గ్లోయింగ్ స్కిన్ కావాలా? ఈ జ్యూస్ ఇంట్లోనే చేసుకుని తాగితే చాలు..!   గ్లోయింగ్ స్కిన్ ప్రతి అమ్మాయి కల.  ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటే చాలా మంది అమ్మాయిల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కూడా.  అయితే ఈ కాలంలో అది అంత ఈజీ కాదు.  ఆహారం, జీవనశైలి,  ఉద్యోగాలు,  చదువులు, కుటుంబ సంబంధాలు..  ఇలా ఒకటా రెండా ఆరోగ్యం దెబ్బతీసే కారణాలు ఎన్నో ఉంటాయి.  పైకి ఎలాంటి సమస్య లేదు అన్నట్టు అనిపించినా మనిషిలో ఉండే ఒత్తిడి,  అసహనం, చిరాకు,  అసౌకర్యం వంటివన్నీ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.  చర్మాన్ని వాడిపోయినట్టు కళావిహీనంగా  మారుస్తుంది.  అయితే ఇంట్లోనే ఒక్క జ్యూస్ తయారుచేసుకుని తాగడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.  అదేంటో తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన రీతిలో గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే దోసకాయ, పైనాపిల్ జ్యూస్ చక్కగా సహాయపడుతుంది.  దోసకాయ చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.  చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.  ఇది శరీరంలో మంటలను తగ్గిస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. దోసకాయ.. పైనాపిల్ జ్యూస్.. కావలసిన పదార్థాలు.. దోసకాయ.. పైనాపిల్.. పుదీనా.. నిమ్మరసం.. తయారీవిధానం.. దోసకాయ,  పైనాపిల్,  పుదీనా ఆకులు మిక్సీ జార్ లో వేసి బాగా మిక్సీ పట్టాలి.  దీన్ని ఒక గ్లాసులో పోసి అందులో నిమ్మరసం కలపాలి. దీన్ని నేరుగా తాగితే మంచిది.  మరింత ఆహ్లాదం కావాలి అంటే కాస్త ఐస్ క్యూబ్స్ కలుపుకోవచ్చు.  రుచికోసం తేనె జోడించుకోవచ్చు.                                             *రూపశ్రీ.

 ముఖాన్ని యవ్వనంగా,  ప్రకాశవంతంగా ఉంచే సీరమ్ ఇది..!   ప్రతి అమ్మాయి తన ముఖ చర్మం ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంది.  దీని కారణంగానే మార్కెట్లో బోలెడు రకాల ఫేస్ క్రీములు,  స్ప్రేలు, ఫేస్ ప్యాక్ లు, సీరమ్ లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి కావడం వల్ల ఇవి వాడితే కలిగే ఫలితాలు తాత్కాలికంగా ఉంటే.  వీటిని మానేసినప్పుడు ముఖ చర్మం మునుపటికంటే దారుణంగా ఉంటుంది.  కానీ ముఖ చర్మాన్ని ఇంటి పట్టునే ఆరోగ్యంగా,  యవ్వనంగా, కాంతివంతంగా మార్చే సీరమ్ ఉంది. దీన్ని స్వయానా చర్మ సంరక్ష నిపుణులే రికమెండ్ చేస్తన్నారు.  ఈ సీరమ్ ఏంటో.. దీన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. కొబ్బరినూనె అలోవెరా జెల్ పసుపు విటమిన్-ఇ క్యాప్సూల్ తయారీ విధానం.. పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని ఒక చిన్న కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.  దీన్ని ప్రతిరోజూ ముఖానికి పట్టించి 2 నుండి 3 నిమిషాలు ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి పొందుతుంది. ఇది ముఖంపై మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  మార్కెట్లో దొరికే రసాయనాలతో నిండిన సీరమ్ లకు బదులు దీన్ని వాడితే చర్మానికి ఎలాంటి హాని ఉండదు.  ఇది మాత్రమే కాకుండా ఇంటి పట్టున తయారుచేసుకోగలిగిన మరొక ఫేస్ సీరమ్ కూడా ఉంది.  అదెలా తయారుచేసుకోవాలి అంటే.. కావలసిన పదార్థాలు..  విటమిన్-సి క్యాప్సూల్స్.. 2    విటమిన్ ఇ  క్యాప్సూల్.. 1 రోజ్ వాటర్..  2 స్పూన్లు కలబంద జెల్.. 1 టీస్పూన్ గ్లిసరిన్.. 1 టీస్పూన్ ఒక చిన్న కంటైనర్ తయారు చేసే పద్ధతి.. ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్,  రోజ్ వాటర్ కలపాలి.  అందులో 2 క్యాప్సూల్స్ విటమిన్ సి,  1 క్యాప్సూల్ విటమిన్ ఇ కలపాలి. చివరగా గ్లిజరిన్ వేసి  బాగా   మిక్స్ చేయాలి.  ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో నిల్వచేసుకోవాలి.  దీన్ని  వారం పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. ఎలా ఉపయోగించాలి..  రాత్రి లేదా పగటిపూట నిద్రపోయే ముందు  ఈ  సీరమ్‌ను ముఖంపై అప్లై చేయవచ్చు. అయితే దీనికి ముందు ముఖాన్ని కడుక్కోవాలి.  తర్వాత  టోనర్‌ను అప్లై చేసి ఆ తరువాత సీరమ్‌ను అప్లై చేయాలి.  2 నుండి 3 నిమిషాల తర్వాత ఫేస్ క్రీమ్ రాసుకోవచ్చు.  దీన్ని   డే స్కిన్ కేర్‌లో అప్లై చేస్తే సన్‌స్క్రీన్ కూడా అప్లై చేయాలి.                                               *రూపశ్రీ.

జుట్టు బాగా రాలిపోతోందా...ఈ నాలుగు వాడితే సెట్! నేటి కాలంలో చాలామంది  జీవనశైలి దారుణంగా తయారైంది.  బయటి ఆహారం,  పానీయాల కారణంగా  శరీరంలో ప్రతి భాగం ఊహించని ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. ఇలా ప్రతికూలతలు కలిగే వాటిలో జుట్టు మరీ ముఖ్యమైంది. జుట్టు తెల్లబడటం, రంగు మారటం, చిన్నవయసులోనే బట్టతల, జుట్టు సామర్థ్యం తగ్గడం, పలుచగా మారడం ఇలా చాలా విధాలుగా జుట్టు దెబ్బతింటుంది.  ఇక జుట్టు రాలడం, తలలో చుండ్రు వంటి సమస్యల గురించి చెప్పక్కర్లేదు.  జుట్టు ఎక్కువగా రాలడం వల్ల బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆడవారిలో కూడా కనిపించడం చాలా విచారించాల్సిన విషయం.  దీని కోసం ప్రజలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు.  కానీ ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ప్రభావం కనిపించడం లేదు. అయితే  శరీరం అంతర్గతంగా పోషకాలను పొందినప్పుడు మాత్రమే జుట్టు బలంగా ఉంటుంది.  శరీరానికి ఏయే పదార్థాలు లభిస్తే జుట్టు బలంగా ఉంటుంది. వేటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుంటే వాటిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన, ధృడమైన జుట్టును పొందవచ్చు. అవేంటంటే.. క్యారెట్ విటమిన్ ఎ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను బాగా  ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా,  ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. గుడ్లు గుడ్డులో ఉండే ప్రొటీన్లు జుట్టును లోపలి నుండి దృఢంగా మార్చుతాయి. గుడ్లలో కూడా బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. మీ జుట్టు రాలుతున్నట్లయితే, విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం  ఉంటుంది. అవకాడో అవకాడోలో పొటాషియం, బి విటమిన్లు,  ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు  జుట్టును మందంగా చేస్తాయి.కాబట్టి ఆహారంలో అవోకాడోను చేర్చడానికి ప్రయత్నించండి.                                          *నిశ్శబ్ద

  ఐస్ ఫేషియల్ చేసే అలవాటు ఉందా? దీంతో ఎంత డేంజర్ అంటే..!   ఐస్ ఫేషియల్.. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది.  ఐస్ ముక్కలను ముఖం మీద రుద్దడం ఇందులో భాగం.  ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మెరుస్తుందని, ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగుంటుందని అంటారు.  చాలామంది అమ్మాయిలు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడానికి ఇష్టపడతారు కూడా. అయితే ఇది అందరూ చెప్పుకుంటున్నట్టు అంత ఆరోగ్యకరమైనది ఏమీ కాదని కొందరు చెబుతున్నారు. దీనికి కారణం ఐస్ ఫేషియల్ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం చాలా సున్నితంగా ఉండే వ్యక్తుల చర్మాన్ని ఇది మరింత దెబ్బతీస్తుంది. చాలా చల్లగా ఉన్న ఏదైనా ఎక్కువసేపు  చర్మానికి నేరుగా వర్తించినప్పుడు చర్మం రఫ్ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం తొందరగా దెబ్బతింటుంది. పగుళ్లు రావడం,  ఎర్రగా మారడం జరుగుతుంది. ఐస్ ఫేషియల్‌లో ఐస్  క్యూబ్‌ను నేరుగా ముఖంపై రుద్దితే అది చర్మంపై మంట లేదా చికాకు కలిగించవచ్చు. అందువల్ల కాటన్ లేదా హ్యాండ్‌కర్చీఫ్‌లో ఐస్ క్యూబ్‌ను ఉంచి దాంతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా ముఖానికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చేసుకున్న తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కొందరు ఐస్ పేషియల్ చేసుకోవాలనే  తొందరలో  ముఖం కడుక్కోకుండా ఐస్ ఫేషియల్ చేసుకుంటారు.  దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ చర్మ రంద్రాలలో బ్యాక్టీియా చిక్కుకుంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఐస్ ఫేషియల్ మంచిది కాదు.  ఇలా చేయడం వల్ల ముఖం మీద మంటగా అనిపిస్తుంది. అంతేకాకుండా ముఖం  చర్మం రంగు  కూడా నిస్తేజంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజూ ఐస్ ఫేషియల్స్ చేస్తే  ముఖంపై పింక్ రాషెస్ ఏర్పడవచ్చు. ఐస్ ఫేషియల్ చర్మంలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.  ఇప్పటికే ఏదైనా చర్మ సంబంధిత సమస్యతో  ఇబ్బంది పడుతున్నట్లైతే ఐస్ ఫేషియల్ చేయకపోవడమే మంచిది. ఐస్ ఫేషియల్ చేయడం వల్ల  చర్మం చాలా కఠినంగా మారుతుంది. చర్మం గీతలు పడిపోతుంది. ఐస్ ఫేషియల్ చెయ్యాలి అనుకుంటే ముఖం మీద నేరుగా ఐస్ ను అప్లై చేయకూడదు.                                           *రూపశ్రీ.  

ముఖం మీద నల్ల మచ్చలు తగ్గించే ఫేస్ ప్యాక్ లు..!     మచ్చలేని ముఖ సౌందర్యం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇది చాలామందికి సాధ్యం కాదు.  జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోన్ల సమస్యలు అన్నీ కలిసి అమ్మాయిల ముఖం మీద మచ్చలు ఏర్పరుస్తాయి. వీటిని తొలగించుకోవడానికి చాలామంది వివిధ రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు.  అయితే ముఖం మీద మచ్చలు తొలగించడంలో కొన్ని ఫేస్ ప్యాక్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని ఇంటి పట్టునే ట్రై చేయవచ్చు కూడా.. ముఖం మీద నల్ల మచ్చలు పోగొట్టే ఆ ఫేస్ ప్యాక్ లు ఏంటో తెలుసుకుంటే.. శనగపిండి ఫేస్ ప్యాక్.. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో చర్మంలోని మృతకణాలను తొలగించడంలో,  ముఖాన్ని అందంగా మార్చడంలో శనగపిండి  మంచి ప్రభావం  చూపుతుంది. దీనికోసం 2 చెంచాల శనగపిండి, ఒక చెంచా మిల్క్ క్రీమ్,  కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయవచ్చు. పసుపు, పెరుగు..   మచ్చలను తగ్గించుకోవడానికి పసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్  ఉపయోగించవచ్చు. దీనికోసం 2 చెంచాల సాదా పెరుగు తీసుకుని అందులో ఒక చెంచా పసుపు కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. చర్మంపై మెరుపు ఉంటుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి.  పసుపులోని లక్షణాలు మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కలబంద,  పసుపు.. కలబంద, పసుపు ఫేస్ ప్యాక్  ప్రభావం ముఖంపై బాగా  కనిపిస్తుంది. ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌లో అర టీస్పూన్ పసుపు కలపాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. అలోవెరా చర్మానికి హైడ్రేటింగ్ ను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తేనె  నిమ్మరసం..   2 చెంచాల తేనె,  ఒక చెంచా తాజా నిమ్మరసం రెండూ కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. మచ్చలను తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయవచ్చు. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,  నిమ్మకాయలోని ఆస్ట్రింజెంట్ గుణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తాయి. ముల్తానీ మట్టి,  రోజ్ వాటర్.. మచ్చలను తగ్గించడానికి 2 టీస్పూన్ల ముల్తానీ మట్టిని తగినంత రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిపోయే వరకు ముఖంపై ఉంచి తర్వాత కడిగేయాలి. ముల్తానీ మట్టి ముఖంలోని అదనపు ఆయిల్ ను, మలినాలను తొలగించి చర్మానికి మెరుపును తెస్తుంది.                                              *రూపశ్రీ.

బొప్పాయి పండు మాత్రమే కాదండోయ్.. దాని తొక్కలు, విత్తనాలు కూడా అద్భుతం చేస్తాయ్..!     బొప్పాయి ఆరోగ్యకరమైన పండు. ఎర్రగా పండిన బొప్పాయి రుచిని మాటల్లో చెప్పలేం.  అయితే అందరూ బొప్పాయి  పండు తిని తొక్క, విత్తనాలు పడేస్తుంటారు.  కానీ బొప్పాయి పండు మాత్రమే కాకుండా తొక్క, విత్తనాలు కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  అవేంటో తెలుసుకుంటే ఇక మీదట బొప్పాయి తొక్కలు, విత్తనాలు పడేయకుండా ఉపయోగించుకోవచ్చు. బొప్పాయి తొక్కల ప్రయోజనాలు.. బొప్పాయి తొక్కలను మెత్తగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలపాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఆరిన తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బొప్పాయి ఫేస్ ప్యాక్‌ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ అవాంఛిత రోమాలు పెరగడాన్ని తగ్గిస్తుంది.  ముఖంపై వెంట్రుకలను వదిలించుకోవాలనుకుంటే బొప్పాయి తొక్కను ఉపయోగించవచ్చు. బొప్పాయి తొక్కలో ఉండే ఎంజైమ్‌లు మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి తాజాదనాన్ని కలిగిస్తుంది. ఈ పీల్స్‌ను స్క్రబ్‌గా వాడచ్చు, ఆ తరువాత ముఖాన్ని కడగాలి. బొప్పాయి తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు ఉన్న ప్రదేశంలో  బొప్పాయి తొక్కను రుద్ది 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. బొప్పాయి తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు,  ఎంజైమ్‌లు చర్మం  వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. తద్వారా ముడతలు తగ్గుతాయి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. బొప్పాయి గింజల ప్రయోజనాలు.. బొప్పాయి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే నేచురల్ స్క్రబ్ లా పనిచేస్తుంది. దీంతో చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. బొప్పాయి గింజల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి మృదువుగా ఉంచుతాయి. సీడ్ పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడగాలి. బొప్పాయి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంలో మంటను తగ్గించి చర్మాన్ని కూల్ గా  ఉంచుతాయి.  బొప్పాయి గింజల పేస్ట్ ను మంట ఉన్న ప్రాంతాలలో పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.                                                         *రూపశ్రీ.

కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నాయా? ఇలా ఈజీగా వదించుకోవచ్చు..!   కళ్ల కింద నల్లని వలయాలు చాలామందిని ఇబ్బందికి గురిచేస్తాయి.  ఈ నల్లని వలయాలు అమ్మాయిలను వయసు పైనబడినట్టు చూపెడతాయి. అంతేనా ముఖం ఎంత బాగున్నా, ఎంత అందంగా ఉన్నవారు అయినా నల్లని వలయాల కారణంగా వికారంగా కనిపిస్తుంటారు. ఈ నల్లని వలయాలు వదిలించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే బ్యూటీ క్రీమ్ లు వాడుతుంటారు. కానీ వీటి వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇంట్లోనే ఈజీగా నల్లని వలయాలు ఎలా వదిలించుకోవచ్చు.  అదెలాగంటే.. దోసకాయ ముక్కలు.. దోసకాయలు చల్లదనాన్ని ఇవ్వడంలోనూ,  చర్మాన్ని కాంతివంతం చేయడంలోనూ దోహదపడే లక్షణాలు కలిగి ఉంటాయి. తాజా దోసకాయను మందపాటి ముక్కలుగా చేసి, వాటిని 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. చల్లబడిన దోసకాయ  ముక్కలను  మూసిన కళ్లపై  ఉంచి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సరైన ఫలితాల కోసం దీన్ని రోజుకు రెండుసార్లు చేయాలి. టీ బ్యాగ్స్.. గ్రీన్ లేదా బ్లాక్ టీ  బ్యాగ్‌లలో  ముఖ్యంగా కెఫీన్  వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో,  డార్క్ సర్కిల్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. రెండు టీ బ్యాగ్‌లను వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచాలి.  టీ బ్యాగ్‌లను తీసివేసి వాటిని 20 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.  చల్లబడిన  టీ బ్యాగ్‌లను  మూసిన కళ్లపై 15-20 నిమిషాలు ఉంచాలి.  తర్వాత చల్లటి నీటితో  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  దీన్ని రోజూ ఫాలో అవుతుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. బంగాళదుంప .. బంగాళదుంపలలో సహజ బ్లీచింగ్ ఏజెంట్లు,  విటమిన్లు ఉంటాయి.  ఇవి నల్లటి వలయాలను తగ్గించడంలో  సహాయపడతాయి. ఒక పచ్చి బంగాళాదుంపను తురుమి  రసం తీయాలి.  బంగాళాదుంప రసంలో రెండు కాటన్ బాల్స్‌ను నానబెట్టి వాటిని  మూసిన కళ్లపై ఉంచాలి.  ఈ కాటన్ బాల్స్ ను  10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో  ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా కాటన్ బాల్స్ ను ఉంచడమే కాకుండా వీటికి బదులుగా నేరుగా  బంగాళాదుంప ముక్కలను కళ్ళపైన ఉంచవచ్చు. మెరుగైన  ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ రెమెడీని ప్రయత్నించాలి. ఆల్మండ్ ఆయిల్, తేనె.. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.  ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అర టీస్పూన్ తేనెలో కొన్ని చుక్కల బాదం నూనె కలపాలి.  పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని  కళ్ల చుట్టూ రాసి మృదువుగా మసాజ్ చేయాలి.  రాత్రంతా అలాగే ఉంచి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.  మెరుగైన ఫలితాల కోసం దీన్ని రోజూ ప్రయత్నించాలి. టమోటో, నిమ్మరసం.. టొమాటోల్లో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది డార్క్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.  నిమ్మరసం బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక టీస్పూన్ తాజా టమోటా రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.  ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్‌తో డార్క్ సర్కిల్స్‌ పై అప్లై చేయాలి. ఇది కళ్లలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.  10 నిమిషాలు దీన్ని అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితాల కోసం రోజుకు రెండుసార్లు దీన్ని ఫాలో కావాలి.                                          *రూపశ్రీ.  

