పాలన చేతకాని మూర్ఖుడు జగన్.. రేణుకా చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. నవ్యంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు ఆమె సంఘీ భావం ప్రకటించారు. అందు కోసం సోమవారం అమరావతి వచ్చిన ఆమె  రైతులు కూర్చున్న ట్రాక్ట‌ర్‌ను   స్వ‌యంగా న‌డిపి.. పాద‌యాత్రలో పాల్గొన్న రైతులు, మహిళల్లో నయా జోష్ నింపారు.  అనంతరం రేణుకా చౌదరి ఓ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యలో మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓ ముర్ఖుడు అని అభివర్ణించారు. ఆయనకు పాలన చేతకాదన్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదనీ, అసలు ఆయ‌న‌కు ఎందుకు ఓట్లేశామా అని రాష్ట్ర ప్ర‌జ‌లు నిత్యం బాధ‌ప‌డుతున్నారని రేణుక అన్నారు.  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు చాలా మంది తెలుసునని... వాళ్ల‌ను ఎప్పుడు ప‌ల‌క‌రించినా..   జ‌గ‌న్ ఎప్పుడు దిగి పోతాడా? అని ఎదురు చూస్తున్నామ‌ని చెబుతున్నారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్రగా రేణుకా చౌదరి అభివర్ణించారు. అమరావతి రైతులకు మద్దతుగా న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు వచ్చానని.. అలాగే ఇప్పుడూ అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నారని.. వారికి మద్దతు చెప్పడానికి వచ్చానని.. మళ్లీ, మళ్లీ  వస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ది మూర్ఖ‌పు పాలన అన్న రేణుకా చౌదరి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తేననీ, అది  ఎక్క‌డికీ పోద‌ని, అక్కడే ఉంటుందని అన్నారు. హైకోర్టు.. ప్ర‌జ‌లు.. రైతుల‌కు అండ‌గా ఉన్నారనీ, ఉంటారనీ రేణుక అన్నారు. మ‌రి కొన్ని నెల్ల‌లోనే   జ‌గ‌న్ పాల‌న అంత‌మై పోతుంద‌ని... అనంతరం నిర్విఘ్నంగా అమ‌రావ‌తి నిర్మాణం సాగుతుంద‌ని ఆమె జోస్యం చెప్పారు.  మరోవైపు భారతీయ జనతా పార్టీపైనా సైతం రేణుకా చౌదరి విరుచుకుప‌డ్డారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని.. ఈ ప్రాంతానికి అండగా ఉంటామని నాడు ఆయన చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అమ‌రావ‌తికి అండ‌గా నిలుస్తామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు చెబుతున్నారని.. మరి గత మూడేళ్లుగా వీళ్లంతా క‌ళ్లుమూసుకున్నారా? అని నిలదీశారు.

అమ్మో..  ఎంత పెద్ద స్వ్కిడ్!

స‌ముద్రం ఒడ్డున రంగురంగుల పెద్ద గ‌వ్వ‌లో, మ‌రేద‌యినా వింత వ‌స్తువో క‌న‌ప‌డ‌గానే బేస్త‌వాళ్ల  ద‌గ్గ‌ర నుంచి అక్క‌డకి ప‌రుగున వ‌చ్చిన పోలీసులు భ‌య‌ప‌డి చూడ్డం చాలాకాలం నుంచి వింటున్న క‌థ‌ల్లో భాగం. ఏద‌యినా ప‌డ‌వ భాగ‌మో, పెద్ద రాయో ఒక్కోసారి కొట్టుకువ‌స్తాయి. దాన్నీ వింత‌గా దూరం నుంచే చూసి ఆన‌క ద‌గ్గ‌ర‌కెళ్లి ..ఇదేనా భ‌య‌ప‌డి చ‌చ్చాంగా.. అనుకుంటారు. కానీ ఈ మ‌ధ్య‌నే న్యూజిలాండ్ గోల్డె న్ బే లో హ‌ఠాత్తుగా ప‌ర్యాట‌కులు ఒక పెద్ద జంతు క‌ళేబరం లాంటిది చూసి ఖంగారుప‌డ్డారు. కేక‌లు వేశా రు. చాలామంది గుమిగూడారు. కాస్తంత దూరం నుంచే దాన్ని చూస్తుండిపోయారు. అది అతిపెద్ద స‌ముద్ర స్వ్కిడ్. ఇదేదో భూతంలా ఉంద‌ని ప‌ర్యాట‌ కులు భ‌య‌ప‌డి గోల చేశారు.  కొంత‌సేప‌టికి అక్క‌డికి చేరుకున్న స‌ముద్ర‌జీవుల సంబంధిత శాస్త్ర‌వేత్త ఒకాయ‌న అది స‌ముద్ర స్క్విడ్ అనీ అది చ‌చ్చింద‌ని భ‌యప‌డాల్సిందేమీ లేద‌ని ధైర్యం చెప్పాడు. మ‌రో చిత్ర‌మేమంటే ఇలాంటి  అతిపెద్ద స‌ముద్ర‌జీవి  ఇలా తీరంలోకి  వ‌చ్చి ప‌డ‌టం చాలా చాలా అరుదుగా జ‌రుగుతుంద‌ని  ఆయ‌న చెప్పారు. అన్న‌ట్టు  ఇది ఏకంగా 13 అడుగుల పొడ‌వు, 10 అంగుళాల వెడ‌ల్పూ ఉంది.  పెద్ద పెద్ద క‌ళ్లు, పొడ‌వాటి తోక‌ల్లాంటి కాళ్ల‌తో ఉంది.  సైంటిస్టు ఇచ్చిన ధైర్యంతో అది ఖ‌చ్చితంగా చ‌చ్చింద ని నిర్ధారించుకున్న త‌ర్వా త పిల్ల‌లు పెద్ద‌లు ఏకంగా సెల్ఫీలు తీసుకుని ఆనందించారు. పోలీసులు, అక్కడున్న‌పెద్ద‌లు ఏమీ అనలేదు. కార‌ణం ఇలాంటివి మ‌ళ్లీ చాలాకాలానికి గాని చూడ‌ లేమ‌ని. ఇది నిజంగానే స‌ముద్ర విచిత్రంగా చెప్పు కున్నారంతా. దాని క‌డుపు భాగం చీలి ఉంది. అందులో పెద్ద పెద్ద  చేప‌లు స‌గం స‌గం తెగి ఉన్నా యి. బ‌హుశా ఈ స‌ముద్ర‌జీవి చ‌నిపోయిన త‌ర్వాత చాలా రోజులుగా కెర‌టాల మీద తేలుతూ న్యూజిలాండ్ గోల్డెన్ బే బీచ్‌కి వ‌చ్చి ప‌డి ఉంటుంద‌ని శాస్త్ర‌ వేత్త‌లు అన్నారు.  

