కోమటిరెడ్డి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఫిక్సయ్యిందా? అధిష్ఠానం నిర్ణయం ఏమిటో తేలిపోయిందా?

కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అని ఓ సమెత ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి విషయంలో ఆ సామెతనే నమ్ముకున్నట్లు ఉంది. ఇష్టారీతిగా పార్టీపైనా, పార్టీ అధిష్ఠానంపైనా వ్యాఖ్యలు చేస్తూ పోతున్న రాజగోపాలరెడ్డిపై క్రమశిక్షణా చర్యల విషయంలో టీపీసీసీ చీఫ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా వ్యూహాత్మక  మౌనం పాటిస్తూ వస్తున్నారు. బుజ్జగించడానికి అన్నట్లు మల్లు భట్టి విక్రమార్క రాజగోపాలరెడ్డితో భేటీ అయినా భేటీ తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ రాజగోపాలరెడ్డి పార్టీని వీడినట్లేనని చెబుతున్నారు. రాజగోపాల రెడ్డితో భేటీ అనంతరం భట్టి ఎవరి ఇష్టం వారిది, ఎవరి దారి వారిది అన్నట్లు మాట్లాడారు. ఇక భేటీ తరువాత రాజగోపాల రెడ్డి అయితే తన వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడంపై కూడా పార్టీ వైఖరికి, విధానానికి విరుద్ధంగా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే సోనియా గాంధీని ఈడీ విచారించడానికి నిరసనగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఈ ఆందోళనలు ఎందుకు అన్న అర్ధం వచ్చేనా వ్యాఖ్యలు చేశారు.  అసలు గత రెండేళ్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి పార్టని ఎప్పుడు వీడదానా అన్నట్లుగానే ఉంది. గతంలో కూడా ఒక సారి బీజేపీలో చేరేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. గత రెండేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ చేపట్టిన ఆందోళనల్లో కానీ పాల్గొన్న దాఖలాలు లేవు. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన అనంతరం రాజగోపాలరెడ్డి పార్టీలో ఉన్నారంటే ఉన్నారంతే లా వ్యవహరిస్తున్నారు.  రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇక తాజాగా ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ తరువాత కాంగ్రెస కు గుడ్ బై చెప్పేందుకు డిసైడైపోయారు. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీకీ, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేయాలన్న అమిత్ షా సూచన మేరకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ సారి ఏకంగా సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీని ఈడీ విచారించడంలో తప్పేముందన్నట్లు మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మట్టి కరిపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలను ఖండించడం లేదు. వీహెచ్ వంటి వారు ఏవో ఓ రెండు మాటలు మాట్లాడి ఖండించినా.. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి కానీ, రాష్ట్ర వ్యవహారల శాఖ ఇన్ చార్జ్ మాణికం ఠాకూర్ గానీ పన్నెత్తి మాట్లాడిన దాఖలాలు లేవు.  ఆయనపై చర్య తీసుకోవాలని   పార్టీ అధిష్టానాన్ని కోరనూ లేదు. అధిష్ఠానమే చూసుకుంటుంది అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు

ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్ బంద్.. ఇది నిర్మాతల సమ్మె!

తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చే నెల 1వ తేదీ నుంచి స్తంభించిపోనుంది. ఒక విధంగా ఇది నిర్మాతల సమ్మె పిలుపని చెప్పవచ్చు. నిర్మాతల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ షూటింగ్ లు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. దీంతో పలు సినిమాల షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వీటిలో ప్రధానంగా ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ నిలిచిపోతుంది. భారీ బడ్జెట్ తో నిర్మితమౌతున్న ఈ సినిమాల షూటింగ్ నిలిచిపోతే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని సినీ రంగ ప్రముఖులు చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి షూటింగ్ కూడా నిలిచిపోనుంది.  ఇవే కాకుండా ఇంకా చాలా సినిమాలు షటింగ్ మధ్యలో ఉన్నాయి అవి కూడా నిలిచిపోనున్నాయి. గత కొంత కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకూ  షూటింగ్ లు నిలిపివేయాలని మంగళవారం జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం నిర్ణయించింది. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రేక్షకులు సినిమా ధియోటర్ కు రావడం బాగా తగ్గిపోయిందని వారంటున్నారు. దానికి తోడు టికెట్ల ధరలు, ఓటీటీ, హీరోల రెమ్యూనరేషన్ వంటి సమస్యల కారణంగా తాము చాలా తీవ్రంగా నష్టపోతున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ఈ సమస్యల పరిష్కారం కోసం కొంత కాలం షూటింగ్ లు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  త్వరలోనే తమ సమస్యలు పరిష్కారమౌతాని ఆశిస్తున్నామనీ, సమస్యలు పరిష్కారమయ్యాకా యథావిధిగా షూటింగ్ లు ప్రారంభిస్తామని ఎడిటర్స్ గిల్డ్ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు చెప్పారు.  

పని మొదలెట్టేసిన ఈటల.. తెరాస నుంచి వలసలు షురూ అవుతాయా?

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పని మొదలెట్టేశారు. బీజేపీ అధిష్ఠానం అప్పగించిన పని ప్రారంభించేశారు.  చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసేశారు.  టిఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు రానున్న రోజులలో కమలం గూటికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈటల స్వయంగా చెప్పారు. అంతేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులకు కేసీఆర్ పై కంటే తనపైనే ఎక్కువ విశ్వాసమని ఈటల పేర్కొన్నారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పార్టీలోకి చేరికలపై దృష్టి సారించాలని సూచించారనీ, అందుకే చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్ గా నియమించారనీ బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈటల రాజేందర్ గతంలో టీఆర్ఎస్ లో కీలక నేత. కేసీఆర్ కేబినెట్ లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా ఈటల పని చేశారు. ఆ తరువాత కేసీఆర్ తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి.. ఆ కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో కమలం పార్టీ అభ్యర్థిగా తెరాసపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాను విజయం సాధించినది టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేననీ ఈటల పలు సందర్బాలలో చెప్పారు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డారు. కేవలం ఆ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఎన్ని చేసినా ఈటల విజయాన్ని నిలువరించడంలో మాత్రం కేసీఆర్ విఫలమయ్యారు. అందుకే తన విజయం టీఆర్ఎస్ అభ్యర్థిపై కాదనీ కేసీఆర్ పైనేనని ఈటల చెబుతున్నారు. తాను వచ్చే ఎన్నికలలో గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ ను ఆయన ఇలాకాలోనే ఓడిస్తానని సవాల్ కూడా చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఈటలతో టీఆర్ఎస్ అసంతృప్త నేతలు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్న సంగతి విదితమే. ముఖ్యంగా పీకే సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు కేటాయించనున్నట్లు కేసీఆర్ భావిస్తుండటం, పీకే సర్వేలో పలువురు సిట్టింగ్ ల పనితీరుపై ప్రజలలో అసంతృప్తి ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో  టీఆర్ఎస్ సిట్టింగులలో గుబులు మొదలైంది. అటువంటి వారంతా ఈటలకు టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో టీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఈటల ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి లో తొలి నుంచీ పార్టీలో ఉన్న వారికీ, ఆ తరువాత అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వచ్చి చేరిన వారికీ మధ్య అగాధం పెరిగిపోయింది. ఈ పరిణామాలు బాగా తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ కావడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో, కెసిఆర్ నాయకత్వం పై తీవ్ర అసహనం తో ఉన్న నాయకులను గుర్తించి వారిని బిజెపి బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ అత్యధికులకు సీఎం కేసీఆర్ తో కంటే తనతోనే సాన్నిహిత్యం ఎక్కువ అని ఈటల చెబుతున్నారు. వారితో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందనీ, వారంతా ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నారనీ ఆయన అన్నారు.   అమిత్ షా ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు టార్గెట్ గా ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు.  తనతో ప్రస్తుతం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, వారు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని ఈటల చెప్పారు. 

