స్టార్ బ్యాట్స్ మ్యాన్ కి ఇంకా ఎన్నిబాల్స్ మిగిలాయో

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఎన్నివాదనలు వినిపిస్తున్నపటికీ, విభజన ప్రక్రియకు మాత్రం ఆయన ఎన్నడూ అవరోధం కలిగించలేదనేది తెలంగాణావాదులు కూడా అంగీకరిస్తారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే, ఆయన పరోక్షంగా విభజనకు సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. నిన్నతెలంగాణా ఏర్పాటుకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో విభజన ప్రక్రియలో మరో అంకం ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది. అయితే ముఖ్యమంత్రి నుండి దానిపై ఇంతవరకు స్పందించకపోవడం చాల విచిత్రం. ఏమయినప్పటికీ, ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనేది, రాష్ట్ర విభజన లాగే ఒక పెద్ద సస్పెన్స్ గా ఉంది.   ఒకవేళ ఆయన విభజన తరువాత కూడా పార్టీలోనే కొనసాగాలనుకొన్నా, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నవారు ఆయనని ఉండనీయకపోవచ్చును. ఒకవేళ బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేసి పార్టీ పెట్టుకొన్నా, ప్రజలు నమ్మి ఓటేస్తారనే నమ్మకం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన కారణంగా అయన వేరే ఏ పార్టీలోను జేరి మరొకరి క్రింద పనిచేయడం కూడా చాలా కష్టమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏమిచేస్తారనే ప్రశ్నకి ఎవరూ కూడా ఊహించని జవాబు వచ్చినా ఆశ్చర్యం లేదు.   బీజేపీ పాలిత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా కలవడం అనుమానాలకు తావిస్తోంది. నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లకు అత్యంత సన్నిహితుడయిన ఆయన  తమ ప్రత్యర్ధ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా ఎందుకు కలిసారో ఇంకా తేలవలసి ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై కోపంతో రగిలిపోతున్నకిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొన్నబీజేపీ ఇదే అదునుగా భావించి ఆయనని తమ పార్టీలోకి ఆహ్వానించి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే అటు ఆయన, ఇటు సీమాంధ్రలో సరయిన నాయకుడు లేక బలహీనంగా ఉన్నబీజేపీ ఇద్దరూ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.   ఈ కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులిద్దరి రహస్య సమావేశం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలంటే శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు.

టిడిపి ఎంపీలపై లాఠీచార్జ్...తీవ్ర గాయాలు

      కేబినెట్ హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నివాసం వద్ద ధర్నా చేపట్టిన టిడిపి సీమాంధ్ర ఎంపీల పై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోద౦ తెలపడంతో...ఆగ్రహంతో టిడిపి సీమాంధ్ర ఎంపీలు షిండే నివాసం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటు అమానుషమని, అదొక తప్పుడు నిర్ణయమని మండిపడ్డారు. వైఎస్ జగన్ కోసమే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.  టిడిపి ఎంపీ సీఎం రమేశ్ విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోని ఆయన మెడ మీద చెయ్యి వేసి తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సంధర్బంగా పోలీసులు ఎంపీల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జి చేయడంతో సీఎం రమేశ్‌కు, మోదుగులకు, ఒక కార్యకర్తకు బాగా దెబ్బలు తగిలాయి.  అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని అర్ధరాత్రి దాటినా వదిలిపెట్టలేదు.                