నలుపు ఈజీగా పోగొట్టే చిట్కాలు తెలుసా..?   అమ్మాయిలలో అందం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే అమ్మాయిలు చాలా అందంగా, హుందాగా తయారు కావడానికి ఇష్టపడతారు. కొందరు ప్యాషన్ దుస్తులు ధరించడానికి, ముఖ్యంగా స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. దీనికి కారణం అండర్ ఆర్మ్ నల్లగా ఉండటం.  చంకల కింద నలుపు కారణంగా కొన్ని అందమైన దుస్తులు వేసుకోలేక బాధపడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. అయితే ఈ నలుపును ఇంటి దగ్గరే ఈజీగా తొలగించుకోవచ్చు. అందుకోసం కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కావలసిన పదార్థాలు.. కాఫీ పొడి.. కోల్గేట్ టూత్ పేస్ట్.. పసుపు..   రోజ్ వాటర్.. పైన చెప్పుకున్న మిశ్రమాలలో కాఫీ పొడిని ఒక చిన్న కప్పులో తీసుకుని అందులో కోల్గేట్ పేస్ట్,  చిటికెడు పసుపు,  రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్స్ చేయాలి.  దీన్ని చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో పట్టించి 10నిమిషాలు అలాగే వదిలేయాలి.  తరువాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.  ఈ టిప్ ను వారానికి ఒక్కసారి అయినా ఫాలో అవుతుంటే కేవలం 15 రోజులలోనే తేడా స్పషంగా కనిపిస్తుంది. చంకల కింద, మెడ వెనుక భాగంలో ఉండే నలుపు తగ్గించుకోవడానికి మరొక చిట్కా కూడా ఉంది.  ప్రతి రోజూ తాజా కలబంద జెల్ ను చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో, మెడ వెనుక నల్లగా ఉన్న ప్రాంతంలో పూయాలి. 15 నుండి 20 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా టూత్ పేస్ట్,  అర చెంచా ఉప్పు వేసి మెడ వెనుక నలుపు ఉన్న ప్రాంతంలో,  చంకల కింద నలుపు ఉన్న చోట అప్లై చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే 15 రోజుల్లోనే ఫలితం ఉంటుంది.                                      *రూపశ్రీ.

వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు నిజాలేంటంటే..! జుట్టు పెరుగుదలకు సంబంధించి చాలా రకాల టిప్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో ఉల్లిపాయ జ్యూస్ నుండి హెయిర్ ప్యాక్ లు, హెయిర్ డైలు, హెన్నా ట్రిక్స్ తో పాటూ జుట్టుకు బియ్యం నీరు ఉపయోగించడం వరకు చాలా ఉన్నాయి. అయితే జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదేనని చాలా మంది అంటారు. జుట్టుకు రైస్ వాటర్ అప్లై చేస్తే జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందని, జుట్టు పట్టు కుచ్చులా మారుతుందని అంటుంటారు కూడా. అయితే జుట్టుకు  రైస్ వాటర్ అప్లై చేస్తే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? దీని వెనుక నిజమెంత తెలుసుకుంటే..  జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రైస్ వాటర్  ఒక గొప్ప మార్గమని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. నిజానికి  జుట్టు పెరుగుదలకు ఈ సాధారణ పద్ధతి అంత ఉపయోగపడదు. జుట్టు బాగా పెరగాలంటే  వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయాలి. దీని తరువాత జుట్టు పెరుగుదలను,  దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి రైస్ వాటర్ రెసిపీని ఫాలో కావచ్చు. బియ్యం నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు,  ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే వేసవిలో వెంట్రుకలకు రైస్ వాటర్ అప్లై చేసే సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రైస్ వాటర్ ఎలా  చేయాలి.. ముందుగా బియ్యాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. నీరు క్లీన్ గా కనిపించేవరకు బాగా కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కడిగిన బియ్యాన్ని వేసి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. దీని తరువాత నీటిని ఫిల్టర్ చేసి ఒక పాత్రలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని గాజు పాత్రలో నింపి 12 నుండి 24 గంటలపాటు మూసి క్లోజ్ చేసి ఉంచాలి.  దీన్ని 1 వారం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు. ఎలా అప్లై చేయాలంటే.. హెయిర్ వాష్ తర్వాత బియ్యం నీటిని కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా దీన్ని హెయిర్ మాస్క్‌గా కూడా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ చెయ్యవలసిన ముఖ్యమైన పని ఏంటంటే  బియ్యం నీటిలో కొన్ని చుక్కల కలబంద,  ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి హెయిర్ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవాలి.                                      *నిశ్శబ్ద.

