పవన్ బస్సు యాత్ర వాయిదా.. సినిమాల కోసమేనా అని జనసేన శ్రేణుల అనుమానం

మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనుకుంటారు.. అందుకే గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త హామీలతో ప్రజలను ఇట్టే మభ్యపెట్టేయచ్చనుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వయంగా మతి మరుపు ఎక్కువ.. ప్రతి రోజూ పుస్తకాలు చదువుతాను.. పుస్తకాలు ఉంటే నాకింకేం అక్కర్లేదు అనే ఆయన ఏ రోజు చదివింది ఆ రోజే మరచిపోతారేమో అని పించేలా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆయనకు తానో రాజకీయ పార్టీ అధినేతను అన్న సంగతి కేవలం వీకెండ్ లోనే గుర్తుకు వస్తుందా అన్న అనుమానం జన బాహుల్యంలో కలిగే విధంగా ఆయన కేవలం ఆదివారాలు (వీకెండ్)లో మాత్రమే మాట్లాడతారు. అదీ గత వారం ఏ మాట్లాడారో మరచిపోయి అందుకు పూర్తిగా భిన్నంగా తదుపరి వారం మాట్లాడతారు. సరిగ్గా ఈ విషయం మీదే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని జనసేనానిని విమర్శలతో ఓ ఆట ఆడుకున్నారు.  తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత చాలా కాలం పాటు కేవలం సినిమాలే జీవితం అన్నట్లుగా బతికేసి ఆ తరువాత తీరిగ్గా జనసేనను స్థాపించారు. 2019 ఎన్నికలలో అధికారమే లక్ష్యం అంటూ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి  పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. సరే ఆ తరువాత ఏం జ్ణానోదయం అయ్యిందో ఏమో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. మొన్నీ మధ్య తన అన్న చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించి ఉండేదని అన్నారు. తన అన్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాలలో ఉన్న వారే కారణమనీ, వారి తప్పుడు సలహాలతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారనీ సూత్రీకరించారు. ఆ విషయం మరచిపోయారో ఏమో తాజాగా తన అన్న చిరంజీవి రాజకీయంగా తప్పులు చేశారనీ, కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి ద్రోహిగా మారారనీ అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఈ విషయాన్ని పేర్ని నాని  2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున  తనతోపాటు 18 స్థానాలు గెలిపించుకుకున్న చిరంజీవి..  ఆ తరువాత వాస్తవం అర్ధం చేసుకుని రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారనీ, అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ లా రోజుకో పార్టీ, పూటకో సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి  వరదలు వస్తే బాధితులకు అండగా నిలబడ్డారు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆ పార్టీ యువ నేతగా పవన్ కల్యాణ్ ఒకటి రెండు సభలలో ప్రసంగాలకే పరిమితమయ్యారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీకి కనీసం రాజీనామా కూడా చేయకుండా సినిమాలంటూ రాజకీయ తెర మీద నుంచి అదృశ్యమయ్యారని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఆ విషయాలన్నీ విశ్మరించి ఇప్పుడు వైసీపీ ఇన్ని సీట్లకే పరిమితమౌతుందంటూ చిలక జోస్యం చెప్పడమేమిటని విరుచుకుపడ్డారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఎన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడుతుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని విమర్శించారని కాదు కానీ, అసలు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా స్థిరత్వం ప్రదర్శిస్తున్నారా అన్ని జనసేన శ్రేణుల్లోనే సందేహం వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అందరి కంటే ముందు పోత్తు ఊసెత్తిన పవన్ కల్యాణ్ ఇప్పుడా మాట విస్మరించి ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. దసరాకు బస్సు యాత్ర అని ఘనంగా ప్రకటించి ఇప్పుడు వాయిదా వేయడానికి కారణాలే ఎందుకు చెప్పడం లేదని అంతర్గత చర్చల్లో మధన పడుతున్నారు. ఆయనకు రాజకీయాలు పార్ట్ టైమ్ లా ఉన్నాయనీ, ఫుల్ టైమ్ ప్రొఫెషన్ సినీమాలేనని అంటున్నారు. ఇప్పుుడ బస్సు యాత్ర వాయిదాకు కూడా సినిమా షూటింగులే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. 

 ఎడ్ల‌బ‌ళ్ల‌ను లాగుతూ టీడీపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

ఏపీలో రైతుస‌మ‌స్య‌ల్ని ప్ర‌భుత్వం పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ప్ర‌ధాని విప‌క్షం తెలుగుదేశం భారీ ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టింది. సోమ‌వారం అసెంబ్లీ వ‌ద్ద కూడా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ నాయ క‌త్వంలో టిడిపి శాస‌న‌స‌భ ప‌క్షం నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించింది. అయితే వారంతా ఎడ్ల‌బండ్ల మీద వ‌చ్చి నిర‌స‌న‌కు దిగ‌డం ప‌ట్ల పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయినా వారిని ప‌ట్టించు కోకుండా నినాదాలు చూస్తూ ప్ర‌భుత్వం ప‌ట్ల విముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న ర్యాలీపై పోలీసులు ఆంక్ష‌లు పెట్టడంతో బండ్లు నిలిపివేశారు. ఎడ్ల‌బ‌ళ్ల‌ను పోలీసులు తీసికెళ్లారు. తెలుగుదేశం ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీ లు తూళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకుని అక్క‌డ కూడా నిర‌స‌నకు దిగారు. అక్క‌డి నుంచి ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు ఎడ్లు లేకుండానే కాడ తామే స్వ‌యంగా త‌గిలించు కుని మ‌రీ రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు.  ఈ సందర్భంగా తెదేపా శాసనసభ పక్షఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న కోటరీ వల్లే రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మూడేళ్లుగా వ్యవ సాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. మూగజీవాల్ని పోలీసులు తరమటం దుర్మార్గమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎడ్లను పోలీసులు తీసుకెళ్లడంపై పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఎడ్లబండి కాడె  మోస్తూ అసెంబ్లీ కి లోకేష్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసు వలయాన్ని తోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకూ ఎడ్ల బండిని నేతలు లాక్కుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారన్నారు. రైతుపై చెయ్యి చేసుకున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతును కొట్టిన అంశంపై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామన్నారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యల వల్లే  పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు  మండిపడ్డారు. 

ఏసీబీ అధికారుల‌ను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే అనుచ‌రులు

పార్టీకి అప్ర‌తిష్ట‌తెచ్చే ప‌నులు చేసిన‌పుడు, అవినీతిలో కూరుకున్న‌పుడు ఎవ‌రో ఒక‌రు హెచ్చరించ‌క‌ పోరు. మితిమీరిన‌పుడు సామా న్యుడైనా, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే అయినా ఏసీబీకి ఒక‌టే. అవినీతి నిరోధ‌క శాఖ దృష్టిలో అంద‌రూ స‌మాన‌మే. త‌ప్పు చేసి దొరికిన‌పుడు సోదాల‌కు, త‌నిఖీ ల‌కు వ‌చ్చిన అధికారికి స‌హాయ ప‌డ‌ట‌మే మంచిది. మా ఇంటికే వ‌స్తారా.. అంటూ విర్ర‌వీగితే ప్ర‌తిష్ట గంగ‌ లో క‌లిసిన‌ట్టే. ఇపుడు ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లాఖాన్ ప‌రిస్థితి ఇదే.  అవినీతి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ  ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌  నివాసాలపై అవినీతి నిరోధక విభా గం  అధికారుల దాడుల సమయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ నెల 16న ఏసీబీ దాడులు జరిపిన సందర్భంలో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ మద్దతుదారులు ఏసీబీ అధికారి పై చేయి చేసుకున్నారు. సదరు అధికారితో దురుసుగా ప్రవర్తించడమే కాక దుర్భాషలాడారు.  అమానతుల్లాఖాన్‌ నివాసానికి సమీపం నుంచి ఏసీబీ అధికారిని దూరంగా తోసుకుంటూ వెళ్లిపోయారు. ఘటనపై ఏసీబీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో ఉండగా ఏసీబీ అధికారిపై దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది. విధుల్లో ఉన్న అధికా రులపై మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారులు యత్ని స్తున్నారు.    రెండేళ్ల క్రితం ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ ఢిల్లీ వక్ఫ్ బోర్డు  ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు నిబంధన లను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా నియమించారని ఆరోపణలున్నాయి. పైగా వక్ఫ్‌ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన నివాసా లు, సన్ని హితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. రెండు పిస్తోళ్లు, తూటాలు, రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డే ...భార‌త్‌ను గెలిపించిన మంధాన‌, హ‌ర్మ‌న్ 

హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన 91 పరుగుల బ్యాటింగ్ హోరు  హర్మన్‌ప్రీత్ కౌర్ అజే యంగా 74 పరుగులు చేయడంతో భారత మహిళలు ఇంగ్లండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. మంధాన, హర్మన్‌ప్రీత్ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించి 228 పరుగుల ఛేదనలో భారత్ ఎప్పుడూ డ్రైవింగ్ సీట్లో ఉండేలా చూసుకున్నారు. అంతకుముందు షఫాలీ వర్మ వికెట్ కోల్పోయిన తర్వాత మం ధాన, యాస్తిక భాటియా భారత్‌ను ఆదుకున్నారు. భాటియా 50 పరుగుల వద్ద పడిపోయాడు  కెప్టెన్ హర్మన్ ప్రీత్ మంధానతో కలిసి మిడిల్‌కి వచ్చాడు,  ఇద్దరూ తృటిలో సెంచరీని  కోల్పో యినప్పటికీ, ఇద్దరూ మ్యాచ్ను ఇంగ్లాండ్ కు దూరం చేశారు.  హర్మన్‌ప్రీత్ తన హాఫ్ సెంచరీని కొట్టి, భారత్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసింది  సరిగ్గానే, విజయవంతమైన సిక్స్‌ను కొట్టింది. ఇంగ్లండ్‌ స్కోరు 227/7. భారత్ తరఫున దీప్తి శర్మ రెండు వికెట్లు తీయ గా, మేఘనా సింగ్, ఝులన్ గోస్వామి, స్నేహ రాణా, హర్లీన్ డియోల్, రాజేశ్వరి గయక్వాడ్  తలో వికెట్ తీశారు. మరోవైపు, ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ అజేయంగా 50 పరుగులతో నాక్   డానియెల్ వ్యాట్ నుండి 43 పరుగులతో ఇంగ్లాండ్‌ను క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ  గౌరవప్రదమైన స్కోరు కు తీసుకె ళ్లడంలో కీల‌క‌ పాత్ర పోషించారు. మరోవైపు ఇంగ్లండ్ మహిళలు తమ కోసం ఎలా ముగించారో సంతోషంగా ఉంటుంది. ఒక దశలో 200 కాస్త దూరం అనిపించినా, మిడిల్ ఆర్డర్ బాగానే 200 మార్కును అధిగమించేలా చేసింది. డాని వ్యాట్ మరియు ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ ఇద్దరు బ్యాటర్లు ఇంగ్లండ్ ఉమెన్‌లను సమాన స్థాయికి తీసుకు రావడానికి ప్రధాన బాధ్యత వహించారు. డాని వ్యాట్ 43 పరుగులతో రాణించినప్పటికీ, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్ చివరి వరకు ఉండి తన తొలి హాఫ్-టన్ను సాధించారు. సోఫీ ఎక్లెస్‌స్టోన్ , షార్లెట్ డీన్ కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆడారు. చివరికి ఇంగ్లండ్ మహిళలు 227 స్కోరును సాధించడంలో సహాయ పడింది. వారు ప్రస్తుతం తమ బౌలర్‌లకు బౌలింగ్ చేయడానికి కొంత ఇచ్చారు. వారు ఈ లక్ష్యా న్ని కాపాడుకోగలరా? మేము కను గొంటాము.  ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించింది. వారి పేసర్లు పరిస్థితులను సరిగ్గా ఉపయోగించారు మరియు ఇంగ్లీష్ ఓపెనర్లను వరుసగా అవుట్ చేశారు. వారు దానిని సద్వినియోగంచు కున్నారు.  27వ ఓవర్ ముగిసే సమయానికి 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. అయినప్పటికీ, వారు చివరివరకు వేగంగా వికెట్లు సాధించలేకపోయారు మరియు ఇంగ్లాండ్‌ను కొన్ని భాగస్వామ్యాలతో దూరం చేయలేకపోయారు. కానీ మొత్తంమీద ఇది బౌలర్ల నుండి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రద ర్శన. భారత మహిళలు ఈ సిరీస్‌లో  మ‌రింత ధాటిగా ఆడి  సిరీస్‌లో ముందంజ వేసే అవకాశాలను కోరు కుందాం.

వైఎస్ ది హత్య.. నా ప్రాణాలకూ ముప్పు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆమెది పరిచయం అక్కర్లేని పేరు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలైన సందర్భంగా జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె చేసిన పాదయాత్ర, ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలూ అప్పట్లో ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి, ఆకట్టుకున్నాయి. ఏపీలో 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి అధికారంలోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా ఓ కారణం అని అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆ తరువాత కారణా లేమైనా ఆమెకు ఏపీ సీఎం జగన్ కూ మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె ఆంధ్రను వదిలేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు. ప్రజా సమస్యలపై  నిరంతర యాత్రలలో ఆమె జనం మధ్యే ఉంటున్నారని చెప్పాలి. అయితే తెలంగాణలో ఆమె యాత్రను అసలెవరైనా పట్టించుకుంటున్నారా? అంటే అనుమానమే. తీవ్ర పదజాలంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై చేస్తున్న విమర్శలకు ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఆమెపై చర్యలు తీసకోవాలంటూ మంత్రులు తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అదేమంత పెద్ద విషయంగా ప్రజలెవరూ భావించలేదు. అయితే ఇప్పడు ఆమె గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే..తాజాగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాదని బాంబు పేల్చారు.  హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది  ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదంటూ ఆయన కుమార్తె, వైఎస్సార్ టీపీ అదినేత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా సంచలనం రేపాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి, జగన్ ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, తద్వారా వచ్చిన సానుభూతే కారణమని పరిశీలకులు అంటారు. ఇప్పుడు అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల తన తండ్రి మరణం అనుమానాస్పద స్థితిలో సంభవించిందంటూ చేసిన వ్యాఖ్యలు మామూలుగా తీసుకోవడానికి వీల్లేదు. కేవలం తన సోదరుడిలా తన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించు కోవాలని ఆమె భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో తన సోదరుడికి కలిసి వచ్చిన ఈ సెంటిమెంట్ తెలంగాణలో తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ హెలికాప్టర్ వెనుక కుట్ర ఉందని చెప్పిన షర్మిల తన ప్రాణాలకూ ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయితే   వైఎస్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం ఆయన పిల్లలైన జగన్, షర్మిలలకు ఇదే మొదటి సారి కాదు.   గతంలో   ఏపీలో ప్రచార సమయంలో జగన్, షర్మిలలు రిలయన్స్ పై ఇటువంటి  ఆరోపణలే చేశాడు. అప్పట్లో రిలయన్స్ షోరూలంపై దాడులు కూడా జరిగిన సంగతి విదితమే. ఇంత కాలం తరువాత ఇప్పుడు ఇప్పుడు మళ్లీ షర్మిల మళ్లీ తన తండ్రి మరణం వెనుక కుట్ర.. ఆయనది హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఆమె పార్టీని కానీ, ఆమె యాత్రను కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడమే కారణమని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2 వేల కిలోమీటర్లు నడిచినా (పాదయాత్ర) ఫలితం లేకపోవడం.. ప్రజలే కాదు.. పార్టీలూ పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ అధినేత, నేతలను తీవ్ర పదజాలంతో విమర్శించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో    షర్మిల సంచలనం కోసం, గుర్తింపు కోసం వైఎస్ మరణం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారంటున్నారు.  వైఎస్ఆర్ ను చంపారని.. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని  ఆరోపణలు చేశారు.   

చైతన్య కాలేజీ విషయంలో ఒకలా.. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరోలా!

 ఏపీలో జగన్ సర్కార్ ఇష్టారాజ్యం నడుస్తోంది. చట్టాలు, నిబంధనలనూ పట్టించుకోకుండా అసమదీయుల విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోకలా వ్యవహరించడం పరిపాటి అయిపోయింది. వడ్డించే వాడు మనవాడైతే  పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్నది నానుడి.. జగన్ పాలనలో దానిని మార్చి నేరం చేసిన వాడు మనవాడైతే ఫర్లేదు వదిలేయండి అన్నట్లుగా మార్చుకోవలసిన అవసరం కనబడుతోంది. విజయవాడ చైతన్య కాలేజీలో ఓ టీచర్ విద్యార్థిని కొడుతున్ వీడియో ఒకటి బయటపడగానే జగన్ సర్కార్ ఆఘమేఘాలపై స్పందించింది. కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. దాడి చేసిన లెక్చరర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు ప్రకటించేసింది. విద్యార్థిని దారుణంగా కొట్టిన లెచ్చరర్ పై చర్యలు తీసుకోవాలన్న జగన్ సర్కార్ ను, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరును కచ్చితంగా స్వాగతించాల్సిందే. అదే సమయంలో అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిపోయిన వైసీసీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో సర్కార్ ఈ వేగంతో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చర్యల సంగతి దేముడెరుగు.. అసలు ఆయనను సమర్థిస్తూ వైసీపీ రంగంలోకి దిగి.. ఆరోపణలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి పాల్పడడమేమిటని నిలదీస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సదరు కాలేజీలో లెచ్చర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి కానీ, అతడి తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. కనీసం ఇంటర్ బోర్డు దృష్టికీ తీసుకు వెళ్లలేదు. కానీ వీడియో చూసి సర్కార్ కదిలిపోయింది. ఆ వీడియో ఫేకా, ఒరిజనలా అన్న మీమాంసే రాలేదు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించేసింది. ఆ వేగాన్నికచ్చితంగా అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో విషయంలో జగన్ సర్కార్ లో ఆ వేగం ఎందుకు కనిపించలేదు అని సామాజిక మాధ్యమం వేదికగడా నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఏమీ మామూలు మనిషి కారు. ఆయన ఓ ఎంపీ.. అందులోనూ అధికార పార్టీ ఎంపీ. అటువంటి వ్యక్తి సభ్య సమాజం ఏహ్యతతో ఉమ్మేసే లాంటి చర్యకు పాల్పడినప్పుడు... చర్య తీసుకోవలసింది పోయి.. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా మీడియా ఎదుట మాట్లాడడమేమిటి. పైగా గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ అని ఎవరూ అనే ధైర్యం చేయడం లేదు. తెలుగుదేశం నాయకులు అయితే అది ఒరిజనల్ వీడియోయే అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కూడా బయట పెట్టారు. ఎలాంటి ఫిర్యాదు, క్రాస్ చెకింగ్ లేకుండా విద్యార్థిని కొట్టాడన్న వీడియో ఆధారంగానే, విద్యారంగంపై  అచంచల విశ్వాసం, గౌరవంతో ఆ కేసును సుమోటోగా తీసుకుని, తానే స్వయంగా చర్యలకు దిగిన జగన్ సర్కార్.. తమ పార్టీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చట్టాన్ని లెక్కచేయకుండా మరీ తనంతట తాను చర్యల కొరడా ఝళిపించిన జగన్ సర్కారు  మిగిలిన కేసులలో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో ఎందుకు ఇంత చైతన్యరహితంగా ఉందని నెటిజన్లు నిలదీస్తున్నారు. వైసీపీ ఎంపీ మాధవ్  అసభ్య వీడియోకు సంబంధించి మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా మహిళా నేతలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినా ఆయనపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోలేదు సరికదా.. మాధవ్ తరఫు వారు ఇచ్చిన ఫిర్యాదుపైనే మాధవ్ ను విమర్శించిన వారిపై కేసులు పెట్టారు. మరి మాధవ్ పై ఎందుకు కేసు పెట్టలేదంటే.. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని బదులిస్తున్నారు.  మరి చైతన్య కాలేజీ సంఘటనపై ఫిర్యాదు చేసిన వారెవరు? ఎవరూ లేకపోతే మరి ఫిర్యాదు లేకుండా ఎందుకు కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారు అని సామాన్య జనం నిలదీస్తున్నారు.  

రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు.. తీర్మానాలు చేస్తున్న పీసీసీలు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. ఆ పార్టీలో ఖంగారు, అయోమయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబం ఆవలి వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేకుండా పార్టీ అధిష్టానం ఒక్కటొక్కటిగా పావులు కదుపుతోంది. ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పార్టీ అధ్యక్ష నియామక బాధ్యతలు తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ తీర్మానాలు చేయాలని హైకమాండ్ పీసీసీలు, డీసీసీలకు స్పష్టమైన సంకేతాలిచ్చిన  సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలూ పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీయే చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. అలాగే ఛత్తీస్ గఢ్ కూడా అదే దారిలో నడిచింది. రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని మరో సారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని ఛత్తీస్ గఢ్ సీఎం బూపేష్ బఘేల్ అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీనే అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని తీర్మానాలు చేశాయి,  మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇదే విధంమైన డిమాండ్లు, తీర్మానాలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏదో విధంగా ఒత్తిడి తీసుకువచ్చైనా రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేలా చేయాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తున్నది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల పార్టీ కమిటీలూ రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి.  ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ బిజీగా ఉన్న సంగతి విదితమే. ఐదు నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగి కాశ్మీర్ లో ముగుస్తుంది.ఇదిలా ఉంటే అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 22న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8 అని.. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. అంతకు ముందు 2017లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ.. 2019 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగారు. 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవి చేపట్టే విషయమై రాహుల్ గాంధీని విలేకరులు ప్రశ్నించిన సందర్భంగా రాహుల్ గాంధీ సూటిగా సమాధానం చెప్పలేదు. పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో సుముఖతనూ వ్యక్తం చేయలేదు. అలాగని వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. మీరే చూస్తారుగా అంటూ సస్పెన్స్ మెయిన్ టైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే  కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే  కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి, కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది.అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు. అదలా ఉంటే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరోమారు తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు  గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూ సమావేశంలో తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు.  అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు.  మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సదిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్  నాయకుడు గులాంనబీ ఆజాద్, ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి  సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగా బలహీనమైందని, మండి పడుతున్నారు. నిజానికి, వాస్తవానికి రాహుల్ గాంధీ  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారథ్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ, నిన్న(శుక్రవారం) విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, సస్పెన్సు కొనసాగించారు. అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎప్పుడోనే  నిర్ణయం తీసేసుకున్నను ఈ విషయంలో నాకెలాంటి అయోమయమూ లేదు. అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి  అంటూ, అటూ ఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఒకవేళ తాను పోటీ చేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాననీ సమాధానం ఇచ్చి సస్పెన్స్ కొనసాగేందుకు అవకాశమిచ్చారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ సమాధానంతో మీడియాయే కాదు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన ఔనన్నారా, కాదన్నారా అర్ధం కాక అయోమయంలో పడ్డాయి. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా?  లేదని సరిపుచ్చుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.  అదలా ఉంటే రాహుల గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా  ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.

తైవాన్ లో కంపించిన భూమి.. కుప్పకూలిన భవనాలు

 తైవాన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.8గా నమోదంది. పలు భవనాలు కుప్పకూలాయి. రైళ్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. టైటుంగ్ కౌంటీలో సంభవించి ఈ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగుతు తీశారు. అంతకు ముందు కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. ముందు సంభవించిన భూ కంప తీవ్రత 6.4కాగా, 24 గంటల వ్యవధిలో మరో సారి భూమి కింపించిందని వివరించారు.భవన శిధిలాల కింద చిక్కుకున్న పలువురిని అధికారులు రక్షించారు. కాగా భూకంపం కారణంగా భవనాలు కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. అలాగే బ్రిడ్జి కుప్పకూలడంతో పలువురు గాయపడ్డారు. పలు రైళ్లు పట్టాలు తప్పాయి. రైల్వే స్టేషన్లలో నిలిపి ఉన్న రైళ్లు అట్టబొమ్మల్లా ఊగిసలాడాయి. ఆస్తి నష్టం వివరాలు అందాల్సి ఉంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

మాతోనే ఉండు చెల్లీ..!

ఒక ధ‌నికుడు, పోనీ వ్యాపారి ఒక మ‌హాన‌గ‌రానికి వెళ‌తాడు. అక్క‌డో మ‌హిళ ప్రేమ‌లో ఊహించ‌నివిధంగా ప‌డ‌తాడు. ఆమెను అక్క‌డే పెళ్లాడ‌తాడు. కొద్దిరోజుల‌కు ఇంటికీ తీసుకువ‌స్తాడు.. అప్ప‌టికే పిల్ల‌తో ఆడుతున్న అత‌గాడి భార్య చూసి ఆశ్చ‌ర్య‌పో తుంది. మెల్ల‌గా వివ‌రిస్తాడాయ‌న‌. మెలోడ్రామా అయ్యాక‌..సంగ‌తి తెలిసి, మ‌న‌సు పెద్ద‌ది చేసుకుని.. పోనీ మాతోనే ఉండిపో చెల్లీ.. అంటుంది అప్ప‌టికే కొంగు మొత్తం క‌న్నీళ్ల‌తో త‌డిపేసుకున్న గృహిణి.. ఇదే అనాదిగా సినిమాల దృశ్యం. స‌రిగ్గా ఇలాంటిదే ఒరిస్సాలో రిపీట్ అయింది.   32 ఏళ్ల వ్యక్తి, రెండేళ్ల పాప తండ్రి, ఒక ట్రాన్స్ వుమన్‌తో ఒక సంవత్సరం పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త, అతని ప్రేమికుడి కలయికకు సంతోషంగా అంగీకరించింది. ఆమె వారిని క‌లిసే ఉండడానికి కూడా అనుమతించింది. అయితే, ఈ చర్యలకు చట్టపరమైన ఆంక్షలు లేవు. ఒరిస్సా నార్లలోని ఓ దేవాలయంలో పరిసర ప్రాంతాలలోని ట్రాన్స్ కమ్యూనిటీ సమక్షంలో నిరాడంబరమైన కార్యక్రమంలో వివా హం కూడా జరిగింది. సెబకారీ కిన్నర్ మహాసంఘ అధ్యక్షురాలు కామిని వివాహ నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. ఒక బిడ్డ భార్యతో ఉన్న వ్యక్తి తాను ప్రేమిస్తున్న ట్రాన్స్‌వుమన్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుండి ట్రాన్స్ కమ్యూ నిటీకి ఇది అసాధారణమైన సంఘటన. హిందూ ఆచారాల ప్రకారం, మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు చేయబడే వరకు రెండవ వివాహం చట్టబద్ధం కాదని తనకు తెలుసునని కామిని చెప్పారు. అయితే ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.   ఇద్దరు భాగస్వాముల కోరిక, భార్య సమ్మతి ఈ అరుదైన 'వివాహానికి' దారితీసింది. లింగమార్పిడి సంఘంలోని సభ్యులందరూ కూడా వారికి రెండవ ఆలోచనలు ఉన్నాయా అని వారిని పదే పదే అడిగారు. వారికి లిఖితపూర్వకంగా తెలియజేయడానికి తాము కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లాము, కాని వారు ఈ విషయంతో తమకు పెద్దగా సంబంధం లేదని చెప్పారని ట్రాన్స్‌జండ‌ర్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అన్నారు. అయితే, నార్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రకారం, వివాహానికి సంబంధించి ఎవరైనా మూడవ వ్యక్తికి ఫిర్యాదు చేస్తే, ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఒడిశా హైకోర్టులో పనిచేస్తున్న ఒక న్యాయవాది ప్రకారం, మొదటి వివాహం రద్దు చేయబడకపోతే, రెండవది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించబడదు. ఈ సంబంధాన్ని లివ్-ఇన్ లేదా వివాహేతర సంబంధం అని పిలవవచ్చని, అయితే దానిని వివాహం అని పిలవలేమని చెప్పింది. అయితే, కొత్త జంటకు వారి పరిస్థితికి ఇబ్బంది లేదు. వారి ప్రకారం, వారిలో ముగ్గురు ఒకే పైకప్పు క్రింద సంతోషంగా జీవిస్తున్నారని మరియు అదే విధంగా ఉండాలని కోరు కుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ ఐఏ సోదాలు

ఇది క‌నీవినీ ఎరుగ‌నిది. సాధార‌ ణంగా ఉగ్ర‌కార్య‌క‌లాపాలు అన‌ గానే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ లేదా ఇటు ద‌క్షిణాదిన హైద‌రా బాద్‌తో సంబంధాల గురించే వార్త‌లు వస్తుంటాయి, ఎన్ ఐఏ సోదాలు భారీ ఎత్తున చేప‌ట్ట‌డం జ‌రుగు తూంటుంది. కానీ మొద‌టిసారి గా ఆంధ్రా, తెలంగాణా జిల్లా ల్లోనూ సోదాలు చేప‌ట్ట‌డం విం టున్నాం.  తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్య కలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు  నిర్వహిస్తోంది. నిజామాబాద్, నిర్మల్‌, కడప, కర్నూలు, గుం టూరు జిల్లాల్లో దాడులు చేప ట్టింది. నిజామాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా..కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్‌ఐఏ సోదాలు చేస్తోంది. ఇప్పటికే పీఎఫ్‌ఐ  జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా ఇమ్రాన్, అబ్దుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిపై పోలీ సులు దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహి స్తోంది. మతకలహాలు సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. పీపుల్స్ఫ్రంట్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐ సంబంధాలపై విచారణ నిర్వహి స్తున్నారు. ఒక్క నిజామాబాద్‌లోనే 28 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో అబ్ధుల్ ఖాదీర్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేసి 200 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు గుర్తించారు. కేరళ, ఢిల్లీ, కర్ణాటకలతో కూడా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అదేవిధంగా నిర్మల్ జిల్లా బైంసాలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మదీనా కాలనీలో అధికారులు సోదాలు చేపడుతున్నారు. రాత్రి మూడు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పీపుల్స్ ఫ్రంట్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించి అనుమానితులను అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పోలీసులు సుప్రీం ఆదేశాలు పాటించ‌మ‌నండి...సీఎస్‌కు టీడీపీ విన‌తి

అక్రమంగా అరెస్ట్, లాకప్డెత్, కోర్టుకు హాజరుపరచకుండా నిర్బంధించి హింసించటం..ఇలా పోలీస్ శాఖపై ఎన్నో సందర్భాల్లో ఆరోపణలు చూశాం..చూస్తూనే వున్నాం. విచారణ పేరుతో నింది తులకు చిత్రహింసలు, ఒక్కోసారి నిరపరాధులు కోర్టు మొహం చూడకుండానే పోలీస్ అతి మర్యాదలు, ఇలా కక్షపూరితంగా హింసించిన సందర్భాల్లో లాకప్ డెత్లు దానిపై విచారణలు కూడా జరిగాయి. పోలీస్ శాఖలో ఈ తరహా హింసను అరికట్టడా నికి ఎన్నోమార్గదర్శకాలు వెలు వడ్డా, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రావటంలేదని న్యాయ నిపుణు లు, మానవ హక్కుల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణ సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం వ్యవహరించేలా ఆదేశా లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ న్యాయ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ విభాగానికి చెందిన ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు ఒక లేఖ రాశారు.  రాష్ట్రంలో పోలీసులు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు అవసరం. నిందితు లను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు, సీఐడీ, ఏసీబీ సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది వేధింపులకు, శారీరక హింస కు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వేళ తలుపులు పగలగొట్టి మరీ అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. విచారణ పేరుతో అనుమానితులను చిత్రహింసలకు, భావోద్వేగ వేధింపులకు గురి చేస్తున్నారు. అనుమానితులకు చెందిన డెస్క్‌టాప్‌ కంప్యూ టర్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వంటి వాటిని దోచుకొంటున్నారు. తీసుకొన్న వస్తువుల వివరాలు దర్యాప్తు సమయంలో రికార్డుల్లో నమోదు చేయడం లేదు. విచారణ ప్రదేశాల్లో సీసీ కెమేరాలు పెట్టడం లేదు. దర్యాప్తు సంస్థల అధికారులు, సిబ్బంది వారి శాఖకు, హోదాకు సంబంధించిన బ్యాడ్జీలు పెట్టుకోవడం లేదు. ఇటువంటి చర్యలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. అనుమానితులను విచారంచే ముందు దర్యాప్తు సంస్థల అధికా రులు, సిబ్బంది తమ పేరు, హోదా తెలిపే బ్యాడ్జీలు తప్పనిసరిగా ధరించాలి. కోర్టు ఆదేశాలకు కట్టుబడి విచారణ ప్రదేశంలో సీసీ  కెమేరాలు అమర్చాలి. విచారణ దృశ్యాలు రికార్డు చేయాలి. పోలీస్‌ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల వద్ద తప్పని సరిగా సీసీ కెమేరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.   పోలీసులపై వలసవాద ముద్ర తొలగిపోవడం లేదు. వేధింపులను, అణచివేతలను వారు ఓ సాధనంగా ఇంకా ఉపయోగిస్తు న్నారు. అరెస్టు చేసే అధికారాన్ని వినియోగించడంలో పోలీసుల అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసుల అవినీతికి అరెస్ట్ అనేది లాభదాయకమైన వనరుగా మారిపోయింద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది.   పోలీసుల అధికార దుర్వినియోగా నికి అడ్డుకట్ట వేయకపోవడం మేజిస్ట్రేట్ ల వైఫల్యం. నిందితుడిని ముందుగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతా విషయాలను పరిశీ లించడం సరికాదు. అరెస్ట్ సమయంలో సెక్షన్​41 నిబంధనలను సరిగ్గా పాటిస్తే  ముందస్తు బెయిల్ కోసం వచ్చే వారి సంఖ్య గణ నీయంగా తగ్గుతుంది. యాంత్రికంగా రిమాండ్ చేయడం మేజిస్ట్రేట్ లకు తగని పని. అరెస్ట్ అధికారాన్ని వాడే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక క్రమం మధ్య సమతుల్యతను పాటించాలి. అరెస్టు వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. స్వేచ్ఛ ను కోల్పోతాడు. అతనిపై పడిన అరెస్టు మచ్చ జీవితాంతం కొనసాగుతుంది. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప అరెస్ట్ అధి కారాన్ని ఉపయోగించకూడదు. కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో సత్యం ఉందని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు అరెస్టు చేయవచ్చు. అయితే ఆ నేరం కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడం చట్టబద్ధం కాదు. అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తయితే, దానికి న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు. ఆరోపణలు రాగానే వ్యక్తులను అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయడానికి ముందు పోలీస్ అధికారి తనని తాను ప్రశ్నించుకోవాలి. అరెస్టు ఎందుకు చేయాలి? నిజంగా అవసరమా ? ఏ ప్రయోజనం కోసం అది ఉపయోగపడుతుంది ? ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ? ఈ ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు దొరికిన తర్వాత ఒకటి రెండు కారణాలు సంతృప్తికరంగా అనిపిస్తే అరెస్టు అధికారాన్ని ఉపయోగించాలి. ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడేండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసులకు సంతృప్తి కలిగినప్పుడు కూడా అరెస్టు చేసే అధికారం లేదు. ఆ వ్యక్తి తిరిగి నేరం చేయకుండా నిరోధించడానికి, అరెస్టు తప్పనిసరని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు, కేసును సరైన దిశలో దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాన్ని ఆ వ్యక్తి అదృశ్యం, తారుమారు చేయకుండా ఉండటానికి, ఇతర  నేరాలు చేయకుండా ఉండటానికి అరెస్టు చేయవచ్చు. ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా భవిష్యత్తులో కోర్టు ముందు హాజరు పరచలేమని భావించినప్పుడు కూడా అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కారణాలని పోలీస్ అధికారి రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

మోదీజీ ... ఇది  మీకు త‌గునా!

