రాష్ట్రంలో బిఎస్పిలాగా వైఎస్సార్సీపీ
ఉత్తర ప్రదేశ్లో బిఎస్పి పార్టీలాగా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ తయారవుతుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లో బిఎస్పి బ్రాహ్మణులు, దళితులు కలిసి జాతీయ పార్టీలకు ధీటుగా బిఎస్పి ఏర్పాటయింది. ప్రస్తుతం వైఎస్ ఆదర్శం, బలంతో జగన్ పార్టీకి దళితులు, మైనార్టీలు ఆకర్షితులవుతున్నారు. ఈ రెండు వర్గాలూ కాంగ్రెస్కు ఓటు బ్యాంకు. దాదాపుగా వైఎస్సార్సిపి వీటిని కొల్లగొట్టేసింది.
రెడ్లు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి దగ్గరవుతున్నారన్న విషయం ఉప ఎన్నికలు తేల్చిపారేశాయి. ఈ వర్గాల్లో బిసి వర్గాలను ఏదో విధంగా టాప్ చేయాలని టిడిపి చూస్తున్నది. కోస్తా ఆంధ్రలో ఉన్న కమ్మ, కాపు వర్గాలు కూడా వైఎస్సార్సీపీవైపు చూస్తుండడంతో టిడిపి ఏ వర్గాలను ఆదరిస్తుందో వేచి చూడాల్సిందే. నరసాపురం ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కయితే ఆసీటు కాంగ్రెస్కు దక్కింది. మరోసారి ఉప ఎన్నికలు జరగక పోతే 2014లో వైఎస్సాఆర్సీపీ అధికారం దిశగా పయనించే అవకాశం ఉన్నది. తెలంగాణ వాదంపై ఎటూ తేల్చక కాంగ్రెస్, వాదాన్ని నిలుపుకోలేక టిఆర్ఎస్, దిశా తెన్నూ తెలియక టిడిపి, ఓటు బ్యాంకు దూరమై కాంగ్రెస్ అధికారం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాల ప్రాతిపదికన ప్రచారం చేస్తున్నప్పటికీ మత ఛాందసవాదంతో ఆ పార్టీ ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు.