌లో ఓ ప‌ట్ట‌ణంలో చాయ్ దుకాణం న‌డిపిన‌వాడు ప్ర‌ధాని ఎలాగ‌య్యాడ్రా మావా?!  అని రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆయ‌న ఒక‌ప్పుడు చాయ్ దుకాణ‌మే న‌డిపి ఉండ‌వ‌చ్చు. కానీ రాజ‌కీయాల్లోకి రావ‌డం, అంద‌రి మ‌ధ్యా శ‌భాష్ అనిపించుకోవ‌డం అంచ‌లంచెలుగా ఎద‌గ‌డం అన్నీ వెర‌సి ఆయ‌న్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టాయి. అంతేగాని చాయ్ క‌లుపుతూ ఢిల్లీకి వెళ్లి కుర్జీ బాగుంద‌ని కూర్చోలేదు. ఇటీవ‌లి కాలంలో చాలామంది స‌క్సెస్ స్టోరీస్ అంటూ రిక్షావాడి కూతురు క‌లెక్ట‌ర్ కావ‌డం, ఆటోవాడి కుమారుడు పెద్ద ఆఫీస‌ర్ అయ్యాడ‌ని.. ఇలా చ‌దివే ఉంటారు. ఒక వ్య‌క్తి ఒక స‌మ‌యంలో ఉన్న స్థాయికి ఆ త‌ర్వాత కాల‌క్ర‌మంలో వ‌చ్చే ప‌రిణామ‌ల్లో జీవ‌న‌గ‌మ‌నంలో వ‌చ్చే మార్పుల‌ కు సంబంధం ఉండన‌క్క‌ర్లేదు. చ‌దువు, ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న బ‌ల‌మైన ఇచ్ఛ అవ‌స‌రం.  కాల‌క్ర‌మంలో అన్ని మ‌ద్ద తులూ ల‌భిస్తాయి.  పూర్వం ఒక‌డు నాడా ఉంద‌ని గుర్రం కొన‌డానికి వెళ్లాట్ట‌. అలా ఉంది కేసీఆర్ తంతు.. మ‌ద్ద‌తు ఇస్తార‌ని తాను ప్ర‌ధాని కావ‌డానికి తెలంగాణా సీఎం కేసీఆర్ లా మాత్రం ఎవ్వ‌రూ త్వ‌ర‌ప‌డ‌రు. వాస్త‌వానికి మ‌ద్ద‌తు, ప్ర‌ధాని ప‌ద‌వీ రెండూ భ్ర‌మే. ఉన్న ప్రాంతాన్ని, త‌న‌వాళ్ల‌నీ కాద‌ని లోక‌మంతా త‌న తెలివి ప్ర‌ద‌ర్శించి కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని అనుకోవ‌డం మ‌డ‌త‌మంచం మీద ప‌డుకుని క‌ల‌లు క‌న‌డం లాంటిది. మ‌ధ్యాన్న‌భోజ‌నం త‌ర్వాత వ‌చ్చే కునుకులాంటిది. ఆన‌క ఎవ‌రో గిల్లిన‌ట్టు వాస్త‌వం ముల్ల‌యి గుచ్చుకుని ఓరే నాన్నా.. ముందు నీ ఊళ్లో  లైటుస్థంబాలు, రోడ్లు సంగ‌తి ఆలోచించు అని గుర్తుచేస్తుంది. తాహ‌త‌కు మించి నింగికి ఎగ‌రాల‌నుకోవ‌డం బుద్ధిలేనిత‌న‌మే. కేసీఆర్ మొద‌టి యాత్ర‌లో అంద‌ర్నీ క‌లిశారు. ఏమ యింది. చిర్న‌వ్వులు, పూల‌గుత్తులు, నాలుగు షేక్‌హ్యాండ్లు, ముప్ప‌యి ఫోటోలు త‌ప్ప జ‌రిగిందేమీ లేదు. ఆయ‌న క‌లిసిన‌వాళ్లంతా ఆయ‌న‌కంటే దేశ‌ముదురులు అన్న సంగ‌తి ఆయ‌న‌కు తెలియ‌కా కాదు. ఏదో ఒక రాయి వేయ‌డానికి వెళ్లారు. అదే రాయి దారి త‌ప్పి మ‌ళ్లీ ఆయ‌న‌కు బూమ‌రాంగ్ అయింది. అయినా పులుపు ఎక్క‌డ ఛ‌స్తుంది. చ‌తికిల‌ప‌డిన‌వాడు మ‌ళ్లీ చాప చుట్టుకుని మ‌రోప్ర‌య‌త్నంగా బ‌ట్ట‌లు స‌ర్దుకుం టున్నారు. ఖుదాకీ క‌స‌మ్ మోదీని దించ‌డం ఖాయం అని స‌గం తెలుగు, స‌గం ఉర్దూలో స‌వాలు చేసి నంత మాత్రాన అన్నీఅయిపోతే.. మోదీకి  పంచాయితీ ప్రెసిడెంటుకీ తేడా ఏవుంట‌ది?

జ‌గ‌న్‌.. ముఖ్య‌మంత్రివేనా!