బీహార్ సీఎం నితీష్ కు..మోడీషా జోడీ మరో ఝలక్

ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో, ఆ ఇంటికి ఆ ఇల్లు అంటే దూరం,ఇప్పుడు మోడీ షా జోడీ రాజకీయాలు కూడా అంతే. నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీతో మంచిగా ఉంటా, కాదని నువ్వు కయ్యానికి కాలు దువ్వితే, నేను కత్తులు తీస్తా.. ఇదీ మోడీ షా జోడీ రాజకీయం. అవును, చాలా మంది విపక్ష నేతలు, విశ్లేక్షకులు ఆరోపించే విధంగా అటల్జీ అద్వానీ జోడీ బీజేపీ సారధులుగా ఉన్న రోజులు వేరు,ఇప్పుడున్నబీజేపీ వేరు.  ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పుడు వేరే లెక్క. ఇందులో దాపరిమూ లేదు. దాచుకునేదీ లేదు. బీజేపీ నాయకులు,  కార్యకర్తలు కూడా అదే మాట అంటున్నారు.  ఒకప్పుడు బీజేపీ విభిన్నమైన పార్టీ, మడికట్టుకున్న పార్టీ, నిజాయతీకి నిలబడి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని జార విడుచుకున్న పార్టీ, అని గొప్పలు  చెప్పుకున్న, పార్టీ నాయకులు.  కార్యకర్తలు ఎవరూ కూడా ఇప్పడు అలాంటి విశేషణాల జోలికి వెళ్లడం లేదు. కాలర్లు  ఎగరేయడం లేదు. నువ్వు గిచ్చితే నేను గిల్లుతా, నువ్వు గోకితే నేను బరుకుతా అనే ధోరణికి పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా, మోడీ షా బీజేపీని అటల్జీ, అద్వానీ బీజేపీ అనే భ్రమల్లో ఉన్నారు, లేదంటే, అలా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, అది ముగిసిన అధ్యాయం. బీజేపీ విభిన్న పార్టీ కాదు.   కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలో ఏమి జరిగిందో చూశాం.మూడేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కమల దళంతో కలిసి పోటీ చేసిన శివసేన, ఫలితాలు వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి పీఠం ఆశించి, కమలానికి కటీఫ్ చెప్పి,కాంగ్రెస్,ఎన్సీపీలతో జట్టుకట్టింది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంది. అయితే, ఇదే పరిస్థితి ఆటల్జీ అద్వానీల రోజుల్లో వస్తే, ఏమి జరిగేదో ఏమో కానీ, మోడీ షా జోడి మాత్రం, మాజీ మిత్ర పక్షం అని అయినా చూడకుండా, శివసేనలో చిచ్చుపెట్టింది. కొంత ఆలస్యం అయితే అయిందేమో కానీ, చివరకు శివసేనను చీల్చి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేని గద్దె దించింది. అదలా ఉంటే, ఇప్పుడు బీహారులోనూ బీజేపీతో కలిసి పోటీ చేసి, కమల దళంతో కయ్యానికి కాలు దువ్వి విడిపోయిన జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి  నితీష్ కుమార్ కు కూడా మోడీ షా జోడీ పొగ పెట్టడం స్టార్ట్ చేసింది. ఆఫ్కోర్స్, ఆర్జేడీ, కాంగ్రెస్ తో జట్టు కట్టిన నితీష్ కుమార్ సర్కార్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం లేక పోవచ్చును, కానీ, మోడీషా జోడీ ఆట అయితే మాత్రం ఆట ఆరంభించేసింది. తమతో  మైత్రీ బంధం తెంచుకున్న నేపధ్యంలో, మోడీషా జోడీ, జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ షాక్  ట్రీట్మెంట్ స్టార్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలలో జేడీయు ఎమ్మెల్యేలు మొత్తానికి మొత్తంగా బీజేపీ గూటికి చేరారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువాలు కప్పుకున్నారు.అలాగే, మణిపూర్ లో జేడీయూకు  ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు బీజేపీలోకి ఫిరాయించారు.  అంతే కాదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే, సూత్రాన్ని పాటిస్తూ, మోడీషా జోడీ ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు, స్థానిక సంస్థల సభ్యులనూ వదలడం లేదు. డయ్యూ డామన్  ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులుండగా వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు డయ్యూ డామన్ జేడీయూ నేతలు కూడా బీజేపీ తీర్థం స్వీకరించారు. బీజేపీతో మైత్రిబంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ అవినీతి పార్టీ ఆర్జేడీతో కలిశారని, దానికి వ్యతిరేకంగానే తాము బీజేపీలో చేరుతున్నట్లు డయ్యూడామన్ జేడీయూ నేతలు ప్రకటించారు. నిజానికి, బీజీపీ గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది తొమ్మిది రాష్టాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని విపక్షాలు, ముఖ్యంగా కేసేఆర్ ఆరోపిస్తున్నాయి. అందులో కొంత నిజం లేక పోలేదు. బీజేపీ ప్రభుత్వాలను కూలిస్తే, కేసీఆర్ అదే ఎనిమిదేళ్ళలో, టీడీపీ, వైసీపీ, సిపిఐ, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీల టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంతమందిని, తమ పార్టీలో చేర్చుకున్నారో లెక్కలేదు. రాజీకీయ పునరేకీకరణ పేరున ఒక్క బీజేపీ, మిత్ర పక్షం ఎంఐఎం మినాహా, మిగిలిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కారెక్కించి ఆ పార్టీలను నిర్వీర్యం చేశారు. ఒక్క కేసీఆర్, తెరాస అనే కాదు, కాంగ్రెస్ మొదలు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నాయి. సో .. ఇప్పడు బీజేపీ ని తప్పు పట్టాలంటే ... ముందుగా రాయి విసిరేది ఎవరు? ఆ అర్హత ఎవరికుంది?

ఎస్‌సీఓ స‌ద‌స్సుతో భార‌త్‌కు ప్ర‌యోజ‌నం?

షాంఘై సహకార సంస్థ (ఎస్ సిఓ)ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థ, ఇది యురేషియా ప్రాంతం లో సుమారు 60%, ప్రపంచ జనాభాలో 40% ప్రపంచ జీడీపీలో 30 శాతం కంటే ఎక్కువ. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లను న్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు కూడా హాజరుకాను న్నారు. ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చైనాతో భారతదేశ సరిహద్దు వివాదాలపై విస్తృత మైన విభే దాలు, ఉద్రిక్తతల సమయంలో వస్తుంది. నాయకులు గత రెండు దశాబ్దాలుగా ఒక బృందంగా ఉండే కార్య కలాపాలను సమీక్షించి, బహుపాక్షిక సహకారం అవకాశాలను చర్చించాలని భావిస్తు న్నారు. పురాతన సిల్క్ రోడ్‌లోని ఉజ్బెకిస్తాన్ నగరం సమర్‌కండ్‌లో జరిగే ఈ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ కొన్ని ద్వైపా క్షిక సమావేశాలను కూడా నిర్వహించే అవకాశం ఉంది. 2019లో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సందర్భంగా బ్రెజిల్‌లో జరిగిన వారి సమా వేశం తర్వాత ప్రధాని మోదీ మరియు జీ జిన్‌పింగ్ ముఖాముఖికి రావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు అపూర్వమైన పాశ్చాత్య ఆంక్షలతో మాస్కో బీజింగ్‌తో సంబంధాలను పెంచుకోవ డానికి ప్రయత్ని స్తున్నందున, శిఖరాగ్ర సమావేశంలో జి జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమా వేశమవుతారని రష్యా తెలిపింది. బీజింగ్ ప్రధానకార్యాలయం ఎస్సిఓ చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, అలాగే నాలుగు మధ్య ఆసియా దేశాలతో రూపొందించబడింది--కజకిస్తాన్, కిర్గిజిస్థాన్‌, ఉజ్బెకిస్తాన్,  తజికిస్తాన్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంతీయ సంస్థ, ఇది యురేషియా ప్రాంతంలో సుమారు 60శాతం, ప్రపంచ జనాభాలో 40 శాతం, ప్రపంచ జీడీపీలో 30 శాతం కంటే ఎక్కువ. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఈ వారం కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లకు రాష్ట్ర పర్యటనలు చేయనున్నారు -- కరోనావైరస్ మహమ్మా రి ప్రారంభ రోజుల నుండి అతని మొదటి విదేశీ పర్యటన. ఇరాన్ అధికారికంగా ఎస్ సిఓ లోకి ప్రవేశించాలని భావించిన సమర్‌కండ్ శిఖరాగ్ర సమావేశం తర్వాత, సెంట్రల్ ఆసియా రిపబ్లిక్ ల ప్రభావవంతమైన గ్రూప్ అధ్యక్ష పదవిని భారతదేశం తీసుకుంటుంది. 2019 నుండి మొదటి వ్యక్తిగత ఎస్ సిఓ శిఖరాగ్ర సమావేశాన్ని చైనా అధ్యక్షుడు జి, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో పాటు ద్వైపాక్షిక సమావేశాల అవకాశం కోసం నిశితంగా పరిశీలిస్తారు. జిన్‌పింగ్‌ అక్టోబర్‌లో పాలక కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దానికి రెండుసార్లు కీలకమైన కాంగ్రెస్‌కు సిద్ధమవుతు న్నారు, అక్కడ ఆయ‌న‌  మూడవసారి అధ్యక్షుడిగా గెలుస్తారని విస్తృతంగా భావిస్తున్నారు. తెరవెనుక అధికార పోరాటాలు తరచుగా తీవ్రరూపం దాల్చినప్పుడు, పార్టీ కాంగ్రెస్‌కు ముందు వారాల ముందు చైనా నాయ కులు సాధారణంగా విదేశీ పర్యటనలకు దూరంగా ఉండేవారు.

అసెంబ్లీ సమావేశాలు ఎందుకోసం?ఎవరి కోసం ?

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఏమి కోరుకుంటున్నారు? ఏమి ఆశిస్తున్నారు?  రాష్ట్ర శాసన సభ వేదికగా ముఖ్యమంత్రి చేసిన సుదీర్ఘ ప్రసంగం విన్న ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది.  సోమవారం (సెప్టెంబర్ 12) కేవలం మూడు గంటల పాటు జరిగన సభలో సుమారు రెండు గంటలు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న ఏ ఒక్క సమస్యనూ ప్రస్తావించలేదు.కేంద్ర ప్రభుతాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా,  అనే అనుమానం వచ్చే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది.   పోనీ, అందులో అయినా ఏదైనా  కొత్త విషయం వుందా? అంటే, అదీ లేదు. ఇప్పటికే, పార్టీ వేదికలు,బహిరంగ సభలు, విలేకరుల సమావేశాలలో ఒకటికి పదిసార్లు ఏకరవు పెట్టిన విషయాలనే, అసెంబ్లీ వేదికగా మరో సారి ఏకరవు పెట్టారు. నిజమే కావచ్చును,కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని, ముఖ్యమంత్రి భావిస్తే భావించవచ్చును. ఆయన జాతీయ పార్టీ పెట్టి దేశాన్నిప్రగతి పథంలో ముందుకు తీసుకుపోదామనుకుంటే, అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఆయన ప్రధాన మంత్రి కావాలనుకుంటే కాదనే వారుండరు. గుజరాత్ ముఖ్యంత్రిగా మోడీ ఎలాంటి పాలన అందించారో ఏమో కానీ, దేశ ప్రజలు ఆమోదిస్తేనే ఆయన ప్రధాని అయ్యారు. అలాగే రేపు దేశ ప్రజలు ఆమోదిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని కావచ్చును. అందుకు ఎవరూ అభ్యతరం చెప్పరు.   కానీ, అందుకోసం తెలంగాణ శాసన సభను ప్రచార వేదిక చేసుకోవడం, ఏమిటనేదే సామాన్య ప్రజలు అడుగుతున్నప్రశ్న. ఆరు నెలల తర్వాత, అది కూడా కేవలం రెండే రెండు రోజులు (మొదటి రోజు  సంతాప తీర్మానాలతో సభ వాయిదా పడింది) శాసన సభ జరుగతున్న వేళ రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్లు, ముఖ్యంత్రి రాజేకీయ ప్రసంగం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొదవ లేదు?  ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ‘జాతి’ ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం (కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం) విఫలమైందని ఆరోపిస్తూ,ఇంచు మించుగా రెండు నెలలకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వీఆర్‌ఏలు, బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాల ముట్టడికి ప్రయత్నించారు. రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే జిల్లా నుంచి హైదరాబాద్ వస్తున్న వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినట్లు వీఆర్ఎ జేఏసీ ఆరోపిస్తోంది. నిజానికి వీఆర్‌ఏల జేఏసీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదెమియా తెలిపారు. అంతేకాదు  ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి, సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరుతున్నామన్నారు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలకుండా, అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ఆందోళనను అంచి వేయాలనుకోవడం, ఎంత వరకు సమంజసం? అది ఎలాంటి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది? ఇది ఏ మోడల్ పాలనకు సంకేతం అవుతుందని వీఆర్ఏలే కాదు సామాన్యులు కూడా అడుగుతున్న ప్రశ్న. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల  సమ్మె విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అణచివేత విధానాలను అవలంబించిన నేపధ్యాన్ని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతే కాదు, ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నదని వీఆర్ఏలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన వీఆర్ఏలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా సర్కార్ లో చంలనం లేక పోగా, స్వయంగా ముఖ్యమంత్రి వీఆర్‌ఏల ఆందోళన  అర్థంలేని ఆందోళన అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. కావచ్చు, వారిది అర్థం లేని ఆందోళన అయినా కావచ్చును, కానీ, ప్రజస్వామ్య పద్దతిలో వారిని చర్చలకు పిలిచి సమస్యను చర్చించడంలో తప్పేముందని, తెరాస ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు.   నిజానికి, ఒక్క వీఆర్ఏ సమస్యనే కాదు, ధరణి సమస్యకు బడుగు రైతులు బలవుతున్నారు. అన్నిటినీ మించి, సంక్షేమ హాస్టళ్ల  విద్యార్ధులు, విద్యాశాఖ మంత్రి   సబితా ఇంద్రా రెడ్డి చెప్పినట్లుగా ‘సిల్లీ’ సమస్యలతో చచ్చిపోతున్నారు. వర్ధన్న పేట గురుకుల హాస్టల్ లో కలుషిత ఆహరం తిని 60 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. అందులో పది మంది విద్యార్ధులు ఇప్పటికీ ఇంకా  కోలుకో లేదు. చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యనే కామరెడ్డి జిల్లాలోని ఓ బీసీ హాస్టల్ లో ఓ చిన్నారి పాము కరిచి కన్నుమూసింది. ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు, ఎదుర్కుంటున్న సిల్లీ సమస్యల గురించి అయితే చెప్పనే అక్కరలేదు. కలుషిత ఆహారం కారణంగా ఒక విద్యార్థి చనిపోయారు. వందల మంది పిల్లలు తీవ్ర అస్వత్తకు గురయ్యారు.  అసఫాబాద్ లో ఒక డిగ్రీ విద్యార్ధిని చని పోయారు. మరో నలుగురు చిన్నారులు చనిపోయారు. పరిగిలో వందమందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి ఇంట అద్వాన్నంగా ఉంటే, అసెంబ్లీలో చర్చ ఉండదు. కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించినా ముఖ్యమంత్రి పట్టించుకోరు. సభా ముఖంగా ఒక హామీ ఇవ్వరు.. ఇదేమి తీరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇవి మాత్రమే కాదు, చెప్పుకుంటూ పోతే .. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల చిట్టా ఇంకా వుంది.. కానీ, ముఖ్యమంత్రి ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి ..

అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రసంగం దేనికి దర్పణం?

కేసీఆర్ సమయం, సందర్భం పట్టించుకోకుండా ఇటీవల మోడీ వ్యతిరేకత ఒక్కటే దేశంలో ప్రధాన అంశంగా ప్రసంగాలు చేస్తున్నారు. అది రైతులతో సమావేశమైనా, మునుగోడు ఉప ఎన్నిక సన్నాహక సభ అయినా, రైతులతో సమావేశమైనా, ఆఖరికి అసెంబ్లీ అయినా ఆయన ప్రసంగాలు మోడీ వల్ల దేశానికి, తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతోందని చెప్పడానికే పరిమితమౌతున్నాయి. ఆయన నోటి నుంచి మోడీ సర్కార్ పై విమర్శలు వినా.. రాష్ట్రంలో పరిస్థితుల గురించి.. నెలకొన్న సమస్యల గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా రావడం లేదు.  మోడీ, కేంద్రం తెలంగాణకు.. దేశానికి తీవ్ర అన్యాయం చేశారని, అలాగే మోడీ పాలనలో దేశం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చెప్పడానికే పరిమితమౌతున్నారు. ఆఖరికి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన బాణి, వాణి ఇదే అయిపోయింది.  .రెండురోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో .. కేసీఆర్ తొలి రోజు దాదాపు రెండు గంటల పాటు చేసిన ప్రసంగం   మొత్తం మోడీని విమర్శించడానికి.. ఆయన పాలనలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసింది చెప్పడం ఊరుకోకుండా  దేశానికి మోడీ వల్ల జరిగిన నష్టం..   తనతో సఖ్యతగా ఉన్న సీఎంలు ఉన్న రాష్ట్రాలకూ మోడీ నేతృత్వంలోని కేంద్రం చేసిన అన్యాయం తదితర అంశాలను ఏకరవు పెట్టడానికే కేటాయించారు.   తెలంగాణకు మోదీ అన్యాయం చేశారని చెప్పడానికి ఏడుమండలాల దగ్గర్నుంచి ప్రారంభించారు. చంద్రబాబు చేతిలో కీలబొమ్మగా మారి ఏడు మండలాల విలీనం నుంచి  ఇప్పుడు కరెంట్ బకాయిల పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేనంత వడ్డీ వేసి కట్టమని ఆదేశించడం వరకూ దేనినీ వదల లేదు. అదే సమయంలో   తెలంగామకు రావాల్సిన వాటి గురించి మాత్రం మోడీ   ఎందుకు నోరు విప్పరని నిలదీశారు. తెలంగాణ విషయంలో మోడీ సర్కార్ చేసిన, చేస్తున్న అన్యాయాల గురించి గతంలో పలుమార్లు చెప్పిన విషయాలనే మరో సారి అసెంబ్లీ వేదికగా కేసీఆర్ వల్లె వేశారు.   వ్యవసాయానికి రైతులను దూరం చేసే కుట్ర మోడీ సర్కార్ చేస్తోందన్నారు.  రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేస్తామంటూ కేంద్ర హోంమంత్రే చెప్పడం సిగ్గు చేటన్నారు. తెలంగాణను ఎంత మంది షిండేలు, బొండేలు  వచ్చినా ఇక్కడ ఏమీ చేయలేరని హెచ్చరించారు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడని మోడీ ఎంత అని కేసీఆర్ అన్నారు. అధికారం, అహంకారం తలకెక్కిన మోడీకి గుణపాఠం చెబుతామన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం మొత్తం ఆయన జాతీయ రాజకీయ అజెండాకు నకలుగా ఉంది.  రాజ్యాంగ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆరు నెలల్లోపు సభ నర్వహించాల్సి ఉండటంతో అనివార్యంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారే కానీ ఆయన దృష్టి మొత్తం జాతీయ రాజకీయాల మీదే ఉంది. అందుకే అసెంబ్లీని కూడా ఆయన దానికే వేదికగా మార్చుకున్నారు.

నితీష్‌కు పీఎం యోగ్య‌త లేదు...గిరిరాజ్ 

గత 18 ఏళ్లలో తాను ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, అలాంటివారు ప్రధానమంత్రి క‌ల‌లు క‌న‌డం ఆర్ధ‌ర‌హిత‌మ‌ని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు గిరిరాజ్ సింగ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమ‌ర్శ‌నాస్త్రం సంధించారు.  కె చంద్రశేఖర్ రావు పాట్నాకు వచ్చినప్పుడు, ఆయ‌న నితీష్ కుమార్ పేరును ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకోలేదు, బదులుగా బీహార్‌ను అవమానించాడు, తన విలేకరుల సమావేశంలో సిట్-అప్‌లు చేశాడ‌ని అన్నారు. నితీష్ ఇప్పుడు దేశం మొత్తం పర్యటిస్తున్నారు, కానీ ఎవరూ అతనిని పట్టించుకోవడం లేద‌ని గిరిరాజ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ తరహాలో బీహార్‌ ప్రభుత్వం కూడా  రాష్ట్రంలోని మదర్సాలపై సర్వే నిర్వహించాలని కేంద్ర మంత్రి డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాల సర్వేను స్వాగతించే చర్య తీసుకున్నారు, ఇది బీహార్‌లో కూడా అవసరం. మదర్సాలలో చదివే పిల్లలు మతపరమైన విద్యను మాత్రమే పొందుతున్నారు మరియు వారు సైన్స్, ఇతర సబ్జెక్టులపై కూడా  జ్ఞానం పొందాలని మేము కోరుకుంటున్నాము, అయితే నితీష్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను నమ్ముతుం దని మాకు తెలుసు, అందువల్ల ఈ రకమైన సర్వే చేయదని సింగ్ అన్నారు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశలు ఉన్నాయన్న ఊహా గానాలన్నింటినీ ఇటీవ‌లే అన్నారు, తాను ప్రధానమంత్రి పదవికి హక్కుదారు కాదు లేదా దానిని  కోరు కునే వాడిని కాద‌ని అన్నారు. ఇటీవ‌ల సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం అనంతరం నితీష్‌, మీడియాతో మాట్లాడుతూ.. వామపక్షాలు, కాంగ్రెస్, అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆస న్న మైందని అన్నారు. మొత్తం అన్ని వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్‌లను ఏకం చేయడం పై దృష్టి సారించాలని, మనమందరం ఏకతాటిపైకి వస్తే ఇది చాలా పెద్ద విషయం అని ఆయన అన్నారు.

ఆసియాలో  స్తంభించిన  బియ్యం వాణిజ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, విరిగిన బియ్యం రవాణాను నిషే ధించింది,  రుతుపవనాల సగటు కంటే తక్కువ వర్షపాతం తగ్గిన తర్వాత దేశం సరఫరాలను, ధరలను పెంచడానికి ప్రయత్నిస్తున్నందున వివిధరకాల ఇతర రకాల ఎగుమతులపై గ‌త‌వారం 20% సుం కాన్ని విధించింది. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఆసియాలో వాణిజ్యాన్ని స్తంభింపజేశాయి, కొను గోలు దారులు వియత్నాం, థాయ్‌లాండ్‌, మ‌యన్మార్‌ల‌ నుండి ప్రత్యామ్నాయ సరఫరాల కోసం వెతుకు తున్నారు, ఇక్కడ ధరలు పెరగడంతో విక్రేతలు ఒప్పందాలను నిలిపివేస్తున్నారని పరిశ్రమ అధికా రులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా ఉన్న భారతదేశం, విరిగిన బియ్యం రవాణాను నిషే ధించింది రుతుపవనాల సగటు కంటే తక్కువ వర్షపాతం తగ్గిన తర్వాత దేశం సరఫరాలను, ప్రశాంత ధరలను పెంచడానికి ప్రయత్నిస్తున్నందున వివిధ రకాల ఇతర రకాల ఎగుమతులపై గురువారం 20% సుంకాన్ని విధించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉత్పన్నమైన వాణిజ్య అంతరాయాల మధ్య సరఫరాలను పెంచడానికి , ద్రవ్యోల్బణంతో పోరాడటానికి ప్రభుత్వాలు కష్టపడుతున్నందున ఈ సంవత్సరం ఎగుమతి నియంత్రణ లను ఎదుర్కొన్న వస్తువుల వరుసలో బియ్యం తాజాది. భారతదేశం యొక్క ప్రకటన నుండి బియ్యం ధర లు ఆసియాలో 5% పెరిగాయి. కొనుగోలుదారులు, అమ్మకందారులను పక్కన పెట్టడం ద్వారా ఈ వారం మరింత పెరుగుతుందని అంచనా. ఆసియా అంతటా బియ్యం వ్యాపారం స్తంభించిపోయింది. వ్యాపారులు తొందరపడి ఏదైనా చేయకూడద నుకుంటున్నారని భారత దేశపు అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు సత్యం బాలాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిమాన్షు అగర్వాల్ అన్నారు. గ్లోబల్ షిప్‌మెంట్ లలో 40% కంటే ఎక్కువ భారతదేశం వాటా కలిగి ఉంది. కాబట్టి, రాబోయే నెలల్లో ధరలు ఎంత పెరుగుతాయో ఎవరికీ ఖచ్చితం గా తెలియదు. మూడు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు బియ్యం ప్రధానమైనది. 2007లో భారతదేశం ఎగుమతులను నిషేధించి నప్పుడు, ప్రపంచ ధరలు టన్నుకు దాదాపు వెయ్యి డాల‌ర్ల‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 2021లో భారతదేశ బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో 21.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి, ఇది ప్రపంచంలోని తదుపరి నాలుగు అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారులైన థాయ్‌లాండ్, వియత్నాం, పాకిస్థాన్, యునైటెడ్ స్టేట్స్‌ల సంయుక్త రవాణా కంటే ఎక్కువ. భారతీయ ఓడరేవులలో బియ్యం లోడ్ చేయడం ఆగిపోయింది. అంగీకరించిన కాంట్రాక్ట్ ధర కంటే కొను గోలుదారులు ప్రభుత్వం కొత్త 20% ఎగుమతి లెవీని చెల్లించడానికి నిరాకరించడంతో దాదాపు ఒక మిలి యన్ టన్నుల ధాన్యం అక్కడ చిక్కుకు పోయిం ది. కొత్త కాంట్రాక్టుల కోసం అధిక ధరలను చెల్లిం చడా నికి కొంతమంది కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ, షిప్ప ర్లు ప్రస్తు తం పెండింగ్‌లో ఉన్న ఒప్పం దాలను క్రమబద్ధీకరిస్తున్నారు, ఓలమ్ ఇండియా రైస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ గుప్తా. భారతీయ ఎగుమతిదారులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడం ఆపివేయడంతో, కొనుగోలు దారు లు ప్రత్యర్థి థాయ్‌లాండ్, వియత్నాం మరియు మయన్మార్‌ల నుండి సరఫరాలను పొందేందుకు ప్రయ త్నిస్తున్నారని, గత నాలుగురోజుల్లో 5% విరిగిన తెల్ల బియ్యం ధర టన్నుకు సుమారు 20 డాల‌ర్ల‌ చొప్పున పెంచినట్లు డీలర్లు తెలిపారు. అయితే ఈ సరఫరాదారులు కూడా ధరలు బలపడతాయని అంచనా వేస్తున్నందున కాంట్రాక్టుల కోసం హడావిడి చేసేందుకు ఇష్టపడరు. రాబోయే వారాల్లో ధరలు మరింత పెరుగుతాయని మేము భావి స్తున్నామని హో చి మిన్ సిటీకి చెందిన  ఒక  వ్యాపారి చెప్పారు. వియత్నాం 5% విరిగిన బియ్యం ఇటీ వ‌ల‌ టన్నుకు 410 డాల‌ర్ల‌కి  అందించబడింది, గతవారం టన్నుకు 390-393 డాల‌ర్ల‌ వరకు, వ్యాపా రులు తెలి పారు. చైనా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సెనెగల్, బెనిన్, నైజీరియా, ఘనా వంటి ఆఫ్రికన్ దేశాలు  సాధారణ  గ్రేడ్ బియ్యం దిగుమతిదారుల లో అగ్రగామిగా ఉన్నాయి, ఇరాన్, ఇరాక్ మరియు సౌదీ అరేబియా ప్రీమియం గ్రేడ్ బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుం టాయి. కోవిడ్‌-19 మహమ్మారి నుండి సరఫరా అంతరాయా లు, ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ధాన్యాల ధరలను పెంచింది, అయితే గత రెండు సంవత్సరాలు గా ఎగుమతిదారుల వద్ద బంపర్ పంటలు, విస్తారమైన నిల్వల కారణంగా బియ్యం ఎక్కువగా ఈ ధోరణి ని పెంచింది. భారతదేశం యొక్క చర్య బియ్యం ధరలను పెంచుతుందని, గోధుమలు, మొక్కజొన్న వంటి ప్రధానమైన వాటిని ఖరీదైనదిగా మారుస్తుందని ఇప్పుడు కొనుగోలుదారులు భయపడుతున్నారని గ్లోబల్ ట్రేడింగ్ సంస్థతో ముంబైకి చెందిన డీలర్ చెప్పారు.

ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

హైదరాబాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాంలో ఏడుగురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంద. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని రూబీ హోటల్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ హోటల్ కింద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో తొలుత మంటలు వ్యాపించాయి. దాంతో షో రూంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకదాని తరువాత ఒకటిగా వరుసగా పేలిపోయాయి. దీంతో మంటలు పై అంతస్థులో ఉన్న హోటల్ కు వ్యాపించాయి. దట్టమైన పొగతో హోటల్ లో ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఏం జరుగుతోందో తెలిసేలోగా కొందరు సజీవదహనమయ్యారు.  మరి కొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఇంకొందరు ప్రాణభయంతో పై నుంచి దూకేసీ గాయపడ్డారు.   ఈ అగ్నిప్రమాద ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న  రోడ్డులో..   రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ల  షోరూం ఉంది. సెల్లార్‌లో ఆ షోరూం వాహనాల గోడౌన్ లో రాత్రి   షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్‌ పేలిపోయింది. ఆ వెంటనే మంటలు ఇతర వాహనాలకు వ్యాపిం చి, ఒకదాని తరువాత ఒకటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. సంఘటన జరిగిన సమయంలో  గోడౌన్ లో ఎవరూ లేరు. కానీ మంటలు పైన ఉన్న  రూబీ హోటల్‌కు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో పాతిక మంది బసచేసినట్లు తెలుస్తోంది. వారిలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.  మరో నలుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆసుపత్రిలో  చికిత్స అందిస్తున్నారు.   

రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేయనున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆదిపురుష్ లో రాముడి పాత్రను పోషిస్తున్నప్రభాస్ కు ఈ ఏడాది దసరా వేడుకల్లో రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసే అవకాశం లభించింది. ఈ మేరకు రామ్ లీలా కమిటీ ప్రభాస్ ను ఆహ్వానించింది. దసరా వేడుకలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 5న రామ్ లీలా మైదానంలో రావణదహనం కార్యక్రమం జరగనుంది. రావణుడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి హీరో ప్రభాస్ కు ఆహ్వానం లభించింది.    రావ‌ణుడు, కుంభ‌క‌ర్ణుడు, మేఘ్‌నాధ్ దిష్టిబొమ్మ‌ల‌ను ప్ర‌భాస్ బాణంతో ద‌గ్ధం చేస్తారు. ఒక తెలుగు నటుడికి ఈ గౌరవం దక్కడం ఇదే మొదటి సారి. గతంలో అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, జాన్ అబ్ర‌హం వంటి న‌టులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 

ర‌జ‌త్ కుమార్‌పై చర్య‌లు ఎందుకు తీసుకోలేదు.. డీవోపీటీపై ఢిల్లీ హైకోర్టు ఫైర్

అవినీతి నీడ‌లోనే అధికారం చెలాయించాలంటే ఆట్టే కాలం సాగ‌దు. అధికారం చేతిలో ఉంద‌ని క్రింది స్థాయి ఉద్యోగుల‌తో స్వంత ప‌నులు చేయించుకుంటే ఆన‌క అవినీతి బయ‌ట‌ప‌డి కోర్టు హెచ్చ‌రిక‌లు, అవ‌మానాలు భ‌రించాల్సి ఉంటుంది.  త‌న కుమార్తె వివాహం ఖ‌ర్చుల బిల్లుల విష‌యం  ర‌జ‌త్ కుమార్ ప‌రువు  ర‌చ్చ‌కీడ్చింది. కానీ దీనిపై డీఓపీటీ స్పంద‌న‌ప‌ట్ల  ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హించింది.  తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డివోపీటీ  వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి.  రజత్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ డివోపీటీకి తెలంగాణకు చెందిన గవి నోళ్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రజత్ కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ చీఫ్ సెక్ర టరీని డీవోపీటీ కోరింది. డివోపీటీనే నేరుగా చర్యలు తీసుకోకుండా తన ఫిర్యాదును రాష్ట్రానికి పంపడం పై ఢిల్లీ హైకోర్టును గవినోళ్ల శ్రీనివాస్ ఆశ్రయించారు.  న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారణ నిర్వహించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్‌పై చీఫ్ సెక్రటరీ ఎలా చర్యలు తీసుకుంటారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.  డివోపీటికి నోటీసులు జారీచేసి రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదు పరి విచారణను సెప్టెం బర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది. రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పిటిషన్‌లో గవినోళ్ల శ్రీనివాస్ కోరారు

టాలీవుడ్‌పై ఆర్జీవీ విసుర్లు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి టాలీవుడ్‌కు తీరని లోటని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. అయితే కృష్ణంరాజు మృతి చెందితే టాలీవుడ్‌లో సినిమా షూటింగులు నిలిపివేయకపోవడంపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు! అంటూ రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. అలాగే కృష్ణగారికి,మురళీమోహన్‌గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్‌కి, మహేశ్ బాబుకి, పవన్‌కల్యాణ్‌కి.. నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని రామ్‌గోపాల్‌వర్మ అభిప్రాయపడ్డారు. మనస్సు మనకు లేకపోయినా ఒకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దామన్నారు ఆర్జీవీ. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామని..  డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోందంటూ నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ గుర్తు చేశారు. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువనిద్దామని.... కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామంటూ ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్‌ పరిశ్రమను కోరారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు సెప్టెంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 3.25 గంటలకు మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనార్యోగంతో బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ సమీపంలో కొండమామిడిలోని కృష్ణంరాజు ఫాం హౌస్‌లో పూర్తి అధికార లాంచనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు అంత్యక్రియలకు వివిధ రంగాల ప్రముఖలే కాదు.. ఆయన అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు.

హాట్సాఫ్  డాక్ట‌ర్‌!