  ఎర్ర చందనం ముఖానికి చేసే మేలు తెలుసా?     ఎర్ర చందనం..  భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఈ వృక్షాలకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది.  పుష్ప సినిమా వల్ల ఎర్ర చందనం గురించి తెలియని వారికి కూడా చాలా స్పష్టంగా దీని గురించి తెలిసొచ్చింది.  అయితే దీనికి మార్కెట్లో ఉన్న విలువ, మార్కెటింగ్ రాజకీయల గురించి పక్కన పెడితే ఎర్ర చందనం ఆరోగ్యపరంగానూ,  సౌందర్య పరిరక్షణలోనూ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎర్ర చందనం వాడటం వల్ల చర్మానికి కలిగే లాభాలేంటంటే.. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.. ఎర్రచందనం చర్మానికి  మెరుపును ఇస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఛాయ చేకూర్చడంలో సహాయపడుతుంది. ఎర్రచందనాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే వాడిపోయిన చర్మానికి పునరుజ్డీవాన్ని ఇస్తుంది.  చర్మం  సహజ కాంతితో మెరిసిపోయేలా చేస్తుంది. మొటిమలు తగ్గిస్తుంది.. మొటిమలు చాలా మందికి చాలా చిరాకు తెప్పిస్తాయి.  అయితే ఎర్ర చందనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇది మంటను , ఎరుపును తగ్గించడానికి..  మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.  మొటిమల బారినపడే చర్మాన్ని సమర్థవంతంగా ట్రీట్ చేస్తుంది. మచ్చలు తగ్గిస్తుంది.. మొటిమల మచ్చలు, మచ్చలు,  చర్మం మీద నలుపు, ఎరుపు రంగు గుర్తులు ఉంటే ఎర్ర చందనం వాటిని క్రమక్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.  చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఇందులో ఉంటాయి. ఇవి చర్మపు రంగును సమం చేయడంలో సహాయపడతాయి.  మచ్చల పరిమాణాన్ని కూడా తగ్గిస్తాయి, కాలక్రమేణా  మృదువైన,   మచ్చలేని చర్మం సొంతమవుతుంది. జిడ్డు అరికడుతుంది.. చర్మంలో చాలా రకాలుంటాయి. వీటిలో జిడ్డు చర్మం కూడా ఒకటి. అధిక జిడ్డు రంద్రాలు మూసుకుపోయి పగుళ్లకు దారి తీస్తుంది. ఎర్రచందనం సహజ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది, సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.  చర్మం సహజమైన తేమను తొలగించకుండా జిడ్డును నియంత్రిస్తుంది.  చర్మ సంరక్షణ దినచర్యలో ఎర్రచందనం కలపడం వల్ల  చర్మం సమతుల్యంగా,  రిఫ్రెష్‌గా ఉంటుంది. యాంటీ ఏజింగ్.. సన్నని గీతలు, ముడతలు,  చర్మం వాడిపోవడం వంటి వృద్ధాప్య సమస్యలు  చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఎర్ర చందనం వాటిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఎర్ర చందనాన్ని క్రమం తప్పకుండా ముఖానికి రాసుకుంటూ ఉండే ముడతలు వచ్చే ప్రక్రియ నెమ్మదిస్తుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.                                                     *రూపశ్రీ.  

జుట్టును స్మూత్ గా మార్చే అలోవెరా సీరమ్.. ఇలా తయారుచేసేయండి..!   కలబంద ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఉంటుంది.  మొక్కలు  పెంచుకోవడానికి స్థలం లేనివారు చిన్న కుండీలలో అయినా సరే అలోవెరా మొక్కను పెంచుతూ ఉంటారు. చాలామంది దీన్ని పెంచడమే తప్ప దేనికి ఉపయోగించరు. కానీ అమ్మాయిలు మాత్రం బ్యూటీ చిట్కాలలో కలబందను విరివిగా వాడేస్తుంటారు.  ముఖ సౌందర్య చిట్కాలలోనూ, జుట్టు సంరక్షణలోనూ  కలబందను చాలా ఎక్కువగా వాడుతారు. జుట్టు స్మూత్ గా  సిల్కీగా ఉండాలంటే అలోవెరాను వాడటం మంచిది.  అలోవెరాలో కేవలం మూడు పదార్థాలు కలిపితే చాలు ఇంట్లోనే అలోవెరా సీరమ్ తయారైపోతుంది. దీనికోసం ఏం కావాలో..  దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. తాజా అలోవెరా జెల్..  1 స్పూన్.. రోజ్ వాటర్.. 2 స్పూన్లు.. బాదం నూనె.. 1 టీస్పూన్.. టీ ట్రీ  ఆయిల్..  4-5 చుక్కలు పై పదార్థాలను అన్నింటిని ఒక కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇది మరీ జిడ్డుగా, చిక్కగా ఉండకూడదు.  అలా అనిపిస్తే మరికాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ ను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.  దీన్ని రాత్రి పడుకునే ముందు జుట్టు మూలాలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.  రాత్రంతా అలాగే వదిలేయాలి.  మరుసటి రోజు ఉదయాన్నే సాధారణ నీటితో జుట్టును కడిగేయాలి. ఈ సీరమ్ ను కొన్ని రోజులపాటూ వాడుతుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలోవెరా సీరమ్ ప్రయోజనాలేంటంటే.. అలోవెరా జెల్ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇది జుట్టును మాయిశ్చరైజ్ చేస్తుంది. తల చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది.  ఈ సీరమ్ ను అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. చీలిపోయిన జుట్టు చివర్లను రిపేర్ చేస్తుంది. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు.  పైపెచ్చు జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా పెరగడంలో కూడా సహాయపడుతుంది.                                                    *రూపశ్రీ. 

ముఖ చర్మం రంధ్రాలు తగ్గించడం ఎలాగో తెలుసా? కొందరికి ముఖం మీద చర్మం రంధ్రాలలా కనబడుతుూ ఉంటుంది. ఇది చర్మ గంధ్రులు తెరచుకోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ తెరచుకున్న రంధ్రాల కారణంగా మొటిమలు, మచ్చలు, దుమ్ము, ధూళి పేరుకోవడమే కాదు.. చర్మం చాలా తొందరగా ముడుతలు పడినట్టు, వృద్దాప్యం మీద పడినట్టు అనిపిస్తుంది. చర్మం మీద ఉన్న ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించడం కష్టమే కానీ అసాద్యం మాత్రం కాదు. చాలా మంది వీటని తగ్గించుకోవడానికి వాణిజ్య ఉత్పత్తులను వాడుతుంటారు.  ఇవి వాడినంత సేపు చర్మం బిగుతుగా, రంధ్రాలు లేకుండా ఉంటుంది. కానీ తరువాత మళ్లీ మొదటికి వస్తుంది.  అలా కాకుండా ఇంటి పట్టునే సులువైన చిట్కాలతో ఈ ఓపెన్ పోర్స్ ను తగ్గించుకోవచ్చు.  అందుకోసం ఫాలో కావాల్సిన చిట్కాలు ఇవీ.. ఐస్.. ఓపెన్ పోర్స్ తగ్గించుకోవడానికి మంచు ముక్కలు బాగా సహాయపడతాయి. ఒక క్లాత్ లో మంచుముక్కలు ఉంచి ఆ క్లాత్ ను 15 నుండి 30 సెకెన్ల పాటు ముఖ చర్మం మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మాన్ని బిగుతుగా చేయడం, చర్మ రంధ్రాలు మెల్లిగా తగ్గడం జరుగుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్.. నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్ ను సమాన భాగంలో తీసుకోవాలి. దీంట్లో కాటన్ బాల్ ముంచి ఈ ద్రావణాన్ని ముఖమంతా పట్టించాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత ముఖాన్ని కడిగేయాలి.  యాపిల్ సైడర్ వెనిగర్ లో  ఉండే అస్ట్రింజెంట్ గుణాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో సహాయపడతాయి. గుడ్డు తెల్ల సొన.. గుడ్డులో ఉండే తెల్లసొన చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. గుడ్డు తెల్ల సొనను చర్మానికి అప్లై చేసి 15నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, రంధ్రాలను చిన్నగా చేయడంలో సహాయపడతాయి. టమోటా  మాస్క్.. మిక్సీలో టమోటా వేసి  పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ వేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. టమోటాలో ఉండే సహజ ఆమ్లత్వం చర్మ రంధ్రాలను బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. బేకింగ్ సోడా స్క్రబ్.. కొద్దిగా బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి వృత్తాకారంగా చర్మం మీద స్క్రబ్ చేయాలి. ఆ తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మృతకణాలను తొలగిస్తుంది.  మూసుకుపోయిన చర్మరంధ్రాలను క్లియర్ చేస్తుంది. గ్రీన్ టీ.. గ్రీన్ టీ చర్మానికి చాలా మేలుచేస్తుంది. కాటన్ బాల్ ఉపయోగించి  గ్రీన్ టీని ముఖానికి అప్లై చెయ్యాలి. ఆ తరువాత 15 నిమిషాలు అలాగే ఉంచి   ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ రంధ్రాలను బిగించి జిడ్డును తగ్గించడంలో సహాయపడతాయి. రంధ్రాలను బిగుతు చేస్తాయి. కలబంద.. స్వచ్చమైన కలబంద తెరుచుకున్న రంధ్రాలను తిరిగి సాధారణం చెయ్యడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును అప్లై చేసి 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. కలబందలో ఉండే గుణాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి.  రంధ్రాలను బిగుతుగా ఉంచుతాయి.                                                     *నిశ్శబ్ద. 

 పొడవాటి కనురెప్పల కోసం అల్టిమేట్ ట్రిక్స్ ! అందమైన కళ్ళు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. కళ్ల అందం కోసం, వెంట్రుకలు నల్లగా, మందంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా మంది తమ వెంట్రుకలు నల్లగా,  మందంగా చేయడానికి ఆర్టిఫిషయల్ ఐస్లాష్ వాడుతుంటారు. అయితే సహజసిద్ధంగా కూడా కనురెప్పలను అందంగా మార్చుకోవచ్చు. వెంట్రుకలను మందంగా, నల్లగా మార్చే సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం.  ఈ హోం రెమెడీస్ తో మీరు వెంట్రుకలను ఆకర్షణీయంగా, అందంగా మార్చుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ: కనురెప్పలు నల్లగా, మందంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై రాయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పొడవుగా, మందంగా, ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి. గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కనురెప్పల వెంట్రుకలను పొడవుగా చేయడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ టీ తాగడం,  కనురెప్పల మీద అప్లై చేయడం వల్ల కూడా కనురెప్పలు అందంగా తయారవుతాయి. విటమిన్ ఇ: విటమిన్ ఇ కనురెప్పల జుట్టు పెరుగుదలకు చాలా మేలు చేస్తుంది. మీరు మార్కెట్లో విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీనితో మీరు వెంట్రుకలపై జుట్టు రాలడం సమస్య నుండి కూడా బయటపడవచ్చు. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు కనురెప్పల పెరుగుదలకు సహాయపడతాయి. దీన్ని కనురెప్పలపై అప్లై చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా మందంగా, పొడవుగా మారుతాయి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. కొబ్బరి నూనె కనురెప్పలకు కూడా మేలు చేస్తుంది.  

మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు! అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్‌ లెస్‌ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి . 2. స్క్రబింగ్‌ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్‌ సెల్స్‌, టాక్సిన్స్‌ తొలగుతాయి. స్క్రబ్‌ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్‌ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్‌ చేయవద్దు. 3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్‌ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్‌గా హ్యాండిల్‌ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం, ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్‌ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌, విటమిన్‌ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉంటుంది. 6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్‌ కారణంగా.. పిగ్మెంటేషన్‌, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపండి.