పిల్ల‌వాడి పుట్టిన‌రోజు. పక్కింటి పిన్నిగారు, మామ్మ‌గారుతో పాటు అంతా వ‌చ్చారు. పిల్ల‌డికి కేక్ తినిపించారు. మీవాడు  బా వుంటాడు, బాగా అల్ల‌రి చేస్తాడు అంటూ తోటి అమ్మ‌ల‌క్క‌లంతా ఆ పిల్ల‌వాడి త‌ల్లికి చెబుతూనే కాస్తంత కంట్రోల్‌లో  పెట్టుకో మ్మా.. మ‌రీ బాగుంటది అనీ చిన్న‌గా వాడి బుగ్గ గ‌ల్లి మ‌రీ వెళ్లారు. ఇలా ఉంది మోదీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం. ఆవేశం, ఆగ్ర‌హం, దూకుడు.. ఎక్క‌డ చూపించాలో, ఆయా సందర్భాల్లో అక్క‌డే ప్ర‌ద‌ర్శంచాలి. కేవ‌లం ప్ర‌శాంతంగా ఉన్న‌చోట గొడ‌వ‌లు, విభేదాలు సృష్టించి త‌గుదున‌మ్మా అంటూ వ‌చ్చి ప్ర‌బోధ‌చేసి పాల‌కుడు మంచివాడు కాదంటూ ఉప‌న్యాసాలు దంచి  అధికారం చేజిక్కిం చుకునే కుయుక్తులు రాజ‌కీయంగా అంత మంచిది కాదు. ఇది చూచాయిగా బీజేపీ వారికి విప‌క్షాల‌న్నీ క‌లిసి బోధిస్తున్న బ్ర‌హ్మ సూత్రం. చిత్ర‌మేమంటే ఇది బీజేపీ వారికీ బాగా ఎరుకే. కాని పాటించ‌న‌వ‌స‌రం లేద‌న్న‌ది వారి నియ‌మం. దీని కి ఎవ‌రి నుంచి స‌మాధానం ఉండ‌దు. మూర్ఖ‌త్వం నిలువెల్లా ఉన్న‌ప్పుడు ఎవ‌రు చెప్పినా ఎక్క‌దంటారు పెద్ద‌లు. అదే పంథాలో మోదీ స‌ర్కార్ ప‌రుగులు పెడుతోంది, ఆవేశ‌ప‌డుతోంది.  పులుల‌తో ఫోటోలు, ప‌రుగులు కాకుండా కాస్తంత నిమ్మ‌ళంగా ఉండాలి. త‌మ పాల‌న లేని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాన్ని అమాంతం దింపేసి మ‌నోళ్ల‌ని పెట్టుకుని పాల‌న సాగించాల‌నుకోవ‌డ‌మే పొర‌పాటు. అన్నిచోట్లా ఇది సాగ‌దు. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ కులలో ఒకరిగా తరచు వార్తల్లో ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మహువ మొయిత్రా  శనివారంనాడు ఆయ నకు ఒక ట్వీట్లో పుట్టినరోజు శుభాకాంక్షలు   తెలి పారు. ఇదే సమయంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేగంగా అంతరించి పోతున్న రాజ్యాంగ రక్షణను ప్రస్తావించారు. గౌరవనీయులైన ప్రధానమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతరించి పోతున్న చిరుత పులుల విషయంలో ఏమి చేశారో అదే విధంగా అంతరించిపోతున్న రాజ్యాంగ విలువలను కూడా పునరుద్ధరించాలి అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యా స్త్రాలు సంధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. భగవంతుడు మీకు చిరాయువు ప్రసాదించాలి. ఈ దేశ యువతకు మీరు చాలా చేశారు. ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం జరుపుకోవడానికి ఇదో కారణం. ఈ దేశంలోని ప్రతి నిరుద్యోగి మీకు రుణ పడి ఉంటారని భారత జాతీయ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశిథరూర్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖమంత్రి కె.చంద్రశేఖరరావు తదితరులు ప్ర‌ధానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. కానీ కేక్ తినేముందు, శుభా కాంక్ష‌ల ట్వీట్ చ‌దివిన త‌ర్వాత కాస్తంత పాల‌నావ్య‌వ‌హారాల ప‌ద్ధ‌తిని స‌రిచూసుకోవాల‌న్న హెచ్చ‌రిక‌ను గుర్తుచేశారు.  ఇటీవ‌లి కాలంలో దేశంలో అంద‌రి వ్య‌వ‌హారాల్లోనూ త‌ల‌దూర్చి ఏదో ర‌హ‌స్యం క‌నుగుని ఈడీ,సిబిఐ అధికారుల‌ను గిల్లి మ‌రీ పంప‌డం బ‌తుకు గంద‌ర‌గోళం చేయ‌డం అనే ఆట‌లు బాగా ఆడుతున్నారు బీజీపీవారు. అవ‌త‌లివాడిని గిల్లి ఆనందించే స్కూలు స్థాయి ఆనందం వారికి ఇంకా పోలేదు. ఇద్ద‌రి మ‌ధ్య గిల్లికజ్జాలు పెట్టి అధికారం చేజిక్కించుకునే నైజం బాగా ప్ర‌ద‌ర్శిస్తు న్నారు. అంతే త‌ప్ప దేశ ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల ఆర్ధిక‌, సామాజిక‌, విద్యా,ఉద్యోగ రంగాల్లో ప‌రిస్థితుల‌ను అంత‌గా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి తోడు విదేశీ సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయ‌ని బీజేపీ వందిమాగ‌దుల బాకాలు చెవికి ఇంపుగా ఉంటే మోదీ నిద్రిస్తున్నార‌న్న‌ది అంద‌రికీ అర్ధ‌మైంది.  తాజాగా షాంగైలో జ‌రుగుతున్న ఎస్‌సీఎస్ స‌ద‌స్సులో ఆయ‌న చైనా, పాక్ నేత‌ల‌తో ఎడ‌మొగం పెడ‌మొగంగానే వ్య‌వ‌హ‌రిం చారు. కార‌ణం వారిద్ద‌రు దేశానికి ప‌క్క‌లో బ‌ల్లెలుగా మారార‌ని. కానీ దేశంలో ప్ర‌జ‌ల‌తో మాత్రం అబ్బే వారు మ‌న‌కు మంచి మిత్రులే అంటూంటారు. చైనా వ్య‌వ‌హార‌మే తీసుకుందాం.. పైకి దొంగ న‌వ్వులు న‌వ్వుతూనే స‌రిహ‌ద్దుల్లో ఆక్ర‌మ‌ణ‌లు చేస్తూనే ఉన్నారు, సైనిక విన్యాసాలూ సాగిస్తున్నారు. ప్ర‌ధాని మోదీకి మాత్రం అదేదో బ‌చ్చన్ సినిమాలా అనిపిస్తోంది.  తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో సైనికులు ఘర్షణ పడినప్పుడు మే ప్రారంభంలో భారత్ , చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్త తలు మరింత హింసాత్మకంగా మారాయి. దేశం ఒక కమాండింగ్ అధికారితో సహా 20 మంది సైనికులను కోల్పోయింది. 45 ఏళ్ల తర్వాత చైనాతో జరిగిన మొదటి హింసాత్మక ఘర్షణ తర్వాత మరో వైపు కూడా ప్రాణాలు కోల్పోయారని భారత సైన్యం తెలిపింది. ప్ర‌పంచ వార్త‌ల్లో కరోనావైరస్ సంక్షోభం  ఆధిపత్యం చెలాయించినప్పటికీ, భార‌త్‌-చైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు ఒక నెలకు పైగా ముఖ్యాంశాలుగా మారాయి. సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇంతకుముందు కుదిరిన ఏకాభి ప్రాయం  చైనా నిర్ల‌క్ష్యం చేసినప్పటికీ, దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నిర్ధారించడానికి కట్టు బడి ఉన్నామని భారత్‌ తెలిపింది.

టీ-20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌...ష‌మీ ఔట్‌, ఉమేష్ ఇన్‌

టీమ్ ఇండియాకు మ‌రో షాక్‌. అస‌లే ఆల్‌రౌండ‌ర్ జ‌డేజా గాయాల‌తో జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. ఇపుడు పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ కోవిడ్ పాజిటివ్‌తో జ‌ట్టుకు దూరం కావ‌డం క్రికెట్ అభిమానుల‌ను ఇబ్బందిపెడుతుంది. ఇప్పటివరకు షమీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలడం గురించి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక ప్రక టన చేయ‌లేదు. కాగా, ష‌మీ స్థానంలో మ‌రో పేస‌ర్ ఉమేష్ యాద‌వ్‌ను తీసుకున్న‌ట్టు తెలిసింది.  ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచ కప్ 2022కి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20I సిరీస్ కోసం జట్టులో ఎంపికైన షమీ, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌ వేదిక మొహాలీకి ఇంకా చేరుకోలేదు. ఉమేష్ యాదవ్ తన ఐపీఎల్‌ కెరీర్‌లో చాలా స్థిరంగా ఉన్నాడు, గత క్యాష్ రిచ్ లీగ్ సీజన్ లో ఉమేష్ అత్యుత్తమ పవర్‌ప్లే బౌలర్ లలో ఒకడు, అతని ఎకా నమీ 7.06 తో 16 వికెట్లు పడగొట్టాడు. అతను రాయల్ లండన్ వన్డే కప్‌లో మిడిల్‌సెక్స్ కోసం చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండ టం అత‌ను మంచి ఫామ్ లో ఉండ‌టాన్ని తెలియ‌జేస్తుంది. ఈ కార‌ణంగానే ష‌మీ స్థానంలో టీమ్ ఇండియాలోకి మ‌ళ్లీ ఉమేష్ యాద‌వ్‌ను తీసుకున్నారు.  టీ-20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు నుండి తప్పుకున్న తర్వాత షమీకి ఈ సిరీస్ ముఖ్య మైనది, అయినప్పటికీ అతను స్టాండ్-బై ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. దాదాపు ఏడాది తర్వాత టీ20కి ఎంపికైన షమీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. అతను చివరిసారిగా నవంబర్ 2021లో యుఏఇ లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్‌లో T20I ఆడాడు, అతను ఐదు గేమ్‌లలో 140 పరుగులకు తక్కువ సిక్స్‌తో మరియు ఆ గేమ్‌లలో టోర్నమెంట్ ఎకానమీ రేటు 8.84తో ముగించాడు. టీ-20  ప్రపంచ కప్‌కు ముందు  పేస్ బౌల‌ర్‌గా షమీ ఫామ్‌ను పరిశీలించడం జట్టు మేనేజ్‌మెంట్‌కు అనువైనది, ఎందుకంటే అతను గత ఏడాది టీ-20 ప్రపంచ క‌ప్‌లోనూ త‌ను మంచి ఫామ్‌లో లేక‌పోవ‌డంతో ఆడ‌లేదు. అయితే,ఈ ఏడాది ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించినప్పటికీ, ఏ ఆటగాడికి ఏదైనా గాయం అయితే షమీకి జట్టులోకి వచ్చే అవకాశాలను పెంచేది - భారత ఫాస్ట్ బౌలర్‌కు సిరీస్ ముఖ్యమైనది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 I సిరీస్‌కు ముందు షమీ కోలుకుంటాడని సెలెక్టర్లు, భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆశించింది, ఇది వచ్చే నెల ప్రపంచ కప్‌కు ముందు అతని ఫామ్ గురించి వారికి కొంత ఆలోచన ఇస్తుంది. సెప్టెంబర్ 20, 2022 మంగళవారం జరగాల్సిన మొదటి టీ-20 కోసం ఇరు జట్లు మొహాలీ చేరుకున్న సంగతి తెలిసిందే.

సీమ సింహం బాలయ్య

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.   ఆ వ్యూహంలో భాగంగానే రాయలసీమ జల్లాల ఎన్నికల ప్రచార బాధ్యత హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.   బాలయ్య(బాలకృష్ణ)   ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అదీ కాక రాయలసీమ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆయన హీరోగా తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనన్న విషయం విదితమే. అలాగే సీమ జిల్లాల్లో బాలయ్యకు భారీగా అభిమానులు ఉన్న  సంగతి తెలిసిందే. అందుకే రాయలసీమలో టీడీపీకి బాలయ్య ప్రచారం పార్టీ విజయాన్ని నల్లేరుమీద బండి నడక చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే పార్టీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.   ఈ ప్రచారంలో   జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిన తీరు, అన్ని వర్గాల ప్రజలూ ఎలా ఇబ్బందులు పడుతున్నారు. అ పన్నుల రూపంలో జగన్ సర్కార్ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్న విధానం, ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జగన్ పాలనలో ప్రజలు పొందింది ఎంత.. పొగొట్టుకొంది ఎంత అనే అంశంతోపాటు జగన్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు బాలయ్య సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.    మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే.. జగన్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ..  బాదుడే బాదుడు కార్యక్రమంతోపాటు మినీ మహానాడులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇంకోవైపు టీడీపీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు సైతం నిర్వహిస్తున్నది. అలాగే హిందూపురం, మంగళగిరిలో ఇప్పటికే ఆరోగ్య రథాలు సైతం ప్రారంభమైనాయి. ఇలా ప్రజలకు ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువైంది. జగన్ దుర్మార్గ పాలన గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వైసీపీకి ప్రజలను దూరం చేయాలన్న వ్యూహంతా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే సీమ జిల్లాల ప్రచార బాధ్యతలను బాలయ్యకు అప్పగించాలని నిర్ణయించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలంతా విభేదాలను విడనాడి  ఏకతాటిపైకి వచ్చి ప్రజలతో మమేకమైతే  తెలుగుదేశం విజయం ఖాయమనీ, క్యాడర్, లీడర్ కలిసి సాగితే వచ్చే ఎన్నికలలో సైకిల్ స్పీడ్ కి తిరుగుండదని తెలుగుదేశం అధినేత పార్టీ నేతలకు ఉద్భోధిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  సైకిల్ స్పీడ్ చూస్తుంటే 2024 ఎన్నికలలో ఘన విజయం ఖాయమని పార్టీ క్యాడర్ ఉత్సాహంతో చెబుతోంది.

తెలంగాణ భారత్ లో లేదా?

తెలంగాణ ఏ దేశంలో ఉంది? .. ఇదేం ప్రశ్న ... అనుకోవచ్చును. కానీ, (విమోచనమో, విలీనమో పేరు ఏదైనా) తెలంగాణ ప్రాంత ప్రజలు స్వాతంత్రం పొంది 75 సంవత్సరాలు నిండిన తర్వాత, తొలి సారిగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారు, ఎవరి దారిన వారు వేడుకలను జరుపుకున్న తీరును చూస్తే, ఎవరికైనా, ఇదే అనుమానం వస్తుంది. రావాలి కూడా. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొరపొచ్చాలు, మాట పట్టింపులు, తూతూ ..మై మై విమర్శలు సహజం . కానీ, జాతీయ వేడుకల విషయాలోనూ గిల్లి కజ్జాలు పెట్టుకునే ధోరణి, చూస్తే, తెలంగాణ దేశంగా భావిస్తున్నారా అనే అనుమానం కలగడం కూడా అంతే సహజం అంటున్నారు. నిజానికి, నిజాం నవాబు అకృత్య పాలన అంతమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. అయినా ఇంకా ఆ బానిస మనస్తత్వం నుంచి పాలకులు బయటకు రాలేదు. అందుకే, ఉమ్మడి రాష్టంలో రాష్ట్రాన్ని పాలించిన పాలకులు, నిజాం నవాబ్ భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ ముందు తలవంచి లొంగిపోయిన సెప్టెంబర్ 17 న స్వాతంత్ర జెండాను సగౌరవంగా  ఎగరేసే సాహాసంచేయలేక పోయారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల దుర్నీతిని ఎండగట్టి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన/ విలీన దినోత్సవాని ఘనంగా నిర్వహిస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తెరాస పాలకులు,, ఎనిమిదేళ్ళు, ఆ ఉసే ఎత్తలేదు. ఉద్యనేతగా గర్జించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఎందుకు పిల్లి కూతలు కూశారు? ఎవరికి భయపడి దాసోహం అన్నారు? ఐదు వేల మంది ప్రాణాలొడ్డి ప్రసాదించిన. ‘తెలంగాణ స్వాతంత్ర ‘ దినాన్ని, జరిపే సాహసం ఎందుకు చేయలేక పోయారు? అవును, ఉద్యమ నేతగా గర్జించిన కేసీఆర్, ఈ ఎనిమిదేళ్ళు ఎందుకు తెలంగాణ స్వాతంత్ర దినాన్ని, ఎందుకు విస్మరించారో, ఎవరికీ భయపడి నోరు మెదపలేదో, వేరే చెప్పనక్కరలేదు. అది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఇప్పుడు అది కాదు ప్రశ్న ... ఇన్నేళ్ళకు  అయినా, కేంద్ర ప్రభుత్వం కదలికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా, జాతీయ సమైక్యత పేరున, తెలంగాణ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం  గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత మేలు. అయితే, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల విషయంలో  రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరు, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం కాదనే భావనతో ఉన్నారా? అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, అనుకోవాల్సి వస్తుందని అంటున్నారు.   కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి కాదంటే మరో మంత్రి రిసీవ్ చేకోవాలి, కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరూ కేంద్ర్ర మంత్రిని రిసీవ్ చేసుకోలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందుకు పోటీగా, సమాంతరంగా  మరో కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంత్రి ప్రతి రోజు ప్రవచించే, ఫెడరల్ స్పూర్తికే కాదు, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. ఇంకా కొంచెం గట్టిగా  రాజ్యంగం పట్ల అపచారం. ముఖ్యంగా జాతీయ స్పూర్తికి ప్రతీకగా  నిలిచే స్వతంత్ర దినోత్సవం, గానతంత్ర దినోత్సవం వంటి స్పూర్తి దాయక కార్యక్రమాల విషయంలో ఇలాటి,పోకడలు ఎ విధంగానూ సమర్ధనీయం కాదని విజ్ఞులు భావిస్తున్నారు, అదొకటి అలా ఉంటే, సికింద్రాబాద్ పరేడ్’ గ్రౌండ్’లో జరిగింది, బీజేపీ కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, కేంద్ర హోం మంత్రి మాత్రమే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సహా, అనేక మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపే సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎవరు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ర్రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం సీఎస్,డీజీపీనే కాదు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.ఇది ఒక విధంగా, రాజకీయ పరిభాషలో చెప్పాలంటే,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధులను బహిష్కరింఛి నట్లే అవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాజకీయ పరిబాషను పక్కన పెట్టి, అధికారిక పరిభాషలో చెప్పాలంటే, ‘ అధికారిక విధులకు గైర్హాజర్’ (డుమ్మా కొట్టడం) అంటారు. అంతే కాదు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి  రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకున్నా తీసుకోవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అదలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్, నిజాం నవాబు మైండ్ సెట్’ తో వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత,  నిజాం నవాబు, హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసేందుకు  ససేమిరా అన్నారు. బ్రిటీష్ పాలకులు పోతూ పోతూ, దేశంలోని 500లకు పైగా సంస్థానాలు భారత దేశంలో కలవాలా వద్దా అనేది వారే, నిర్ణయించుకోవాలని పుల్ల పెట్టి పోయారు. ఇదే సాకుగా తీసుకుని నిజాం నవాబు హైదరాబాద్ సంస్థానాన్నిపాకిస్థాన్’లో కలిపే ప్రయత్నం చేశారు.  కాదంటే, స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతామని  ప్రకటించారు.ఆ నేపధ్యంలోనే సర్దార్ పటేల్, ఆపరేషన్ పోలో నిర్విహించి నాలుగు రోజుల్లో నిజాం నవాబును కాళ్ళ బేరానికి తెచ్చారు. నవాబు రాక్షస పాలనా నుంచి తెలంగాణకు విమోచన కల్పించారు.  ఈ నేపధ్యంలో, తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం వ్యవహరించిన తీరు గమించిన వారు ముఖ్యమంత్రి కేసేఆర్, నిజాం నవాబు ఆలోచనలు తిరగ తోడుతున్నారా,అనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. నిజానికి, ఈ విషయంలోనే కాదు, ఆజాదీ కా అమృత మహోత్సవ్’ కార్యక్రమం విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా, ప్రత్యేకంగా సొంత కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.కేంద్రంలో అధికారంల ఉన్న బీజేపీతో, ప్రధాని నరేంద్ర మోడీతో  ముఖ్యమంత్రి కేసీఆర్’కు రాజకీయ విబేధాలు ఉంటే ఉండవచ్చును, కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని బేఖాతర్’ చేస్తానంటే మాత్రం, మళ్ళీ ఆపరేషన్ పోలో వంటి ఆపరేషన్’ అవసరం కావచ్చునని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషంలో, ఇదీ ధోరణి కొనసాగిస్తే రాష్ట్రంలో రాష్ట్రపతిటి పాలన అనివార్యమయినా కావచ్చిని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ బహుశా అదే కోరుకుంటున్నారు, కావచ్చును అందుకే కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని, తానే  రాజు, తానె మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు.

అటు బాబు,  ఇటు అమిత్ షా.. ఒక‌టే క్లాసు! 

చేతులే ఆయుధాలు కావాలి.. ఒక్కొక్క‌రూ ఒక్కో సైనికుడ‌యి విజృంభించాలి.. ఇలాంటి ఆవేశంతోనే బాహు బ‌లి త‌న‌చుట్టూ ఉన్న ప‌దిమందినీ యుద్దానికి ప్రేరేపిస్తాడు. అటు ఆంధ్రాలో జ‌గ‌న్‌ను తోసేయ డంలో చంద్ర‌బాబు  త‌మ పార్టీవారికి బాహుబ‌లిలానే ఉద్య‌మించే గ‌ట్టి  ప్ర‌సంగ‌మే చేశారు.  ఇటు తెలం గాణాలో  కేసీఆర్ ని  గ‌ద్దె దింపి రాజ్యం అధీనం చేసుకోవ‌డానికి బీజేపీ అమిత్ షా కూడా బాబు పంథానే అనుస‌రిం చారు.  యుద్ధంలోనైనా, ఎన్నిక‌ల్లో నైనా గెల‌వాలంటే వ్యూహాల‌మాట ఎలా ఉన్నా, నాయ‌కుడు ఒక్క‌డే కాలికి బ‌లపం క‌ట్టుకుని దేశ‌మంతా, రాష్ట్ర‌మంతా తిర‌గ‌లేడు, భారీ ప్ర‌సంగాలు, హెచ్చ‌రిక‌లు చేస్తూ ద‌వ‌డ‌లు నొప్పి తెచ్చుకోలేడు. కాలం మారింది. ఇపుడంతా మొబైల్ ప్ర‌చారాలే సాగుతున్నాయి.కానీ  పార్టీలో ఇత‌ర నాయ‌కులు, వీరాభిమానులు అంద‌రూ త‌మ త‌మ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా జ‌నాల్లోకి వెళ్లాలి, తిర‌గాలి, ప్ర‌జ‌ల్ని పార్టీప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యేలా చేయాలి. అపుడే పార్టీ అధినేత అనుకున్న ల‌క్ష్యాన్ని సాధిం చ‌గ‌ల్గుతాడు, పార్టీకి ఎంతో ప్ర‌తిష్ట ఉంటుంది. అలాగాకుండా ప‌ప్పురుబ్బ‌డం, గారెలు వేసి ప‌చ్చ‌డితో ప్లేట్లో పెట్ట‌డం.. అంతా నాయ‌కుడు ఒక్క‌డే చేయాలంటే కుద‌ర‌దు. పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా ప‌రిగెట్టాలి. నాయకుడి కంటే ఒక అడుగు ముందుండాలి. అదే మాట తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆ మ‌ధ్య త‌న పార్టీ ప్ర‌తినిధుల‌తో చాలా సీరియ‌స్‌గానే చెప్పారు.  అంతేకాదు, పార్టీ విజ‌యానికి పాటుప‌డ‌టం కొంద‌రి ప‌నే కాదు, ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త అంటూ హెచ్చ‌రించారు. పార్టీ విజయా నికి ఎవ‌రు నిజంగా కృషి చేస్తున్నారు, ఎవ‌రు కేవ‌లం ఉప‌న్యాసాలు, ప్రక‌ట‌న‌ల‌తో స‌రిపెట్టుకుంటున్నార‌న్న స‌మాచారం ఆల్‌రెడీ త‌న వ‌ద్ద ఉంద‌ని, చ‌ర్య‌లు తీసుకుం టాన‌ని హెచ్చ‌రించారు. వాస్త‌వానికి ఆంధ్ర లో గెల‌వ‌డానికి ప‌రిస్థితులు అనుకూలిస్తున్నాయి గ‌నుక బంగారు అవ‌కాశాన్ని చేజార్చు కోరాద‌న్న ది ఆయ‌న మాట‌. అదే శాస‌నంగా పార్టీ వ‌ర్గాలు తీసుకోవాలి, ముంద‌డుగు వేయాలి. అంతే కాని ప‌రిస్థితులు బాగానే ఉన్నాయి, జ‌గ‌న్‌కు అంత‌టా వ్య‌తిరేక‌తే  ఉంది గ‌న‌క మ‌నం ఇంట్లో కూర్చుంటే చాలు గెలిచేస్తామ  అని, ప‌ద‌వులు వ‌చ్చేస్తాయ‌ని అనుకుంటే చంద్ర‌ బాబు  సాగ‌నీయ‌రు.  ఇదిలా ఉండ‌గా, తెలంగాణాలో కేసీఆర్ పాల‌న ప‌ట్ల విముఖ‌త ఎంతో ఉన్నందువ‌ల్ల బీజేపీ మ‌రింత ఉద్య మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సేమ్ టు సేమ్ చంద్ర‌బాబులానే కేంద్ర‌మంత్రి అమిత్ షా బీజేపీ వ‌ర్గాల ను హెచ్చ‌రించారు. ఎవ్వ‌రూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని, వ‌చ్చిన అవ‌కాశాన్ని మ‌నం స‌ద్విని యోగం చేసుకోవాల‌ని, ఇంత‌కంటే మంచి త‌రుణం మ‌రోసారి ద‌క్క‌దు గ‌నుక మ‌న‌సుపెట్టి కాస్తంత శ్ర‌మించి పార్టీ ని ప్ర‌జ‌ల్లోకి మ‌రింత తీసికెళ్లి ఓట్లు ప‌డేలా ప‌నిచేయ‌మ‌ని హెచ్చ‌రించారు. దేశంలో వెలిగిపోతు న్నంత మాత్రాన తెలంగాణాలో అధికారంలోకి ఇట్టే వ‌చ్చేస్తుంద‌న్న భ్ర‌మ‌లో ఉండ‌వ‌ద్ద‌ని షా తెలంగానా బీజేపీ నాయకుల‌ను హెచ్చ‌రించారు. కేసీఆర్ కేంద్రంపై దృష్టిపెట్టి రాష్ట్రాన్ని నిర్ల‌క్ష్యం చేశారు గ‌నుక రాష్ట్ర ప్ర‌జ ల‌కు బీజేపీ ద‌గ్గ‌ర‌యి అధికారంలోకి వ‌చ్చేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి టిఆర్ ఎస్‌కు బుద్ధి చెప్పా ల్సి న అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అమిత్ షా మ‌న‌సులో మాట. పార్టీ ప‌థ‌కాలు, పాల‌నా విధానాలు, తెలంగాణా  రైతాంగం ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి, అభివృద్ధికి పార్టీ ఎలా కంక‌ణం క‌ట్టుకుంది ప్ర‌జ‌ల్లోకి  తీసికెళ్లాలని అమిత్ షా  తెలంగాణా బీజేపీ  నాయ‌కుల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా  క్లాస్ తీసుకున్నారు.  మ‌రి ఈ నాయ‌కుల ప్ర‌తిన‌, మ‌నోభీష్టం ఏ మేర‌కు విజ‌యాల‌ను ఇస్తుంద‌న్న‌ది చూడాలి. అయితే చంద్ర బాబు హెచ్చ‌రిక‌లు ఆంధ్రాలో నాయ‌కులు, పార్టీ అభిమానులు  బాగా చెవికి ఎక్కించుకునే అవ‌కా శం ఉంది. అక్క‌డ నాయ‌కుని భాషా, ఆవేశం వారికి అవ‌గ‌త‌మే. కానీ  అమిత్ షా ప్ర‌సంగం, ఆయ‌న ఆగ్ర‌హం మ‌రి తెలంగాణా బీజేపీ  వారు ఏమాత్రం పూర్తిగా అర్ధంచేసుకున్నార‌న్న‌దే సందేహం. 

షా వ‌చ్చిన వేళ‌.. బ‌య‌ట‌ప‌డ్డ  సెక్యూరిటీ లోపం

ఒక పారిశ్రామిక‌వేత్త ఇంట్లో బార‌సాల వేడుక‌. కేంద్ర‌మంత్రి రివ్వున కారులో వ‌చ్చి అంద‌ర్నీ ప‌ల‌క‌రి స్తాడు. తీరా వెళ్లేముందు ఒక కుర్రాడు బైక్ మీద వ‌చ్చి అడ్డుకుంటాడు. కోపంతో మంత్రి చూస్తాడు, సెక్యూరిటీ కొట్ట‌బోతారు, అంత‌లో వెన‌గ్గావున్న కాన్వాయ్ వాహ‌నాల్లో రెండు గాల్లోకి లేస్తాయి..హీరో న‌లు గుర్ని త‌న్ని మంత్రి ని వెక్కిరించి మ‌రీ పారిపోతాడు.. ఇదంతా సినిమా సీన్. హ‌రిత ప్లాజా ద‌గ్గ‌ర ఇలాం టివేమీ జ‌ర‌గలేదు  కానీ కేంద్రహోంమంత్రి అమిత్ షా వాహ‌నాన్ని మాత్రం ఒక కారు అడ్డు కుంది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అమి త్ షా హరిత ప్లాజా వైపు పయనమయ్యారు.  అమిత్ కాన్వాయ్ వెళుతుండగా  ఓ కారు అడ్డంగా రావ డంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగుల గొట్టారు. హరిత ప్లాజా వద్ద కారు ఆగిన సమయంలో ఈ ఘటన జరిగింది.  మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన కొత్త కారు అమి త్ షా కాన్వాయ్ కి అడ్డుగా వచ్చింది. దాంతో అమిత్ షా కాన్వాయ్ ఆగిపోయింది.  ఎంతకీ ఆ కారు పక్కకి తొలగకపోవడంతో భద్రతా సిబ్బంది ఆ కారు అద్దాలు పగులగొట్టారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్ర హోంమంత్రి పర్యటనకు వస్తే ఇలా గేనా భద్రత ఏర్పాట్లు చేసేది? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రికే ఇలాం టి పరి స్థితి ఎదురైతే ఇతరులను ఎలా రక్షిస్తారని మండిపడ్డారు. కేంద్ర‌ప్ర‌భుత్వం కేంద్ర ప‌ర్యాట‌కశాఖ ఆధ్వ‌ర్యంలో సికింద్రాబాద్‌లో తెలంగాణా విమోచ‌న  కార్యక్ర‌మా నికి ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు షా వ‌చ్చారు.  క‌నుక ఇక్క‌డ ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ ప‌రంగా  ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌ ప‌ర‌చ లేద‌ని బీజేపీ వ‌ర్గాల ఆగ్ర హం. ఎలా వ‌చ్చినా వచ్చింది కేంద్ర‌మంత్రి గ‌నుక  రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ విష యంలో నిర్ల‌క్ష్యం చేసింద‌నేది ప్ర‌స్ఫుటంగా క‌న‌ప‌డుతోంది. 

రేవంత్  మ‌రో రాజ‌కీయ ఎత్తు!

దేవ‌త‌ను ప‌లుర‌కాలుగా పూజిస్తారు. అమ్మ‌వారు ప‌లుపేర్లు క‌లది. విజ‌య‌వాడ దుర్గ‌, క‌ల‌క‌త్తా కాళి అంటారు.  కాల‌క్ర‌మంలో భాషాప‌ర దేవ‌త‌లూ వ‌చ్చారు. తెలుగునాట తెలుగు త‌ల్లి అంటూ చాలాకాలం నుంచి ప్ర‌చారంలో ఉంది. ఇపుడు కొత్త‌గా తెలంగాణా త‌ల్లి, తెలంగాణాలోనే తెలంగాణా కాంగ్రెస్ త‌ల్లి విగ్ర‌హాలు త‌యార‌య్యాయి. ఈ విష‌యంలోనూ రాజ‌కీయ‌రంగు పులుము కోవ‌డ‌మే విడ్డూరం. రేవంత్రెడ్డి ఆలోచ‌న ఆయ‌న వ‌ర‌కూ బాగుండేదేమో. ఎవ‌ర్ని రెచ్చ‌గొట్ట‌డానికి ఇపుడు తెలంగాణాలో కాంగ్రెస్  తెలంగాణా  త‌ల్లి అంటూ కొత్త విగ్ర‌హాన్ని తెర‌మీద‌కి తెచ్చారో కాంగ్రెస్ సీనియ‌ర్లు చెప్పాలి.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన త‌ర్వాత తెలుగుత‌ల్లి విగ్రహం రూపు ఇలా ఉండాల‌ని నిర్ధారించుకుని విగ్రహం ఏర్పా ట్లు ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. తెలుగు త‌ల్లి మీద గీతాలు వ‌చ్చాయి. కాలక్ర‌మంలో స‌మై క్యాం ధ్రా కాస్తా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణాగా విడిపోయింది. తెలుగు నేల రెండు రాష్ట్రాల‌యింది. అటు వాళ్లు, ఇటు వాళ్లు అంతా బాగానే ఉన్నాం. కానీ తెలుగు త‌ల్లికి పోటీగా  తెలంగాణా త‌ల్లి రూపొం దించారు.  తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బి. వి. ఆర్. చారి. సాధారణ స్త్రీ మాదిరిగా(తలపై కీరీటం ఆభ రణాలు లేకుండా) కొంగు నడుముకు చుట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని బీయూఆర్ చారి చిత్రిం చారు. చీర, కరీంనగర్ వెండి మట్టెలు, కోహినూర వజ్రం, జాకబ్ వజ్రం, పాలమూరు, మెదక్, అది లాబాద్ మెట్ట  పంటలకు చిహ్నంగా మక్కకంకులు,నిజామాబాద్ వరంగల్, కరీంనగర్ జి ల్లాల సం స్కృ తికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాతముద్దు బిడ్డగా , రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీ టంలో ప్రసిద్ద కొహినూర్ వజ్రం,వడ్డాణం,జరీ అంచుచీర నిండైన కేశ సంపద తదితరాలతో తుది మెరుగులు తీర్చిదిద్దడం జరిగింది. ఇలా తెలంగాణ తల్లి రూపకల్పనలో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశే షాలు ప్ర‌తిఫ‌లించాయి. ఆంధ్రాలో తెలుగు త‌ల్లి, తెలంగాణా లో తెలుగు త‌ల్లి అంటూ రెండు ర‌కాల ఆరాధ‌న ఉంది. ఇపుడు కొత్త‌గా తెలంగాణా కాంగ్రెస్ వారూ ఒక తెలుగు తల్లికి శ్రీ‌కారం చుట్టారు. విగ్ర‌హానికి కాంగ్రెస్ మూడు రంగుల చీర చుట్టారు. ఎడ‌మ‌చేతిలో జొన్న కంకులు పెట్టారు, మెడ‌లో వెండి క‌డియం, కాళ్ల‌కు మెట్టెలు అలంక‌రిం చారు. ప్ర‌తీదీ రాజ‌కీయ దృష్టితో చూడ‌టం, ఆధిప‌త్య పోరులో అన్నింటినీ వ‌దిలేయ‌డం లేదా నిర్ల‌క్ష్యం చేయ‌డం ఒక ప‌ద్ధ‌తిగా అమ‌లు చేస్తూ రాజ‌కీయ రంగంలో ప్ర‌త్య‌ర్ధి కంటే ఒక మెట్టు పైనే ఉన్నామ‌ని ప్ర‌క‌టించుకోవ‌డం, ప్ర‌చారం చేసుకో వ‌డంలో జాతీయ చిహ్నాల‌ను, రాష్ట్ర చిహ్నాల‌ను కూడా లెక్క‌లోకి తీసుకోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.  మ‌రి రేపో మాపో.. అయితే గీతే అయినంపూడి సంబంధంలా.. బీజేపీవారూ తెలుగుమీద దేశ‌భ‌క్తి స్థాయిలో అమాంతం ప్రేమ పెంచుకుంటే మ‌రి ఆ త‌ల్లికి కాషాయం క‌డ‌తారేమో, ఎడ‌మ‌చేతిలో క‌మ‌లం పెడ తా రేమో! ఎందుకంటే, ఏకంగా మూడు సింహాల గుర్తే వీజీగా మార్చేశారు. కాస్తంత శాంతంగా క‌నిపించే సింహాలు బీజేపీ స‌ర్కారు వారి ఆదేశానుసారం మ‌నిషి క‌నిపిస్తే మింగేసేట్టు కోర‌లు బ‌య‌టికి పెట్టుకు న్నాయి ప్ర‌తీ విగ్ర‌హంలోనూ!  అయినా రాజు త‌లచుకోవాలేగాని, రాత్రి వ‌చ్చిన క‌ల‌ని సాకారం చేయ‌డం ఎంత సులువో దేశంలో!

గుడివాడ బరిలో దేవినేని ఉమ.. కొడాలి నానికి చెక్!?

వైసీపీకి, ఆ పార్టీలోని కొందరు కీలక నేతలకు ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ముకుతాడు వేసి, టీడీపీని పంచకళ్యాణి గుర్రంలా పరుగెత్తించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు చురుగ్గా రచిస్తున్నారు.  విర్రవీగి  అసభ్యంగా మాట్లాడుతున్న కొడాలి నాని మెడలో గుడివాడ బరిలోనే గుదిబండ వేసి మరీ టీడీపీ జెండా రెపరెపలాడించాలని టీడీపీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో గుడివాడలో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాలపై ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో బలమైన నేతగా, వైసీపీకి దీటుగా జవాబు చెప్పగల నేతగా పేరున్న మాజీ మంత్రి దేవినేని ఉమను గుడివాడ బరిలో దింపాలనే యోచన చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. గుడివాడలో బలమైన అభ్యర్థి ఉంటే కొడాలి నానిని మట్టి కరిపించవచ్చని, ‘కొడాలి ఓటమి మిషన్’ సక్సెస్ అవుతుందన్న భావన టీడీపీ వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోందని సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ అధినేత చంద్రబాబు కూడా దేవినేనికి గుడివాడ టికెట్ ఇచ్చి, సీటు గెలుచుకువచ్చే బాధ్యతలు అప్పగించాలనే యోచన చేస్తున్నారంటున్నారు. కొడాలి నానికి దేవినేని ఉమ అయితే.. సమ ఉజ్జీ అవుతారని, ఉమ గెలుపు తథ్యం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుడివాడలో కొడాలి నానిని ఓడించడం, టీడీపీకి విజయం సాధించడం ఆ పార్టీ నేతల ముందు ఉన్న ముఖ్యమైన లక్ష్యంగా ఉంది. కొడాలి నానిని ఓడించడం కృష్ణా జిల్లా టీడీపీ నేతలే కాకుండా.. ఆ పార్టీ  కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం అధినేత సహా,   పార్టీలోని పెద్దలపై నోరు పారేసుకుని మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్న కొడాలి నానికి గుణపాఠం చెప్పే కార్యాచరణతో టీడీపీలోని కీలక నేతలు ఇప్పటికే వడివడిగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కొడాలిపై ఫోకస్ పెట్టిన క్రమంలో టీడీపీలో కీలకమైన చర్చ కొనసాగుతోందంటున్నారు. ఈ చర్చల్లో భాగంగా కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు దీటుగా బదులిస్తారా? లేక మరింత బలమైన నేతను బరిలో దింపాలా అన్న విషయం  తెరమీదకు వచ్చిందంటున్నారు. ఈ చర్చల క్రమంలోనే గుడివాడ నుంచి దేవినేని ఉమను బరిలో దింపితే ఫలితం అనుకూలంగా వస్తుందనే ధీమా పార్టీ నేతలలో వ్యక్తమైందని అంటున్నారు రావి వెంకటేశ్వరరావు గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యారు. అయినప్పటికీ రావి వెంకటేశ్వరరావు స్పీడు రానున్న ఎన్నికల్లో కొడాలి నానిపై విజయం సాధించేందుకు సరిపోదనే అభిప్రాయం స్థానిక తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమైందని సమాచారం. టీడీపీపై, టీడీపీ నేతలపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఆయన ఇమేజ్ ని చాలా వరకూ తగ్గించిందని, అయినప్పటికీ.. చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లు దేవినేని ఉమతో చెక్ చెప్పాలనే అభిప్రాయం టీడీపీ అధినేతకు కూడా వచ్చిందని చెబుతున్నారు. ఇదే అభిప్రాయం పలువురు టీడీపీ నేతల్లో కూడా కలిగిందని తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలోని అనేక మంది కార్యకర్తలు, ముఖ్యమైన నేతలు కూడా దేవినేని ఉమ పేరును పార్టీ చీఫ్ చంద్రబాబుకు సూచిస్తున్నారంటూ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి దేవినేని ఉమ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాతో మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలోని అనేక మంది పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న దేవినేని ఉమ గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దాంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత సమావేశంలో దేవినేని ఉమ చేసిన ప్రసంగం, తొడగొట్టి మరీ కొడాలి నానికి చాలెంజ్ విసరడంపై ఆ పార్టీ గుడివాడ నేతలు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ విశ్లేషించుకుంటే.. బూతుల మాజీ మంత్రి కొడాలికి సరైన ప్రత్యర్ది దేవినేని ఉమ అవుతారని, లెక్క సరిపోతుందని అంటున్నారు. ‘మాహిష్మతీ ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగొచ్చాడు’ అని బాహుబలి సినిమాలో దేవ సేన అన్నట్లు.. ‘గుడివాడా ఊపిరి పీల్చుకో.. కొడాలి నాని కోరలు పీకేందుకు దేవినేని ఉమ వస్తున్నాడు’ అని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.