కేంద్రానికి సంగీతంగా జగన్ సర్కార్ రుణగొణ ధ్వని

ఏపీ సర్కార్ అప్పుల విషయంలో కేంద్రం కొట్టినట్టు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడ్చినట్లు చేయడం లేదు. కేంద్రం చేసిన హెచ్చరికలను, వెల్లడించిన జాబితాను తనకు అనుకూలంగా ఉన్నాయని సంబరపడిపోతోంది. ఏపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయని మురిసిపోతోంది. అయితే కేంద్రం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన గణాంకాలు పాక్షికం మాత్రమే. పూర్తి వివరాలు సేకరించకుండా జగన్ సర్కార్  చెప్పిన లెక్కలు, అబద్ధాలనే ఆధారం చేసుకుని ఏపీ అప్పులను ప్రకటించింది. అలా అరకొర వాస్తవాలతో కేంద్రం వెల్లడించిన వివరాలే ఇక ఏపీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అప్పులు గగనమే అవుతాయని తేల్చేసింది. కానీ నొసటితో మాత్రం మీకేం భయంలేదు.. మా అభయం ఉందని భరోసా ఇచ్చేస్తోంది. అందుకే పార్లమెంటులో రాష్ట్రాల అప్పుల జాబితా ప్రకటించిన రోజే రాష్ట్రం కొత్తగా  రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది. జగన్ సర్కార్ రుణగొణ ధ్వని కేంద్ర ప్రభుత్వానికి సంగీతంలా వినిపిస్తున్నదని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. పార్లమెంటులో రాష్ట్రం అప్పుల చిట్టాను ప్రకటిస్తూ కేంద్రం ఆర్బీఐ ఇచ్చిన వివరాల మేరకు అని తెలిపింది కానీ వాస్తవంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు.  ఆర్బీఐ విడుదల చేసిన డేటానే యథాతథంగా పార్లమెంటులో ప్రకటించేశారు.  ఇక తాజాగా జగన్ సర్కార్ మంగళవారం (జులై 26) మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. ఇది కూడా ఎలాగంటే వేయి కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏడు సంవత్సరాలకు 7.79 శాతం వడ్డీతోనూ. మరో వేయి కోట్ల రూపాయలు 8.04 శాతం వడ్డీతోనూ తీసుకుంది.  కేంద్రం పదే పదే రాష్ట్రాన్ని పరిమితికి మించి అప్పులు చేస్తోందంటూ హెచ్చరిస్తూనే అడగడమే ఆలస్యం అన్నట్లు రుణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలోని ఆంతర్యమేమిటని పరిశీలకులు, ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబుతో నటుడు మోహన్ బాబు భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో నటుడు మోహన్ బాబు భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోహన్ బాబు ఆయనతో దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిరువురి మధ్యా చర్చకు వచ్చిన అంశం ఏమిటన్నది తెలియరాలేదు.  అయితే  ఈ  భేటీ  అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచీ తెలుగుదేశంలో ఉన్న మోహన్ బాబు  ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. అయితే ఆ తరువాత  ఆ పార్టీకి దూరమయ్యారు.  తిరుపతిలోని తన విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం  ఆందోళన చేశారు. తిరుపతిలో రాస్తారోకో, ధర్నా కూడా నిర్వహించారు.  ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అనంతరం వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ  ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆయనకు ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వలేదు. క్రమంగా మోహన్ బాబు కూడా రాజకీయాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో ఒక సారి మోడీతో భేటీ అయినప్పటికీ.. ఆయన రాజకీయంగా క్రియాశీలంగా అయితే లేరు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బేటీ కావడం సంచలనం సృష్టించింది.  మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 

పార్లమెంట్ లోపలా , బయట ఒకటే సీన్ ..

ఓ వంక పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల. ద్రవ్యోల్బణం పై చర్చకు పట్టు పడుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేస్తున్నాయి. ఉభయ సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.  సోమ వారం (జులై 25) లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ సభ్యులను ప్రస్తుత వర్షాకాలసమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.  మంగళవారం (జులై 26)  పెద్దల సభలో  ఏకంగా 19 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. డిఎంకే, టీఎంసీ, తెరాసకు  చెందిన ఈ 19 మంది సభ్యులపై ఈ వారంతం వరకు సస్పెన్షన్ వేటు వేశారు.   నిజానికి, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటిరోజు నుంచి ప్రతి రోజు కొంచెం అటు ఇటుగా ఇదే కథ నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చకు పట్టుబడుతుంటే, ప్రభుత్వం చర్చకు సిద్ధమే, కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత, ధరలు, ద్రవ్యోల్బణం అంశాన్ని చర్చిద్దామని అంటోంది. అయితే, అందుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటున్నాయి. ఆర్థిక మంత్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం అత్యవసరంగా చర్చించవలసిన ధరలు, ద్రవ్యోల్బణం చర్చ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని  ఆరోపిస్తున్నాయి. అదొక అంతులేని కథ. వరసగా ఏడవ రోజు కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. అదలా ఉంటే, పార్లమెంట్ వెలుపల కూడా రసవత్తర రాజకీయమే నడుస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. గత వారంలో  ఫస్ట్ రౌండ్ విచారణ పూర్తి చేసిన ఈడీ ఈ రోజు సెకండ్ రౌండ్ విచారణ జరుపుతోంది. మరో వంక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధిని విచారించడం అంటే భారత మాతను బోనులో నిలబెట్టడమే అనే విధంగా ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలియచేస్తున్నారు. ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  అందులో భాగంగా,  ఢిల్లీ విజయ్ చౌక్‌లో, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ పార్టీ ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి తరలించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. రాహుల్ గాంధీ చాలా సీరియస్ అయ్యారు.  రాహుల్ గాంధీ పాటుగా,  లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పని చేస్తోన్నాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన దర్యాప్తు ఏజెన్సీలను ప్రధాని మోడీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోన్నారని ధ్వజమెత్తారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సభా కార్యక్రమాలను స్తంబింప చేయడం ద్వారా ప్రతిపక్షాలు, ప్రభుత్వానికి మేలు చేస్తున్నాయని అంటున్నారు. ప్రజాసమస్యలు పక్కకు పోయి  రాజకీయ వివాదాలకు పార్లమెంట్ వేదిక కావడం అత్యంత దురదృష్టకరంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

నీవు నేర్పిన విద్య‌యే .!

నేను కొట్టిన‌పుడు ఏడ‌వ‌కూడ‌దు నువ్వ న‌న్ను తిడితే ఎంత బాధో తెలుసా అన్న‌ది చిన్న కోడ‌ల్ని పెద్ద కోడ‌లు. కాపురానికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిట్లూ శాప‌నార్ధాలూ అయి ఇపుడు తిట్టుకోవ‌డం, కొట్టుకోవ‌డం దాకా సాగిన వారి స్నేహ‌పూర్వ‌క అత్తింటి యాత్ర ఊహించ‌ని మ‌లుపుల‌కు దారి తీసింది. ఇలానే ఉంది, కాంగ్రెస్ వారు బీజేపీని తిట్టుకోవ‌డం. వారి పాల‌నలో చేసిన‌ది, జ‌రిగిన‌దంతా మ‌ర్చిపోవాలి, బీజేపీ వారు దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వీరి త‌ర‌ఫున దేశ ప్ర‌జ‌లంతా రోడ్డు మీద‌కి రావాలంటున్నారు. ఇంత కంటే హాస్యం మ‌రోటి ఉంటుందా?  మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ మంగళవారం రెండోసారి విచారి స్తోంది. సోనియా గాంధీని ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సహా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపు తున్నారు. అయితే.. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలతో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని కింగ్స్‌వే క్యాంప్‌కు తరలించారు. నిజానికి రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలవాలని, మెమోరాండం ఇవ్వాలని అను కున్నారు. కానీ విజయ్ చౌక్ దాటి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో రాహుల్  విజయ్ చౌక్  వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, పార్టీ పెద్ద నాయ కులు పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ  సందర్భంగా  పలు వురు కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అనేక ఇతర సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ రాజులా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. పార్లమెంటు లోపల చర్చకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేస్తు న్నారు. పోలీసుల అనుమతితోనే తాము నిరసన  తెలుపుతున్నామని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ఇదంతా ప్రతిపక్షా లను తొక్కేసేందుకే  ప్రధాని మోదీ, అమిత్ షాల కుట్రని విమర్శిం చారు. మేము భయ పడం, మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు విచారణకి వెళ్ళకుండా ఉండాలంటే అప్పుడు తప్పు చేయకుండా ఉండాలి అని అనుకుంటు న్నారు. మనం  ఏది ఇస్తామో, ఇచ్చామో అదే మనకి తిరిగివస్తుంది అనేది మాత్రం ఇప్పుడు గాంధీ ల కుటుంబానికి అవగతం అవుతున్నాటు ఉంది.