ఫేషియల్ తరువాత ఈ తప్పులు అస్సలు చేయొద్దు! అమ్మాయిలు ఆరోగ్యం కంటే కూడా చర్మసంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే అందం ఎప్పుడూ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో  ఆరోగ్యంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో శరీరంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు చాలా  వస్తాయి. మరీ ముఖ్యంగా ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. సూర్యరశ్మి కారణంగా చర్మం కమిలిపోవడం, రంగు మారడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, మహిళలు తమ ముఖానికి ఫేషియల్ చేయించుకుంటారు. ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగి, ముఖచర్మం  శుభ్రపడుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. కానీ వందలాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకున్నా, ఇంట్లో సొంతంగానే పేషియల్ చేసుకున్నా.. ఫేషియల్ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్న వయసులోనే ముసలితనం మొదలవుతుందని మీకు తెలుసా? చాలా మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. ఫేషియల్ చేయించుకున్న తర్వాత కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి పాటించకపోతే.. ఫేషియల్స్  అందాన్ని ఇవ్వడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఫేషియల్ తరువాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. మేకప్‌కు దూరంగా ఉండాలి.. ఫేషియల్ చేసినప్పుడు ముఖ చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాంటి సమయంలో  వెంటనే మేకప్ చేస్తే, అది చర్మ సమస్యలను కలిగిస్తుంది.మేకప్ తాలూకూ రసాయనాలు చర్మరంధ్రాల్లోకి చొచ్చుకెళ్లి చర్మానికి నష్టం చేకూరుస్తుంది. సూర్యరశ్మికి గురికాకూడదు.. ఫేషియల్ చేసిన వెంటనే ఎండలోకి వెళ్లకూడదు. పార్లర్ నుంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలో, దుమ్ములో బయటికి వెళితే దుమ్ము, ధూళి, గాలిలో ఉండే వాహనాల పొగ, సూర్యకిరణాల ప్రభావం అన్నీ కలిపి చర్మాన్ని తొందరగా పాడుచేస్తాయి. బ్యూటీ పార్లర్ లో ఫేషియల్ చేయించుకున్న తరువాత స్కూటీ ప్రయాణం మానుకోవాలి, ఆటోలో వెళ్లడం మంచిది. స్యూటీలో వెళ్ళాలి అంటే ముఖానికి స్కార్ఫ్  వాడటం మరచిపోకూడదు.  ఫేస్‌వాష్‌తో అస్సలు చేయొద్దు..  ఫేషియల్ చేయించుకున్న తరువాత  రోజు మొత్తం  ఫేస్‌వాష్‌ని ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. పొరపాటున ఫేస్ వాష్ ఉపయోగిస్తే ఫేషియల్ ద్వారా చర్మానికి అందిన మృదుత్వం పోతుంది. ఫలితంగా ఫేస్ వాష్ లో రసాయనాల వల్ల చర్మరంధ్రాలు దెబ్బతిని ఓపెన్ పోర్స్ సమస్యకు దారితీస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.. ఫేషియల్ తర్వాత చర్మ సంరక్షణ ఉత్పత్తులను  దూరంగా ఉంచాలి . ఫేషియల్  ముఖచర్మం లోపలివరకు ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిలో చర్మసంరక్షణ ఉత్పత్తులు వాడితే అందులో ఉన్న రసాయనాల వల్ల చర్మం మరింత సున్నితమైపోయి దారుణంగా దెబ్బతింటుంది. అందుకే ఫేషియల్  తర్వాత  స్క్రబ్ చేయడం, ఇతర ఉత్పత్తులు వాడటం చేయకూడదు.                                    ◆నిశ్శబ్ద.

ముఖం పొడిబారి వాడిపోయినట్టుందా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే! వాతావరణం మారేకొద్ది శరీరం కూడా మార్పులకు లోనవుతుంది. వర్షాల వల్ల వాతావరణం చలిగానూ, చిరాగ్గానూ మారుతుంది. ఈ వాతరణం దాటికి నీరు తక్కువగా తాగుతుంటారు. ఇక ముఖ చర్మం కూడా చాలావరకు పగులుతుంది, మరికొందరికి శరీరంలో నీటిశాతం తక్కువ ఉండటం వల్ల చర్మం పొడిబారుతుంది. ఇది తొందరగా దురదలు, దద్దుర్లు, గాయాలకు దారితీస్తుంది. దీనికి విరుగుడుగా వీలైనంత వరకు నీటిని సమృద్దిగా తాగాలి. దీంతోపాటు తేమ కోల్పోయిన చర్మాన్ని, పగిలిన చర్మాన్ని తిరిగి రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్ లు, లోషనల్ లు అక్కర్లేదు. పొడిబారిన, పగిలిన ముఖ చర్మాన్ని పైసా ఖర్చు లేకుండా మన ఆహారంలో భాగమైన ఒక పదార్థాన్ని ఉపయోగించడం వల్ల చక్కదిద్దుకోవచ్చు. ఇంతకూ అందరికీ అందుబాటులో ఉండే ఆ పదార్థం ఏంటి?? దాన్ని ఎలా ఉపయోగించాలి? తెలుసుకుంటే… ప్రతి ఇంటి వంటిట్లో తప్పనిసరిగా ఉండేది పెరుగు. పెరుగు కేవలం కడుపుకు చల్లదనాన్ని ఇవ్వటమే కాదు.. పొడిబారిన ముఖచర్మాన్ని రిపేర్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా తేమగా మారుస్తుంది. ఇందుకోసం పెరుగును ఎలా ఉపయోగించుకోవాలంటే.. పెరుగు, శనగపిండి.. చలికాలంలో చాలామంది సోప్ వాడటం మానేసి శనగపిండి ఉపయోగిస్తారు. అయితే ఈ శనగపిండి, పెరుగు రెండు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి మెరుపును ఇవ్వటమే కాకుండా ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. పెరుగు, శనగపిండి రెండు మిక్స్ చేసి పేస్ట్ చేసుకుని ముఖానికి పట్టించాలి. దీన్ని 15నిమిషాలు ఉంచి తరువాత కడిగేయాలి. పెరుగు, బియ్యం పిండి.. ఇది మంచి ఫేస్ ప్యాక్ కమ్ స్క్రబ్. పెరుగు, బియ్యం పిండి కలిపి మిక్స్ చేసి దీన్ని ముఖానికి పట్టించాలి. ఇది ప్యాక్. ఈ ప్యాక్ ఆరిన తరువాత దీన్ని స్క్రబ్ లాగా రుద్దుతూ తొలగించాలి పెరుగు, తులసి.. 7 నుండి 10 తులసి ఆకులను గ్రైండ్ చేసి దానికి పెరుగు కలపాలి. మందపాటి పేస్ట్‌లా చేసి, ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ సెప్టిక్ లక్షణాలు మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తాయి. ముఖాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు  పసుపు పెరుగు, పసుపు రెండూ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల l ట్యానింగ్ తగ్గుతుంది.  పెరుగు తేనె.. తేనెను ఉపయోగించడం ద్వారా,  ముఖంపై తేమ లోపాన్ని తొలగించవచ్చు. ప్యాక్ చేయడానికి, రెండు పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకొని ముఖానికి 15 నిమిషాలు అప్లై చేయాలి. కొంత సమయం తరువాత దీని ఫలితం కనిపిస్తుంది.                                            *నిశ్శబ్ద.

మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..! ప్రతి ఒక్కరూ శుభ్రమైన,  మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్‌లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.  వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి. గంధం,  గులాబీ రేకుల పేస్ట్.. గంధం,  గులాబీ రేకుల పేస్ట్  శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది  సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది.   గంధం,  గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్  చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది. కావలసినవి - 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి ఒక పిడికెడు  ఎండు గులాబీ రేకులు 1 టేబుల్ స్పూన్  పెరుగు ఎలా చేయాలి ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి  పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.   కుంకుమ పువ్వు, పాలు.. సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి  సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి. కావలసినవి:  కుంకుమపువ్వు రేకలు  2 టేబుల్ స్పూన్ల పాలు   1టేబుల్ స్పూన్  శనగపిండి ఎలా చేయాలి..  కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని  నానబెట్టాలి. ఇప్పుడు శనగపిండిని అందులో  వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వేప తులసి పేస్ట్.. వేప,  తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని  ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం  సొంతం అవుతుంది. కావలసినవి.. ఒక పిడికెడు వేప ఆకులు ఒక పిడికెడు తాజా తులసి ఆకులు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి ఎలా చేయాలి..  వేప,  తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్‌లో కలపాలి. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి. గంధం, బాదం పేస్ట్.. గంధం,  బాదంతో  తయారుచేసుకున్నపేస్ట్  చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని   ఇస్తుంది కావలసినవి.. 2 టేబుల్ స్పూన్ గంధపు పొడి 1 టేబుల్ స్పూన్  బాదం పొడి 1 టేబుల్ స్పూన్  తేనె కొన్ని చుక్కల పాలు ఎలా తయారు చేయాలి.. గంధం  బాదం పేస్ట్  కోసం చందనం, బాదం పొడి  ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె,  తగినంత పాలు జోడించాలి.  దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న  స్క్రబ్స్  చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి.  ఇవన్నీ  సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే  ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.                                           *నిశ్శబ్ద.   

తెల్లజుట్టు ఎక్కడైనా కనబడగానే చాలామంది గాభరా పడిపోతారు. ఒకే ఒక్కటి ఉంటే దాన్ని లాగేయడం చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటే  వాటిని కవర్ చేయడానికి నానా తంటాలు పడతారు. అయితే తెల్లజుట్టును కవర్ చేయడానికి వాడే చాలా వాణిజ్య ఉత్పత్తులలో రసాయనాలుంటాయి. ఇవి జుట్టుకు రంగును తాత్కాలికంగా ఇస్తాయి కానీ మెదడులోపలి నరాలను చాలా దెబ్బతీస్తాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చే ఆకులు ఉన్నాయి. అవే గోరింట, నీలిమందు.. గోరింట.. గోరింట సాధారణంగా అందరికీ తెలిసిందే. ఇది చేతులకు మాత్రమే కాకుండా తెల్లజుట్టు కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సహజమైన కలర్ గా పేర్కొనబడుతుంది. నీలిమందు.. సాధారణంగా నీలిమందును బట్టలకు వాడటమే తెలిసి ఉంటుంది. కానీ నీలిమందును గోరింటలో కలిపి జుట్టుకు పెట్టుకుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. గోరింట, నీలిమందు హెయిర్ డై.. జుట్టు పరిమాణాన్ని బట్టి  గోరింట పొడిని తీసుకోవాలి. ఈ గోరింట పొడిలో టీ పొడి ఉడికించిన నీటిని వేసి పేస్ట్ లాగా కలపాలి. ముదురు రంగు రావడం కోసం ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలపవచ్చు. గోరింట మిశ్రమాన్ని రాత్రంతా ఒక ఇనుప బాండిలోనే ఉంచాలి. మరుసటి రోజు గోరింట మిశ్రమంలో గోరింట పొడి కంటే ఎక్కువ  నీలి మందు పొడి వేయాలి. దీన్ని పేస్ట్ లా చేసుకోవడానికి ఇందులో పెరుగు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ఓ  గంటసేపు  అలాగే వదిలేయాలి.  ఆ తరువాత దీన్ని జుట్టును పాయలు పాయలుగా తీసుకుంటూ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. కనీసం రెండు నుండి మూడు గంటల పాటూ దీన్ని ఉంచుకోవాలి. ఈ హెయిర్ డై ని 15 నుండి 20 రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేస్తుంటే మూడు లేదా నాలుగు సార్లకే తెల్లజుట్టు పూర్తీగా నలుపురంగులోకి మారుతుంది.  ఇది కేవలం జుట్టును నల్లగా మార్చడమే కాదు.. గోరింటలోని గుణాలు, నిమ్మరసం, టీ  డికాషన్ ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.                                                     *నిశ్శబ్ద.