ఎదురు వ‌స్తున్న పిల్ల‌ల్ని ప‌క్క‌కి నెడుతూ  ఓ టెన్త్‌ క్లాస్ పిల్ల ఖంగా రుగా మ‌ళ్లీ స్కూ ల్లోకి ప‌రిగెట్టింది. పిల్ల‌లు చూసి వెక్కిరిస్తూ ఆనం దించారు. ఆమె పుస్త‌కం ఒక‌టి క్లాస్‌లో మ‌ర్చి పోయింది. ఓ కుర్రాడు బ‌స్సు వెంట ప‌రిగెడు తుంటే రోడ్డుమీద వెళ్లేవారు తిట్టారు ప‌డిఛ‌స్తావ‌ని. అత‌నికి న‌వ్వొచ్చింది..ల‌వ్లెట‌ర్ ఇంకా చేతిలోనే ఉంది, ల‌వ‌ర్ ముందెళ్లే బ‌స్సులో ఉంద‌ని! బెంగుళూ రులో ఆ మ‌ధ్య ఓ మ‌ద్య‌ వ‌య‌సాయ‌న ట్రాఫిక్ లో వాహ‌నాలు నిల‌వ‌గానే అమాంతం కారు దిగి ప‌రిగెట్టుకుంటూ వెళుతూంటే అంతా ఆశ్చర్యంతో చూస్తుండి పోయారు. కారు వ‌దిలి వెళ్లేంత తొంద‌ర‌ప‌నేమిటా అని. తీరా చూస్తే ఆయ‌న ఓ డాక్ట‌ర్‌! ఒక రోగి ప్రాణాలు కాపా డేందుకు ఆ డాక్ట‌ర్ ఏకంగా మూడుకిలోమీట‌ర్లు ప‌రిగెట్టాడు. ఒలింపిక్స్ వెళ్లాల్సినాయ‌న ఆస్ప‌త్రికి ప‌రిగెట్టాడ‌ను కున్నారు కుర్ర కారు! బెంగుళూరు స‌ర్జాపూర్‌లోని మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ గోవింద్ నంద‌గోపాల్‌. ఆయ‌న మొన్నామ‌ధ్య ఆస్ప‌త్రిలో ఒక రోగికి ఆప‌రేష‌న్ చేయాల‌ని బ‌య‌లుదేరారు. మ‌రి మూడు కిలోమీట‌ర్ల దూరంలోఆస్ప్ర‌తి ఉంద‌న‌గా ఆయ‌న కారు ట్రాఫిక్‌లో చిక్క‌డింది. ట్రాఫిక్ ప‌రిస్థితి చూస్తే అందులోంచి ఆయ‌న అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేద‌ని డాక్ట‌ర్ గ్ర‌హించారు. అందుకే వెంటనే కారులోంచి బ‌య‌టికి వ‌చ్చి ఆస్ప‌త్రికి ప‌రిగెట్ట‌డం మొద‌లెట్టారు. ఆయ‌న్ను చూసి ఏదో అయింద‌ నుకున్నారంతా. కానీ ఆయ‌న వృత్తి ధ‌ర్మం ఆయ‌న్ను ప‌రిగెట్టించింది. కారుని డ్రైవ‌ర్‌కి అప్ప‌గించి బ‌య‌లుదేరారు. మ‌రి కొద్ది సేప‌ట్లో ఆప‌రేష‌న్ చేయ‌కుంటే అక్క‌డి పేషంట్‌కి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలున్నాయి. అందుకే స‌మ‌యం వృద్ధాచేయ‌కుండా మూడు కిలోమీట‌ర్లు ప‌రిగెత్తి ఆస్ప‌త్రి చేరుకున్నారు. డాక్ట‌ర్ వ‌స్తున్నార‌ని తెలిసి అస్ప‌త్రి సిబ్బంది మ‌రో డాక్ట‌ర్ ఆ పేషంట్‌కి ఆప‌రేష‌న్ థియేట‌ర్ ఏర్పాట్ల‌న్నీ సిద్ధం చేశారు. డాక్ట‌ర్ గోవింద్  ట్రాఫిక్, జ‌నాల‌ను ప‌ట్టించుకోకుండా వీల‌యినంత వేగంగా ప‌రి గెట్టి ఆస్ప‌త్రికి స‌మ‌యానికి చేరుకున్నారు. అంతేకాదు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా ముగించారు.  ఆమధ్య బెంగుళూరులో భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్ల‌న్నీ నీటి మ‌యం అయ్యాయి. విప‌రీత ట్రాఫిక్ జామ్తో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ ప‌డ్డారు. స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే ఇది జ‌రిగింది. ఆ డాక్ట‌ర్ ప‌రిగెడుతూ వెళ్ల‌డాన్ని వీడియో తీసేరు కొంద‌రు. చాలామంది ఆయన్ను ఎంతో మెచ్చుకున్నారు. అస‌లు అంత వేగంగా ఎలా వెళ్ల‌గ‌లిగారు అని అడిగారు. అందుకు డాక్ట‌ర్ స‌మాధానం చెబుతూ త‌న‌కు జాగింగ్ బాగా అల‌వాటు ఉండంతో మూడు కిలోమీట‌ర్ల దూరం సునాయాసంగా ప‌రిగెత్త‌గ‌లిగాన‌న్నారు. ఆయ‌న ఆ స‌మయంలో తీసుకున్న నిర్ణ‌యం, ప‌రిగెట్టి వెళ్ల‌డంకంటే ఆయ‌న అవ‌త‌ల పేషెంట్ గురించి ఎంతో ఆలోచించ‌డ‌మే గొప్ప విష‌యం. హాట్సాఫ్ డాక్ట‌ర్‌!

నిక్కరుకు నిప్పు రగులుతున్న అగ్ని

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న `భారత్ జోడో యాత్ర’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త వివాదాన్ని వెంట తీసుకు పోతోంది. రాహుల్ గాంధీ ధరించిన టీ షర్టుతో మొదలైన, రాహుల్ గాంధీ వివాదాల యాత్ర, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ( ఆర్ఎస్ఎస్) స్వయం సేవకులు గణవేష (డ్రెస్)లో భాగంగా ధరించే ఖాకీ నిక్కరుకు నిప్పు పెట్టడం వరకు వెళ్ళింది.  రాహుల్ గాంధీ, మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ విద్వేషాన్ని రగిలిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రేమను సోదరభావాన్ని పంచుతోందని పేర్కొన్నారు. అన్నిటినీ మించి, దేశంలో విద్వేషాన్ని పారద్రోలి, ఐక్యతను పెంపొందింప చేయడం కోసమే రాహుల్ గాంధీ  `భారత్ జోడో యాత్ర’ చేపట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు కుంటున్నారు. కానీ, ఆయన యాత్ర ముదుకు సాగుతున్న క్రమంలో, యాత్ర ప్రకటిత లక్ష్యం వెనకడుగు వేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో మత  విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న క్రైస్తవ మత ప్రచారకునితో  రాహుల్ గాంధీ సమావేశం కావడం పెద్ద దుమారమే రేపింది.  ఇప్పడు తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)నుదృష్టిలో ఉంచుకొని మండుతున్న ఖాఖీ నిక్కర్’ను కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ పట్ల ఆర్ఎస్ఎస్, బీజేపే, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్వీట్ వైరల్ అయిన వెంటనే, బిజెపి నాయకులు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. వెంటనే చిత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సహకార్యవాహ డాక్టర్ మన్మోహన్ వైద్య దీనిపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ముత్తాత, నానమ్మ, నాన్న(నెహ్రూ, ఇందిరా గాంధీ,రాజీవగాంధీ) కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను మట్టు  పెట్టేందుకు విఫల ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.  ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ధరించే ఖాకీ నిక్కరుకు నిప్పు పెట్టిన.చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ సోషల్  మీడియా, ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో సృష్టించిన విద్వేషాన్ని అంచెల వారీగా  అంతమొందించే లక్ష్యగా  అడుగులు వేస్తున్నాం అని పేర్కొంది. అందులో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ధరించే నిక్కర్ ను విద్వేషానికి ప్రతీకగా చూపించింది.  కాగా, కురువృద్ధ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబ రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో  యాత్ర ద్వారా, దేశంలో విద్వేషం రగిల్చి, తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేస్తోందకుంటోంది అని ఆర్ఎస్ఎస్ ధ్వజమెత్తింది.   రాయపూర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూడు రోజుల సమన్వయ సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ కీలక నేత (సహ సర్ కార్యవాహ) డాక్టర్ వైద్య మాట్లాడుతూ సమాజంలో హిందుత్వానికి ఆదరణ పెరుగుతోందని, అందుకే, కుహన లౌకిక వాదులు మతాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ పై గతంలో రెండుసార్లు అకారణంగా నిషేధం విధించారని, కానీ ఆర్ఎస్ఎస్ దేశ ప్రజల మనసు గెలుచుకుంటూ మరింత విస్తరిస్తోందని, డాక్టర్ వైద్య తెలిపారు. సత్యం, సిద్ధాంతం, త్యాగం, పరిశ్రమ, బలిదానం ద్వారా సంఘ్ సమాజం మద్దతు పొందుతోందని స్పష్టం చేశారు.  అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, ఈ ట్వీట్ కాంగ్రెస్ సిగ్గుపడే మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన అసలు ఉద్దేశాలను కూడా దాచడం లేదు.భారత్ జోడో వేషంలో, భారత్ తోడోలో మునిగితేలుతోంది. జాతీయ వాదులను దెబ్బతీయాలనే వారి ఉద్దేశాలను భారతదేశం క్షమించదు అంటూ ట్వీట్ లో హెచ్చరించారు.అలాగే, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఇది భారత్ జోడో యాత్ర’ కాదు, భారత్ తోడో ఆగ్ లగావో యాత్ర అంటూ విరుచుకుపడ్డారు.  బీజేపీ ఐటీ అధినేత అమిత్‌ మాల్వియా మాట్లాడుతూ.. కేవలం 5 రోజుల్లోనే కాంగ్రెస్‌ తన కోరలను బయటపెట్టుకుంది. నెల్లీ నుండి భాగల్‌పూర్ వరకు, ఖైర్లాంజీ నుండి గోద్రా వరకు, హషీంపురా నుండి సిక్కుల మారణహోమం వరకు వ్యవస్థీకృత హింసతో వర్ధిల్లిన పార్టీ, ఎప్పటికీ జోడో భారత్ కాదని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  దక్షిణ బెంగళూరు ఎంపీ తేజశ్వి సూర్య, ఈ చిత్రం కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నైజంలోనే, హింస దాగుందని అన్నారు. 1984లో ఢిల్లీని కాంగ్రెస్ అగ్నికి ఆహుతి చేసింది. 2002లో గోద్రాలో 59 మంది కరసేవకులను సజీవ దహనం చేసింది.ఇప్పుడు మళ్ళీ మరో మారు అగ్గి రాజేసే కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాజీ నేత, జితిన్ ప్రసాద రాజకీయ విభేదాలు సహజం  కానీ, రాజకీయ ప్రత్యర్థులను అగ్నికి ఆహుతి చేసే అలోచన దేనికి సంకేతం ఇది  ఏ విధమైన  మనస్తత్వం? అంటూ ప్రశ్నించారు. ఇటువంటి  ప్రతికూల, ద్వేష రాజకీయాలను అందరూ ఖండించాలని స్పష్టం చేశారు. నిజానికి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నాయకులు, భారత్ జోడో యాత్ర రాజకీయ యాత్ర కాదని ప్రకటించారు, కానీ, ఇంకా ఒక వారం అయిన కాకుండానే రాహుల్ యాత్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. విద్వేషాలను తగ్గించే ఉద్దేశంతో మొదలైన యాత్ర, మెజారిటీ ప్రజల మనోభావాలను దేబ్బ తీసే విధంగా,  విద్వేషాలను పెంచి పోషించే దిశగా సాగుతోందనే సందేహాలు కాంగ్రెస్ వర్గాలు కూడా వ్యక్త పరుస్తున్నాయి.

టీ-20 ప్ర‌పంచ‌క‌ప్  భార‌త్ జ‌ట్టు...బుమ్రా,హ‌ర్ష‌ల్, అక్ష‌ర్‌ల‌కు చోటు

ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది జరగ నున్న టీ20 వరల్డ్‌ కప్2022కి భారత జట్టుని సెలెక్టర్లు సోమవారం ప్రక టించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికవగా.. ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చా రు. గాయం కారణంగా ఈ ఇద్దరూ ఆసియా కప్ 2022కి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం అక్టో బరు 16 నుంచి నవంబరు 13 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.  ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌-2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్‌16న క్వాలిఫైర్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఆక్టోబర్‌ 22 నుంచి సూపర్‌ 12 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక భారత్‌ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్న మెంట్ లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్‌లో పాక్‌ చేతిలో ఘోర ఓటమికు టీమిండియా బదులు తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటినుంచే ప్రపంచ కప్‌ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2022లో పాల్గొనే భారత జట్టును టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.  స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్

కుమార స్వామి, కేసీఆర్ భేటీ ఆంతర్యమేమిటి?

జాతీయ రాజకీయాలలో చక్రంతిప్పుతానంటున్న కేసీఆర్ అందుకు సంబంధించి వరుస భేటీలతో ఇటీవల బాగా బిజీ అయ్యారు. రైతు నాయకులతో సమావేశం తరువాత కర్నాటక  మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో ఆదివారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దాదాపు గంటల సేపు జరిగిన ఈ భేటీలో జాతీయ రాజకీయాలతో పాటు కర్నాటక రాజకీయాలపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు. కర్నాటక అసెంబ్లీకి   వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. కర్నాటకలో పాగా వేయాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఫండింగ్ చేసే విషయంలో కుమార స్వామితో భేటీలో కేసీఆర్ చర్చించినట్లు చెబుతున్నారు.  మొత్తంగా జాతీయ రాజకీయాలలో బీజేపీని దీటుగా ఎదుర్కొన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ కు కుమారస్వామి మద్దతు పలికారనడంలో సందేహం లేదు. కుమారస్వామితో భేటీ అనంతరం ఇరువురూ కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఇరువురూ కూడా ప్రత్యామ్నాయ జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. దేశంలోని మోధావులు, ఆర్థిక రంగ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, రైతు సంఘాల నేతలతో చర్చించి జాతీయ అజెండాపై ఒక అభిప్రాయానికి వచ్చామన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం, నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. సబ్బండ వర్ణాలనూ కలుపుకుని సుదీర్ఘ కాలం పోరాడి, ఉద్యమించి కేసీఆర్ తెలంగాణ సాధించారని కర్నాటక మాజీ మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్   దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందుండి నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనీ, జాతీయ రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలక భూమిక పోషించాలనీ, ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమార స్వామి చెప్పారు.  త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతించారు. కాగా కుమారస్వామి, కేసీఆర్ ల మధ్య భేటీలో జాతీయ రాజకీయాల చర్చ సంగతి అలా ఉంచితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు ఆర్థిక చేయూత అందించేందుకు సంబంధించిన లావాదేవీల గురించి కూడా విస్తృతంగా జరిగిందని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందుకు కుమారస్వామి తన బృందంలో కర్నాటకకు చెందిన పారిశ్రామిక వేత్తను కూడా వెంటబెట్టుకుని రావడమే నిదర్శనమని చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో మద్దతుగా జేడీఎస్ నిలుస్తుందనీ, అందుకు ప్రతిగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను (ఎలక్షన్ ఫండింగ్) కేసీఆర్ అందించేట్లుగానూ ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ స్పీడ్ కు మునుగోడు బ్రేక్

అధికారం చేతిలో ఉంటే రాజకీయ లబ్ధి కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే తమ రాజకీయ లబ్ధికి ఇబ్బంది అవుతుందని భావిస్తే వాటి స్పీడుకు బ్రేకులూ వేయవచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అదే చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు చెందిన వారి ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలు, ఆ తరువాత హైదరాబాద్ లో ఈడీ జరిపిన సోదాలలో వెలుగులోనికి వచ్చిన అంశాలతో త్వరలో నోటీసులు అరెస్టులు అనివార్యం అంటూ మీడియాలో కుప్ప తెప్పలుగా కథనాలు వచ్చాయి. ఈ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించిన ఆమె చివరికి తనపై ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అలాగే ఇదే కుంభ కోణంలో ఏకంగా ఏపీ సీఎం జగన్ సతీమణి భారతిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అలాగే వైసీపీ  ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి పైనా ఆరోపనలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ రాజకీయ నాయకులపై ఆరోపణలు గుప్పించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఆరోపణల పర్వానికి తెర తీశారు. అన్ని ఆధారాలూ ఉన్నాయనీ, త్వరలోనే కుంభకోణంలో ప్రమేయం ఉన్నవారి గుట్టు బయటపడుతుందనీ ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. అదలా ఉండగా సీబీఐ, ఈడీలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు మీద దర్యాప్తు చేపట్టాయి. ఈడీ అయితే హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో ఎకకాలంలో తనిఖీలు నిర్వహించి  పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈడీ దూకుడు గమనించిన పరిశీలకులు సైతం ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి నోటీసులు, అరెస్టుల పర్వం అనివార్యం అని భావించారు. అయితే అంతలోనే ఈడీ స్పీడ్ మందగించింది. లిక్కర్ స్కాం కు సంబంధించిన విచారణ పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారమూ బయటకు పొక్కడంలేదు. ఈడీ స్పీడ్ కు బ్రేక్ పడిందని అంటున్నారు. అయితే ఈడీ స్పీడ్ కు మునుగోడు ఉప ఎన్నిక వల్ల బ్రేక్ పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సహా   ఎవరికి నోటీసులు జారీ చేసినా, ఎవరిపైనైననా చర్యలు తీసుకున్నా అది మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీకి ప్రయోజనం కూర్చుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ఈడీ ఈ స్కాం దర్యాప్తులో స్పీడ్ తగ్గితే మేలని బీజేపీ పెద్దలు  భావించడం వల్లనే ఈడీ స్పీడ్ కు బ్రేకులు వేసిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అయిన తరువాత మళ్లీ ఈడీ స్పీడ్ పెరుగుతుందనీ, అంత వరకూ ఈ కేసుకు సంబంధించి పెద్దగా పురోగతి ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే ఈ స్కాం వ్యవహారంలో    ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితులు ఆరుగురిని ఈడీ విచారించడం  రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో ఏకంగా తెలంగాణ సీఎస్ ప్రమేయంపై ఈడీ విచారణ ప్రారంభించడంతో తెలంగాణా సర్కార్ ఉక్కిరిబిక్కిరిఅవుతున్న మాట వాస్తవమే అయినా, అదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక ముంగిట సంభవించిన ఈ పరిణామాల కారణంగా తెరాసకు ఉప ఎన్నికలో ప్రయేజనం చేకూరు అవకాశాలున్నాయని బీజేపీ గ్రహించింది. ఇప్పటికే ప్రత్యర్థులపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి వారిని ఇక్కట్లకు గురి చేస్తున్నదన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న కేంద్రం మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ఆ ఆరోపణలకుబలం చేకూర్చే అవకాశం ఇవ్వరాదన్న ఉద్దేశంతోనే ఈడీ స్పీడుకు బ్రేకులు వేసిందని అంటున్నారు.

కృష్ణంరాజు పాడె మోసిన భార్య‌

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్‌లో ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో క‌న్ను మూశారు. ఆయ‌న పార్ధివ దేహానికి సోమ‌వారం మ‌ధ్యాన్నం  అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. పార్ధివ‌దేహాన్ని ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల మోయ‌డం అంద‌ రినీ  కంట‌త‌డిపెట్టించింది.  మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో రెబల్ స్టార్ అంత్యక్రియలు నిర్వహిం చారు. కృష్ణంరాజు పార్థీవదేహాన్ని అంతిమయాత్రగా తీసుకువచ్చారు.  పార్ధివ‌దేహ‌న్ని ఆయ‌న స‌తీమ‌ణి శ్యామ‌ల కూడా మోయ‌డం అంద‌రి నీ ఎంతో బాధ‌పెట్టింది.  ప్రభుత్వ లాంఛనాలతో అంత్య క్రియలు పూర్తి చేశారు. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ రాజ్ చితికి నిప్పంటించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీ రుగా విలపించారు.  కృష్ణంరాజు కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండేం దుకు ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. కానీ అది పూర్తి అవ్వకముందే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా.. కృష్ణంరాజు నివాసం ఉండా లకున్న వ్యవ సాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనా రోగ్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం ఆయన అంత్యక్రియలు  పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు రెబల్ స్టార్‌ను చివరి సారి చూసేందుకు భారీగా తరలివచ్చారు.   

అసంతృప్తిని మంత్రి పదవిపై ఆశ మింగేసిందా?

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో అంతగా పరిచయం అక్కర్లేని పేరు.ఉమ్మడి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే. గత కొంత కాలంగా ఆయన వైసీసీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ కేబినెట్ లో చోటు లభించలేదన్న అసంతృప్తే అందుకు కారణమని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరాఖరికి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి చేతులు కాల్చుకున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి తూతూ మంత్రంగానే పాల్గొన్నారు.  వైఎస్  మరణం తర్వాత...  జగన్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా ... వైసీపీని స్థాపించిన సమయంలో  నెల్లూరు జిల్లా నుంచి జగన్ పార్టీలో చేరిన తొలి నేతనల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. దాంతో జగన్ ఆయనకు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  అయితే తరువాత ఆ బాధ్యతల నుంచి ప్రసన్నకుమార్ రెడ్డిని తప్పించి  కాకాణి గోవర్థన్ రెడ్డికి   అప్పగించారు. సరే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసన్న కుమార్ రెడ్డి జగన్ తొలి కేబినెట్ లో స్థానం ఆశించారు. కానీ భంగపడ్డారు. ఆ భంగపాటును ఎలాగోలా ఓర్చుకున్నా మూడేళ్ల తరువాత జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో కూడా తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో నొచ్చుకున్నారు.  తనకు మంత్రి పదవి దక్కక పోవడం కంటే జిల్లాలో తన కంటే జూనియర్లు..  సబ్ జూనియర్లు అయిన.. మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు తొలి కేబినెట్‌లో చోటు దక్కడం.. అలాగే కాకాణి గోవర్థన్ రెడ్డికి జగన్ మలి కేబినెట్‌లో బెర్త్ కేటాయించడం  ప్రసన్న కుమార్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. ఆ అసంతృప్తి కారణంగానే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతుంటాయి. అయితే హఠాత్తుగా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్క సారిగా జగన్ ను ఆకాసానికి ఎత్తేస్తున్న చందంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా సీఎం జగన్ ది ప్రధాన మంత్రి స్థాయి అని పొగిడేశారు. రాష్ట్ర ప్రజలు ఆయనే మరో సారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటూ చేసిన ప్రకటన పార్టీ శ్రేణులనే నివ్వెర పరిచింది. ఇంత కాలం పార్టీలో అసమ్మతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా యూటర్న్ తీసుకుని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించడమేమిటా అని ఆశ్చర్య పోయారు. కాగా ప్రసన్న కుమార్ రెడ్డి హఠాత్తుగా జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించడానికి ఆయన త్వరలో మరోసారి తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయం తీసుకోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి తూతూ మంత్రంగా పాల్గొనడంపై   తాడేపల్లి ప్యాలెస్ నుంచి గట్టిగానే మందలింపులు అందినా కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపని ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు హఠాత్తుగా జగన్ పై ఎక్కడ లేని అభిమానాన్నీ ఒలకబొస్తూ పొగడ్తల వర్షం కురిపించడానికి కారణం ఆయనలో చిగురించిన మంత్రి పదవి ఆశేనని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశం సందర్భంగా సీఎం జగన్ మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. పార్టీపైనా, తన కుటుంబంపైనా  ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు ఆరోపణలు సంధిస్తున్నా మంత్రులు స్పందించడంలేదని జగన్ ఫైర్ అయ్యారు.  తన తొలి కేబినెట్‌లో మంత్రులు   చలాకీగా ఉండేవారని చెబుతూ,  కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్,  కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్లు ప్రస్తావించారు. అదే సందర్భంగాఇప్పటికైనా మంత్రులు తీరు మార్చుకోకుంటే పదవులు పీకేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదిగో ఆ హెచ్చరికతోనే రాష్ట్రంలో జగన్ తన కెబినెట్ ను మరో సారి పునర్వ్యవస్థీకరిస్తారనే  టాక్ జోరందుకుంది. ఈ నేపథ్యలోనే ప్రసన్నకుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవిపై ఆశ ప్రసన్న కుమార్ రెడ్డిలోని  అసంతృప్తిని మింగేసిందని అంటున్నారు.