తెలంగాణాలో మ‌ళ్లీ ముంచెత్తుతున్న వ‌ర్షాలు

ఆమ‌ధ్య భారీ వ‌ర్షాలు తెలంగాణాను ఒణికించాయి. త‌ర్వాత  కాస్తంత త‌గ్గుముఖం ప‌ట్టింది.  ప్ర‌జ‌లు కాస్తంత ఆందోళ‌న‌నుంచి బ‌య‌ట‌పడ్డారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఈ నెల 30వ తేదీ దాకా భారీ వ‌ర్షాలు ముంచెత్త‌నున్నాయని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో  ఏర్పడిన ఆవర్తనం  ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  కాగా అప్పుడే రాష్ట్రంలో, రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లోనూ వ‌ర్షాలు  ఒక మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. హైద‌రాబాద్‌లో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కుంభ‌పోత వ‌ర్షం కార‌ణంగా అనేక ప్రాంతా ల్లో నీళ్లు నిలిచి ట్రాఫిక్ అంత‌రాయం క‌లిగింది. హైద‌రాబాద్‌లో అర్ధ‌రాత్రి నుంచే భారీ వ‌ర్షం ఆరంభ‌మ‌యింది.   యాకత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలుచోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి.  నీటి ప్రవా హంలో పలుచోట్ల  కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచి పోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ 9.2 సెంటీ మీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీ మీట ర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0  సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీ  మీట ర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

జగనన్న గోరుముద్ద పథకంలో పురుగుల చిక్కీలు!

జగనన్న పాలనలాగే ఆయన పేరున ప్రారంభించి జగనన్న గోరు ముద్ద పథకం కూడా పక్కదారి పట్టిందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ పథకం కింద పురుగులు పట్టిన చిక్కీలు పంపినీ చేస్తున్నారన్న  విమర్శలు వినవస్తున్నాయి. జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు వచ్చాయి. పురుగులను గమనించిన వెంటనే విద్యార్థులు వాటిని తినకుండా విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో విద్యార్థులు ఫుడ్ పాయిజినింగ్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులను విద్యార్థులు గుర్తించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కొన్ని చిక్కీలు పురుగులు పట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. పురుగులను గుర్తించిన వెంటనే ఆ చిక్కీలను తీసివేసి వేరు చిక్కీలు ఇచ్చామని వివరించారు. అయితే ఇలా పురుగులు రావడం ఇదే తొలి సారి కాదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూడా పురుగులు వచ్చిన సంఘటనలు ఉన్నాయని వారు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం కింద నాసిరకం చిక్కీలను, కాలం చెల్లిన వస్తువులను ఇవ్వడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. కాగా  చిక్కీలలో పురుగుల సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

జ‌గ‌న్ అప్పుల గుట్టు బ‌య‌ట‌పెట్టిన కేంద్రం

కొడుకుని బాగా చ‌దివించి మంచి ఉద్యోగంలో పెడితే, స‌ర‌దాలకు అప్పులు చేసి తండ్రికి దొరికి పోయాడు. ఒకానొక పండుగ రోజు అంద‌రిముందూ చిట్టావిప్పి ప్ర‌శ్నించాడు. అదుగో అలా వుంది ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప‌రిస్థితి. కేంద్రం  ఇక వైసీపీ స్నేహ‌ యాత్ర‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్టే.  వైసీపీ స‌ర్కార్ ఎవ‌రు అప్పులు ఇస్తారోన‌ని ఎదురుచూసే దుకాణంలా మారిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల గురించి పార్ల‌మెంటులో ప్ర‌స్తావిస్తూ, కేంద్ర ఆర్ధిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్‌చౌద‌రి, ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం అనుమ‌తించిన అప్పుల్లో అప్పుడే ఏపీ స‌గానికి పైగా రుణాలు తీసేసుకుం ద‌న్నారు.  టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో కేం ద్రం, నాబార్డు నుంచీ కూడా జ‌గ‌న్ స‌ర్కారు రుణాలు పొందింద‌ని పంకజ్‌ చౌదరి  వెల్లడించారు.   2022-23లో నికర రుణ పరిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణానికి కేంద్రం అనుమతిచ్చింది. మొదటి తొమ్మిదినెలలకు రూ.40,803 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఉంది. కానీ  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఊహించ‌ని విధంగా అతి  త‌క్కువ స‌మ‌యంలోనే ఆరుణాన్ని తీసుకుంద‌ని  రాజ్యసభలో కేంద్రం వెల్లడిం చింది. ఏప్రిల్‌ నాటికే రూ.21,890 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి మరో  రూ.1,373.47 కోట్లను ఏపీ రుణంగా తీసుకుంది. అప్పు పుట్టిన ప్రతిచోటా ఏపీ రుణాలు తీసుకుం టున్నట్లు కేంద్రం కొస మెరుపుగా పేర్కొంది.

విజయమ్మకు కొత్త  కొలువు.. కుదురుకునేనా? 

కొడుకు కొలువిచ్చి ఉద్ద‌రిస్తాడ‌నుకుంటే అవ‌స‌రం తీరాక చెన్న‌ప‌ట్నం పంపాడ‌ట‌. అదుగో అలా ఉంది వైసీపీ మాజీ గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ ప‌రిస్థితి. తండ్రిబొమ్మ‌ని, అమ్మ గౌర‌వాధ్య‌క్ష ప‌ద‌వినీ అడ్డు పెట్టుకుని జ‌నాన్ని ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని రంగంలోకి దిగిన త‌ర్వాత జ‌గ‌న్‌రెడ్డికి రాష్ట్ర‌ప్ర‌జ‌లు  ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామ‌నుకున్నారు. మూడేళ్ల ప్ర‌యాణం త‌ర్వాత రైలు ఖ‌ర్చులు వృధా అయ్యాయ‌ని జ‌నం తెలు సుకున్నారు. ఇంటా బ‌య‌టా మెటిక‌లు విరిచేవారి సంత ఎక్కువ‌యి జ‌గ‌న్ ఉక్కిరి బిక్కిర‌ వుతున్నారు. ఇక లాభం లేద‌ని ఇంటా బ‌య‌టా గెల‌వాల‌ని అమ్మ విజ‌య‌ల‌క్ష్మిని గౌర‌వంగా చెల్లి ష‌ర్మిల వ‌ద్ద‌కు ప్ర‌యాణం క‌ట్టించారు. కొడుకు రాజ‌కీయా చాతుర్యం నుంచి ఎలాగో త‌ప్పించుకుని కుమార్తె నొస‌ట విరుపుల నీడ‌లోకి చేరింది వై.ఎస్‌.విజ‌య‌ల‌క్ష్మి. కానీ ఇక్క‌డా  ఏదో టిఫిన్ చేస్తూ క‌బుర్లు చెప్ప‌డం త‌ప్ప‌మ‌రేమీ ఆశించ‌క‌ని కుమార్తె చిన్న‌పాటి హెచ్చ‌రికా చేస్తోంది.  వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి విజయమ్మ వైదొలిగిన అనంతరం ఆమె పూర్తిగా తన కుమార్తె తెలంగాణ లో ఏర్పాటు చేసిన వైఎస్సీర్టీపీకి ఆమె పరిమితమయ్యారు.  అదీ ఆ పార్టీ ప్లీనరీ వేదికగాపై నుంచి రాజీ నామా చేస్తున్నట్లు గౌరవంగా ప్రకటించారు. మరోవైపు పక్క రాష్ట్రంలో తన కుమార్తె, వైయస్ఆర్ తెలం గాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఒంటరిపోరాటం చేస్తుంది.. ఆమెకు అండగా ఉండాలనుకొంటు న్నట్లు ఆమె ఇదే వేదికపై నుంచి చెప్పుకొచ్చారు.  అయితే తాజాగా జులై 25న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ...రాజశేఖరరెడ్డిగారి భార్య విజయమ్మ...అలాంటి విజయమ్మగారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే అవుతోంది. పదవి ఆశించకుండా... రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పాలన మళ్లీ రావాలని నేను పని చేస్తానని చెప్పిన గొప్ప మనిషి విజయమ్మ... పదవులతో సంబంధమే లేదంటూ పేర్కొన్నారు. తాజాగా వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.  అయితే వైయస్ షర్మిల వ్యాఖ్యలతో.. తెలంగాణలో తన కుమార్తె స్థాపించిన వైయస్ఆర్‌టీపీకి గౌరవాధ్య క్షురాలిగా ఇకపై వైయస్ విజయమ్మ కొనసాగవచ్చుననే ఊహాగానాలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు వైయస్ జగన్‌ను.. అధికారంలోకి తీసుకు వచ్చేందుకు.. ఓ తల్లిగా వైయస్ విజయమ్మ, సోదరిగా వైయస్ షర్మిల పడిన కష్టం ప్రతి ఒక్కరికి తెలిసేందే. అలాగే తెలంగాణలో కూడా తన కుమార్తె వైయస్ షర్మిలకు అధికారం అందేలా తాను సహకరిస్తే.. సరిపోతోందనే  ఓ ఆలోచన వైయస్ విజయమ్మ ఉన్నట్లు ఆమె కుమార్తె వైయస్ షర్మిల వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందనే ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తోంది. మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి వేదికగా జగన్ పార్టీకి రాజీనామా చేసే క్రమంలో వైయస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న తన కొడుకు వైయస్ జగన్‌కు అండగా ఉన్నాను.. ఇప్పుడు నా కూతురు కష్టాల్లో ఉంది... కాబట్టి ఆమెతో పాటు ఉండేందుకు వెళ్తున్నానంటూ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి. అలాగే లక్షల కోట్ల ఆస్తులున్న వైయస్ జగన్, వైయస్ షర్మిలలు ఏ రకంగా.. ఏ రకమైన కష్టాల్లో ఉన్నా రంటూ వైయస్ విజయమ్మను సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ వద్ద లక్ష కోట్లు ఉన్నాయంటూ ఓ వైపు ప్రచారం అయితే మోత మోగిపోతోంది. ఆ లెక్కన చూస్తే.. మహానేత వైయస్ఆర్ తనయ ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల వద్ద ఓ 10 వేల కోట్ల రూపాయిలు అయినా ఉంటాయని.... పోనీ కనీసంలో కనీసంగా వెయ్యి కోట్లు అయినా ఉంటాయని.. వాటితో ఈ భూమండలం మీద ఏ దేశంలో అయినా సుఖంగా సౌఖ్యంగా బతికేయొచ్చంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అలాంటి వైయస్ షర్మిల.. ఎలాంటి కష్టంలో ఉందని వారు వైయస్ విజయమ్మను సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నిస్తున్నారు. అయితే విజయమ్మ మాటలను బట్టి చూస్తే.. ఓ ముఖ్యమంత్రి పదవో లేక.. మంత్రి పదవో.. లేక పెద్దల సభ రాజ్యసభో.. లేక ఇంకేదైనా పదవో లేకపోవడమే వైయస్ షర్మిలకు కలిగి న కష్టమా అంటూ వైయస్ విజయమ్మని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ లో రాజన్నరాజ్యం తీసుకు వస్తాడంటూ గతంలో ఓ తల్లిగా.. ఓ చెల్లిగా అతడి కోసం ఎన్నికల్లో  ప్రచారం చేశారని.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని  ఆ విషయం మీరు బయటకు చెప్పక పోయి నా.. మీ మనసాక్షిగా తెలుస్తునే ఉంటుందని వారు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నా రు. ఆ క్రమంలోనే మీరు.. ఆ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఉంటారని నెటిజన్లు సోషల్ మీడియాలో అబిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెచ్చి తెలంగాణ ప్రజల కష్టాలు తీరుస్తానని వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల చెబుతున్నారని.. మరోవైపు మీరు ప్లీనరీ వేదికగా వైయస్ షర్మిల కష్టాల్లో ఉందంటూ మీరు లక్షలాది మంది హాజరైన ప్రజల ముందు చెప్పారని.. మరి వైయస్ షర్మిలే ప్రస్తుతం కష్టాల్లో ఉంటే.. ఇక తెలంగాణ ప్రజల కష్టాలను ఆమె ఎలా తీరుస్తోందంటూ నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా.. ఏపీలో వైయస్ జగన్‌ని అధికారంలోకి తీసుకు వచ్చే వరకు వీరిద్దరు శ్రమించి.. ఈ మూడేళ్ల జగన్ పాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని కనీసం వీరిద్దరు ఆరా కూడా తీయడం లేదనే విమర్శ  సైతం తెలుగు రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉందనే చర్చ అయితే చాలా బలంగా సాగుతోంది. ఇక వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఎప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టినా..  ఏపీలో జగన్ పాలనపై విలేకర్లు ఏమైనా ప్రశ్నలు సంధిస్తే.. ఆమె కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తారని ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో రంజు రంజుగా నడుస్తోంది.

తానేటి వనిత ఇలాకాలో వైసీపీకి ఘోర పరాజయం

వైసీపీకి కష్టాలన్నీ ఒకే సారి కట్టకట్టుకుని వస్తున్నట్లున్నాయి. నిన్న మొన్నటి వరకూ విపక్షం ఎంతగా విమర్శించినా గుట్టుగా ఉన్న అడ్డగోలు అప్పుల వ్యవహారం కేంద్రంపార్లమెంటు సాక్షిగా బట్టబయలు చేసేసింది. అసలు అడ్డగోలుగా, ఇష్టారీతిగా అప్పులు తీసుకోవడానికి పచ్చ జెండా ఊపిన కేంద్రమే ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ చూపేసింది. కేవలం జగన్ సర్కార్ ను సహాయపడటానికే, అడ్డగోలుగా అప్పులు తీసుకోవడానికే జగన్ సర్కార్   కేవలం అప్పుల కోసమే  రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ)ను ఏర్పాటు చేసింది. అడ్డగోలుగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి అప్పులు దండుకుంది.   యూపీ సహా పలు రాష్ట్రాలూ దీనినే అనుసరించాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా కేంద్రం కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా వ్యవహరించింది. ఇప్పుడు మాత్రం అడ్డగొలు అప్పులపై శ్రీలంకను బూచిగా చూపి రాష్ట్రాలను హెచ్చరిస్తున్నది. కేంద్రం రాష్ట్రం అప్పులకు చెక్ పెట్టడంతో ముందు ముందు జగన్ సర్కార్ పీకలోతు ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఇక ఈ స్థాయి సహకారం ఉండదని స్పష్టంగా తేలిపోవడంతో ప్రభుత్వంలో గాభరా మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కూడా జగన్ సర్కార్ కు ప్రతికూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. జగన్ సర్కార్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని సర్వేలో తేలింది. అలాగే గడప గడపకూ కార్యక్రమంలో ఎదురౌతున్న నిరసనలు.. ఇవి చాలవన్నట్లు ప్రతిష్టాత్మక అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పరాజయం ఎదురైంది. అక్కడా ఇక్కడా కాదు సాక్షాత్తూ హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గమైన కొవ్వూరులో. అది కూడా ఏకగ్రీవంగా విపక్ష తెలుగుదేశం కైవశం చేసుకుంది. కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికలలో సొంత అభ్యర్థులను గెలిపించుకోలేక మొత్తం 11డైరెక్టర్ స్థానాలనూ విపక్ష తెలుగుదేశం పార్టీకి ధారాదత్తం చేసేశారు. 2019లో విజయం తరువాత వైసీపీకి తగిలిన భారీ షాక్ ఇదేనని చెప్పాలి. బ్యాంకుచైర్మన్ గా తెలుగుదేశంకు చెందిన మద్దిపట్ల శివరామృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే11మంది డైరెక్టర్లూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరాజయం తానేటి వనిత సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం సత్తాను, వైసీపీ బలహీనతను చాటాయని పరిశీలకులు అంటున్నారు. 