ఒరేయ్ అబ్బాయ్‌! ఏంజేస్తున్నావురా?  అని ఒక‌రోజు పొద్దుటే ఇంటిముందు నుంచి వెళుతోన్న‌వాడిని మామ్మ గారు అడిగారు. ఏంలేదండీ..ఏదో చిన్న దుకాణం పెట్టానన్నాడు. మ‌రి మీ బావో ఎవ‌రో చిట్‌ఫండ్ కంపెనీ పెట్టాడ‌ని విన్నాను మ‌రి.. అవునండీ.. మా పెద్ద‌బావ‌. మ‌రీ బాగుంది.. మ‌రి పెద‌నాయ‌న సిని మాల్లో ఉన్నాడ ట‌గా.. విన్నాను.. అవును మామ్మ‌గారూ..అపుడ‌పుడూ సినిమాలూ తీస్తుంటాడు.. మామ్మ‌ గారికి కించిత్ ఆశ్చ‌ర్య మేసింది. చాలా రోజుల త‌ర్వాత ఊళ్ల‌కి వెళ్లే కుర్రాళ్ల‌కు పెద్ద‌మ్మ‌లు ఎదుర‌యితే వ‌చ్చే ప్ర‌శ్నావ‌ళి ఇదే. ఎవ‌రేం చేస్తుంటే ఈమెకు ఎందుకు అనుకున్నాడు ఆ కుర్రాడు. ఈ సీన్ చాలా కాలం క్రితంది.  కాలంతో పాటు వేగంతో పాటు అడుగులు వేస్తూ అనేక వ్యాపా రాల్లో స్థిర‌ప‌డుతున్నారు. వృత్తి ఉద్యోగాలూ చేసుకుంటున్నారు. వ్యాపారం చేయ‌వ‌చ్చు, ఉద్యోగా లు చేసుకోవ‌చ్చు. ఎవ‌రు ఏమి చేస్తున్నా వారి ఆర్ధిక‌, సామాజిక స్థాయిని పెంచుకోవ‌డానికే గాని ఇత‌రు ల‌ను కించ‌ప‌ర‌చ‌డానికి కానే కాదు. కానీ దానికి కులం రంగు పూయ‌డం అనేది దుర్మార్గం. అస‌లా మాట‌కు వ‌స్తే వ్యాపారం, ప‌రిశ్ర‌మ‌లు పెట్టి రాణించ‌డం అనేదానికి కులానికి సంబంధం లేదు. అంతా తెలివితేట‌లు, కాలానుగుణంగా మార్పులు చేర్పులు, కొత్త‌ని ఆద‌రిం చ‌డంలోనే ఉంది. అంతేగాని నూనెకొట్టు మీది, చిట్‌పండ్ మీది అని తిట్టుకుం టూ కూర్చుంటే అలా కూర్చునే ఉంటారన్న‌దానికి అనేకానేక ఉదాహ‌ ర‌ణ‌లూ ఉన్నాయి. దుర‌దృష్ట‌మేమంటే, ఏద‌న్నా వ్యాపారంగురించి చ‌ర్చ‌రాగానే అది ఫ‌లానా కులంవారికే చెల్లింది  అని పాసింగ్ కామెంట్ చేయ‌డం అనాదిగా ఉంది. అన‌డం సుల‌భం, చేయ‌డ‌మే క‌ష్టం. వ్యాపార‌లావాదేవీల విష‌యంలో తెలివితేట‌లు, మార్కెట్ జాగ్ర‌త్త‌లు తెలుసుకోవ‌డంలోనే బుర్ర‌పెట్టేవారికి అలాంటి పాసింగ్ కామెంట్లు వినేటంత స‌మ‌యం అస్స‌లు ఉండ‌దు. కానీ చాలాకాలం నుంచి నోరు జార్చుకునేవారిని చూస్తే మాత్రం ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. కార‌ణం, మోసానికి, అన్యాయానికి, దారుణాల‌కీ తావు లేని విధంగా త‌మ త‌మ వ్యాపారాలు చేసుకుంటూ కాస్తంతైనా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డుతున్న‌వారి మ‌న‌సు చివుక్కుమ‌న‌డం ఖాయం.  మ‌రీ దారుణ‌మేమంటే, రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న‌వ్య‌క్తి అలాంటి చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే. రాష్ట్రంలో ఎక్క‌డ‌యినా స‌రే పాలు, ప‌చ్చ‌ళ్లు, చిట్‌ఫండ్ వ్యాపారాల‌న్నీ మీవే, కాలేజీలూ మీవే ఇక ఎవ్వ‌ రికీ వీలు లేదా అంటూ ఒక సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌టం అందునా అసెంబ్లీలో అన‌డం ఒక వ‌ర్గాన్ని ప‌నిగ‌ట్టుకుని  కించ‌ప‌ర‌చ‌డ‌మే. ఇది ఎవ్వ‌రూ స‌హించ‌రు, ఇష్ట‌ప‌డ‌రు. ముఖ్య‌ మంత్రి నోటి నుంచి ఇలాంటి కామెంట్ల‌ను ఎవ్వ‌రూ  ఊహించ‌రు. ఇది కేవ‌లం ఉక్రోషం తాలూకు ప్ర‌భావం. వాస్త‌వానికి ఎవ‌ర‌యినా ఏద‌యినా చేయ‌వ‌చ్చు.  కాలంతోపాటు మ‌నుషులు మారుతున్నారు. ఇంకా మారకుండా, అదే పాత‌చింత‌కాయ‌ప‌చ్చ‌డి ఆలోచ‌న‌తోనే మ‌గ్గిపోతున్న‌వారిని స‌మాజం క్ష‌మిం చ‌దు. కంప్యూట‌ర్ యుగంలో బ‌తుకుతూ, ఊపిరాడ‌ని టైమ్‌టేబుల్ ప్రకారం జీవ‌నం సాగిస్తున్న ఈ కాలంలో కులం, మ‌తం గురించిన పెద్ద ఆలోచ‌న‌లకు తావులేదు. మ‌రీముఖ్యంగా ఇత‌రుల కుల‌, మ‌త‌, వృత్తి, వ్యాపారాల గురించి తోచిన‌ట్టు కామెంట్లు ఎవ‌రూ స‌హించ‌రు కూడా. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న‌వారు, ప్ర‌జాసంక్షేమానికి పాటుప‌డాల్సిన‌వారు, ప్ర‌జాహితాన్ని కోరేవారు ఒక  సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయ‌డం వారి విజ్ఞ‌త‌కు అద్దంప‌డుతుంది. కులాల మ‌ధ్య పోరాటాలు ఏ విధంగానూ మంచిది కాద‌ని సామాజిక శాస్త్ర‌వేత్త‌లు, విద్యావంతుల మాట‌. ఈ కాల‌లో కూడా ఇలాంటి ఆలోచ‌న‌లు చేసేవారిని, ప్ర‌జ‌ల‌మ‌ధ్య చిచ్చుపెట్టేవారిని చ‌రిత్ర క్ష‌మించ‌దు. 

ఈడీ దూకుడు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు?

మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తెరాసకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. తనపై ఆరోపణలు రావడంపై భగ్గుమన్న కవిత..ఆ ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానంటూ హెచ్చిరించారు. చివరకు తనపై ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. పరువునష్టం దావా ఊసెత్తలేదు. అదలా ఉంటే తాజాగా ఈడీ  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉండటంతో నోటీసులను కవితకు ఈడీ అందించలేదని సమాచారం. కానీ ఆమె సన్నిహితులకు మాత్రం ఈడీ నోటీసులు అందజేసింది.   హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ నగర్ లోని ఒక రెసిడెన్సీలో నివాసం ఉంటున్ కవిత వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో శుక్రవారం (సెప్టెంబర్ 16) ఈడీ సోదాలు నిర్వహించింది. గతంలో కవిత పీఏ అభిషేక్ రావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. శుక్రవారం ఈడీ సోదాలకు ముందు ఓ పక్షం రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈడీ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయని అంతా భావించారు.   మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సహా   ఎవరికి నోటీసులు జారీ చేసినా, ఎవరిపైనైననా చర్యలు తీసుకున్నా అది మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీకి ప్రయోజనం కూర్చుతుందని బీజేపీ భావిస్తోందనీ,  మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ఈడీ ఈ స్కాం దర్యాప్తులో స్పీడ్ తగ్గితే మేలని బీజేపీ పెద్దలు  భావించడం వల్లనే ఈడీ స్పీడ్ కు బ్రేకులు వేసిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. రాజకీయ వర్గాలు సైతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఈడీ స్పీడు తగ్గించిందనీ పేర్కొన్నాయి, ఈ మేరకు మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. అయితే తగ్గిన ఈడీ స్పీడు తుపాను ముందటి ప్రశాంతత వంటిదేనని.. ఉరుము లేని పిడుగులా ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా  దేశ వ్యాప్తంగా 42 చోట్ల ఏకకాలంలో  శుక్రవారం(సెప్టెంబర్ 16) ఈడ దాడులు చేయడం నోటీసులు ఇవ్వడంతో  తేటతెల్లమైంది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్త సంచలనం సృష్టించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ముందు ముందు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరింత మంది ప్రముఖులకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఆలూ లేదు చూలూ లేదు.. అయినా హామీలకు కొదవే లేదు