యదా ప్రజా తదా నేత

కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడంతో తెలంగాణాలో ఉద్రిక్తతలు తగ్గితే, సీమాంధ్రలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెదేపా, వైకాపాలు 48గంటల సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఉద్యోగ సంఘాలు మళ్ళీ సమ్మెకు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి సీమాంధ్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యుల ఇళ్ళకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక పోలీసు రక్షణ కల్పించారు.   సీమాంధ్రలో మారిన ఈ పరిస్థితులను చూసి రాజకీయనేతల వాదనలు, మాట తీరు, ఆలోచనలు కూడా మారిపోయాయి. నిన్నటి దాకా రాజీనామాలు తప్ప మరిదేనికయినా సిద్దం అని దృడంగా పలికిన సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు మళ్ళీ తమ రాజీనామా డ్రామాలకు తెర తీసారు. ఇంతకాలంగా రాష్ట్ర విభజన అనివార్యమని వాదిస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర విభజనని చివరి దాకా అడ్డుకొంటామని మళ్ళీ ప్రతిజ్ఞలు చేయడం మొదలు పెట్టారు. తెదేపా, వైకాపాలు మళ్ళీ విడివిడిగా సమైక్యపోరాటాలు మొదలుపెట్టేసాయి.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాపత్రయం కంటే ప్రజాగ్రహానికి గురి కాకూడదనే భయమే రాజకీయ నాయకులని ఈవిధంగా మాట్లడేలా, వ్యవహరించేలా చేస్తోంది. పనిలోపనిగా ప్రజలలో ఉన్న బలమయిన సమైక్య సెంటిమెంటుని కూడా వాడుకొని ప్రయోజనం పొందుదామనే దురాశ కూడా ఇమిడి ఉంది.

మరోసారి రాజీ'డ్రామా'

  రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర కేభినెట్‌ నిర్ణయం నేపధ్యంలో సీమాంద్ర కాంగ్రెస్‌ నేతలు మరోసారి రాజీనామ డ్రామాకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ నేతలు స్పీకరుకు రాజీనామా లేఖలు సమర్సించగా వాటిన ఆయన తిరస్కరించారు. అయితే ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌ సభలో సభాపతికి రాజీనామ లేఖలు అందించాలని భావిస్తున్నారట. ఇందులో కేంద్రమంత్రులు పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, చిరంజీవి, పురంధేశ్వరి తో పాటు ఎంపిలు లగడపాటి, హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌, సబ్బంహరి, రాయపాటి సాంబశివరావులు ఉన్నారు. అయితే ఈసారైనా ఈ నాయకులు రాజీనామాలు ఆమోదింప చేసుకుంటారా లేక మరోసారి అదే డ్రామా ఆడుతారా అన్న అనుమానం ప్రజల్లో ఉంది. తాము కోరినట్టు సమైక్యా రాష్ట్రంగా కోనసాగించకపోయినా తప్పని పరిస్థితుల్లో తాము చెప్పినట్టుగా భద్రాచలాన్ని సీమాంద్రలో కలపటం, హైదరాబాద్‌ను యూటి చేయటం లాంటి ప్రతిపాదనలను కూడా పట్టించుకోకపోవడంతో సీమాంద్ర నాయకులు మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం.

మరోసారి అన్నా దీక్ష

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆగమేగాల మీద చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంలో మాత్రం అంత త్వరగా స్పందించకపోవటం పై అన్నా హజరే ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు. ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు అన్నాహజరే ప్రకటించారు . ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చానని అందుకే దీక్ష చేపడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే గతంలోనే దీక్ష చేయాలని భావించినా తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు.

నల్లసూరీడి అస్తమయం

  ఇటీవల తన 95 వ పుట్టినరోజును జరుపుకున్న నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా అస్తమించారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట యోదుడి మరణంతో యావత్‌ ప్రపంచం షాక్‌ గురైంది.ఈ మహాయోధుడి అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణం జూన్‌ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. అయితే ఇటీవలే ఆయనను హాస్పిటల్‌ నుంచి ఇంటికి మార్చారు. ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్‌ ప్రైజ్‌న్‌ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్‌ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. నల్లజాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహాయోధుడి ఆత్మశాంతి కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది.

