పంచాయతీ ఉద్యోగుల పంట పండిరదా?
రాష్ట్రంలోని పంచాయతీ ఉద్యోగుల పంట పండిరది. ఇప్పటి వరకూ పదోన్నతులకు దూరమైన ఈ శాఖలో ప్రభుత్వం కొత్తగా పదవుల పందేరం పండిరచింది. ఐదువేల జనాభా, ఐదులక్షల వార్షికాదాయం ఆథారంగా ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తోంది. ప్రత్యేకించి స్పెషల్గ్రేడ్డిపిఓ హోదాను కల్పిస్తోంది. అంటే జిల్లా పంచాయతీ అథికారి పోస్టులో అప్గ్రేడ్ కల్పించింది.
ఐదువేల జనాభా దాటిన పంచాయతీలు ఉన్న జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి... తూర్పుగోదావరి`231, పశ్చిమగోదావరి`169, గుంటూరు`143, కృష్ణా`112, నెల్లూరు`57, ప్రకాశం`80, విశాఖ`50, విజయనగరం`32, శ్రీకాకుళం`32, కర్నూలు`100, చిత్తూరు`100, అనంతపురం`70, కడప`52, రంగారెడ్డి`77,వరంగల్`75, నిజామాబాద్`75, కరీంనగర్`65, నల్గొండ`65, ఖమ్మం`52, అదిలాబాద్`48, మహబూబ్నగర్`38 పంచాయతీలున్నాయి. అలాగే ఐదులక్షల వార్షికాదాయం దాటిన పంచాయతీల్లో పశ్చిమగోదావరి`238, తూర్పుగోదావరి`219, గుంటూరు`228, కృష్ణా`204, నెల్లూరు `106, ప్రకాశం`65 తదితరాలున్నాయి. ఈ పోస్టుల అప్గ్రేడేషన్ కూడా సిఇఓ స్థాయి, జెడిస్థాయిల్లో కల్పించారు. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఈ తరహా పదోన్నతులు ఎప్పుడూ జరగలేదని ఉద్యోగవర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతస్థాయికి ఛానల్ను రూపొందించిన ఖ్యాతి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఉద్యోగులు కొనియాడుతున్నారు.