ఏ దేశానికీ అయినా ఒకరే ప్రధాని ఉంటారు.. ఒకటే రాజధాని ఉంటుంది. అలాగే ఏ రాష్ట్రానికి అయిన ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు. ఒకటే రాజధాని ఉంటుంది. అంతే కానీ, ఏకకాలంలో ఇద్దరు, ముగ్గురు ప్రధానులు ఉన్న దేశం, ఇద్దరు ముగ్గరు ముఖ్యమంత్రులు ఉన్నరాష్ట్రం ఉండవు. అలాగే ఏక కాలంలో రెండు మూడు రాజధానులు ఉన్న దేశాలు రాష్ట్రాలు కూడా ఉండవు. అయితే,ఇప్పడు దేశంలో ఇద్దరు,ముగ్గురు కాదు ఏకంగా ఓ అరడజను మందికి పైగానే, మహా నాయకులు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్నారు. నిజమే,ప్రధాని పదవికి  పోటీ పడడం వరకు అయితే తప్పు కాదు. అందులో అక్షేపించవలసిన విషయం ఉండదు. కానీ, ఒక కూటమిగా కలిసి పోటీచేయాలని అనుకుంటున్న పార్టీల నాయకులు ఎవరికి వారు, ‘నేనే ప్రధాని’ అన్న విధంగా వాగ్దానాలు చేయడం వరకు వచ్చేశారు. అక్కడే చిక్కొచ్చింది. ఇతర నేతల విషయం ఎలా ఉన్నా  తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ ఇద్దరికిద్దరూ ఏమి కలలు కంటున్నారో ఏమో కానీ, పోటాపోటీగా వాగ్దానాలు చేసేస్తున్నారు. అయితే, ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా ఎవరికి వారు ఇలా  ప్రధాని కిరీటం పెట్టేసుకుంటే, అసలుకే మోసం చేసేవిధంగా ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు విషయాన్నే తీసుకుంటే  2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది, ‘మన’ ప్రభుత్వమే అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్టీ వేదికలనుంచే కాదు, పబ్లిక్ మీటింగులలో అదే ధీమా వ్యక్త పరుస్తున్నారు. అయితే ఆ ‘మనం’ లో ఎవరెవరు ఉన్నారో, ఎవరు లేరో మనకు తెలియదు, కానీ, ఆయన మాత్రం తెరాస శ్రేణులను ఉద్దేశించే ఈ ప్రకటన చేశారు. అంటే, తెరాస లేదంటే ఇంకా పుట్టని జాతీయ పార్టీ, బీఆర్ఎస్ అధికరంలోకి వస్తుందనేది ఆయన ఆలోచనో ఏమో, కానీ, ఉచిత వరాల జల్లు అయితే మొదలైంది. కేంద్రంలో, ‘మన’ ప్రభుత్వం రాగానే, దేశంలోని రైతులు అందరికీ, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇత్యాది ఉచితాలన్నీ ఇచ్చేస్తామని ప్రకటించారు. అంతే కాదు, దేశం మొత్తంలో తెలంగాణ మోడల్ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.అంటే రాబోయే రోజుల్లో కాబోయే ప్రదాని తానే నని చెప్పకనే చెప్పారు. అయితే, ఇంతవరకు  జాతీయ రాజకీయాలో ఆయన పోషించే పాత్రపై ఆయన సంగతి ఏమో కానీ, తెరాస శ్రేణులు సహా ఏ ఒక్కరికీ ఎలాంటి స్పష్టత లేదు. జాతీయ పార్టీ పెడతారా, ప్రాతీయ పార్టీల జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తారా లేక నలుగురిలో  నారాయణ గుంపులో గోవింద అన్నట్లుగా, జాతీయ పార్టీల ప్రాంతీయ కూటమిలో చేరతారా? ఏమి చేస్తారు? ఎటు పోతారు ? జాతీయ రాజకీయాల్లో అయన పోషించే పాత్ర ఏమిటి? ఇలా జవాబు లేని ప్రశ్నలు, ఎన్నో.. అయినా, ఆలు లేదు చూలు లేదు , కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా, కేసీఆర్  జాతీయ నేతగా ప్రచారం చేసుకుంటున్నారు.పట్టుమని పది మంది ఎంపీలు లేక పోయినా, తానే కాబోయే ప్రధాని అనే ధీమాతో, దేశ ప్రజలపై వరాల జల్లు కురిపితున్నారు.  కేసీఆర్ కథ ఇలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్’ కుమార్, మరో అడుగులు ముందుకేశారు. 2024 ఎన్నికల్లో పీఎం కుర్చీలో కూర్చోగానే,బీహార్‌తో సహా వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేక హోదా కల్పిస్తామని వాగ్దానం చేశారు. అంతే కాదు, కేసీఆర్ కంటే ఇంకా ఎక్కవ భరోసాతో, వెనక బడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వక పోవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని కూడా నితీష్ కుమార్ సెలవిచ్చారు.  అయితే, నిజానికి, నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీలో గడప గడపకు వెళ్లి దండాలు పెట్టుకుని వచ్చిన సందర్భంలో, అన్ని పార్టీల నాయకులను కలిసిన సమయంలో, తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు. బీజేపే యేతర పార్టీలను ఏకం చేసి, మోడీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కానీ, ఇప్పడు ఏకంగా, ఏక పక్షంగా, కీలక వెనకబడిన రాష్ట్రాలకు  చేశారు. అంటే ఒక విధంగా తానే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధినని డిక్లేర్ చేశారు. ఇలా ఓ వంక కేసీఆర్, మరో వంక నితీష్, ఈ పక్క నుంచి మమతా బెనర్జీ, ఆ వైపు నుంచి కేజ్రీవాల్, ఇటు పవార్, అటు మాయ ఈ అందరినీ మించి, పార్టీని పణంగా పెట్టి మరీ భారత్ జోడో యాత్రా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. ఇలా ఎవరికీ వారు ఎవరి ఎజెండాతో వారు ముందుకు పోతున్నారు. అందుకే రాజకీయ పండితులు ప్రతిపక్షలా ఈ అనైక్యతే బీజేపీకి శ్రీరామ రక్షా.. అంటున్నారు.

టి.కాంగ్రెస్‌లో  తెలంగాణా త‌ల్లి ర‌భ‌స‌

రాజ‌కీయాల్లో విగ్ర‌హాల రాజ‌కీయం ప్రాధాన్య‌త సంత‌రించుకుంటోంది. మ‌ర‌ణించిన నాయ‌కుల విగ్ర‌హాల ప్ర‌తిష్ట ర‌భ‌స చాలాకాలం నుంచి అన్ని పార్టీల్లోనూ ఉంటూనే ఉంది. ఒకరి అభిప్రాయం, మ‌రొక‌టి న‌చ్చ‌క చిలికి చిలికి విధేదాలు పార్టీల్లో చీలిక‌ల‌కు దారితీస్తున్నాయి. ఆన‌క బుజ్జ‌గింపుల కార్య‌క్ర‌మంతో శాంతి స్తున్నారు. ఇపుడు తెలంగాణా కాంగ్రెస్లో కొత్త ర‌భ‌స మొద‌ల‌యింది. అస‌లే రేవంత్ రెడ్డి ఆధిప‌త్యాన్ని అంత‌గా ఇష్ట‌ప‌డ‌ని సీనియ‌ర్ నాయ‌కులు ఇపుడు తెలంగాణా త‌ల్లి విగ్ర‌హం విష‌యంలో వివాదం రేపారు.   నేలతంతా రెండుగా చీలిపోయారు. కొత్తగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను తిరస్క రిస్తూ ఒక వర్గం, మద్దతుగా మరో వర్గం తయారైంది. కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీనియర్లు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. రేపు కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ సిద్ధ‌ప‌డుతు న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని రేవంత్‌పై సీనియర్లు ఒత్తిడి తెస్తున్నారు. నిన్న సీనియర్ల సమావేశంలో గాంధీ భవన్‌లో సెప్టెంబర్ 17 వేడుకలపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు గాంధీ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై టీపీసీసీ చీఫ్ తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణా తల్లి కొత్త విగ్రహం రెడీ అయ్యింది. ఈ నెల 13న జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సెప్టెంబర్ 17 వేడుకలపై తీర్మానం చేశారు. అయితే సీనియర్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రేవంత్ వారందరినీ వ్యతిరేకించి నిర్ణయం తీసుకుంటారా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారా? లేదంటే విరమించుకుంటారా? చూడాల్సి ఉంది. 

ఏపీ అసెంబ్లీ... టీడీపీ స‌భ్యులు  ఒక‌రోజు స‌స్పెండ్‌

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో శుక్ర‌వారం మరింత గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. నిత్యావ‌స‌ర ధ‌ర‌ల‌పై తెలుగుదేశం స‌భ్యుల ఆందోళ‌న‌తో ఈ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీ స‌భ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ తిర‌స్క‌రించారు. దీంతో టీడీపీ స‌భ్యులు పోడియం చుట్టుముట్టారు. దీంతో ఆగ్ర‌హించిన స్పీక‌ర్  టీడీపీ ఎమ్మెల్యేల ను సభ నుంచి సస్పెండ్ చేశారు. వారిని వెంట‌నే బయటకు తోసేయండంటూ మార్షల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 13 మంది టీడీపీ ఎమ్మె ల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.   నిత్యావసర ధరలపై టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు  అంటూ నినాదాలు చేశారు. పెరిగిన చార్జీలు, పన్నులపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. దీంతో సభలో గందరగోళ పరిస్థిత చోటు చేసుకోవడంతో... స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ప్రతీరోజు ఇదొక అలవాటుగా మారిందని. మీ దుష్ప్రవర్తనకు సస్పెండ్ చేస్తున్నా. ప్రతి రోజు ఇదొక వ్యాపకం అయిపోయిందా మీకు. ఇంతకంటే వ్యాపకం లేదా మీకు  అని మండిపడ్డారు. వారిని బ‌య‌టికి లాగేయండి  అంటూ మార్షల్స్‌కు స్పీకర్ ఆదేశించారు. స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు ఆగ్రహించారు. మార్షల్స్‌తో ఎలా బయటకు పంపు తారంటూ మండిపడ్డారు. దీనితో స్పీకర్ స్పందిస్తూ ‘‘దె ఆర్ మార్షల్స్ ఆస్ ద స్పీకర్ ఆయామ్ డిక్లరింగ్. వన్స్ అయామ్ డిక్లేర్ యు షుడ్ నాట్ టేక్ ఎనీ మోర్ హియర్. తీసుకెళ్లిండి’’ అంటూ మార్షల్స్‌ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు.   అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్‌ రూల్‌ 2 ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, అచ్చెన్నా యుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య, నిమ్మకాయల చిన్నరాజప్ప, గండ్ర వెంకటరెడ్డి, జోగేశ్వ రావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు, వెలగ పూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లు సస్పెండ్ అయ్యారు. 

తొలిసారిగా  ఏపీలోనూ  ఈడీ సోదాలు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా దాదాపు 40 ప్రదేశాల్లో ఈడి  తాజా దాడులు ప్రారంభించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మరికొన్ని నగరాల్లోని మద్యం వ్యాపా రులు, పంపిణీదారులు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన స్థలాల్లో సోదాలు నిర్వహిస్తు న్నారు. ఢిల్లీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదా లు జరుపుతోంది. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరులోని  పలు ప్రదేశాల్లో సోదాలు జరుపుతోంది. బెంగళూరు, చెన్నై‌లో కూడా సోదాలు చేపడుతోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇదివరకే ఒకసారి ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ చేసిన ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్‌లో ఇదివరకు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ప్రేమ్సాగర్ రావు, అభిషేక్ తదితరుల నివా సాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. వీరంతా రాబిన్ డిస్టిలరీ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇటీవలి సోదాల్లో వెలుగుచూసిన సమాచారం ఆధారగా శుక్రవారం మరికొన్నిచోట్ల సోదాలు జరుపు తున్నారు. సెప్టెంబర్ 6న దేశవ్యాప్తంగా దాదాపు 45 చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత ఈ కేసులో ఫెడరల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రెండో రౌండ్ దాడులు ఇది. ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్‌కు సంబంధించిన ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కేసు సిబిఐ ఎఫ్‌ఐఆర్ నుండి వచ్చింది, ఇందులో ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా,  కొంతమంది అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీని ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో సిసోడియా (50), ఐఏఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఆగస్టు 19న దాడులు నిర్వహించింది. సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ నేతృ త్వం లోని ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్, విద్యతో సహా పలు పోర్ట్‌ఫోలియోలను కలిగి ఉన్నారు. గత ఏడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవకత వకలు జరిగాయా, అలాగే నిందితులు కళంకిత డబ్బుకు సంబంధించి కొన్ని నేర ఆదాయాలు సంపాదిం చారా అనే ఆరోపణలపై ఈడి విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న ఆప్ నాయకుడు, మంత్రి సత్యేందర్ జైన్‌ను కూడా ఏజెన్సీ శుక్రవారం ప్రశ్నించే అవకాశం ఉంది, అలా చేయడానికి స్థానిక కోర్టు నుండి అనుమతి పొందింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం.. ఏపీలో ఈడీ సోదాలు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కుంభకోణంపై దర్యాప్తులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు మరింతగా పెంచింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్ లోని20 ప్రాంతాలు సహా ఐదు రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తుండడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధాలు ఉన్నట్లు అధికార వైసీపీ ముఖ్య నేత సతీమణి సహా నెల్లూరు జిల్లాలోని కొందరు వ్యాపారవేత్తల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు కూడా. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి నెల్లూరు, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోని పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఇప్పటికే రెండుసార్లు సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో కోకాపేటలోని రామచంద్ర పిళ్లై ఇల్లు, నానక్ రామ్ గూడలోనిరాబిన్ డిస్టలరీస్ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్ పీ పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్ బోయిన్ పల్లి, గండ్ర ప్రేమ్ సాగర్ రావును డైరెక్టర్లుగా రామచంద్ర పిళ్లై నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసాని హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేస్తుండడం గమనార్హం. మద్యం వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్ వర్క్ లే టార్గెట్ గా ఈడీ దాడులు జరుగుతున్నాయి. అంతకు ముందు సెప్టెంబర్ 6న మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీతో పాటు ఇతర నగరాల్లో 35 చోట్లకు పైగా ఈడీ సోదాలు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను మూడు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసింది. సత్యేంద్ర జైన్ ను విచారిస్తున్న సందర్భంగా ఆయన తెలిపిన సమాచారం మేరకు లిక్కర్ స్కామ్ చైన్ ను బట్టబయలు చేసేందుకు ఈడీ అధికారులు పెద్ద ఎత్తున ఒకే సారి 40 చోట్ల తనిఖీలు చేస్తుండడం సంచలనంగా మారింది.

పాక్‌ది స్వ‌యంకృతం..అర్ధంలేని ష‌రీఫ్‌ ఆవేద‌న‌

చేసుకున్న‌దానికి చేసుకున్నంత అని సామెత‌. పెద్ద‌లు అన్న‌ది పాకిస్తాన్‌కి స‌రిగ్గా స‌రిపోతుంది. ఆవి ర్భావం నుంచి పాకిస్తాన్ ఎవ‌రితోనూ స‌ఖ్యంగా లేదు. మిల‌ట‌రీ చేతిలో కీలుబొమ్మ‌గ ప్ర‌యాణం చేస్తూనే ఉంది. ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జాభిప్రాయాల‌కు విలువ‌లేన‌పుడు ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు, భ‌యాందోళ‌న మ‌ధ్య కాలం గ‌డ‌ప‌వ‌ల‌సిందే. ఇది దాదాపు పాక్ గురించి అన్ని దేశాల‌వారూ చాలాకాలం నుంచీ అభిప్రాయ ప డుతున్న‌దే. ఇది విన‌డానికి ఇబ్బందిక‌రంగా ఉన్న‌ప్ప‌టికీ ఎంతో వాస్త‌వం. ఇవ్వాళ మేము అడుక్కుంటు న్నామ‌ని, చిన్న‌దేశాలే చాలా మెరుగ్గా ఉన్నాయ‌ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆవేద న వ్యక్తం చేయ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చదు.  ఇప్ప‌టికీ  విదేశాల మీద ఆధార‌ప‌డ‌వ‌ల‌సిన ప‌రిస్థితుల్లోనే కాలం గ‌డుపుతోంది. దీనికి తోడు ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌న్న‌దీ వాస్త‌వ‌మే. దాని ప్ర‌భావ‌మే ప్ర‌పంచంలో శాంతిని కోరుకునే దేశాల‌న్నీ పాకి స్తాన్‌ను దూరం చేశాయి. క్ర‌మేపీ ప‌రిస్థితులు మ‌రింత గ‌డ్డుగా మారి 75 ఏళ్ల చ‌రిత్ర‌ను వెన‌క్కి తిరిగి చూసుకుంటే దేశాధినేత‌ల‌కు సాధించిందేమీ క‌న‌ప‌డ‌లేదు. తాము 75 ఏళ్లుగా చిప్ప పట్టుకుని.. సంచా రం చేస్తూ.. అడు క్కుంటున్నామ‌ని పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ తెగ బాధ‌ప‌డుతున్నారు.  త‌మ కంటే చిన్న దేశాలు కూడా ఆర్థిక రంగంలో మమ్మల్ని దాటిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మిత్ర దేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తు న్నాయ‌ని పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి అన్నారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్‌లో జరిగిన న్యాయశాస్త్ర విద్యార్థుల స్నాతకోత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  తాను మిత్ర దేశాల్లో పర్యటించినప్పుడు డబ్బుల కోసమే వచ్చాననుకుంటున్నారని.. మిత్ర దేశాధినేత లకు ఫోన్‌ చేసినప్పుడు ఇదే పరిస్థితి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. వారంతా మేము భిక్షం అడుగు తామేమో అనే భావనలో ఉన్నారు. నిజంగానే పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఇప్పుడు పాకి స్థాన్‌ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని వాపోయారు. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా తమ పరిస్థితి తయా రైందన్నారు.  తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయానికే ఆర్థిక పరిస్థితి సంక్లి ష్టంగా మారింద‌న్నారు.   జూన్‌లో వచ్చిన వరదలు మూడో వంతు పాకిస్థాన్‌ను ముంచెత్తాయి. 1400 మంది చనిపోగా.. దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. రూ. 95 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. 78 వేల చదరపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. ఓ వైపు కనీసం రూ.32 వేల కోట్లమేర అప్పు దొరుకుతుందేమోనని ఇంటర్నేషనల్‌ మోనిటర్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌) వద్ద ప్రయత్నాలు చేస్తుంటే.. అకాల వర్షాలు, వరదలతో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్థమైపోయింద‌న్నారు ష‌రీఫ్‌. గత పాలకులు ఐఎంఎఫ్‌ నిబంధనలను ఉల్లంఘించిన పాపానికి.. ఇప్పుడు ఆ సంస్థ చేపట్టే కొన్ని కార్య క్రమాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. అతికష్టమ్మీద చేసిన ప్రయత్నాలతో ఐఎంఎఫ్‌ రూ. 14 వేల కోట్లను విడుదల చేసిందని, చైనా వంటి మిత్ర దేశాలు మరో రూ. 32 వేల కోట్ల మేర అప్పు ఇచ్చా యని పేర్కొన్నారు.

ప్ర‌భుత్వానికి ఊపిరాడ‌నీయ‌ని టీడీపీ

శాసనమండలి  సమావేశాల్లో  రెండ‌వ‌రోజు శుక్ర‌వారం ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ అధి నేత చంద్రబాబు  వ్యవ సాయం దండగ  అన్నారంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వ్యాఖ్య లు చేశారు. దీనిపై నారా లోకేష్ , టీడీపీ ఎమ్మెల్సీ లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దమ్ముంటే ఆ మాట ఎక్కడ అన్నారో చూపిం చాలి అంటూ అధికార పక్షానికి లోకేష్  సవాల్ విసిరారు. అధికారపక్షం వ్యాఖ్య లకు నిరస నగా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంను చుట్టుముట్టిన నిరసనకు దిగారు.  జగన్  అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని,  ధాన్యం బకాయిలు కూడా చెల్లించలేని రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ అంటూ లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీలు నినా దాలు చేశారు. ఆధారాలు అంటే ఎక్కడ నుండి తెస్తామంటూ టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు వైసీపీ మంత్రు లు ప్రయత్నించారు. చంద్రబాబు ను ఉద్దేశించి మాట్లాడలేదంటూ అధికారపక్షం ఎమ్మెల్సీలు, మంత్రులు వింత వాదనకు దిగారు.  ఇదిలా ఉండ‌గా, అసెంబ్లీలో కడప స్టీల్‌ప్లాంట్‌పై టీడీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చారని, కడప స్టీల్‌ప్లాంట్ పై కేంద్రాన్ని ప్రభుత్వం ప్రశ్నించట్లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు  అన్నారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ, టీడీపీ సభ్యులు సబ్జెక్టుకు కన్పైన్ కావడం లేద న్నారు. కడప స్టీల్ పెట్టేందుకు ఆలోచించొచ్చు అని ఉందన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచ వ్యీప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నదని వెల్లడించారు. విభజన చట్టంలో ఏముందో సరిగా చూడాలని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చెయ్యోచ్చు అని మాత్రమే ఉందని.. కావ‌చ్చు అని మాత్రమే ఉంది ష‌ల్‌ అని లేదని బుగ్గన తెలిపారు.

ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన వైద్య విద్యార్థులకు కేంద్రం షాక్

యుద్ధం కారుణంగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేసిన భారత విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్యార్థులకు కేంద్రం షాక్ ఇచ్చింది. అక్కడ నుంచి వెనక్కు వచ్చేసిన వైద్య విద్యార్థులకు దేశంలోని మెడికల్ కాలేజీలలో సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుతున్న వేలాది మంది భారతీయ  విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులు యుద్ధానికి ముందు 22000 మంది వరకు ఉన్నారు. వీరిలో అత్యధికులు మెడికల్ విద్యార్థులే. భారత్ లో ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ కు అయ్యే వ్యయం కంటే ఉక్రెయిన్లో తక్కువే కావడం, ఉక్రెయిన్ ఎంబీబీఎస్ చదివిన వారికి   గుర్తింపు ఉండటం కారణంగా చాలా మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ మెడికల్ కాలేజీలలో  మెరిట్ మేరకు సీట్లు లభించని వారు ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిండానికి మొగ్గు చూపుతారు. అందుకే ఉక్రెయిన్ లో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే  ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వారి చదువుకు అవరోధం కలిగించింది. యుద్ధం కారణంగా    అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో సురక్షితంగా  స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే మిగిలిన విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా   ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికల్ విద్యార్తులకు మాత్రం ఇక్కడి మెడికల్ కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. చట్ట ప్రకారం.. ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తూ యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చేసిన వారిని ఇక్కడి కాలేజీలలో సర్దుబాటు చేసి వారి విద్య కొనసాగించేందుకు చట్టప్రకారం కుదరదని తేల్చేసింది. తమను భారత వైద్య కళాశాలలకు బదిలీ చేయాలంటూ ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. 'ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులను ఇక్కడి మెడికల్ కాలేజీలు/యూనివర్సిటీల్లో సర్దుబాటు చేయడం లేదా ఇక్కడికి బదిలీ చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. విదేశీ వైద్య విద్యార్థులను భారత మెడికల్ కాలేజీలకు బదిలీ చేయడం లేదా సర్దుబాటు చేసే అంశానికి సంబంధించి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్-1956 లేదా నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్- 2019లో ఏ విధమైన నిబంధనలు లేవు' అని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు మన దేశంలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయారని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఆర్థికంగా స్థితిమంతులు కావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారని వెల్లడించింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి వచ్చేసిన విద్యార్థులకు భారత్ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలిపిస్తే ఇతర ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే.. ఉక్రెయిన్ విద్యార్థులు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు  సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో భారత విదేశాంగ శాఖతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంప్రదింపులు జరుపుతోందని కేంద్రం వెల్లడించింది.  

జిన్‌పింగ్, షెహబాజ్ ల‌తో  మోదీ స‌మావేశ‌మ‌వుతారా? 

ఎస్‌సిఓ సమ్మిట్ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో పాటు మరికొందరు నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్  పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందన్న వార్తలపై విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఏ) షెడ్యూల్ ముగుసేలోగా తెలియజేస్తామని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు,  మరికొందరు నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఎస్‌సిఓ సమ్మిట్ సందర్భంగా చైనా, పాకిస్తాన్  రష్యా అధినేత‌ల‌తో మోదీ స‌మావేశాల స‌మాచారాన్ని తెలియ‌జేస్తామ‌ని విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి క్వాత్రా  తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంపాటు ఎస్‌సిఓ సదస్సు కోసం ఉజ్బెకిస్తాన్‌లో ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ శుక్ర వారం ద్వైపాక్షిక సమావేశాల సెట్‌తో పాటు పరిమితం చేయబడిన మరియు పొడిగించబడిన సెషన్‌ లకు హాజర వుతార‌ని క్వాత్రా చెప్పారు. ఎస్‌సీఓ సమ్మిట్ 2022లో ప్రధాని మోదీ పాల్గొనడం ఎస్‌సీఓ, దాని కారణానికి భారతదేశం ఇస్తున్న ప్రాము ఖ్యతకు ప్రతిబింబిస్తుంద‌ని విదేశాంగ కార్యదర్శి అన్నారు. ఈ స‌ద‌స్సు  సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఉజ్బెక్ రాజధాని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ సదస్సు సంద ర్భంగా ప్రధాని మోదీతో వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక సమావేశం కావ‌చ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోయే షాంఘై సహకార సంస్థ  సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. ప్రధాని మోదీ కూడా వెళ్తున్నారు. ఎస్‌సీఓ లో  ప్రస్తుతం  చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి. కాగా  పూర్తి సభ్యత్వాన్ని పొందేందుకు ఆసక్తిని కలిగి ఉన్న  ఆఫ్ఘనిస్తాన్, బెలా రస్, ఇరాన్ మంగోలియా. దీనికి ఆరు డైలాగ్ పార్ట్‌నర్‌లుగా అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక మరియు టర్కీ కూడా ఉన్నాయి.

సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు సరే.. దళిత సీఎం మాటేమిటి సారూ!

అవ్వా కావాలి.. బువ్వా కావాలి అంటే కుదరదన్నది నానుడి. రాజకీయాలలో కూడా అంతే ప్రత్యర్థిపై పై చేయి సాధించడానికి ఒక ఎత్తు వేస్తే.. అది ప్రత్యర్థినే కాదు తననూ ఇరుకున పెడుతుంది. తప్పదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూ అది అనుభవంలోకి వచ్చింది. దళిత బాంధవుడిగా ఒక ముద్ర కోసం ఆయన అనూహ్య వేగంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఫలించింది. అదే సమయంలో బూమరాంగ్ కూడా అయ్యింది. కేసీఆర్ తన వ్యూహ వేగం కారణంగా ఒకే సమయంలో కేంద్రంపై పై చేయి సాధించారు.. రాష్ట్రంలో తన విమర్శకులకు షాక్ ఇచ్చారు. ఒకే ఒక్క ప్రకటన జాతీయ స్థాయిలో కేసీఆర్ ఇమేజ్ ను పెంచేసింది. దళిత బాంధవుడిగా గుర్తింపు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో గతంలో తాను ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చలేదన్న ప్రశ్ననూ బలంగా తెరమీదకు తీసుకువచ్చింది.  తెలంగాణ సెక్రటేరియెట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం కేసీఆర్ కు జాతీయ స్థాయిలో మైలేజ్ పెంచేసింది. నిజమే కానీ అదే సమయంలో తెలంగాణలో ఆయన రాజకీయ ప్రత్యర్థులకు ఒక ఆయుధాన్నీ ఇచ్చింది.  ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని చకచకా ఆలోచించి.. తాము కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి  సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ రాలేదు.  కానీ కేంద్రం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అండేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ మాత్రం అన్ని వైపుల నుంచీ బలంగా వచ్చింది. దీనిని అవకాశంగా తీసుకుని కేసీఆర్ సచివాలయానికి అండేడ్కర్ పేరు పెట్టేశారు. అదే సమయంలో కేంద్రం కూడా తన బాటలోనే నడవాలని ఒక డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ఒకే దెబకు రెండు పిట్టలను కొట్టేయవచ్చని భావించారు. అంతా బానే జరిగింది కానీ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించగానే తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ గతంలో తానే ఇచ్చి విస్మరించిన హామీ ఇప్పుడు గతంలో న్నడూ లేనంత బలంగా తెరమీదకు వచ్చింది.  సచివాలయానికి అంబేడ్కర్ పెరు పెట్టడం కాదు.. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటలను నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ ప్రత్యర్థులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. సచివాలయానికి ఎవరూ కోరకుండానే అంబేడ్కర్ పేరు పెట్టిన కేసీఆర్, తాను స్వయంగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నిస్తున్నారు.   తెలంగాణ ఉద్యమ సమయంలో .. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను సీఎంను కానని దిళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని లేకపోతే తల నరుక్కుంటానని ఘనంగా ప్రకటించిన కేసీఆర్.. తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు సార్లు ఆ అవకాశం వచ్చినా తానే సీఎం అయ్యారు తప్ప దళితుడికి ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీస్తున్నారు. అంతే కాకుండా  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ విజయం తథ్యమనీ, తానే సీఎంను అవుతాననీ ప్రకటిస్తున్నారు తప్ప దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న తన హామీని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పుడు.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి బీజేపీని డిఫెన్స్ లో పడేశానని కేసీఆర్ సంబరపడుతున్న వేళ దళిత ముఖ్యమంత్రి అంశం బలంగా తెరమీకు వచ్చింది.   దళితుల్ని ఆకట్టుకని జాతీయ స్థాయిలో మైలేజీ సంపాదించాలని ఆయన వేసిన త్తుగడ ఈ రకంగా బూమరాంగ్ అయ్యింది. ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఆ అంశాన్నే ఆయుధంగా మార్చుకుని కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నది. మొదటి సారి సీఎం అయిన సందర్భంగా దళిత ముఖ్యమంత్రి విషయంపై కేసీఆర్ కొత్త రాష్ట్రానికి తన వంటి అనుభవజ్ణుడైన వ్యక్తి సీఎం కావాల్సిన అవసరం ఉందనీ అందుకే దళిత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చలేదనీ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తరువాత ఈ విషయంపై ఎవరు ప్రశ్నించినా విమర్శించినా స్పందించలేదు. అయితే ఈ సారి ఆయన బీజేపీని ఇరుకున పెట్టే లక్ష్యంతో వ్యూహాత్మకంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతూ తీసుకున్న నిర్ణయం దళిత ముఖ్యమంత్రి అంశాన్నిప్రత్యర్థి పార్టీలకు ఒక బలమైన ఆయుధంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. 

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడవుతాడా?

భారత మాజీ కెప్టెన్ మళ్లీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక అవుతారో లేదో నిర్ధారించడానికి బీసీసీఐలో ఎవరూ సిద్ధంగా లేరు. భార‌త క్రికెట్  కంట్రోల్ బోర్డు (బిసీసీఐ) రాజ్యాంగంలోని కూలింగ్-ఆఫ్ నిబంధన ను సవ రించడానికి అంగీకరించిన సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, ఇద్దరు ప్రముఖ ఆఫీస్ బేరర్లు - ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా కి మరో మూడేళ్ల కాలాని కి స‌వ‌రించారు. అయినప్పటికీ, గంగూలీ పదవిలో కొనసాగడం ఇప్పటికీ పూర్తయిన ఒప్పందంగా కనిపించడం లేదు. అక్టో బరు 2019లో మాజీ భారత కెప్టెన్ ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు, కోర్టు నియమించిన నిర్వాహకుల పాలన  33 నెలల తర్వాత బోర్డుకు విశ్వసనీయతను అందించిన వ్యక్తిగా అతను స్థానం పొందాడు. ఇది సభ్యుని ఫిట్‌నెస్, అర్హత ప్రమాణాలు మారాయి. కాబట్టి, మరికొంత మంది అర్హులు అవుతారు. సభ నిర్ణయం తీసుకోనివ్వండ‌ని సీనియర్ బోర్డు కార్యనిర్వాహకుడు చెప్పారు. కానీ గంగూలీ,  షా ల కొనసా గింపు  బీసీసీఐ  ఏజీఎంలో నిర్ణయిస్తారు, దీని కోసం నోటీసు త్వరలో వెలువడు తుంది. వ్యాఖ్యా నించడా నికి ఇద్దరూ అందుబాటులో లేరు. ఈ నవంబర్‌లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎన్నికలపై బీసీసీఐ అధికారులు కూడా  ఒక కన్ను వేయనున్నారు. ప్రస్తుత ఛైర్మన్, న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే మరో పదవీ కాలం కొనసాగేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు, అయితే బీసీసీఐ తమలో ఒకరు ముందుకు రావాలని కోరుకోవచ్చు. గత, ప్రస్తుత నిర్వాహకులు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించారు, ఇది పరిపాలనా కొనసాగింపుకు సహాయపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. బిసిసిఐ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు తరలించబడింది మరియు ఏ వ్యక్తులను కాదని బిసి సిఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. ఏదైనా సంస్థకు కొనసాగింపు ఎప్పుడూ సహాయం చేస్తుంది. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ బాడీ మరియు క్రికెట్ కోసం దీర్ఘకాలిక లక్ష్యాలను కలిగి ఉండాలి. మా సవర ణలలో కొన్నింటిని పునఃపరిశీలించి, ఆమోదించడానికి న్యాయస్థానం ఉదాత్తంగా వ్యవహరిం చినందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రస్తుత ఆఫీస్ బేరర్లు నేరుగా ప్రయోజనం పొందుతుండగా, ఇప్పుడు వారి ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత వారు శీతలీకరణకు వెళ్లనవసరం లేదు, బోర్డు రాజ్యాంగంలో సవరణ కూడా చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటుంది. బిసిసిఐ ఆలోచ‌న‌ను కోర్టు గౌరవించడం సానుకూలభాగం. పదవిలో కొనసాగింపు లేకుండా పని చేయ డం చాలా కష్టం' అని బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా అన్నారు. ప్రజలు ఎప్పటికీ అధికారంలో ఉంటా రనే అభిప్రాయం వరకు, బీసీసీఐలో ఎప్పుడూ అలా జరగలేదు ఎందుకంటే మీరు ప్రతిసారీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో గెలవాలన్నారు.

పొత్తు పొడుపులపై ఊహాగాన సభలు.. ఢిల్లీ టు గల్లీ ఇదే చర్చ ఇదే రచ్చ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఒక విధంగా  సర్వామోదం పొందిన నానుడి. యూనివర్సల్ ట్రూత్.  సో .. పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం, పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం, పాత పొత్తులు వాడి,  కొత్త పొత్తులు విచ్చుకోవడం, కొత్త విషయం కాదు. నిన్న గాక మొన్న బీహారులో ఏమి జరిగిందో చూశాం.  రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం  జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈరెండు సంవత్సరాలలో లోలోపల ఏమి జరిగిందో ఏమో కానీ, నితీష్ కుమార్’ బీజేపీ చేయి వదిలి ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్ళీ ఆయనే పీఠం ఎక్కారు. నితీష్  ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సరే,నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే భేతాళ ప్రశ్నలు ఉంటే ఉండవచ్చును కానీ, రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఇదొక లేటెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్’ గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజమే, ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి. మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో  అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది.  అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల్ వరకు పొత్తుల మీదనే చర్చ నడుస్తోంది.ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ బీహార్ రాజదాని పాట్నా వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్’ తో సమావేశమై జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని, ఇటు బీహారు పెద్దాయనకు, దేశ ప్రజలకు విశద పరిచే ప్రయత్నం చేశారు. అలాగే, అంతకు ఒకరోజు ముందే ఎన్సీపీ అధినేత  శరద పవార్’  బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే అందులో తనది సలహాదారు పాత్ర మాత్రమే అని కూడా చెప్పారు. అలాగే, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇలా ఎవరికి వారు, ప్రధాన మంత్రి నరేందర్ మోడీని గద్దెదించడం కోసం ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, నాయకత్వం విషయంలో ఎవరి దారిన వారు విడి పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాట్నా పర్యటనలో ఇదే  తగవు తలమానికంగా నిలిచింది. చివరకు ఆయన వెళ్ళిన పని పంచిన కోటి రూపాయల నజరానాలు అన్నీ పక్కకి పోయి, నాయకత్వం విషయంలో కేసీఆర్, నితీష్ కుమార్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్న విషయమే ప్రముఖంగా బయటకు వచ్చింది.నాయకత్వ విషయంవచ్చే సరికి నితీష్ కుమార్ లేచి పోవడం, కేసీఆర్ ఆయన్ని కూర్చో పెట్టిందుకు భైఠోజీ .. భైఠో అని బతిమిలాడుకోవడమే హైలైట్’ గా నిలిచింది.  అదొకటి అలా ఉంటే, ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీల మధ్య మళ్ళీ పొత్తు పొడుస్తోందని, త్వరలోనే టీడీపీ ఎన్డీఎలో చేరుతోదంటూ గత వారం పదిరోజులుగా సాగుతున్న ప్రచారానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా చుక్క పెట్టారు. ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని చెప్పారు. పొత్తులపై నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక  హోదా కోసమే  పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది.   ప్పడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ  మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే.నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు.  అదలా ఉంటే తెలంగాణలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వాలని ఉభయ  కమ్యునిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం నిర్ణయించాయి. నిజమే, కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలే కాదు అన్ని పార్టీలు ఎప్పుడోనే నిర్ణయించాయి.ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు. అయితే, సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు,అనుకోండి అది వేరే విషయం. గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, లెఫ్ట్ నేతలు కేసీఆర్’ను  ఏ బాషలో దూషించారు, అనేది ఇప్పడు అప్రస్తుతం.  అయితే, ఇలా  పొత్తుల చుట్టూ తిరుగుతున్న చర్చలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కనిపిస్తోందని,  ఇన్ని పార్టీలు, ఇంత మంది మహా నాయకులు అందుకోసమే పనిచేస్తున్నారు, అని పిస్తుంది. కానీ... బీజేపీని మోడీని ఓడించడం అయ్యే పనేనా అంటే రేపటి సంగతి ఏమో కానీ ఈరోజుకు అయితే కాదనే అనిపిస్తుందని విశ్లేషకులే కాదు, సామాన్యులు కూడా భావిస్తున్నారు. ఎందుకలా ...?!