పది జిల్లాలతో కూడిన తెలంగాణకే ఆమోదం

  దాదాపు 3 గంటల సేపు సాగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణానే కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని ప్రకటించారు. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా సాగే హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజల హక్కులను కాపాడే బాధ్యత తెలంగాణా గవర్నర్ దేనని తెలిపారు. ఆర్టికల్ 371 (డీ) రెండు రాష్ట్రాలలో కొనసాగుతుందని తెలిపారు. జలవనరులు, విద్యుత్ తదితర కీలక అంశాలలో కేంద్రం పాత్ర ఉంటుందని తెలిపారు.   విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించాలో ననిర్ణయించేందుకు ఒక నిపుణుల కమిటీ వేయబడుతుందని, అది 45 రోజులలో తన నివేదికను సమర్పిస్తుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తగినన్ని నిధులు విడుదులు మంజూరు చేస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా క్యాబినెట్ ఆమోదం పొందిందని, దానికి అవసరమయిన అనుమతులు, నిధులు వగైరా అన్నీ కేంద్రమే చూసుకొంటుందని ఆయన తెలిపారు.   ఈరోజు ఆమోదింపబడిన తెలంగాణా బిల్లు రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతికి పంపబోతున్నట్లు షిండే తెలియజేసారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపటి నుండి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ యాత్రకి బయలుదేరబోతున్నారు. అంటే షిండే చెప్పినట్లు రేపు కాక ఈరోజు రాత్రే రాష్ట్రపతికి తెలంగాణా బిల్లు అందజేయవచ్చును. లేకుంటే ఆయన కోల్ కత చేరుకొన్నతరువాత అక్కడికే బిల్లుని పంపి, ఆయన ఆమోదిస్తే  అక్కడి నుండే నేరుగా రాష్ట్రశాసన సభకు పంపవచ్చును. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని షిండే తెలిపారు.   ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, కావూరి సాంభశివరావు, పల్లంరాజు, కిషోర్ చంద్ర దేవ్ కూడా పాల్గొని తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా బలంగా వాదనలు వినిపించారు. అయితే క్యాబినెట్ విభజనకే మొగ్గు చూపడంతో, సీమాంధ్ర మంత్రులు ముగ్గురు  సమావేశం ముగిసే ముందే బయటకు వెళ్ళిపోయారు. వారు సీమాంధ్రకు ఇస్తున్న ప్యాకేజీ పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ప్రకటించినట్లు సమాచారం.

రాయల తెలంగాణాపై కేంద్రం వెనకడుగు

  కేంద్ర మంత్రి వర్గం సమావేశం గురువారం సాయంత్రం సమావేశమయ్యి కేంద్రమంత్రుల బృందం ఆమోదించిన రాయల తెలంగాణా లేదా పది జిల్లాలతో కూడిన తెలంగాణాలలో ఏదో ఒక ప్రతిపాదనను ఆమోదింపవలసి ఉంది. అయితే తను ఆయాచితంగా తెలంగాణా ప్రజలకు ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దపడినా వారు అందుకు అంగీకరించకుండా, మళ్ళీ బందుల బాట పట్టడంతో రాయల తెలంగాణా ప్రతిపాదన విరమించుకొంటున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే అలవాటు ప్రకారం మీడియాకు లీకులు ఇచ్చింది. తద్వారా తాము ఆ ప్రతిపాదనపై తనకు అంత ఆసక్తి లేదనే అభిప్రాయం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ముందు ప్రకటించినట్లుగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇవ్వబోతున్నట్లు మీడియాకి లీకులు ఇచ్చింది.   అయితే రాయల తెలంగాణా ప్రతిపాదనతో తమ టీ-కాంగ్రెస్ నేతలు మళ్ళీ తెలంగాణాలో దైర్యంగా తిరుగలేని పరిస్థితి కల్పించడమే గాక, ఉన్న కొద్దిపాటి పరువు కూడా రెండే రెండు రోజుల్లో పోగొట్టుకొంది. తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగానే సోనియా గాంధీకి కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుడి కట్టిన ప్రజలు, రాయల తెలంగాణా ప్రతిపాదన చేయగానే దానిని కూల్చి వేయడమే ఇందుకు చక్కటి ఉదారణగా చెప్పుకోవచ్చును.   ఈ నిరసనలను చూసి భయపడి కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా ప్రతిపాదన ఉపసంహరించుకొన్నపటికీ, హైదరాబాద్ మరియు భద్రాచలంపై ఆంక్షలు, ఇతర సున్నిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి దూరం చేయడం ఖాయం. అందువల్ల ఇప్పుడు పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇచ్చినా, తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మెచ్చి దానికి ఓటేసే పరిస్థితి ఉండకపోవచ్చును.

రాయల తెలంగాణను వ్యతిరేకించిన ఆజాద్

      పది జిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం ఆయన జీఓఎం సభ్యులకు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తేనే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చునని, లేకుంటే కొత్త సమస్యలకు దారి తీసినట్లవుతుందని వివరించారట. సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడాలని సూచించినట్లుగా సమాచారం. రాయల తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం వల్లనే  ఆజాద్ వెనక్కి తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు. బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆజాద్ వెనక్కి తగ్గడానికి కారణమైందని అంటున్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం కష్టమవుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల లోగా ఏర్పాటు చేయాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. దీంతో ఆజాద్ వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు.

కాంగ్రెస్ ఎత్తులకి కాంగ్రెస్ చిత్తు

  కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా మజ్లిస్ పార్టీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుండి ఈ ప్రతిపాదన చేస్తున్నపటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. అయితే ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని కాంగ్రెస్ పార్టీ గ్రహించడంతో తెలంగాణా ప్రజల కోరకపోయినప్పటికీ వారికి అదనంగా ఈ ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.   రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో మజ్లిస్ ఉనికి నామమాత్రంగా మారిపోతుంది. పైగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ కూడా భయపడుతున్నాయి. అదే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెచ్చి తెలంగాణాతో అంటు కట్టగలిగితే, అక్కడ అధికంగా ఉండే ముస్లిం ఓటర్లవలన మజ్లిస్, రెడ్డి ఓటర్ల వలన కాంగ్రెస్ పార్టీ బలపడవచ్చనే ఆలోచన కూడా ఇందులో ఇమిడి ఉంది.   అయితే, తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముఖ్యమంత్రి మరియు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతల అవకాశాలను ఈ ప్రతిపాదన దెబ్బ తీస్తుంది. గనుక వారు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరుగబోయే కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ అంశంపై తమ అధిష్టానం తీసుకొనే నిర్ణయం చూసిన తరువాతనే వారు స్పందించాలని వేచి చూస్తున్నారు.   ఒకవేళ రాయల తెలంగాణాకే మొగ్గు చూపితే వారు కూడా అధిష్టానానికి ఎదురు తిరగవచ్చును. అదే జరిగితే, ఈ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కళ్ళెం వేద్దామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి అసలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల బహుశః ముందు ప్రకటించినట్లు 10జిల్లాలతో కూడిన తెలంగాణానే ఆమోదించక తప్పకపోవచ్చును.   రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంత కీలక దశకు చేరుకొన్నపటికీ, రాష్ట్రాన్ని ఏవిధంగా విడదీయదలచుకొందో చెప్పలేని దీనస్థితిలో కాంగ్రెస్ ఉంది పాపం. మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రజలను కానీ, పార్టీలను గానీ పరిగణనలోకి తీసుకోకుండా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తులకి చివరికి తానే బలయిపోయే పరిస్థితి ఏర్పడింది.   కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అది అప్పుడప్పుడు తనను తానే ఓడించుకొంటుంది అని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకొనే మాట ఎంత నిజమో ఇప్పుడు అర్ధం అవుతోంది.నిన్న వెలువడిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక కవుంట్ డవున్ మొదలయిందని సూచిస్తునాయి.

అక్బరుద్దీన్‌ కు తెలంగాణ సెగ..హరీష్ ఫైర్

      తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. తెలంగాణ కోసమే తమ పోరాటం కానీ...రాయల తెలంగాణ కోసం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తెరపైకి తెస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ గద్దెలను కూల్చేస్తామని హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా హరీష్‌రావు సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను ఒప్పుకోమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నాయకులు ఎన్నో కుట్రలు చేశారని, వారితో తాము కలిసేది లేదని హరీష్‌రావు తేల్చిచెప్పారు.

జగన్ కి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత

  ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇరుకునపడిన జగన్మోహన్ రెడ్డి, ధర్నాలు చేసే బాధ్యతను తల్లికి అప్పగించి చెన్నైవెళ్ళి ముఖ్యమంత్రి జయలలితను, ప్రతిపక్ష నేత కరుణానిధిని కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కరుణానిధి కుమార్తె మరియు 2జీ కేసులో నిందితురాలయిన కనిమోలి ఆయనకు స్వాగతం పలకడం విశేషం.   ఆయన వస్తున్నట్లు తెలిసి చెన్నైలో వైకాపా అభిమానులు బాగానే దారి పొడుగునా వైకాపా జెండాలు అలంకరించి బాగానే స్వాగతం పలికారు. అయితే చెన్నైనుండి హైదరాబాదులో కాలుపెట్టేసరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి హైదరబాదులో విమానం దిగి ఇంటికి వెళుతుంటే ఆయన కాన్వాయ్ పై కొందరు తెలంగాణా యువకులు కోడి గుడ్లు, టొమేటోలు, చెప్పులు విసిరి తమ నిరసన తెలిపారు. ఇది చూస్తే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.

తెలంగాణ బంద్...పలుచోట్ల ఉద్రిక్తత

      రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ తెలంగాణ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఐదు గంటల నుంచి తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. జిల్లాలోని బస్సు డిపోల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.   #. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలోని జూబ్లీబస్టాండ్‌వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఈటెల హెచ్చరించారు. #. తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. #. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు బైక్ ర్యాలీకి యత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. #. రాయల తెలంగాణకు ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ బంద్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. అసెంబ్లీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.  

నేడే కేబినెట్‌కు బిల్లు

  తెలంగాణ ఏర్పాటు విషయంలో జీవోయం తుది నివేదిక సిద్దం చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఆంటోని ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే తుది నివేదిక సిద్దమయ్యింది అన్న ఆయన ఈోజు నివేదికను ప్రదానికి అందజేస్తామన్నారు. అది కేభినెట్‌ ముదుకు ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని ప్రదానే నిర్ణయిస్తారన్నారు. అయితే ఆయన తరువాత మాట్లాడిన షిండే మాత్రం బిల్లు గురువారం కేభినెట్‌ ముందుకు వస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే జీవోయం నిర్ణయం ఏమిటి అన్న విషయం మాత్రం ఆయన ప్రకటించలేదు. పది జిల్లాల తెలంగాణనా, లేక 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణనా అన్నవిషయం కేభినెట్‌ ముందుకు బిల్లు వచ్చిన తరువాత తెలుస్తుంది అన్నారు.

సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్‌ అవుట్‌

  రాబోయే ఎలక్షన్స్‌కు సెమీఫైనల్‌గా భావిస్తున్న మూడు రాష్ట్రల ఎన్నికలు కాంగ్రెస్‌కు భారీ షాక్‌ ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి సర్వేలు. ఇప్పటికే పోలింగ్‌ పూర్తయిన మూడు రాష్ట్రల్లో బిజెపికే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని టుడేస్‌చాణక్య సర్వే పేర్కొంటుంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లలో బిజిపి అధికారాన్ని నిలబెట్టుకుంటారని, రాజస్థాన్‌లో కూడా బిజెపికే విజయావకాశాలు ఎక్కువని సర్వే తేల్చింది. టైమ్స్‌ ఆప్ ఇండియా సర్వే ప్రకారం ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఢిల్లీ ఫీఠం ఎక్కడానికి ఏ పార్టీకైన ఆమ్‌ ఆద్మీ పార్టీ సపోర్ట్‌ తప్పని సరి అయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది.