ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!   స్త్రీ....  అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం.  పడతి.... అంటే ఓ ప్రగతి.  అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి  గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.  భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).   ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.  ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే.  ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.  భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.  ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది  మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది.   కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి.  గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.  జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.  మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.  శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.  దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.   యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది.  అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన  ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు  (మొదటి భారతీయ)  1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు)  1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో  కమలాదేవి చటోపాధ్యాయ  వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐

  మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే   ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే  ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు. చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా  , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే 1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి 2. మీతో మీరు కొంత సమయం గడపండి 3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.  

బట్టల మీద  మరకలు  ఇలా ఈజీగా తొలగించవచ్చు..!   మరక మంచిదే అనే యాడ్ చూసే ఉంటారు. అయితే నచ్చిన దుస్తుల మీద మరకలు పడటం వల్ల చాలా బాధపడతాం.  ముఖ్యంగా ఫేవరెట్ డ్రెస్ అని అందరికీ ఉంటుంది.  పొరపాటున ఈ ఫేవరెట్ డ్రెస్ మీద కానీ, ఖరీదైన దుస్తుల మీద కానీ మరకలు పడితే మనసు విలవిలలాడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. నిమ్మరసం.. నిమ్మరసం సహజమైన బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తంది. దుస్తుల మీద మరకలు ఏర్పడినప్పుడు దాని మీద నిమ్మరసం పిండాలి. ఆ తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి.  ఆ తరువాత కడగాలి.  మరకలు మాయం అవుతాయి. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేవలం దుస్తులే కాదు.. వివిధ వస్తుల మీద మొండి మరకలను కూడా బేకింగ్ సోడా సహాయంతో మాయం చేయవచ్చు.  ఇకపోతే దుస్తుల మీద ఏర్పడిన మరకల మీద బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయాలి.  ఆ గుడ్డను కాసేపు పక్కన పెట్టాలి. ఆరిపోయాక దాన్ని వాష్ చేయాలి. బేకింగ్ సోడా మరకల తాలూకు మురికి,  జిడ్డు, రంగు మొదలైనవి లాగేస్తుంది. వెనిగర్.. నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా చాలామంది చాలా సందర్భాలలో వెనిగర్ ను ఉపయోగిస్తారు. అయితే బట్టల మీద మరకలను కూడా వెనిగర్ ద్వారా తొలగించుకోవచ్చు.  మరకల మీద వెనిగర్ రాసి కాసేపు అలాగే ఉంచాలి.  ఆరిన తరువాత  వాష్ చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్.. రంగు దుస్తులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించే ముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి.   బట్టలకు ఎలాంటి నష్టం కలగకుంటే మరకల మీద ప్రయోగించాలి.  ఇది మరకలు తొలగించడంలో చాలా ప్రబావవంతంగా ఉంటుంది. డిష్ వాష్ సోప్.. డిష్ వాష్ సోప్ మరకల తాలూకు ఆయిల్,  గ్రీజు మరకలను తొలగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.  మరక మీద కొద్దిగా డిష్ వా,్ సోప్ రాసి రుద్దాలి.  తర్వాత దాన్ని వాష్ చేయాలి. ఉప్పు.. మరకలు ఇంకా అప్పుడే అయినవి అయితే వాటని తొలగించడానికి ఉప్పు భలే మంచి ఎంపిక.  మరకలపైన ఉప్పును వేయాలి.  ఉప్పు మరకల తాలూకు గ్రీజు, జిడ్డు, రంగును లాగేస్తుంది. బోరాక్స్.. బోరాక్స్ అనేక రకాల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బోరాక్స్ ను పేస్ట్ చేసి మరకల మీద రాసి కాసేపు అలాగే వదిలేయాలి.  ఆ తరువాత వాష్ చేయాలి.  మరకలు మాయమవుతాయి. బంగాళదుంప.. బంగాళదుంప రసం తుప్పు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది.  బట్టల మీద తుప్పు మరకలు ఉన్నప్పుడు బంగాళదుంప ను కట్ చేసి బంగాళదుంప ముక్కలతో మరకల మీద బాగా రుద్దాలి.  ఇలా చేస్తే మరకలు పోతాయి.                                               *రూపశ్రీ.  

అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..!     పట్టు చీరలు భారతీయ కళకు కాణాచి.  ఇక పట్టు చీరలు కట్టుకున్నమగువలను చూస్తే  సాక్షాత్తూ ఆ దేవతే దిగి వచ్చిందేమో అనిపిస్తుంది.  మగువల వల్ల చీరకు అందమా.. చీర వల్ల మగువల అందం రెట్టింపైందా అనేది తెల్చలేని సందిగ్ధం కూడా ఏర్పడుతుంది. భారతదేశంలో చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి.  ప్రాంతాన్ని బట్టి పలు రకాల పట్టులు పేరొందాయి.  వాటిలో బనారసి సిల్క్ చీర కూడా ఒకటి.   బనారసి సిల్క్ చీరకు దానిదైన ప్రత్యేకత ఉంది. అయితే స్వచ్చమైన బనారసి పట్టు అంత ఈజీగా దొరకవు. చాలా చోట్ల బనారసి పేరుతో మోసాలు జరుగుతుంటాయి.  నిజమైన బనారసి పట్టు చీరల ఫాబ్రిక్, డిజైన్, రంగు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి.  నిజమైన బనారసి పట్టును ఎలా గుర్తించవచ్చో తెలుసుకుంటే ఈ రకమైన పట్టు చీర కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు. మెరుపు.. బనారసి సిల్క్ చీరలను కొనేటప్పుడు దాని మెరుపు మీద దృష్టి పెట్టాలి్.  కొనుగోలు దారులు నకిలీ చీరలు చూపించి ప్రజలను సులువుగా మోసం చేస్తారు.  అందుకే బనారసి చీరలు కొనేటప్పుడు చీరల మెరుపు మీద దృష్టి పెట్టాలి.  బనారసి సిల్క్ చీరలు  చాలా మృదువుగా ఉంటాయి. అంచు.. బనారసి సిల్క్ చీరల అంచు దారం వదులుగా ఉంటుంది.  ఈ చీరను చేతితో నేస్తారు.  దీని వల్ల అంచు దారం వదులుగా ఉంటుంది.  అదే సమయంలో నకిలీ చీరలు అయితే యంత్రం సహాయంతో నేస్తారు.  ఈ మెషీన్ తో నేసే చీరల అంచు దారాలు వదులుగా ఉండవు.  ఈ అంచును చూసి అసలు చీర, నకిలీ చీర మద్య తేజా కనుక్కోవచ్చు. ధర.. బనారసి సిల్క్ చీరలను ధరతో పోల్చి కూడా కనుక్కోవచ్చు.  ఈ చీరలు ఖరీదైనవి.  దాదాపు 10 నుండి 12వేల రూపాయల ధర ఉంటాయి.  ఇంతకంటే తక్కువ ధరకు ఈ చీరలను ఏ దుకాణంలో అయినా అమ్ముతుంటే అవి నకిలీ చీరలని తెలుసుకోవచ్చు.  అలాంటి చీరలు కొనకూడదు. దారం.. అసలైన బనారసి పట్టు  చీరను కనుక్కోవడానికి మరొక చిట్కా ఉంది.  అసలైన బనారసి పట్టు దారం కాల్చిన వెంటనే కాలిపోతుంది. చేతికి మసి అంటుతుంది.  అదే నకిలీ బనారసి పట్టు అయితే ప్లాస్టిక్ దారాలతో తయారవుతుంది.  దీని దారం కాల్చినప్పుడు చేతికి అతుక్కుంటుంది. నమ్మకం.. బనారసి సిల్క్ చీరలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనకూడదు.  నమ్మకమైన  దుకాణాదారుల దగ్గర.. చాలా వరకు నేత పని చేసే వారి దగ్గర నేరుగా కొనడం మంచిది.                                         *రూపశ్రీ.

  సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..!     సేఫ్టీ పిన్.. ప్రతి అమ్మాయికి చాలా అవసరమైన వస్తువు. చీరలు,  డ్రస్ కు వేసుకునే చున్నీలను  జారిపోకుండా ఉండటం కోసం సేఫ్టీ పిన్ లను వాడతారు.  మధ్యతరగతి, దిగువ తరగతి మహిళల మంగళసూత్రానికి,  గాజులకు ఈ సేఫ్టీ పిన్స్ తప్పనిసరిగా ఉండటం చూడవచ్చు.  అయితే సేఫ్టీ పిన్ లను చీరలు కట్టుకున్నప్పుడు,  దుప్పట్టా వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ను వాడి ఆ తరువాత మనసు చిన్నబుచ్చుకునే వారు చాలామంది ఉంటారు.  కారణం..  ఈ సేఫ్టీ పిన్ లు పెట్టుకున్నప్పుడు డ్రస్ లేదా చీర క్లాత్ కాస్త చిరిగిపోవడం.  సేఫ్టీ పిన్ వినియోగం వల్ల మంచి మంచి దుస్తులు రంధ్రాలు పడుతుంటాయి.  ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ పాటించాలి. ఈ సమయంలోనే ఎక్కువ.. చాలా సార్లు హడావిడిగా చీర కట్టుకున్నప్పుడు,  డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకుండా ఆవేశంతో పిన్ ను గుచ్చేస్తుంటారు. దీని వల్ల అవి చీరలోనూ, చున్నీలలోనూ ఇరుక్కుపోయి అవి సులభంగా బయటకు రాలేక.. దుస్తులకు నష్టం చేకూరుస్తాయి. దీని వల్ల చాలా వరకు కొత్త చీరలు, డ్రస్సులు బలి అయిపోతుంటాయి. బటన్స్.. చీర లేదా దుపట్టాను పిన్ చేయడానికి ముందు సేఫ్టీ పిన్ కు రంగురంగుల బటన్ లను అటాచ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల చీర చిరిగిపోదు.  బట్ట సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. సేఫ్టీ పిన్ ను తిరిగి తీసేయడం కూడా సులువుగా ఉంటుంది. స్టిక్కర్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు స్టిక్కర్ కూడా ఉపయోగించవచ్చు.  స్టిక్కర్ ఉపయోగించి సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల దాన్ని తిరిగి తీయడం సులువు అవుతుంది. అలాగే క్లాత్ చిరిగిపోకుండా కాపాడుకోవచ్చు. పాలిథిన్.. చీరకు కానీ,  దుపట్టాకు కానీ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు దానికి పాలిథిన్ కవర్ లేదా కాగితాన్ని అతికించవచ్చు.  దీని వల్ల క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది.  సేఫ్టీ పిన్ పెట్టుకోవడం,  తిరిగి తీయడం కూడా సులువే. బీడ్స్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు చీరకు కానీ,  దుపట్టా కు కానీ నష్టం జరగకూడదు అంటే సేఫ్టీ పిన్ కు బీడ్స్ ఎక్కించాలి.  ఇవి కూడా చాలా  అట్రాక్షన్ గా ఉండే ముత్యాలు,  రంగు రంగుల పూసలను సేఫ్టీ పిన్ కు ఎక్కించి వాడటం వల్ల చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. టేప్.. సేఫ్టీ పిన్ ల మధ్య టేప్ ఉపయోగించడం వల్ల సేఫ్టీ పిన్ వల్ల చీరలకు,  దుపట్టాలకు నష్టం జరగదు. టేప్ వల్ల క్లాత్ లో సేఫ్టీ పిన్ లు ఇరుక్కోకుండా ఉంటాయి.                                                      *రూపశ్రీ.

చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం  పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి.  లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే  తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది.                                                          *నిశ్శబ్ద.

   గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..!     భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక  అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం.  సత్కర్మల గురించి వివరించేది ఇదే..   కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి,  వ్యాకులతకు,  పిరికితనానికి లోనైన అర్జునుడికి,  శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు.  భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు.   భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి.  ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి.  భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు.  ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు  బాధపడకూడదని,  ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు.  అందుకే..  వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం,  మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి.  భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక  పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది.  ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ,  దుఃఖం,  విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది.  మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది.  గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది.  తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.  కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు.  ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు. భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది.  కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని  చెబుతారు. గర్భధారణ సమయంలో మహిళలలో  హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.  ఇది ఒత్తిడి,  ఆందోళనను పెంచుతుంది.  ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను,  స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి.  ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని,  సుఖాన్ని,  దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం. గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ  నెల నుండి వినికిడి  శక్తి వస్తుంది.  ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు,  బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి.                                             *రూపశ్రీ.    

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.

మహిళలూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి! మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థికపరమైన విషయాల్లో తండ్రి, సోదరుడు, భర్త...ఇలా ఎవరొకరిమీద ఆధారపడుతుంటారు. ఆర్థికపరమైన అంశాలపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమంటున్నారు నిపుణులు. ఇంకొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితులకు అనుగుణంగా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా...చాలా మంది మహిళలు ఆర్థికపరంగా నేటికీ పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కోని ఈ ధోరణిని మార్చుకోవాలి. లేదంటే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో వివాహం జరిగినప్పటినుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఉద్యోగం మానకూడదు: కొంతమంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పటివరకు తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇంకొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండూ కూడా ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అని చెబుతున్నారు నిపుణులు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే మంచిది. తద్వారా భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన పెంచుకోవాలి: ఆర్థిక విషయాల్లో పెళ్లికి ముందు తండ్రిపై...పెళ్లి తర్వాత భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా...డబ్బు పొదుపు మదుపు విషయాల్లో అవగాహన లోపమే దీనికి కారణం. అయితే ప్రతి చిన్న దానికీ ఇతరులపై ఆధారపడటం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి డబ్బులను ఎందులో పొదుపు చేయాలి లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలనే ప్రథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు అలాని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరితోనూ సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఉండాలి. ఇవి కూడా గుర్తుంచుకోవాలి... మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోని ఉండాలి. అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా ఉంటుంది. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడుగుతే గుడ్డిగా చేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. పెళ్లికి ముందు తర్వాత మహిళలకు పుట్టింటివారు మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలు స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం ఇలా ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.  

దీపాలకాంతితో అమ్మాయిల  అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే!  దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా  ప్రత్యేకమైన పండుగ.   ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా  జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు.  కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా  అమ్మాయిలు తమ అందంలో  దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే  ఈ దీపాల పండుగలో  డిఫరెంట్‌గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.. దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా  ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌,  మాస్క్‌లను ఉపయోగించడం మంచిది.  కావాలంటే  చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది,  ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి  ముఖం మెరిసేలా చేస్తుంది. చాలామంది అమ్మాయిలు  తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్‌తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో   ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇందుకోసం పచ్చి పాలలో కాటన్‌ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా,  మేకప్‌కు చేసుకోవడానికి అనువుగా  స్మూత్‌గా మారుతుంది. దీపావళి పండుగ  రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్  వేసుకోకపోవడం మంచిది. బేస్,  ఫౌండేషన్  వేరు వేరు  లేయర్‌లను వేసుకోవడం  వలన  మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్  ను ఒకే  సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది.  ముఖం ఎక్కువసేపు  ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం.  వీటితో  ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా  అవి ఎక్కువ కాలం ఉండవు.   చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం.  క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి  ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే  ఈ తప్పులు చేయకూడదు.  మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి.   ఇవి ముఖంలో గ్లోను  ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి.                                                             *నిశ్శబ్ద

దీపావళి స్పెషల్ - దీపాల అలంకరణ   కాంతులు చిమ్మే దీపావళి వచ్చేస్తుంది. మట్టి ప్రమిదలను మీరే సొంతంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇది మీకోసమే  అతి తక్కువ ఖర్చుతో దీపాలను ఎంతో అందంగా మీకు నచ్చిన విధంగా డిజైన చేయండి. దీపావళిని ఆనందంగా ఆహ్వానించండి.       Click Here for Home Decor N Handicrafts    

  Making of Gel & Crushed Candle (Diwali Special)       Material required : * gel 1/2kg * gel liquid colors * Color Sand * candle thread * decorative items ( small sea shells , showpiece, mirrors,glitter,etc) Procedure : Place the color sand in layers in a glass, melt the gel in a pan at a normal temperature, add the desired gel liquid color to the gel, place the decorative items to the glass above the sand, pour melted the gel to the glass and place candle thread in middle of the glass. let it dry to settle down and then u can light the candle.     Crushed Candle   Material required : * Wax 1/2kg * wax colors ( or wax crayons) * candle thread * mould * grater * glass Procedure: Melt the wax in a bowl , add wax colors or crayons in diff parts for diff color combinations, place the candle thread in the mould, pour the melted wax in the mould and let it cool down completely for 1-2 hours. Unmould the candle and grate it . use the grated wax and place it in a glass in diff colors layers after placing the candle thread. now u can light the candle. --Khushboo Agarwal (Khushi Hobby Classes)

  ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం పొడిబారితే.....   అమ్మతనం గొప్ప వరం. మాతృత్వాన్ని పొందాలంటే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదు. కొంత మంది నెల తప్పిన దగ్గరనుండి వికారం వాంతులతో బాధపడతారు, మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చర్మాన్ని గోక్కోకుండా ఉండలేరు. దాని ఫలితంగా వచ్చే రేషేస్ ఇంకా చికాకు తెప్పిస్తాయి. అసలీ ఇచ్చింగ్ ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తే, మాములుగా ఉన్నప్పటి కన్నా ప్రెగ్నెన్సీ టైంలో మన శరీరంలో కొన్ని హార్మోనియల్ చేంజెస్ రావటం వల్ల  ఇలా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది, దాని వల్ల ఇచ్చింగ్ వస్తుంది. అదీకాక చర్మం సాగుతూ ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందక దురదలు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రయవసానమే కడుపు మీద చారలు ఏర్పడి అవి ఎప్పటికి అలానే ఉండిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించాలి.      * ఎక్కువ మందికి కడుపు మీద లేదా మొహం మీద చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారుతోంది అని అనిపించిన దగ్గర నుండి ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్లో కాసిని నీళ్ళు కలిపి దానిని కావాల్సిన చోట రాసుకుంటూ ఉంటే సరిపోతుంది.       * అలాగే వెన్న కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇంట్లో వెన్న ఉన్నా లేదా పాల మీగడ ఉన్నా దానిని చర్మానికి రాసుకుంటే త్వరిత ఫలితం కనిపిస్తుంది.   * రోజూ వాడే సబ్బులు కూడా చర్మం పొడిబారటానికి కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బులు వాడకుండా జాగ్రత్త పడాలి. సబ్బులకి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటం మంచిది. దీనిని నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.   * పొడి చర్మాన్ని పోగొట్టటానికి పెరుగు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడయితే చర్మం పొడిగా ఉందో  అక్కడ పెరుగు రాసుకుని ఒక 10నిమిషాలు ఉంచి తరువాత కడిగేసుకుంటే చాలు.   * ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.   * చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారయితే. రెండు కోడిగుడ్ల తెల్లసొనలో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి కలిపి రాసుకుని బాగా ఆరిన తరువాత కడిగేసుకుంటే చాలు.   * స్నానం తర్వాత చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాసుకోండి. అందువల్ల చర్మం ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. అప్పుడు దురదలు కూడా రావు.   * అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. మాములుగా ఉన్నప్పటికన్నా ప్రెగ్నేన్సీ తో ఉన్నప్పుడు నీళ్ళు మరిన్ని తాగాలి. అప్పుడు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.   ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ పొడిబారే చర్మానికి కూడా ఇలా చాలా నివారణా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి పాటించి ఇంట్లోనే  మన సమస్యని మనమే దూరం చేసుకుని హాయిగా ఉండచ్చు. ...కళ్యాణి

పనులు పెండింగ్ లో పడుతున్నాయా     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

ప్రత్యేకంగా కనపడండిలా   నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే దుస్తులతో పాటు యాక్ససరీస్ మీదా కూడా శ్రద్ధ పెట్టాల్సిందే. అతి మామూలుగా డ్రస్ వేసుకున్నా నప్పే యాక్ససరీస్ ఉపయోగిస్తే ఎంతో అందగా కనిపిస్తారు. మరి ఆ యాక్ససరీస్ని ఎంచుకునే సమయంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏమిటో చూద్దాం. * హేండ్ బ్యాగులని మన శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. కాస్త ఎత్తు తక్కువ ఉండేవారు పెద్ద బ్యాగుల జోలికి వెళ్లద్దు. అలాగే సన్నగా ఉన్నవారికి వెడల్పాటి బ్యాగులు కన్నాగుడ్రంగా ఉండే బ్యాగులే బాగా నప్పుతాయి. * మెడలో ధరించే నగల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎత్తు తక్కువ ఉన్నప్పుడు, లేదా లావుగా  ఉన్నప్పుడు మెడకు దగ్గరగా ఉండే నెక్లెసులు, చోకర్లు అంతగా నప్పవు. సన్నగా, పొడవుగా ఉండే చైన్స్ అయితే బాగుంటాయి. అదే మెడ సన్నగా, పొడుగ్గా ఉన్నవారు మెడకి దగ్గరగా ఉండే గొలుసులు వేసుకుంటే బావుంటుంది. * చెప్పులు ఎప్పుడూ మనం వేసుకున్న డ్రస్ ని డామినేట్ చేయకూడదు. వీలయితే మ్యాచింగ్ వేసుకోవచ్చు. లేదంటే బ్రౌన్, బ్లాక్ వంటి సాధారణ రంగుల్లో ఉంటే బాగుంటుంది. * ఆకర్షణీయమైన డ్రస్ వేసుకున్నప్పుడు చెవులకు కొంచం పెద్ద హేంగింగ్స్ పెట్టుకొని, మెడలో మాత్రం సింపుల్ చైన్ వేసుకుంటే బావుంటుంది. అదే డ్రస్ సింపుల్ గా ఉన్నప్పుడు గొలుసు కొంచం గ్రాండ్ గా ఉంటే బావుంటుంది. * చేతికి బంగారం గాజులు, మెడలో ముత్యాలు, ఇలా వైవిధ్యంగా కాకుండా అన్నీ ఒకేలా ఉండేటట్టు చూసుకోవాలి. యాక్ససరీస్ లో మీదైన ఓ శైలిని ఏర్పరచుకుంటే నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్రత్యేకంగా ఒకే రకమైన బ్యాగులు, నగలు, వంటివి మీదంటూ ఓ ముద్ర వేసేలా చేస్తాయి. మరి మీ స్టైల్ స్టేట్ మెంట్... ఎలా ఉండాలో నిర్ణయించుకోండి. -రమ

మరకలు పోవాలంటే ఇలా...     మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. తుప్పు మరకల బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది. నూనె మరకలు బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు. కాఫీ కప్పులపై పడే మరకలు ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి  అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి.   పెయింట్ మరకలు బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది. బాల్ పెన్  ఇంకు మరకలు పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి.     పట్టుచీరలపై మరకలు ఎంతో  ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు. చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా?                                                                                                 ----కళ్యాణి

ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో నవరాత్రులు తెలియజేస్తాయి! దేవీ నవరాత్రుల వెనుక కేవలం అమ్మవారి ఆరాధన మాత్రమే కాదు.. అమ్మవారి నవదుర్గ రూపాలతో ఆడపిల్లల జీవితానికి చాలా అనుబంధం ఉంది.  ముఖ్యంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ఆడపిల్లల జీవితాన్ని వ్యక్తం చేస్తాయి. శైలపుత్రి..  ఆడపిల్ల  మొదటి రూపం. ఆడపిల్ల పుట్టినప్పుడు  శైలపుత్రి అంటారు. ఈ దశలో తల్లిదండ్రులు ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటారు. బ్రహ్మచారిణి.. ఆడపిల్ల జీవితంలో రెండవ దశను ఈ  రూపం సూచిస్తుంది. ఈ దశ ఆడపిల్ల  బాల్యం నుండి యుక్తవయస్సుకు మారడాన్ని సూచిస్తుంది. చంద్రఘంట..  వివాహం వయసుకు వచ్చిన ఆడపిల్లను చంద్రఘంట దేవి తో పోలుస్తారు. వివాహం తర్వాత ఈ రూపాన్ని తీసుకుంటుంది. కూష్మాండ.. ఆడపిల్లలు వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత  తన కుటుంబంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతను పెంచుతూ వెలుగును పంచుతుంది. స్కందమాత.. వివాహం అనంతరం ఒక ఆడపిల్ల స్వయంగా తల్లి అయినప్పుడు ఆమెను స్కందమాతకు ప్రతిరూపంగా పూజిస్తారు. కాత్యాయని.. ఆడపిల్ల కుటుంబాన్ని రక్షించడానికి, ప్రతికూలత నుండి విముక్తి చేయడానికి శ్రమించడం కాత్యాయని అమ్మ రూపంలో స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది. కాళరాత్రి.. మహిళల జీవితంలో ఇబ్బందులు,  ప్రతికూల శక్తులను దైర్యంగా ఎదుర్కోవడం, వాటిని నాశనం చేయడంలో కాళరాత్రి రూపాన్ని దర్శించవచ్చు. మహాగౌరి.. జీవితం చివరి దశలో స్వచ్ఛత, త్యాగానికి ప్రతీకగా మహాగౌరి గోచరిస్తుంది. సిద్ధిదాత్రి.. ఆడపిల్ల జీవితాన్ని సంతోషంగా గడిపి చివరకు ముక్తిని పొందే రూపం సిద్ధిదాత్రి.

ఏ దేశమేగినా తప్పని వేధింపులు   ఆడది అర్ధరాత్రి నిర్భయంగా సంచరించడం గురించి గాంధీగారు చెప్పిన మాటలు సరేసరి... కనీసం పట్టపగలు ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయా అని అనుమానం కలిగే స్థితిలో ఉన్నాం. ఒళ్లు గగుర్పొడిచే అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా, అలాంటి ఘటనలు ఇక మీదట జరగవంటూ ప్రభుత్వాలు భరోసాను అందిస్తున్నా... పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఈ విషయాన్ని ధృవీకరించేందుకు బ్రిటన్‌కు చెందిన ‘యాక్షన్‌ ఎయిడ్‌’ అనే సంస్థ ఓ పరిశోదనను నిర్వహించింది. బ్రిటన్‌, ధాయ్‌లాండ్‌, బ్రెజిల్, ఇండియా... ఈ నాలుగు దేశాలలోనూ యాక్షన్‌ ఎయిడ్‌ కొన్ని గణాంకాలను సేకరించింది. సంపన్న దేశాలు మొదల్కొని, పేదరికపు అంచున ఉన్న ప్రాంతాల వరకూ స్త్రీలను వేధించడంలో ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదని ఈ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఈ నాలుగు దేశాలలోనూ నలుగురిలో ముగ్గురు ఆడవారు ఏదో ఒకరకమైన లైంగిక వేధింపుని ఎదుర్కొంటున్నారని తేలింది. దీంతో ఆడవారిని వేధించడం అనేది ఒక అంటువ్యాధిలా మారిపోయిందని యాక్షన్‌ ఎయిడ్‌ హెచ్చరిస్తోంది.   అసభ్యమైన పదాలు వాడటం, ఈలలు వేయడం, ఇబ్బంది కలిగించేలా చూడటం... ఇలా ఏదో ఒక తీరున ఆడవారిని వేధించడం మామూలైపోయింది. ఇరుకు సందుల దగ్గర్నుంచీ ప్రభుత్వ రవాణాల వరకూ... స్త్రీలు నడిచే ప్రతిదారిలోనూ వారికి వేధింపులు తప్పడం లేదని ఈ పరిశోధనలో తేలింది. ఇక అత్యాచారాల సంగతీ సరేసరి. హైస్కూలు కూడా దాటక ముందే బ్రెజిల్‌లో 22 శాతం మంది బాలికలు అత్యాచారానికి లోనవుతున్నారట. కాస్త మంచి బట్టలు వేసుకుని బయటకు రావడానికి కూడా భయపడుతున్నామని అక్కడి అమ్మాయిలు వాపోతున్నారట. అలాగని పోనీ ముసలివారన్నా కామాంధుల కంటపడకుండా ఉన్నారా అంటే అదీ లేదు. ధాయ్‌లాండ్‌లో సేకరించిన లెక్కల ప్రకారం 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో కనీసం 20 శాతం మంది ఆడవారు అత్యాచారానికి లోనైనట్లు తేలింది.   నగరజీవితంలో పొంచి ఉన్న వేధింపుల గురించి ప్రచారం చేసేందుకు గత ఏడాది నుంచి మే 20ని ‘Safe Cities for Women Day’గా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వేధింపులు తగ్గాలంటే ఎలాంటి మార్పులు రావాలి అన్నదే అసలు ప్రశ్న! మగవారి ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పు ఎలాగూ రావాలి. అదే సమయంలో ఆకతాయిల ఆటలు చెల్లకుండా ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి యాక్షన్‌ ఎయిడ్ వంటి సంస్థలు. వీధుల్లో సరైన విద్యుత్ వెలుగులు లేకపోవడం, పోలీస్ పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, ప్రభుత్వ రవాణాలో సైతం తగిన రక్షణ లేకపోవడం, ఆకతాయిలను చూసీచూడనట్లు వదిలేయడం... ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే అంటున్నారు. నగర జీవనంలో మగవారితో సమానంగా పరుగులెత్తుతున్న ఆడవారు, తమ కష్టానికి ఫలితంగా వేధింపులను ఎదుర్కోవడం ఎంత దురదృష్టమో కదా! మరి అలాంటి దుస్థితి మీద ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దృష్టిని సారిస్తాయేమో చూడాలి. - నిర్జర.