దీదీ గుండెల్లో పార్దా గుబులు

 పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్. రాజకీయ పోరాటాలకు పెట్టింది పేరు.అన్నిటినీ మించి,కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వే విషయంలో ఆమె అందరికంటే ముందుంటారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీని, డోంట్ కేర్  పద్దతిలో దూషించడంలో అయినా, దుర్భాషలాడడంలో కేసీఆర్ అయినా కేజ్రీవాల్ అయినా ఆమె తర్వాతనే. చివరకు అల్ పవర్ఫుల్  కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా, (వ్యంగ్యంగానే అయినా) వామ్మో .. మమత అన్నారంటే ఆమె ఎంత పవర్ఫుల్ లీడరో అర్థం చేసుకోవచ్చును. అలాగే, ఆమె ఎవరికీ భయపడరు. భయం అంటే ఏమిటో ఆమెకు తెలియదని అంటారు.  అది నిజమే కావచ్చును. కానీ, అంతటి మమత బెనర్జీ కూడా ఇప్పుడు భయపడుతున్నారా, అంటే, మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ అరెస్టు విషయంలో ఆమె స్పందించిన తీరు చూస్తే, నిజంగానే ఆమె భయపడుతున్నారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు. ఉపాధ్యాయుల నియామ‌కానికి సంబంధించిన కుంభ‌కోణంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయనతో పాటుగా ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీని కూడా అరెస్ట్ చేశారు. ఆమె నివాసంలోనే, ఈడీ నోట్ల కట్టలు కాదు కరెన్సీ కుప్పలు స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలు అలా కుప్పలు పోయడం చూసిన జనం, ముక్కున వేలేసుకుంటున్నారు. అదలా ఉంచితే, మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అరెస్ట్ తర్వాత మమతా బెనెర్జీ పూర్తిగా  రెండు రోజులు పెదవి విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అరెస్ట్ అయిన మంత్రి నాలుగు సార్లు ఫోన్ చేసినా, రిప్లై  అయినా ఇవ్వలేదు. అంటే, ఆ కుంభ కోణం తన మెడకు చుట్టుకుంటుందనే భయమేదో ఆమెను వెంటాడుతోడని అనుకోవచ్చును. అంతే కాదు, మంత్రి అరెస్ట్ పై రెండు రోజుల ఆలస్యంగా స్పందించినా, అందులోమ ఢీ అంటే ఢీ అనే దీదీ కనిపించలేదని  అంటున్నారు. గతంలో డీజీపీ కార్యాలయంలో సోదాలు చేసేందుకు వెళ్ళిన సిబిఐ అధికారుల పై మమత బెజేర్జీ విరుచు పడ్డారు. స్వయంగా రోడ్డెక్కి నిరసన  తెలిపారు. కానీ  మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ విషయంలో మాత్రం,  రోడ్ షో లు లేవు  సరికదా, త‌ప్పులు చేసేవారికి, అవినీతికి పాల్ప‌డేవారికి తాను ఎప్పుడూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌న‌ని అన్నారు, త‌ప్పుచేసిన‌వారు ఎలాంటివారైనా, వారు త‌ప్పుచేసిన‌ట్లు నిరూపిత‌మైనా, యావ‌జ్జీవ‌ శిక్ష ప‌డినా తాను ఏమీ అనుకోన‌న్నారు. ఇటువంటి అవినీతి వ్య‌వ‌హ‌రాల్లోకి త‌న‌ను లాగొద్ద‌ని.. ఎందుకంటే తాను ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే వేత‌నం కూడా తీసుకోవ‌డంలేద‌ని తెలిపారు. అంటే, మమత బెనర్జీ భయపడుతున్నారు అనుకుంటే తప్పులేదని అంటున్నారు.  కాగ, ఈ కేసులో మంత్రి ఛ‌టర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేయ‌డంతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. సోదాల్లో మంత్రికి మ‌రిన్ని అక్ర‌మాస్తుల‌న్న‌ట్లు అధికారులు గుర్తించారు. వీరిద్ద‌రితోపాటు మంత్రి వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సుకాంత ఆచార్య‌ను కూడా అరెస్ట్ చేశారు. 2014-2021 మ‌ధ్య‌లో విద్యాశాఖ మంత్రిగా కొన‌సాగిన పార్థా మీద ఆరోప‌ణ‌లు రావ‌డంతో సుదీర్ఘంగా 26 గంట‌ల‌పాటు ఆయన్ను విచారించిన ఈడీ త‌మ అదుపులోకి తీసుకుంది.

జ‌గ‌న్ భాయ్  ఇక ఆట‌లు సాగ‌వు...  కేంద్రం హెచ్చ‌రిక‌

పెళ్లికి వెల్లిన వియ్య‌పురాలిని ఆన‌క అంద‌రూ స్టీలు గ్లాసులు బాగోలేద‌ని మొట్టికాయ‌లు మొట్టార‌ట‌. అదు గో అలా అయింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సంగ‌తి.  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌య్యేవ‌ర‌కూ  జ‌గ‌న్ స‌ర్కార్ అవ‌స‌రాన్ని గుర్తించి చ‌క్క‌గా ప‌ల‌క‌రించిన‌వారంతా  ఆ వెంట‌నే ఇలా అయితే ఎలా జ‌గ‌న్ అంటూ  రాష్ట్ర ఆర్ధిక స్థితిని గురించి య‌క్షప్ర‌శ్న‌లు వేసి, వెయ్యి అనుమానాలు ఇచ్చి వెనక్కి పంపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఏపీ శ్రీలంక అంటూ ప్రజెంటేషన్ ఇచ్చి.. ఏపీని ప్రముఖంగా ప్రస్తావించారు. జాగ్రత్త పడాల్సిందే నన్నారు. ఆ తర్వాత ఏపీకి అప్పులిస్తున్న బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్ అయింది.  ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఏపీకి అప్పులివ్వాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.  బ్యాం కులకు నోటీసుల ద్వారా ఆర్బీఐ కల్పించింది. ఏపీ తీసుకుంటున్న అప్పుల గురించి కేంద్రం సీరియ‌స్ అయింది. ఈ కార‌ణంగా జ‌గ‌న్ స‌ర్కార్ అప్పుల స్థాయి విష‌యంలో అనుమానాలు బ‌ల‌మ‌య్యే అవ‌కా శాలే క‌న‌ప డుతున్నాయి.   అప్పులు సక్రమమా, అక్రమమా ఎక్కువా, తక్కువా అన్న వాటిని పక్కన పెడితే ఇంత కాలం పెద్దగా పట్టించుకోని కేంద్రం ఇప్పుడు కాస్త సీరియస్‌గా తీుకుందా అన్న అనుమానం తాజా పరిణామాల ద్వారా వస్తోంది. ఇన్నిరోజులు ఒకెత్తు ఇక నుంచి ఒక‌టి అన్న‌ది కేంద్రం. ఇప్ప‌టిదాకా కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం అని చిన్న‌పిల్లాడిని చూసిన‌ట్టు  కాస్తంత చూసీ చూడ‌న‌ట్టే ఉన్న‌కేంద్రం, ఆర్బీఐ  ఇపుడు క‌ళ్లు  పెద్ద‌వి చేశాయి. కానీ ఏపీ స‌ర్కార్ అప్పుల మీద న‌డుస్తున్నది. బీజేసీ స‌ర్కార్ ఈ విష‌యాన్ని ఇప్పుడు సీరియ‌స్గా తీసుకుని వివ‌రాలు డిమాండ్ చేసి ఆర్బీఐ నుంచి అప్పులకు అడ్డుక‌ట్ట‌వేస్తే ఆంధ్రా గ‌తేమిటి. ప్ర‌భు త్వానికి ఆర్ధిక క‌ష్టాలు మెడ‌కు చుట్టుకుంటాయి.   ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల పరిమితిని దాదాపుగా ఈ నెలలో దాటేస్తారు. అద నపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ శ్రీలంక అనుభవాలు భయ పెడుతున్న సమయంలో కేంద్రం ఇక విచ్చలవిడిగా అప్పులకు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌ద‌ని  భావిస్తున్నారు. అదే సమయంలో ఉచితాలపై ఇటీవల మోదీ వ్యాఖ్యలు కూడా  కొంత మంది ఉదహరిస్తున్నారు. నగదు బదిలీ పథకాల్లో  ఏపీ ముందు ఉంది. ఇలాంటి వాటిని మోదీ సహించరని బీజేపీ వర్గాలు చెబుతున్నా యి. మొత్తానికి  బీజేపీ అప్పులు అందకుండా చేయడం కాదు కనీసం సహకారం అందివ్వకపోయినా ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటుంది.

కేసీఆర్ జర్నీ టు కాంగ్రెస్ వయా కేవీపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలంటూ చేసిన విన్యాసం కేంద్రంతో సంబంధాలను తెగేదాకా లాగేసిందా? ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు సొంత రాష్ట్రంలో నిలవడమెలా అన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారా? ఆయన తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో తనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ ను ఆశ్రయించడానికేనా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు.. ఢిల్లీ చేరిన తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా తనను ఇప్పుడు ఆదుకుని ఒడ్డున పడేయగల పార్టీ కాంగ్రెస్సేనని కేసీఆర్ నమ్ముతున్నారని తెరాసలో ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు అంటున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ కు పార్టీని చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసే పనిలోనే ఆయన తాజా హస్తిన పర్యటన అనీ అంటున్నారు. తనంత తానుగా కాంగ్రెస్ కు చేరవ అవ్వడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి విదితమే. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న ప్రతిపాదనను కూడా ఆయన ఒక మధ్య వర్తి ద్వారా సోనియాకు చేసినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి అందుకు ససేమిరా అన్నారని అంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చురుకుగా వ్యవహరించారనీ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, యశ్వంత్ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించి రాచమర్యాదలు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి హఠాత్తుగా హస్తిన పర్యటన చేపట్టడంతోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఆయన ఒక్కసారంటే ఒక్క సారి కూడా ప్రధానితో భేటీ కాకపోవడం.. ఆయన పలు సందర్భాలలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రొటోకాల్ ను కూడా పాటించకుండా ఆయనకు ఆహ్వానం, వీడ్కోలు పలకకుండా దూరంగా ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ తెరాసను దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తన విమర్శలకు టార్గెట్ గా ప్రధాని మోడీని ఎంచుకోవడంతో బీజేపీతోనూ, మోడీతోనూ పూడ్చడానికి వీల్లేనంతగా అగాధం పెరిగిందని తెరాస వర్గాలే చెబుతున్నాయి. రాజకీయంగా వైరి పక్షాలైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతగా ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణపై దృష్టి సారించిందనీ, పరిమితులకు మించిన అప్పులు, కాళేశ్వరం జాతీయ హోదా అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, అవకతవకలను ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వెల్లడించిందని అంటున్నారు. కాగా ఇంత కాలం కేంద్రం విమర్శలను,  అప్పులు కేటాయింపుల విషయంలో కేంద్రాన్ని దీటుగా ఎదుర్కొన్న కేసీఆర్ ఇటీవలి వరదలలో కాళేశ్వరం పంప్ హౌస్ లు  నీట మునిగి, ప్రాజెక్టు లోపాలు బహిర్గతం కావడంతో డిఫెన్స లో పడ్డారని అంటున్నారు. దీంతో కేంద్రానికి చేరువ కావడానికి, రాజీపడటానికి అవకాశాలన్నీ మూసుకు పోయిన తరుణంలో ఆయనకు కనిపిస్తున్న ఏకైక హోప్ కాంగ్రెస్సేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కు చేరువ కావడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన రెండు చేతులతో అందుకోవడానికి చేయని ప్రయత్నం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ భవన్ వద్ద విపక్షాలతో ధర్నాకు కాంగ్రెస్  పిలుపునిచ్చిన సందర్భంలో అన్ని పార్టీల కంటే ముందుగా గాంధీ భవన్ కు ప్లకార్డులతో చేరుకున్నది తెరాస ఎంపీలే. అలాగే సోనియా గాంధీ ఈడీ విచారణ కోసం వెళ్లినప్పుడు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది కూడా టీఆర్ఎస్ ఎంపీలే. ఆందోళనా కార్యక్రమాలపై చర్చించేందుకు పార్లమెంటు ఆవరణలోని కాంగ్రెస్ కార్యాలయంలో విపక్షాల సమావేశానికి కూడా తెరాస హాజరైంది. సోనియాను ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ కు సంఘీ భావం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హస్తిన పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో తెరాస ఎంపీలు కాంగ్రెస్ తో కలిసి వివిధ అంశాలపై పోరాడాలని ఇప్పటికే కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే హస్తిన పర్యటనకు ముందు ఆయన కేవీపీతో పలు మార్లు సంభాషించారనీ, ఒక అడుగు తాను వెనక్కు వేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నాననీ ఆయన కేవీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. కేవీపీ ద్వారా ఆయన తన హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హస్తిన చేరిన తరువాత కూడా ఈ విషయంపై ఆయన కేవీపీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ కాంగ్రెస్ తో సయోధ్యకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారని చెబుతున్నారు. ఇటు తెలంగాణలో తెరాస మరోసారి అధికారంలోకి రావాలన్నా.. అటు జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ స్నేహం అనివార్యమని కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేసీఆర్ హస్తిన పర్యటనలో హస్తం పార్టీకి తెరాసను చేరువ చేసే కేసీఆర్ యత్రాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయనకు కేవీపీ భరోసా ఇచ్చారనీ చెబుతున్నారు. 

ఆంధ్రా  అడియాస‌... విశాఖ రైల్వేజోన్‌

మామిడి చెట్టు పై కొమ్మ‌కి ఉన్న కాయ‌ను చూసి పిల్లాడు అడిగాడు. చాలా ఎత్తులో ఉంది రేపు కోసిస్తాను అన్నాడు తండ్రి. వారం అయినా ఏం మాట్లాడ‌లేదు. పిల్లాడు అలిగాడు. పెర‌ట్లోకి తీసికెళ్లి తండ్రిని డిమాండ్ చేశాడు. అదింకా కింద ప‌డ‌లేదు, ప‌డిన‌త‌ర్వాత చూద్దామ‌న్నాడు. అదుగో అలానే ఉంది విశాఖ రైల్వేజోన్ వ్య‌వ‌హారం. కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి విశాఖ రైల్వేజోన్ ని తాయిలంలా చూపింది.  ఎన్నిక‌ల‌కు ముందు ఆ తాయిలం చూపించి అధికారంలోకి రావ‌డానికి ఉప‌యోగించుకుంది. అనేక రాష్ట్రాల‌కు ఇచ్చి న హామీల‌తో పాటు ఆంధ్రాకు సంబంధించిన విశాఖ రైల్వేజోన్ సంగ‌తి కూడా అట‌కెక్కించింది మోదీ స‌ర్కారు.  రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంద‌ని మంత్రులు, ఏంపీలు, సీఎం కూడా ప్ర‌జ‌ల‌కు చెబుతూనే ఉన్నారు. కానీ కేవ‌లం చెప్ప‌డం, వారు మ‌భ్య‌పెట్ట‌డ‌మే ఇన్నాళ్లూ జ‌రుగుతోంది. వీరి మ‌ధ్య విశాఖ జోన్  విష‌యంలో భాషాంత‌ర‌మేమ‌న్నా ఉందేమోన‌నుకున్నారంతా. అదేమీ కాదు కేంద్రం  కావాల నే జాప్యం చేస్తున్నద‌ని ఇటీవ‌లే  బాగా స్ప‌ష్ట‌మ‌యింది. ప్ర‌ధాని సుముఖానికి చాలాసార్లు వెళ్లిన  సీఎం జ‌గ‌న్  ఈ  అంశాన్ని గురించి అస‌లు చ‌ర్చించారో లేదో ఇంత‌వ‌ర‌కూ తెలీదు. అస‌లు ఆయ‌న  ప‌ర్య‌ట‌న‌ల సారాంశం ఎప్పుడూ  ర‌హ‌స్య‌మే.  అందుకే ఆయ‌న  స్వంత ప‌నుల‌మీద  వెళ్లివ‌స్తున్నార‌న్న ఆరోప‌ణ‌లే  ఎ క్కు వయ్యాయి.  ఇహ ఇప్పుడు కేంద్రానికి అస‌లు  దాన్ని గురించి ఆలోచించే స‌మ‌య‌మే లేద‌ని అంటు న్న‌ది.  ఎవ‌రు ఎవ‌ర్ని భ్ర‌మ‌లో పెట్టార‌న్న‌ది దీన్నిబ‌ట్టీ తెలుస్తోంది.  గ‌తంలో కేంద్ర‌మే తీసుకున్న‌నిర్ణ‌యాన్ని వారే నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. అంటే వారికి అవ‌స‌ర‌మైన  స‌మ యంలో  రాష్ట్రానికి కావ‌ల‌సిన‌వి చేస్తామ‌న‌డం, ప్ర‌జ‌లు, నాయ‌కుల మాట‌ని విన్న‌ట్టు న‌టించ‌డం త‌ప్ప వాస్త‌వానికి ఏమీ ఆలోచించ‌డం లేదు. అన్నింటికంటే విచిత్ర‌మేమంటే ఎలాంటి రైల్వే జోన్ లేద‌నీ చెబు తూండ‌డం. మ‌రోవంక బీజేపీ నేత‌లు ఇచ్చేశామ‌ని ప్ర‌చార హ‌డావుడి చేయ‌డం. దీనికి తోడు గ‌త ఫిబ్ర‌వ‌రి లో దేశంలో ఇక కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు చేసే ఉద్దేశం లేద‌ని పార్ల‌మెంటులోనే కేంద్రం తేల్చి చెప్పేసిం ది.  ఇక కేంద్రాన్ని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు తిట్టుకోవ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు. అస‌మ‌ర్ధ పాల‌కుడు, మాట‌లు నేర్చిన మాంత్రికుడితో క‌లిస్తే ఇలానే ఉంటుంది. కేంద్రం కేవ‌లం క‌బుర్లు చెప్ప‌డం త‌ప్ప కొత్త రాష్ట్రానికి చేస్తున్న‌దేమీ లేద‌న్న అభిప్రాయాల‌కు ఇది మ‌రింత ఊత‌మిస్తోంది.  కేంద్రం విశాఖ రైల్వేజోన్ అంశాన్ని పాత‌బ‌డ్డ చింత‌కాయ‌ప‌చ్చ‌డిగా పేర్కొంటూ దాన్ని గురించి చ‌ర్చోప చ‌ర్చ‌లు చేయ‌డం శుద్ధ దండ‌గ  అంటోంది. పైగా వాల్లేరు డివిజ‌న్‌ను ఓడిషాలో క‌లిసేసింది.  చిత్ర‌మే మంటే, విశాఖ రైల్వే జో‌న్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు  కానీ వాల్తేర్‌ను లాగేసు కుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు  అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి.  కానీ  కేంద్రం ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యాన్నే ప్ర‌ద‌ర్శిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రం ద‌గ్గ‌ర దాసోహం అంటూండ‌ట‌మే అందుకు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు విన‌ప‌డుతు న్నాయి.

వీర జవానుల విజయ కేతనం.. విజయ్ దివస్

 జూలై26, 1999, కార్గిల్ పర్వత ప్రాంతాలలో భారత సేనలు సాధించిన మహోన్నత విజయానికి ప్రతీక. ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ మాత్రమే కాదు, భారత సేనల అద్వితీయ ధైర్యసాహసాలు అత్యున్నత త్యాగాల విజయ గాధ మాత్రమే కాదు. దౌత్యపరంగానూ భారత దేశాన్ని అంతర్జాతీయ వేదికపై, బలీయమైన శక్తిగా నిలిపిన రోజు.అంతేకాదు, అంతర్జాతీయంగా మొదటిసారిగా పాకిస్థాన్ ను ఏకాకిని చేసిన రోజు. అలాగే,  ఉగ్రవాదాన్ని పోషిస్తున్న ఓ అప్రజాస్వామిక దేశంగా పాకిస్థాన్’  ప్రపంచ దేశాల్ ముందు దోషిగా నిలబెట్టిన రోజు.   కార్గిల్ యుద్ధం, పుట్టు పుర్వోత్తరాలోకి వెళితే, పాకిస్థాన్ ప్రభుత్వం, అప్పటి ఆ దేశ అధ్యక్షుడు ముషారఫ్   కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించేసిన కుట్ర, పన్నిన పన్నాగం తప్ప మరేమే కాదు. కార్గిల్ యుద్దః అణు యుద్ధంమారే ప్రమాదం పొంచి ఉందనే భ్రమలు సృష్టించి, కశ్మీర్ వివాదంలోకి మూడవ దేశం తక్షణ జోక్యానికి అవకాశం కలిపించి, తద్వారా కశ్మీర్‌ను అంతర్జాతీయ వివాదంగా చిత్రీకరించాలని ముషారఫ్ ప్రధాన ఎత్తుగడ. అందుకోసమే, ఎల్‌ఓసీని ఉల్లంఘించి కార్గిల్‌లోని నియంత్రణ లేని ప్రాంతాలను ఆక్రమించాలి అనుకున్నారు. అయితే కార్గిల్ దాడి తర్వాత భారతీయ సైన్యం స్పందించిన తీరు పాకిస్థాన్ సైన్యం ఊహకు అందని విధంగా ఉండడంతో వారి ఆటలు సాగలేదు.  వ్యూహాటకమైన కార్గిల్  పర్వత ప్రాంతాలను ఆక్రమించుకోవడం ద్వారా సమీప భవిష్యత్ లో మొత్తం జమ్మూ, కాశ్మీర్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం పాకిస్తాన్ కుట్రపూరితంగా, దొంగచాటుగా దెబ్బతీయాలని చేసిన ప్రయత్నాన్ని మన సేనలు అపూర్వమైన ధైర్యసాహసాలతో ఎదిరించారు. ప్రతికూలమైన పర్వత ప్రాంతాలలో మన సేనల పోరాట పటిమ మొత్తం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. ఆనాడు వాజపేయి, జార్జ్ ఫెర్నాండస్, జస్వంత్ సింగ్ – తిరుమూర్తుల నాయకత్వంలో మన ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించిన తీరు అనూహ్యం. 1971లో బాంగ్లాదేశ్ ఆవిర్భావం తర్వాత మనం సైనికంగా, దౌత్యపరంగా సాధించిన మరో అసాధారణమైన విజయంగా చెప్పవచ్చు.    ఉగ్రవాదులతో పాటు వారి వేషధారణలో చొరబడి భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి కార్గిల్ కొండలను ఆక్రమించిన పాక్ సైనికులను భారతీయ సైనికులు తుదముట్టించారు. అణ్వాయుధ దాడి వంటి తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్న భయంతో కూడా భారతదేశాన్ని భయపెట్టలేమని యావత్ ప్రపంచ సమాజం గ్రహించేటట్లు చేయగలిగారు. దేశ  ఐక్యత, సమగ్రతను రక్షించే సమస్యలపై ప్రపంచంలోని ఏ అగ్రరాజ్యం ఒత్తిడికి లేదా ప్రభావానికి భారత్ లొంగబోదని స్పష్టం చేశారు.   కార్గిల్ యుద్ధం పాకిస్థాన్‌ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే రాజ్యంగా పూర్తిగా బహిర్గతం చేసింది. కార్గిల్ దాడిపై తనకు ఎలాంటి సమాచారం లేదని  పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పగా, షరీఫ్‌కు అన్నీ తెలుసని ఆర్మీ చీఫ్ ముషారఫ్ పేర్కొంటూ దొంగాట ఆడారు.   కార్గిల్‌ గురించి షరీఫ్‌కు తెలుసో, తెలియదో గాని పాక్ సేనలకు తిరిగి భారత్ పై యుద్దానికి దిగలేని విధంగా గుణపాఠం చెప్పారు.  సైన్యం చేసిన ఈ దుశ్చర్య గురించి ప్రధానికి నిజంగా తెలియకపోతే, పాకిస్థాన్‌కు సైన్యం లేదు, సైన్యంలో పాకిస్తాన్ ఉంది అని స్పష్టం అవుతుంది.మొత్తానికి ఈ దుస్సాహసం పాకిస్తాన్ ను జటిలమైన సంకటంలో పడవేసింది. మే 17న పాక్ సేనలు కార్గిల్ పర్వతాలపైకి చొచ్చుకు పోయేవరకు తనకు ఈ దాడి గురించి తెలియదని ఆ దేశం విదేశాంగ మంత్రి కూడా కలత చెందారు.పాకిస్తాన్ సైన్యంలో ఇంతటి గందరగోళం అంతకు ముందెన్నడు కలుగలేదు. భారత్ అనుసరించిన అసాధారణమైన దౌత్య వ్యూహం కారణంగా  కార్గిల్ శిఖరాల నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రపంచంతో పాటు తమకు బాసటగా మరోవైపు నుండి భారత్ పై యుద్దానికి దిగుతుందని అనుకున్న  చైనా కూడా సేనలను వెనుకకు తీసుకెళ్లామని ఒత్తిడి చేయడంతో పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది.  కార్గిల్‌లో పోరాడుతున్న తమ సేనలు కాదని, ముజాహిదీన్‌లు అని మొదట పాకిస్తాన్ ప్రపంచానికి అబద్ధం చెప్పింది, కానీ ప్రపంచ ఒత్తిడిలో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పిలిచినప్పుడు,  వారి కుట్ర ఏమిటో  ప్రపంచానికి బట్టబయలైంది. పాకిస్తాన్ ముజాహిదీన్లను నియంత్రిస్తున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలు వాస్తవమని మొత్తం ప్రపంచం గ్రహించింది.   ముజాహిదీన్‌ పేరుతో కశ్మీర్‌ లోయలో పాక్‌ ఉగ్రరూపం దాల్చిందన్న వాస్తవం కూడా ప్రపంచ దేశాలకు అర్థమయింది.  అంతర్జాతీయ వత్తిడి పెరగడంతో దిక్కులేక కార్గిల్ ఎత్తైన శిఖరాలలో పర్వేజ్ ముషారఫ్ తమ సేనలను దిక్కులేనివారిగా వదిలివేశారు.  ఆవిర్భవించినప్పటి నుంచి పాకిస్థాన్‌లో జవాబుదారీ వ్యవస్థ అంటూ  లేదు. అరాచకమే రాజ్యమేలుతుంది.  ఇంత పెద్ద పొరపాటుకు కారణమైన ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు కావడమే అందుకు నిదర్శనం.  ఏమైతేనేమి, కార్గిల్ విఫల రాజ్యానికి మరో విఫల ప్రయత్నమని నిరూపించబడింది.  1965, 1971 యుద్ధాలలో ఓడిపోయినా పాకిస్తాన్  సైన్యం తన  దుర్మార్గపు ఆలోచన మారలేదు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు రెండుసార్లు, పాకిస్తాన్ సైన్యం కార్గిల్ వైపు నుండి భారత్‌పై దాడికి విఫల విఫల ప్రయత్నం చేసింది.. మూడవ ప్రయత్నంలో యుద్దంలో ఓడి పలాయనం చిత్తగించింది.

చంద్రబాబు లేఖతో వరద ప్రభావిత ప్రాంతాలకు జగన్ పరుగు

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో గోదావరి నది జిల్లాలకు జిల్లాలనే ముంచెత్తినప్పుడు నీరో చక్రవర్తిలా వ్యవహరించిన సీఎం జగన్.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు కోనసీమ జిల్లాకు పరుగులు పెట్టారు. పి.గన్నవరం, రాజోలు మండలాల్లో పర్యటించి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడమే కాకుండా, వరద బాధితులు కొందరితో ముఖాముఖి మాట్లాడారు. అంతకు ముందు వరద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరిగి గాల్లోనే వెనక్కి వెళ్లిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితమే వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు భరోసా కల్పించి వచ్చారు. కాగా.. గోదావరి నదికి వరదలు భారీగా వస్తాయని కేంద్ర జలసంఘం ముందే హెచ్చరించినా జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోలేదని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. గోదావరి నది పరీవాహ ప్రాంతంలోని, ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని వరదలకు వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావంపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదని, సురక్షిత ప్రాంతాలకు ముందు తరలించలేదని విమర్శించారు. వరద బాధితులకు భరోసా కల్పించలేదని, వారిని ఆదుకోవడంలో దారుణంగా విఫలమైందని చంద్రబాబు తూర్పారపట్టారు. గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం అందించి, ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఓ లేఖ రాశారు. ఒక పక్కన వరద పీడిత ప్రాంతాల్లోని బాధితులు అన్నమో రామచంద్రా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో పాటు.. వైసీపీ సర్కార్ పైన, అధికారులు, ప్రజాప్రతినిధుల పైన తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మరో పక్కన బాధితులను వారి ప్రాంతాల్లోనే ముందే ప్రత్యక్షంగా పరామర్శించి, స్థానిక టీడీపీ నేతలు, శ్రుణులను సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని చంద్రబాబు పురమాయించారు. వరద నీటిలో, బురదలో కూడా చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లి మరీ బాధితులకు భరోసా ఇచ్చి వచ్చారు. దీంతో పొలిటికల్ మైలేజ్ చంద్రబాబుకే వచ్చేస్తోందని భావించారో, లేదా ప్రజల్లో ఇప్పటికే తమ ప్రభుత్వంపై, పాలనపై గూడుకట్టుకున్న వ్యతిరేకత మరింతగా పెరిగిపోతుందనే భయంతోనో సీఎం కోనసీమ జిల్లాలో పర్యటనకు వెళ్లారు. అయితే.. సీఎం వెళ్లింది వరద పీడిత ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసేందుకు. కానీ వరద బీభత్సాన్ని, బురదతో నిండిన ప్రదేశాలను సీఎం కళ్లకు కనిపించకుండా అధికారులు, స్థానిక వైసీపీ నేతలు పరదాలు కట్టడం ఏంటని జనం ఎద్దేవా చేస్తున్నారు. నాయకుడంటే చంద్రబాబులా ఉండాలని, కష్టం వచ్చిన వెంటనే నేనున్నానంటూ తమ ముందుకు వచ్చినే వాడే అసలైన నేత అంటున్నారు. కానీ.. సీఎం జగన్ లా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్క మొరిగిన చందంగా ఇప్పుడు పర్యటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు హుటాహుటిన బాధిత ప్రాంతాల్లో వాలిపోయి, అక్కడే తాత్కాలిక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి మరీ సహాయక చర్యలను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక పక్కన తామంతా వరదల్లో అష్ట కష్టాలు పడుతుంటే.. సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో తమ పార్టీ నేతలతో వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అనే, పొలిటికల్ మైలేజ్ ఎలా రాబట్టుకోవాలి, మళ్లీ అధికార పీటాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలనే విషయాలపై ఫోకస్ పెట్టిన వైనాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇటు చూస్తే స్టాలిన్.. అటు చూస్తే మోడీ .. కేసీఆర్ కు కింకర్తవ్యం!

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఈ పోలిక అంత ఆప్ట్ కాదేమో కానీ,  ఒక దానితో ఒకటి ముడి వేసి, అటూ ఇటూ అవడం కంటే  దేనికదే అన్నట్లుగా నడచు కుంటే, ఇదిగో ఇలాంటి గిల్లికజ్జాలు, చిల్లర తగవులు  రావంటారు. ఒకరేమో దేశ ప్రధానమంత్రి, ఇంకొకరేమో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ ఇద్దరు ఎడ ముఖం పెడ ముఖంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక పోవడం వారికేమో గానీ, చూసే వాళ్ళకు , అస్సలు బాగోదు. బాగుండడం బాగోకపోవడం విషయం పక్కన పెట్టినా, ఆ కారణంగా  అసలే అంతంత మాత్రంగా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబధాలు మరింతగా బిగుసుకు పోయే ప్రమాదం ఉందని, నిజానికి అదే జరుగుతోందని అంటున్నారు. ఫలితంగా పరస్పర ప్రయోజనాలే కాదు, పరిపాలనా పరంగా సమస్యలు వస్తాయని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ సంబంధాల విషయాన్నే తీసుకుంటే రెండు ప్రభుత్వాల మధ్య ప్రతి రోజు ఏదో ఒక వివాదం రగులుతూనే వుంది. రోజులు వారాలు కాదు, ఏకంగా నెలల తరబడి తగవులు సాగినా చివరకు ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. హళ్లికి హళ్లి  సున్నకు సున్నా.  వరి వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణకు ఇరుగు పొరుగున ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనూ రాజకీయంగా కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వాలే ఉన్నాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత కు గానూ, 18 రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ అధికారంలో వుంది. మిగిలిన  రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేదు. కాంగ్రెస్, తృణమూల్ , లెఫ్ట్ ఫ్రంట్, ఆప్ ఇలా వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయినా, రాజకీయంగా ఎవరిని ఎవరు ఎంతగా విమర్శించుకున్నా వ్యక్తిగత ద్వేషం పెద్దగా ఎక్కడ కనిపించదువు. ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ వంటి ఒకరిద్దరు ముఖ్యమంత్రుల విషయంలో తప్పించి మిగిలిన వారి విషయంలో ఇలాంటి వ్యక్తిగత ద్వేషం ఎక్కడా లేదనే చెప్పవచ్చును.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత సంవత్సర కాలంలో , అధికార అనధికార కార్యక్రమాలలో పాల్గొనేందుకు నాలుగైదు సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయినా, ఏ ఒక్క సందర్భంలోనూ  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. వీడ్కోలు చెప్పలేదు. ప్రోటోకాల్ పాటించలేదు. మరోవంక గవర్నర్ విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు అదే విధంగా వుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ తో అటు కేంద్ర ప్రభుత్వంలో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అన్నట్లుగా  కయ్యానికి కాలు దువ్వడమే కనిపిస్తోంది.   అదలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ఎదురుపడకుండా అయితే తప్పించుకున్నారు, కానీ, రేపు జూలై 28 న చెన్నైలో ప్రధాని మోడీని, ఎదురుగా పేస్ చేయక తప్పేలా లేదు. విషయం ఏమంటే, జూలై 28న చెన్నైలో ఫిడె చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఈ పోటీలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. ఇదే ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రత్యేకంగా ఒక ఎంపీని హైదరాబాద్ పంపి మరీ, కేసీఆర్ ను ఆహ్వానించారు. కేసీఆర్  ఒకే చెప్పేశారు. తప్పకుండ్ వస్తానని మాట కూడా ఇచ్చేశారు. అయితే, అప్పటికీ అ పోటీలను ఎవరు  ప్రారంభిస్తారనే విషయ  ఖరారు కాలేదో ఏమో కానీ, ఇప్పడు తాజాగా ఒలింపియాడ్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారని అధికారికంగా ప్రకటించడంతో,కేసీఆర్ మీమాంసలో పడ్డట్టు తెలుస్తోంది. స్టాలిన్ కోసం వెళ్ళా లా, మోడీ కోసం మానేయాలా ? అనే విషయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు.