తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఎక్కడంటే? ఎందుకంటే??

తెలంగాణలో త్వరలో  మరో  అసెంబ్లీ స్థానం ఖాళీ కానుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా ? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారెందుకు సిద్ధమయ్యారా ? అంటే, రాజకీయ వర్గాల నుంచి, అవుననే సమాధానమే వస్తోంది. అవును, గత కొద్ది రోజులుగా నల్గొండ  జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారనే వార్త మీడియా, సోషల్ మీడియాలలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చాలా జోరుగా షికార్లు చేస్తోంది.   అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకున్న కోమటి రెడ్డి సోదరుల రాజకీయం  ఎప్పుడు మలుపు తిరుగుతుందో, వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం.  అంతే కాదు , కోమటి రెడ్డి సోదరుల మాటల్లో వినిపించే జోరు, చేతల్లో కనిపించదని  అంటారు. నిజానికి, ఒక దశలో సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇక జీవితంలో గాంధీ భవన్ గడప తొక్కేది లేదని శపథం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని పరోక్షంగానే అయినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఆ తర్వాత గాంధీ భవన్ మెట్లు ఎక్కడమే కాదు, సోనియా, రాహుల్ గాంధీ కంటి తుడుపు కానుకగా ఇచ్చిన స్టార్ క్యాంపైనర్ పదవిని కళ్ళ కద్దుకుని మరీ తీసుకున్నారు. ఆరో వెలితో సమానమైన అ పదవితోనే సంతృప్తి చెందారు, సర్దుకు పోయారు.   ఇక రాజగోపాల రెడ్డి, విషయం అయితే చెప్పనే అక్కర లేదు. 2018 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి, గడచిన మూడు సంవత్సరాలుగా రాజగోపాల రెడ్డి  పార్టీ మారతారనే వార్త  పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూనే వుంది. బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్త లొచ్చాయి. అయితే. ఇంతరవరకు ఆ దిశగా  ముందడుగు పడలేదు. ఆ ముహూర్తమూ రాలేదు. అయితే, ఈసారి అలా కాదని, నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారని అంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో  భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత షా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక గెలుపుతో, పార్టీకి మంరింత ఉపు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వచ్చిన ఉపును, మరో ఉప ఎన్నిక గెలుపుతో మరింత ముందుకు తీసుకు పోయే వ్యూహంలో భాగంగానే, మునుగోడును ఎంచుకున్నారని అంటున్నారు. అందుకే అమిత్ షా ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో రాష్ట్ర నాయకుల ప్రమేయం  లేకుండా నేరుగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షా చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అయితేనే బీజేపీలోకి తీసుకుంటామని రాజ గోపాల రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు అంగీకరిస్తే  ఉప ఎన్నికల భారం మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పడంతో పాటుగా అమిత్ షా ఉప ఎన్నికల్లో గెలుపునకు భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ  మునుగోడుతో పాటుగా  మరో మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి, చివరకు మునుగోడు పై నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  సో .. అదే నిజం అయితే బంతి ఇప్పుడు రాజగోపాల రెడ్డి కోర్టులో ఉందని, ఆయన ఊ .. అంటే  కర్ణాటక (ముదస్తు) అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా డిసెంబర్’లో మునుగోడు ఉపేఎన్నిక ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్లే అంటున్నారు.

బ్ర‌ద‌ర్స్‌..ఇదే స‌మ‌యం...ఉద్య‌మించండి!

రాజ్యానికి దూర‌మైన రాకుమారుడు ప‌ది మందిని పోగేసి యుద్ధానికి స‌న్న‌ద్ధం కావ‌డానికి అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచాడు. ఆ ప‌దిమంది త‌మ బంధువ‌ర్గాన్నీ, స్నేహితుల‌నీ పోగేసి పెద్ద సైన్య‌మే సిద్ధం చేశారు. ఇదంతా రాజ్యాన్ని తిరిగి సాధించాల‌న్న ప‌ట్టు ద‌ల‌, రాజ్యంలో త‌లెత్తిన దారుణ ప‌రిస్థితులే కార‌ణం. అందుకే అవ‌కాశాన్ని చేజిక్కించుకోవ‌డానికి మ‌న‌లోని పొర‌పాట్ల‌ను, నిరాశ‌ను వ‌దిలేసుకుని రెండింత‌ల ఉత్సాహాంతో ఉర‌కండి అంటూ ఆ రాకుమారుడు సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చి మ‌రీ ర‌ణ‌రంగానికి స‌న్న‌ద్ధుల‌ను చేశాడు...ఇది అనేక త‌రాల క్రితం జ‌రిగిన క‌థ‌. ఇపుడు ఇందుకు దాదాపు ద‌గ్గ‌ర‌లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవ‌డానికి తెలుగుదేశం అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టి రాష్ట్ర రాజ‌కీయ‌, సామాజిక ప‌రిస్థితుల‌న్నీ ఆయ‌న శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను ద్విగుణీకృతం చేశాయి. కొత్త శ‌క్తితో ఆయ‌న కుర్రాడిలా ఉర‌క‌లు వేస్తున్నారు. అలాంట‌పుడు పార్టీ నాయ‌కులు, హితులు, కార్య‌క‌ర్త‌లు నీరుగారిన‌ట్టు ఉండ‌డం, నిరుత్సాహంగా ఉండ‌డం ఆయ‌న‌కు స‌సేమీరా ఇష్టం లేదు. అందుకే అంద‌రినీ పిల‌చి క్లాసు పీకుతున్నారు. ఇది సామాన్య‌మైన‌ది కాదు యుద్ధోన్ముఖుల‌ను చేసే స్పెష‌ల్ క్లాసు. దీనికి అంద‌రూ అటెండ్ కావాలి. అధికారంలోకి వ‌చ్చి మ‌ళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలోకి తీసికెళ్లాలంటే ఇదే మంచి త‌రుణం. అధికారంలో ఉన్న జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పూర్తిగా కోల్పోయారు. అందువ‌ల్ల విప‌క్షంగా బ‌ల‌వంతుల‌మై వారిని పీఠం నుంచి దించాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే బ‌త‌కాలి, ఉర‌కాలి, మాట్లాడాలి, ఎదిరిం చాలి.. అన్న నినాదాల‌ను బాబు ఇప్పుడు త‌మ ఎమ్మెల్యేల‌కు నూరి పోయ‌డంలో త‌ల‌మున‌క‌ల‌య్యారు.  చంద్ర‌బాబులో గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని కొత్త కోణం ఇపుడు బ‌య‌ట‌ప‌డింది. ఆయ‌న‌లో ఒక గొప్ప నూత‌నోత్సాహంతో కూడు కున్న మార్పు క‌న‌ప‌డుతోంది. కానీ కొన్ని జిల్లాల్లో పార్టీ నేత‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొన‌డం ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన డ‌మే ఆయ‌న్ను ఇబ్బందిపెడుతోంది. వారినీ అధికారం వేపు క‌ద‌ల‌మ‌ని, అందుకు త‌గ్గ‌ట్టు మారాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. మాట‌లో, ఆరోప‌ణ‌ల్లో వేగం పెంచారు. అంద‌రినీ అలానే దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌చారంలో, రోడ్డు షోల‌లో ఆయ‌న సాధార‌ణంగా మాట్లాడే తీరులో ఎంతో మార్పు వ‌చ్చింది. మాట‌ల తూటాలు వ‌దులుతున్నారు. ప్ర‌త్య‌ర్ధుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఈసారి న‌ల‌భ‌యి శాతం యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా పార్టీలో కొత్త శ‌క్తికి అవ‌కాశం క‌ల్పించి పార్టీప‌రంగా త‌మ శక్తి సామ‌ర్ధ్యాల్ని మ‌రింత ప్ర‌ద‌ర్శించి ప్ర‌తిప‌క్షాల‌కు నిద్ర‌లేకుండా చేయాల‌న్న‌దే ఆయ‌న ల‌క్ష్యంగా ఉంది.  అందుకే కష్టపడిన వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని, ఈసారి ఎన్నికలలో ఎలాంటి లాబీయింగ్ లు పని చేయవని స్పష్టం చేసిన నేపద్యం లో కార్యకర్తలలో కొత్త  ఉత్సాహం నింపారు.ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవడమే టార్గెట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రమిస్తు న్నారు. వయసు మీద పడుతున్నా. యువతకు పోటీగా విరామం లేకుండా జిల్లాల బాట పడుతున్నారు. ఇబు  బాదుడే బాదుడు అంటూ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన వరద ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా భేటీ నిర్వహిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు టచ్ లో ఉంటున్నారు. వారి నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంలోనూ  కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారులు, వ్య‌హ‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన‌ట్టు కాకుండా యువ‌త మ‌న‌సును తాకేట్టు క్లుప్తంగా, సూటిగా మాట్లాడుతూ పార్టీవ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ఏ నేత ఏం చేస్తున్నారో.. ఏనేత పై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం ఏంటన్నది ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసు కుంటున్నారు. చాలా మంది నేతలు మొదట రెండు మూడు రోజులు చేయడం, ఆ తరువాత ఎప్పుడో తమకు కుదిరినప్పుడు జనంలోకి వెళ్లడం లేదా.. పార్టీ పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతున్నారని క్లాస్ పీకారు. ఇది కేవలం ఒకరిద్దరు కాదు జిల్లా నేతలం దరి పరిస్థితి ఇలానే ఉంది. మీరు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలు త‌న‌కు స్ప‌ష్టంగా తెలుస్తున్నాయ‌న్నారు. పార్టీ అధినేత ఇంత స్ప‌ష్టంగా, సూటిగా ఉండ‌డంతో నాయ‌కులు కాస్తంత ఖంగుతున్నారు. బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం కాస్తంత విజ‌య‌వంతం కావ‌డంతో బ‌ద్ద‌కంగా మార‌డం త‌గ‌ద‌ని హెచ్చ‌రిస్తూ ఈ దూకుడును ప‌నిలోనూ చూపించ‌గ‌లిగితేనే ల‌క్ష్యం సాధించ‌గ‌ల్గుతామ‌ని హెచ్చ‌రించారని తెలుస్తోంది.  అయితే, పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండాలని చెబితే.. ఒక నియోజకవర్గంలో కూడా మెరుగ్గా ప్రోగ్రెస్ లేదని ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి మీ ప్రాంతంలో విద్యుత్ మీటర్లు అమర్చుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్ గా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై రెగ్యూలర్ గా కార్యక్రమం చేయడంపై ఏ ఒక్కరికీ శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేతలు మానిటర్ చేయాల్సిన ఐదు జిల్లాల కో-ఆర్డీనేటర్ అమర్నాథ్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు జూమ్ మీటింగ్ ను  నాయ‌కులు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. తీరా  స‌మావేశంలో ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తెలుసుకునే య‌త్నం చేయ‌గానే అంతా విస్తుపోయారు.  మొత్తానికి చంద్ర‌బాబు నూత‌నో త్సాహం తో ఉర‌క‌లు వేస్తుండ‌డంతో పాటు నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌నూ మ‌రింత ఉత్సాహంగా, దూకుడుగా ముంద‌డుగు వేయాల‌ని చిన్న హెచ్చ‌రిక ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. పత్తా లేని మంత్రులు

గోదావరి వరద చరిత్రను తిరగ రాసింది. 36 ఏళ్ల తర్వాత గోదారమ్మ మరోసారి మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వరదనీటి ప్రవాహానికి నదీ పరీవాహక ప్రాంతాలు తల్లడిల్లిపోయాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వందలాది లంక గ్రామాల ప్రజలు వరదనీటి మునకలో నరకయాతనలు పడుతున్నారు. అనేక లంక గ్రామాల్లో వరదనీరు 18 నుంచి 25 అడుగుల ఎత్తులో ప్రవహించింది. కొన్ని మండలాల్లో ఏ లంక గ్రామం ఎక్కడ ఉందో తెలియనంతగా వరదనీరు వెల్లువెత్తింది. గోదావరినదీ పాయలు వశిష్ట, వైనతేయి, గౌతమి భీకరరూపం దాల్చి ప్రవహించాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని పలు గ్రామాలు కూడా వరద ఉధృతితో అల్లాడిపోయాయి. ప్రకృతి విపత్తు ఊళ్లకు ఊళ్లపైన ఇంతలా విరుచుకుపడినా ఏపీలోని ఏ మంత్రి కూడా వరద బాధిత ప్రాంతాలను కన్నెత్తి చూడడం లేదని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి అధికారం కట్టబెట్టిన తాము అసలు బతికి ఉన్నామో చచ్చామో కూడా చూసేందుకు కూడా ఒక్క మంత్రి కూడా రాలేదని దుయ్యబడుతున్నారు. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, పిల్లలకు పాలు లేక, కొంపా గోడు కూలిపోయి, ఇంట్లోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయి, పాడైపోయినా తమను ఏ ఒక్క మంత్రీ కనీసం పలకరించకపోవడం, పరామర్శించకపోవడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలూరు జిల్లాలో ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బీభత్సంతో 50 వేల మందికి పైగా ప్రజలు అల్లాడిపోయారు. అయినప్పటికీ వారిని పరామర్శించేందుకు కనీసం ఒక్క వైసీపీ నేత గాని, ఒక్క మంత్రి గానీ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఒక పక్కన ఎక్కడికక్కడ టీడీపీ స్థానిక నేతలు తమకు తోచిన మేరకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆహారం, తాగునీరు లాంటివి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు గుండెలోతు వరదనీటిలో కూడా స్వయంగా తమ వద్దకే వచ్చి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సహాయ సహకారాలు అందించారు. అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రుల కానీ ఒక్కరు కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదని శాపనార్థాలు పెడుతున్నారు. సీఎం జగన్ రెడ్డి కూడా ఏదో గాల్లో వచ్చి గాల్లోనే తిరిగి.. తమను గాలికి వదిలేసి తుర్రుమన్నారే తప్ప నేరుగా తమ ఇబ్బందుల గురించి ఒక్క మాట అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరద బీభత్సంలో కూడా మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి తమను పరామర్శించి, కష్టసుఖాలు తెలుసుకోవడం పట్ల వరద పీడిత ప్రాతాల వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో పడవ ప్రమాదం జరిగి, టీడీపీ సీనియర్ నేతలు నదిలో పడిపోయారు. అయితే.. అప్పటికే చంద్రబాబు మరో బోటులోకి వెళ్లడంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇలా ప్రాణాలకు తెగించి కూడా టీడీపీ అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు తమకు అండగా నిలబడితే.. వైసీపీ నేతలకు ఏ మాయ ముంచుకొచ్చిందని దుయ్యబడుతున్నారు. అయితే.. తూర్పు గోదావరి జిల్లాలో కొందరు మంత్రులు వరద ప్రాంతాలకు వచ్చి, చూసి వెళ్లారంటే.. కనీస సాయం అందించలేదని, మాట వరసకు కూడా ఒక్క హామీ ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కన చంద్రబాబు సహా టీడీపీ నేతలు వరద బాధిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి, భరోసాగా నిలిస్తే.. ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’గా సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించుకోవడాన్ని జనం తప్పుపడుతున్నారు. జగన్ ఎంతసేపూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అడ్డదారుల్లో అయినా మళ్లీ ఎలా అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయమే తప్ప తమను పట్టించుకోవడంలేదని ఫైరవుతున్నారు. ఒక పక్కన లక్షలాది మంది జనం వరద ముంపులో నానా అగచాట్లు పడుతుంటే.. జగన్ మాత్రం జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాలు, నియోజకవర్గం, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల గురించి చర్చలతో కాలక్షేపం చేయడమేంటని నిలదీస్తున్నారు.

లాలీ  వీర‌మ‌ర‌ణం!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఫ‌తాన్‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బ‌హ‌దూల్ గ్రామంలో ఇటీవ‌ల చాలామంది  ఒక పెద్దాయ‌న ఇంటి వ‌ద్ద ఆమ‌ధ్య గుమిగూడి సంతాపం ప్ర‌క‌టించి ద‌హ‌న‌సంస్కారాలు చేసేరు. ఎంత‌యినా లాలీ.. లాలీయే..నాలుగు రోజులుముందు పుట్టిన లేగ దూడ‌ను కాపాడి త‌న ప్రాణాలు కోల్పోయింది.. అది స్వామిభ‌క్తంటే.. అనుకున్నారంతా!  లాలీ వీర‌మ‌ర‌ణం పొందింది. ఇంత‌కీ ఈ లాలీ ఎవ‌రంటే ఓ కోడి. తినడానికి ఎన్నిఉన్నా, ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక‌టి స్పెష‌ల్ ఉంటుంది. కానీ తొంభైశాతం మంది భోజ‌న‌ప్రియుల‌కు చికెన్ అంటేనే ప్రాణం. కోడియ‌న్న‌ది తినుట‌కేగ‌దా మాన‌వా! అనే డైలాగులు నిత్యం హోట‌ళ్ల‌లో వింటూండ‌వ‌చ్చు. కానీ బ‌హ‌దూల్ వాసులు మాత్రం లాలీని బ్ర‌హ్మాండంగా పెంచేరు, త‌మ ఇంట్లో ఆవులు, గేదెల్లాగా ఎంతో ప్రేమ‌తో. అందుకే వారికోసం ప్రాణ త్యాగం చేసింది. డాక్ట‌ర్ సక్రామ్ స‌రోజ్ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఆ మ‌ధ్య లేగ పుట్టింది. దానికి ర‌క్ష‌గా ఇంటిల్లాపాదీ జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డానికి ప‌గ‌లూ రాత్రి కాప‌లా కాస్తుండేవారు.  ఒక రోజు ఎవ్వ‌రూ లేని మ‌ధ్యాన్నం స‌మ‌యంలో  ఒక కుక్క ఆ ఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ఆ లేగ మీద దాడి చేసింది. అక్క‌డికి కొద్ది దూరంలో లాలీ అనే వారి కోడి అలా తిరుగుతూ కుక్కని చూసి ప‌రుగున వ‌చ్చి కుక్క‌ను ఎదిరిం చింది. కుక్క ఓ క్ష‌ణం ఆశ్చ‌ర్య పోయింది.. నువ్వెంత‌.. నేనెంత అన్న‌ట్టు చూసింది. కోడి ఎగిరి దాని మొహాన్ని పొడిచింది. కుక్క కాలితో ఒక్క త‌న్ను త‌న్న‌ది అది అవ‌త‌ల‌ప‌డింది. ఇక లేవ‌ద‌ని మ‌ళ్లీ లేగ ద‌గ్గ‌రికి వెళ్లింది. లాలీ శ‌క్తినంతా కూడ‌గ‌ట్టుకుని వ‌చ్చి మ‌ళ్లీ కుక్క కంటి మీదా, మొహం మీద దాడి చేసింది. ఎంత‌యినా కుక్క బ‌లం ముందు కోడి ఆగ‌గ‌ల‌దా? గ‌ట్టిగా ఒక్క త‌న్ను త‌న్నింది. లాలీ ఎగిరి చాలాదూరం ప‌డి ర‌క్తం ఓడి ప్రాణం విడిచింది. కానీ దాని దాడికి కాస్తంత దెబ్బ‌లు తిన్న కుక్క మ‌ళ్లీ వ‌స్తుందేమోన‌ని య‌జ‌మాని చూసి చంపుతాడ‌న్న భ‌యంతో పారిపోయింది.  కొంత‌సేప‌టికి ఆ ఇంటివారు లాలీ దూరంగా ర‌క్తం మ‌డుగులో ప‌డి ఉండ‌డం చూసి ఎంతో బాధ‌ప‌డ్డారు. స‌రోజ్ కుమారుడు అభి షేక్ ఆ కుక్క కోసం వీధంతా వెతికాడు. అది ఎటో పారిపోయింది. అత‌గాడు ఏడుస్తూ ఇల్లు చేరాడు. కానీ అప్ప‌టికి జ‌ర‌గాల్సింది జరిగిపోయింది. ఇంటిల్ల‌పాదీ, ప‌క్క‌నున్న వాళ్లూ అంతా లాలీ సాహ‌సానికి ఎంతో మెచ్చుకున్నారు, చ‌నిపోయింద‌ని  చాలా బాధ ప‌డ్డారు. దాన్ని అక్క‌డే స‌రోజ ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే ఖ‌న‌నం చేశారు. చాలా కాలం క్రితం లాలీని ఆశా దేవీ అనే కూర‌లు అమ్ముకునే మ‌హిళ ద‌గ్గ‌ర నుంచి డాక్ట‌ర్ స‌రోజ తెచ్చుకున్నారు. 

రామ్ నాథ్ కోవిండ్ వీడ్కోలు విందు.. కేసీఆర్, మమతలకు అందని ఆహ్వానం

రాజకీయ ప్రత్యర్థులను కేంద్రం, ప్రధాని శత్రువులుగా పరిగణిస్తున్నారన్న విమర్శలకు ఊతం కలిగేలా మరో ఉదంతమిది.రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం (జులై24)న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్ధం ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. ఆయన పదవీ విరమణ విందు కార్యక్రమానికి రామ్ నాథ్ కోవింద్ దంపతులు,  కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. వారితోపాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పద్మ అవార్డుల గ్రహీతలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష  కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ చౌదరి హాజరయ్యారు. కాగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడంతో.. ఢిల్లీలోని ఆ రాష్ట్ర భవన్‌ల రెసిడెంట్‌ కమిషనర్లకు వాటిని అందజేశారు. ఈ విషయాన్ని  ప్రధాని కార్యాలయం  వెల్లడించింది. వారు హోంశాఖ కార్యాలయం నుంచి నేరుగా కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపించాలని సూచించింది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపే విషయంలోనే మోడీ సర్కార్ (కేంద్ర ప్రభుత్వం) తన వైఖరిని బయటపెట్టుకుంది. కనీస మర్యాదను మంటగలిపింది. తమ విధానాలను వ్యతిరేకించే ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపలేదు.   బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సీఎంలనూ మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ సీఎంకు ఆహ్వానం అందలేదు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకీ ఆహ్వానం లేదు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన రాష్ట్రపతి వీడ్కోలు విందులో కూడా కేంద్రం వివక్ష చూపడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాయి.

కాటి కెళ్లాలన్నా.. కట్టె కాలాలన్నా బాదుడే బాదుడు!

అనాదిగా రాజుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, ధ‌నిక‌వ‌ర్గానికి, వ్యాపారుల‌కు సులువుగా చిక్కేది సామాన్య‌ప్ర‌జ‌లే. ప‌చ్చిమిర‌ప‌కాయ నుంచి ప‌చారీ సామాన్ల వ‌ర‌కూ దేని జోలికి స్వేచ్ఛ‌గా వెళ్ల‌నీయ‌రు. ఏదో ర‌కంగా క‌నీసం రెండు రూపాయ‌లు అద‌నంగా కొట్టేద్దామ‌నే అనుకుంటారు. కాలం మారినా, ఆ  దాడి ఆలోచ‌న‌లో మాత్రం పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు, పేరు మార్చారంతే. ఇంకా చెప్పా లంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించు కోవడా నికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి.  ఏదో ఒక సాకుతో అధిక ప‌న్నులు వ‌సూలు చేయ‌డం దేశంలో ఇప్పుడు నిత్య‌కృత్య‌మైంది. మ‌రీ ముఖ్యంగా జీఎస్టీతో ఉద్యోగుల జీవితాల‌ను మ‌రింత సంక్లిష్టం చేశారు. సంపాద‌న‌లో స‌గం ఏదో ఒకర‌కం ప‌న్నుల‌కే పోతోంది. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌లు విసిగెత్తు తున్నారు. ఏది కొనాల‌న్నా, తినాల‌న్నా ప్ర‌భుత్వం దాన్నిగురించి ఏమ‌న్నా అన్న‌దా అని ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌ల్పించారు. కేంద్రం కేవ‌లం వ్యాపార‌సంస్థ‌లు, ఆయా కుటుంబాల‌కు మాత్ర‌మే కొమ్ము కాస్తోంద‌న్న‌ది ప్ర‌తీ విష‌యంలోనూ తెలిసిపోతోంది. ఈ ర‌క‌మైన దోపిడీని దేశంలో సామాన్యులు ఊహించ‌లేదు. చిత్ర‌మేమంటే పెరుగు మీద‌కూడా ఐదు శాతం ప‌న్ను విధించ‌డం. ఇంత‌కంటే దారుణాన్ని ఊహించ‌లేం.  ప్ర‌జ‌లంతా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవ‌డానికి అస‌లా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక అనారోగ్యం పాలై ఆస్ప‌త్రికి వెళితే పెద్ద చికిత్స‌, ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మైతే వాటిని అడ్డుపెట్టుకుని ఆస్ప త్రులు ముందే వాటి ఖ‌ర్చు చెప్పి ప్రాణం లాగేస్తున్నారు. ఓట్లు వేయించు కుని గ‌ద్దె ఎక్కుతున్నామ‌న్న ఇంగితం కూడా లేకుండా పోతోంది. ఓట్ల స‌మ‌యంలో అనేక ప్ర‌మాణాలు, హామీల వ‌ర్షంలో ముంచెత్తి ఓట‌రు న‌వ్వుమొహం చెరిగే లోగా విజేత‌లై దూర‌మ వుతున్నారు.  అస‌లు ప‌న్నులు అతిగా ఎందుకు విధిస్తున్నాము, ప్ర‌స్థ‌త‌స్థితిలో క‌ట్టేట్టున్నారా లేదా అన్న‌ది ప్ర‌భువుల వారికి బొత్తిగా గిట్ట‌ని అంశం. దాన్ని గురించి ఆలోచించ‌మ‌నే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్ర‌ధాని, ముఖ్య మంత్రుల‌కు, ఆర్ధిక మంత్రుల‌కు అవేవీ చెవికి ఎక్క‌డం లేదు. ఇలాంటివారిని చూసి  ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి  ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా ! బ‌త‌క‌డానికి ఊపిరి మీద కూడా రేపో మాపో ప‌న్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచ‌న వారికెందుకు ఇవ్వ‌డం.. చ‌చ్చేదీ సామాన్య‌లం మ‌న‌మే!  ఎక్క‌డ ఎక్కువ వ‌స్తువులు కొని ఆనందిస్తారేమోన‌ని ప్ర‌భుత్వానికి ఈర్ష్య. అవును అందుకే   జీఎస్టీ లేని వస్తువంటూ లేదు.  బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్ద‌మొత్తంలో  ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర‌మేమంటే బ‌త‌క‌డానికి ఉద్యోగం, ప‌న్నులు క‌ట్ట‌డానికి జీతం అన్న‌ట్టుగా బ‌డుగు జీవుల బ‌తుకులు మార్చేశారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారికోస‌మే ప్ర‌జ‌లు బ‌త‌కాల‌న్న‌మాట‌!  ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !

త‌ల్లికో జుట్టు పోగు..!

న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడే జుత్తు అంటే మ‌హిళ‌ల‌కు ప్రాణం. అది అందంలో భాగంగా భావిస్తారు గ‌నుక‌. ఆమ‌ధ్య‌కాలం వ‌ర‌కూ పొడ‌వాటి జ‌డ‌లు చూస్తుండేవారం. ఇపుడు ఎంత చ‌క్క‌గా స్ట‌యిల్‌గా ఉండాలో అమ్మాయిల‌తోపాటు అమ్మ‌లూ చూసుకుం టున్నారు. అంచేత పొడుగు జ‌డ‌ల‌కు మంగ‌ళం పాడేసేరు. ఇంగ్లీషువారి బాప్డ్‌హెయిర్ స్ట‌యిల్ అంద‌రికీ స్ట‌యిల్‌గా ఆక‌ట్టు కుంది. స‌రే ఎవ‌రి ఇష్టం వారిది. అయితే ఆరిజోనా కుర్రాడు త‌న తల్లికోసం మాత్రం చ‌క్క‌టి జుత్తు పెంచుకుంటున్నాడు. కార‌ణం ఆమెకి బ్రెయిన్ ట్యూమ‌ర్ తో ఉన్న జుత్తంతా పోయింది. ఆమెకు మ‌ళ్లీ ఒక‌నాటి రూపు ఇవ్వాల‌ని అత‌ని కోరిక‌. అందుకే జుత్తు క‌ష్ట‌ప‌డి పెంచు కుంటున్నాడు.  మూడేళ్లక్రితం మెలేన్ సాహాకి ట్యూమ‌ర్ సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఆమె రేడియేష‌న్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ కార‌ణంగా ఆమె జుత్తంతా కోల్పోయింది. ఆమెకు అప్ప‌టివ‌ర‌కూ మంచి చ‌క్క‌టి జుత్తు ఉండేది. ఆమెకు తిరిగి ఆ జుత్తు ఉన్న సంతోషాన్ని ఇవ్వాల నుకున్నాడు ఆమె కుమారుడు 27 ఏళ్ల మాట్‌. ఒక‌రోజు వారిద్ద‌రూ భోజ‌నం చేస్తుండ‌గా, నీ కోసం నేను జుత్తు పెంచుకుంటాను. మంచి విగ్ త‌యారు చేయిస్తాన‌న్నాడు. ఆమె ఆనందంతో క‌డుపుబ్బ న‌వ్వింది.  త‌ల్లి అలా న‌వ్వుకుని ఎన్నాళ్ల‌యిందో అనుకున్నాడు మాట్‌. ఆ న‌వ్వుల్ని అలానే చూడాల‌నుకున్నాడు. త‌ల్లి జుత్తులాంటిదే త‌న జుత్తు అని గ్ర‌హించే తాను ఆ నిర్ణ‌యానికి వ‌చ్చేడు. స్నేహితుల‌తో మాట్లాడి విగ్ గురించి తెలుసుకున్నాడు. మొన్న మార్చి నాటికి మాట్ జుత్తు 12 అంగుళాలు పెరిగింది. విగ్ త‌యారుచేసే వ్య‌క్తి ఈ జుత్తు చాలా బావుంది, ఆమెకు న‌ప్పుతుంద‌న్నాడు. పైగా ఈ మాత్రం చాలుతుంద‌న్నాడు. కుర్రాడి ఆనందానికి హ‌ద్దే లేదు. ఆమెను ఆనంద‌ప‌ర‌చ‌డానికి ఈ మాత్రం చేయ‌లేనా అనుకున్నాడు. త‌ల్లికో జుత్తు పోగు! మాట్ కాలిఫోర్నియా విగ్ త‌యారీ కంపెనీ వారిని క‌లిసి రెండువేల డాల‌ర్లు చెల్లించాడు. వాళ్లు బ్ర‌హ్మాండంగా విగ్ త‌యారు చేసి ఇచ్చారు. అది పెట్టుకున్న మెలాన్ అద్దంలో చూసుకుంది.. అస‌లు అది విగ్‌లా అనిపించ‌డం లేద‌న్న‌ది. మాట్ త‌ల్లిని కావ‌లించు కున్నాడు ఆనందంతో! ఆమె అనారోగ్య బాధ నుంచి కాస్తంత ఉప‌శ‌మ‌నం క‌లిగించినందుకు త‌న‌ను తాను శ‌భాష్ అనుకునే ఉంటాడు. వాళ్ల బంధువులు, ఆమె స్నేహితులు కూడా కుర్రాడి ప‌నిని ఎంతో మెచ్చ‌కున్నారు. వియ్ ఆల్ ల‌వ్ యూ! అన్నారు. అది స‌రిపోయింది.. త‌ల్లి అనారోగ్యంతో కుమిలిపోతున్న అత‌ని మ‌న‌సుకి.

న్యాయశాఖ పరిశీలనలో జమిలి ప్రతిపాదన

జమిలి ఎన్నికల విషయాన్ని కేంద్రం ఇంకా వదల లేదు. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం కలిసి వస్తుందని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం లాకమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలపై  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు చెప్పారు. కాగా  స్టాండింగ్ కమిటీ   కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని, ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. తరచుగా వచ్చే ఎన్నికల వల్ల నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం వ్యయం అవుతుందనీ, దేశంలో 2014-22 మధ్యకాలంలో 50  ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ  వివరించింది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 7వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యిందని కిరణ్ రిజుజు తెలిపారు. కిరణ్ రిజుజు సమాధానంతో కేంద్రం మదిలో   జమిలి   ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని,   లోక్​సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉందని అవగతమౌతుంది.   మోడీ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల విధానంలో మార్పుల వల్ల అభివృద్ధి వేగవంతమౌతుందని ఆయన చెబుతున్నారు. లోక్ సభ నుంచి స్థానిక ఎన్నికల వరకూ ఒకే సారి నిర్వహించడం వల్ల ప్రజా ధనం ఆదా కావడమే కాకుండా అభివృద్ధికి అవరోధాలు ఉండవని అన్నారు. అయితే విపక్షాలు నిర్ద్వంద్వంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అంటున్నారు. జమిలి పేర కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా అధికారం  గంపగుత్తగా చేజిక్కించుకోవాలన్న  దురాలోచనలో ప్రభుత్వం ఉందని అభ్యంతరం చెబుతున్నాయి. అయితే లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్‌ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది మోడీ వాదన.  పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నది ఆయన అభిప్రాయం.  2019 బీజేపీ మానిఫెస్టోలో జమిలి అంశాన్ని చేర్చింది.  నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.   అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇందుకు దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసర అవుతుంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్యే అధికం. లోక్ సభలో మోడీ సర్కార్ కు పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో సభ్యుల బలం ఒకింత తక్కువైనా కేంద్రం నిర్ణయాలకు వత్తాసు పలికే పార్టీలు ఉండటంతో అక్కడా ఆమోదం పొందడం పెద్ద కష్టం కాదు. దీంతో జమిలి ప్రతిపాదన అమలుకు ఇదే మంచి తరుణం అని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుంటే మోడీ సర్కార్ జమిలి విషయంలో అడుగు ముందుకు వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు సైతం జమిలికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతులు ఇస్తున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో జమిలికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన సంగతి విదితమే.  

గడప గడపకూ బాధ్యతలు మాజీ మంత్రులకు

జగనాగ్రహానికి పార్టీలో ప్రముఖుల ప్లేస్ లు మారిపోతున్నాయి. పనికి రారన్నట్లుగా కేబినెట్ నుంచి ఉద్వాసన గురైన వారికే ఇప్పుడు వైసీపీ అధినేత గడపగడపకూ మన ప్రభుత్వం బాధ్యతలను అప్పగించారు. ఈ అప్పగింతకు ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి క్లాసే పీకారు. అయినా వారిలో స్పందన లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఈ సారి ఆ బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రిజనల్ కో అర్డినేటర్లకు అప్పగించేశారు. విచిత్రమేమిటంటే వీరిలో అత్యధికులు ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమాత్య పదవులను పోగొట్టుకున్న వారే. ఇలా బాధ్యతలు బదలాయించడానికి జగన్ పెప్పిన కారణమేమిటంటే..గడప గడపకూ వోళ్లని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నా  ఓ పది.. పదిహేను మంది తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని.  దీంతో ఆయన ఎలాగైనా ఎమ్మెల్యేల్ని గడప గడపకూ తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి జిల్లాల అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల పదవులు పోగొట్టుకున్న మాజీ మంత్రులే. వారికే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ప్రోగాంను సక్సెస్ చేయించాల్సిన బాధ్యత ఇచ్చారు. వాళ్లకి ఐప్యాక్ టీం సహకరించేలా ఏర్పాటు చేశారు.  ఐ ప్యాక్ టీంలు జిల్లాల వారీగా పని చేస్తాయని వారితో సమన్వయం చేసుకోవాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి గడపగడపకూ మన ప్రభుత్వాన్ని విజయవంతం చేసే బాధ్యత అంతా పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదేనని జగన్ విస్పష్టంగా చెప్పేశారు. మాజీలకు ఈ బాధ్యతలు అప్పగించడంతో మళ్లీ  మంత్రులు డమ్మీలేనని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ మాత్రం దానికి తమకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మాజీలను చేయడమెందుకని తాజా మాజీలు ఒకింత నిరసన వ్యక్తం చేస్తున్నారు.   మంత్రలు అధికారం అనుభవిస్తుంటే.. మాజీలమైన తాము పార్టీకి ఊడిగం చేయాలా అన్న సణుగుడు మాజీలలో మొదలైందని పార్టీ శ్రేణులే అంటున్నారు. మంత్రులను కాదని తమ మాట క్యాడర్ ఎందుకు వింటుందన్న సందేహమూ వారిలో వ్యక్తం అవుతోంది.   అంతే కాకుండా తమ తమ నియోజకవర్గాలలో తామూ గడపగడపకూ వెళ్లాలి కదా అని గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వంపై ఆగ్రహాన్ని జనం ఎమ్మెల్యేలపై వెళ్లగక్కితే వారి ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందన్న జగన్ భావిస్తున్నట్లుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఎంత మొత్తుకున్నా, తాపత్రేయపడినా, హెచ్చరికలు చేసినా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల పార్టీలో ఎవరూ సీరియస్ గా లేదని పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.

తెలంగాణపై వరుణుడి కరుణ వరద

ఊహించ‌నివిధంగా వాతావ‌ర‌ణం మారిపోయింది. భారీ వ‌ర్షాల‌తో తెలంగాణాపై వరుణుడి కరుణ వరద కొనసాగుతోంది. దీంతో వ‌రుణుడి వ‌ల‌లో రాష్ట్రం చిక్కుకున్న‌ట్టుగా ఉన్న‌ది. ఈ వ‌ర్షాల కార‌ణంగా ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మ‌రింత ఇబ్బందులు ప‌డుతున్నారు. చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఒక వంక జ‌లాశ‌యాలు నిండుతున్నాయ‌న్న ఆనందంగా ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ క‌ద‌ల‌నీయ‌ని స్థితిలో వ‌ర్షాలు ముంచెత్త‌డం భ‌యాందోళ‌న‌కూ గురిచేస్తోంది.  వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ ఇన్‌ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా...  ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి  నీటి  మట్టం  1763.50 అడుగులకు గాను, ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది.  మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మెదక్ మండలంలో 26.8 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటిమీటర్లు, తుప్రాన్ మండలంలో 19.6 సెంటీమీటర్లు, చిన్న శంక రం పేటలో 19.4 సెంటీమీటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ మీటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీమీటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారనంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,600 .18 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.33 టీఎంసీలకు చేరింది.

అక్కడ సంజయ్ రౌత్.. ఇక్కడ కేటీఆర్ ?

ప్రపంచం మొత్తం మీద మనిషిని  పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. అదేమో, కానీ, ఈ మధ్య కాలంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, తెలంగాణ మంత్రి కేటీఅర్ మధ్య చాలా దగ్గరి పోలికలున్నాయనే మాట అక్కడక్కడ వినిపిస్తోంది. అయితే ఆ ఇద్దరి మధ్య ఉన్నది భౌతిక పోలికలు కాదు. వ్యక్తిత్వ సారుప్యతని  అంటున్నారు. నడక,  నడత,  మాట తీరు, ఈ అన్నిటినీ మించి  కూర్చున్న కొమ్మను నరుక్కునే విపరీత దురహంకార ధోరణి విషయంలో ఇద్దరి మధ్య స్పష్టమైన సారుప్యత కనిపిస్తోందనే మాట ఎప్పటి నుంచో అక్కడక్కడా వినిపిస్తున్నా ఈ మధ్య కాలంలో మరింత గట్టిగా వినిపిస్తోందని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. నిజానికి, కేటీఆర్  తీరు పట్ల పార్టీలో ఒక విధమైన ఆందోళన వ్యక్తంవుతోందని అంటున్నారు.  అయితే, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కీలక నేతగా చెలామణి అవుతున్నారు.అందులో మరో అభిప్రాయం లేదు. నిజానికి, కేటీఆర్ తెరాస రాజకీయాల్లో కీలక నేతగా చెలామణి అవడమే కాదు, కాబోయే ముఖ్యమంత్రిగానూ ప్రచారం  జరుగుతోంది. అందుకే కావచ్చును, కొంతమంది ఆయనంటే గిట్టని వాళ్ళు కేటీఆర్’ను మహా రాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్’తో పోలుస్తున్నారు, సంజయ్ రౌత్ కూడా సామ్నా పత్రికలో ఉద్యోగిగాచేరి అలా అలా ఎదిగి ఇలా ఏకుమేకై కూర్చున్నారని, కేటీఆర్’ కూడా సన్ అఫ్ కేసీఆర్’ గా  ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇలా తయారయ్యారని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, శివసేన పతనంలో రౌతు పోషించి పాత్రను, తెరాస పతనంలో కేటీఆర్ పోషితున్నారనే మాట కూడా అక్కడక్కడ వినిపిస్తోంది.మితి మీరిన అహంకారం, అతి తెలివి చూపడం ఈరెండు అంతిమంగా  పతననానికి దారి తీస్తాయి, సంజయ రౌత్’లో పుష్కలంగా పేరుకు పోయిన ఈ అవలక్షణాల కారణంగానే, శివసేనలో చిచ్చు రాజుకుంది. శివసేనలో చీలిక తెచ్చాయి. కేటీఆర్’లోనూ అవే లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకునేటప్పుడు,, షిండే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ, శివసేన రెండు ముక్కలుగా చీలిపోవడానికి మూల కారణం సంజయ్ రౌత్, ఆయన కారణంగానే,శివసేనలో అశాంతి రాజుకుందని విశ్లేషకులు పేర్కొంటున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.  మహారాష్ట్రలో శివసేన అధినేత్ మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పై సైలెంట్’గా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఎవరిని అడిగినా, తిరుగుబాటుకు, ఇంకా  ఇతర కారణాలు అనేకం ఉన్నా, సంజయ్ రౌత్. దురుసు ప్రవర్తన, దురంకార  ధోరణి ఒక  ప్రధాన కారణంగా పేర్కొంటారు. ఇక్కడ తెలంగాణలో, మంత్రి కేటీఆర్ ధోరణిలోనూ అలాంటి పోకడలు కనిపిస్తున్నాయని అంటున్నారు.  కేటీఆర్ తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే, ఎరికి వారు సహించి ఉరుకుంటున్నా, ఎక్కడో అక్కడ అగ్గిరాజుకుంటే, ఇప్పుడ కాకపోయినా, ఎప్పడు అప్పడు మహారాష్ట్ర  పరిణామాలు తెలంగాణ ల్ల్నూ పునరావృతం అయ్యే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు.   ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల దురహంకారం గురించి మాట్లాడుతున్నారే, కానీ, సొంత పార్టీలో పెరుగతున్న దురహంకార ధోరణినీ, సొంత పార్టీలో రగులుతున్న అసమ్మతినీ గుర్తించడం లేదని తెరాస నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, పదిమంది పొతే పోతారని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను చులక చేయడం సరి కాదని అంటున్నారు. మహారాష్ట్రలోనూ తిరుగుబాటు, ముగ్గురితో మొదలై 11 కు చేరి అక్కడి నుంచి 40 ప్లస్ ‘ కు చేరిందని గుర్తు చేస్తున్నారు. అదెలా ఉన్నా, అన్నిటికంటే ముఖ్యంగా తెరాసలో అంతా బాగుంది అనేందుకు లేదు. నివురు గప్పిన నిప్పుల ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

వదలని వాన.. తప్పని తిప్పలు!

విశ్వనగరం మీద వరుణులు పగబట్టాడా అన్న అనుమానం కలుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మరో సారి హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలపై వరుణుడు తన ప్రతాపం చూపాడు. శుక్రవారం ఉదయం ముసురు పట్టి చిరుజల్లులతో మొదలైన వాన అంతకంతకూ పెరిగి కుండపోతగా మారింది. వర్షం నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లళ్లోకి నీరు ప్రవేశించింది. రహదారులు గోదారులయ్యాయి. ట్రాఫిక్ లో జనం నానా ఇబ్బందులూ పడ్డారు. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరి వాహనాలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ముసురు ఇప్పట్లో వదలదనీ మరో రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు వర్షాలు వదలకుండా కురిశాయి. జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేశాయి. నాలుగు రోజులు వర్షాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నగరం శుక్రవారం నాటి జోరు వానకు ఉక్కిరి బిక్కిరైంది. ఒక్క జంట నగరాలనేమిటి? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కనీసం 15 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.    మధ్యాహ్నం 12 గంటల నుంచి క్రమేపీ పెరిగిన వర్షం సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. భారీ వర్షానికి హైదరాబాద్‌ బేగంపేటలోని బ్రాహ్మణవాడి, వడ్డెరబస్తీలో మోకాలిలోతు వరకు నీరు నిలిచింది.  లింగంపల్లి అండర్‌బ్రిడ్జి, బొల్లారం రోడ్డులో వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంపేట మెయిన్‌రోడ్డులో, ఉప్పరపల్లిలో  టోలీచౌకీ వద్ద ప్రవాహం ఉండటంతో వాహనదారులు గంటల తరబడి ఇబ్బందులు పడ్డారు. మక్కా మజీద్‌ అవరణలో వజుఖానా వెనక ఉన్న పురాతన భవనం గోడ కుప్ప కూలింది. కుత్బుల్లాపూర్‌లోని ఇంద్రసింగ్‌నగర్‌, నిజాంపేటలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్‌, బేగంపేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, టోలీచౌకీ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఆబిడ్స్‌, కోఠి, మోజాంజాహి మార్కెట్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. శేరిలింగంపల్లి మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అప్పు స‌రే, తీర్చుమార్గ‌మేది జగనా?!

మేక‌కి పులి భ‌యం, పాముకి కుక్క‌భ‌యం, దొంగ‌కి పోలీసు భ‌యం.. ఇవి స‌హ‌జం. ఇప్పుడు కొత్త‌గా వింటున్న‌ది బ్యాంకులే ప్ర‌భుత్వాన్ని దూరం పెడుతున్నాయి. జగన్ ఏ క్ష‌ణాన వ‌చ్చి ఎన్ని కోట్లు అడుగుతారో అని భ‌య‌ప‌డుతున్నాయి. రకరకాల ఒత్తిళ్లతో కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి మరీ అప్పులు పుట్టించుకున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అవే బ్యాంకుల నుంచి రివర్స్‌లో షాకులు తగిలే పరిస్థితి కనిపిస్తు న్నది. వేల కోట్ల రుణాలను సరైన తనఖా,ఆదాయం,చెల్లింపుల పరిస్థితి లేకుండానే బ్యాంకులు ఇచ్చేశాయి. ఇంకా తెచ్చుకు నేందుకు ఏపీ ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది. కన్సల్టెంట్లకు కమిషన్లు ఇచ్చి ఎస్‌బీఐకి చైర్మన్‌గా పని చేసిన వారిని సలహాదారులుగా నియమించుకుని మరీ ఈ అప్పులు తెస్తోంది. అలాంటి వారి పలుకు బడితో పెద్దఎత్తున అప్పులు తెచ్చింది జగన్ సర్కార్. అంతేగా, గుడిలో ప్ర‌సాదం కావాలంటే పంతులు గారితో ర‌వ్వంత స్నేహం అవ‌స‌రంగ‌దా! అయితే నిజానికి అలాంటి అప్పులు తేవడానికి నిబంధనలు అంగీకరించవు. బ్యాంకులు కూడా ఇవ్వలేవు . కానీ తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారు. కార్పొరేషన్లకు లేని ఆదాయాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేడెట్ ఫండ్ నుంచి డబ్బులు చెల్లిస్తామంటే సరే అన్నారు. కానీ ఇలాంటివి అరికట్టడానికి నిబంధనలను ఆర్బీఐ ఎప్పుడో పెట్టింది. ప్రభుత్వాలకు అప్పు ఇచ్చేపద్దతులను వివ రించింది. కానీ బ్యాంకులు ఇప్పుడు ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించాయి. కాస్త లేటైనా ఇప్పుడు ఆర్బీఐ ఆ అంశంపై దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ బ్యాంకులకు ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.  ఒక వేళ బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించి మరీ అప్పులిచ్చినట్లుగా తేలితే, ఆ బ్యాంకులకు జరిమానా విధిస్తారు. అదో పెద్ద మైనస్ అవుతుంది.  ఇలా అప్పులు తెచ్చుకున్న ఏపీకి రుణాలివ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఏపీ అప్పుల్లో అసలు విషయం ఏమిటంటే.. అసలు ఏ బ్యాంక్ నుంచి ఎన్ని వేల కోట్లు తెచ్చారో స్పష్టత లేదు. ఏం లెక్క చెప్పారు. ఏం తాకట్టు పెట్టారు. ఎలా అప్పులిచ్చా రన్న వివరాలు లేవు. ఆ అప్పులను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. బ్యాంకులూ అంతే. ఈ గోల్ మాల్ వ్యవహారం ముందు ముందు కలకలం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం పెద్దగా పట్టించుకోని ఆర్బీఐ కూడా ఇప్పుడు సీరి యస్‌గా చర్యలు తీసుకుంటోంది. దీంతో మొత్తం లోగుట్టు బయటపడే అవకాశం కనిపిస్తోంది.

ర‌ణ‌రంగానికి రెడీ కండి.. లేకుంటే కొత్త‌వారికి దారివ్వండి!

పూర్వం రాజులు విజ‌య‌మో వీర‌ మ‌ర‌ణ‌మో అనే పెద్ద కాన్సెప్టుతో సైన్యాధ్య‌క్షుడితో, కీల‌క సామంతుల‌తో స‌మావేశ‌మై చివ‌రి హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్టు ఇపుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే పంధాను అనుస‌రిస్తున్న‌ట్టుంది.  ఒక వంక విమ‌ర్శ‌లు, అన‌ను కూల‌త‌లు, మ‌రోవంక ప్ర‌కృతి  వైప‌రీత్యాలు.. నిస్సహాయ‌త‌లో ఎమ్మెల్యేలు.. అయినా వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి మాత్రం విజ‌యం త‌మ‌దేన‌ని 175 స్థానాలూ త‌మ‌వేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంకిత‌ భావంతో ప‌నిచేస్తే గెల‌వ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని వైఎస్సా ర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశంలో ఉద్ఘాటించారు. తాను ప్యాలస్ లో కూర్చన్నా సరే కింది వారంతా క్షేత్రస్థాయిలో తిరగాల్సిందేనని హుకుం జారీ చేశారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని సూచ నలు చేశారు. బాధ్య‌త‌ల‌ను భార‌మ‌నుకుంటే లేదా చేయ‌లేమ‌ని అనుకుంటే కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఒక హెచ్చరికా జారీ చేశారు. సంక్షేమ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించి ప్ర‌తినెలా ప‌థ‌కాల‌ను అందిస్తుండ‌టాన్ని ప్ర‌ జ‌ల‌కు గుర్తు చేస్తూ గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాన్ని చిత్త‌శుద్ధి, అంకిత‌భావం, నాణ్య‌త‌తో నిర్వ‌హిస్తే మొత్తం సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ అన్నారు.   అయితే యుద్ధానికి వెళ్లి గాయ‌ప‌డిన‌ట్టు అవ‌మాన‌భారంతో తిరిగి వ‌స్తున్న ఎమ్మెల్యేల మాట మాత్రం జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఆయ‌న ఆదేశాలు జారీ చేయ‌డం తప్ప ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న‌వ్య‌తిరేక‌త‌, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులు పట్టించుకోరు. ఎవరైనా ఆయనకు తెలియజేయడాన్ని సహించలేరు. అసహనం వ్యక్తం చేస్తారు. అలా చెప్పిన వారిపై లేదా చెప్పబోయిన వారిపై ఆగ్రహిస్తారు. మీ ప్ర‌య‌త్న లోప‌ం అనే ఒకే ఒక్క మాట‌తో వారి మాటలను ఒక్క ముక్కలో తుంచేస్తారు. అందర్నీ సమన్వయం చేసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య క్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలదే అన్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజక వర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో సమావేశమవుతానని.. త్వరలోనే ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని బలో పేతం చేయాలన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు పెట్టామని.. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. పార్టీ పరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. నమ్మకంతో ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించామని.. ప్రాంతీయ సమన్వయకర్తలు నెలకు కనీసం ప‌ది రోజుల పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేశారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నెలలో కచ్చితంగా ఆరు సచివాలయాల్లో ఈ కార్యక్రమం జరిగేలా చూడాలన్నారు. ప్రతి సచివాలయంకు రూ.20 లక్షలు ఇవ్వబోతున్నామని, ఆ నిధులతో చేపట్టే పనులు సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రాంతీయ సమ న్వయకర్తలు, జిల్లా అధ్యక్షులదే అన్నారు.  పార్టీ బలోపేతం కోసం బూత్‌ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని కమిటీలను ఆగస్టు నుంచి అక్టోబర్‌లోగా నియమించాలని సూచించారు. బూత్‌ కమిటీ, గ్రామ, వార్డు కమిటీలు, పట్టణ, నగర కమిటీలు, జిల్లా కమిటీలను నిర్దేశించిన సమయంలోగా నియమించాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తి చేయాలని.. పార్టీ బూత్‌ కమిటీల నుంచి అన్ని రకాల కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రానున్న రోజుల్లో జగన్‌ విస్తృతంగా ప్రజలు, కార్యకర్తలతో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు అధినేత.

హైకోర్టు తరలింపుపై పూర్తి స్థాయి ప్రతిపాదనలు లేవు.. లోక్ సభలో కేంద్ర మంత్రి రిజుజు

అమరావతిని నిర్వీర్యం చేయడమన్నలక్ష్యం తప్పితే మూడు రాజధానులపై జగన్ కు నిజంగా సీరియస్ నేస్ లేదని మరో సారి తేలిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా ఫర్వాలేదు కానీ.. చంద్రబాబు ఆరంభించిన అమరావతి మాత్రం ముందుకు కదలకూడదు అన్నదే జగన్ ఏకైక లక్ష్యం అనడానికి లోక్ సభ సాక్షిగా రుజువు దొరికింది. స్వయంగా వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రిజుజు ఇచ్చిన సమాధానమే మూడు రాజధానులపై జగన్ చిత్తశుద్ధిలోని డొల్లతనం బయట పడింది.  హైకోర్టు ధర్మాసనాన్ని కర్నూలుకు తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత పూర్వక విజ్ణప్తి వచ్చిందా? కేంద్రం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అమరావతి నుంచి ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న ప్రతిపాదన సీఎం జగన్ నుంచి 2020 ఫిబ్రవరిలో ఒక ప్రతిపాదన వచ్చిందన్న రిజుజు పూర్తి స్థాయి ప్రతిపాదనలు మాత్రం అందలేదన్నారు.హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు  ఒక అభిప్రాయానికి వచ్చి పూర్తి స్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ అటువంటి పూర్తి స్థాయి ప్రతిపాదన ఏదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని ఆయన తన సమాధానంలో స్పష్టం చేశారు. రూ.1137.92 కోట్లు విడుదల చేశామన్నారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ముందడుగే!?

తెలంగాణ సీఎం.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇటీవలి కాలంలో ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై ముఖం మొత్తినట్లు కనిపిస్తోంది. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన దృష్టి అంతా జాతీయ రాజకీయాలపైనే ఉందని తెరాస శ్రేణులు కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎనిమిదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వంపై ఇప్పుడు ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందనీ, ఈ సమయంలో రాష్ట్రంపై సీరియస్ గా దృష్టి సారించకుండా జాతీయ రాజకీయాలంటూ చేస్తున్న హడావుడి వల్ల రాష్ట్రంలో మరో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి తూట్లు పడే అవకాశాలున్నాయనీ తెరాస శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పార్టీలో అసమ్మతి పెచ్చరిల్లుతుండటం. అధినేత వాటిని పట్టించుకోకుండా సందర్భం ఏదైనా మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం అన్నట్లుగా  ప్రసంగాలు చేయడం, రాష్ట్ర సమస్యలన ప్రస్తావించకపోవడం మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి నుంచి జాతీయ అజెండా వరకూ ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వ్యూహాలు పన్నినా అనుకున్నంత స్పందన రాకపోవడంతో కేసీఆర్ కూడా ఒక అడుగు వెనుకకు వేశారని పరిశీలకులే కాదు, పార్టీ శ్రేణులు కూడా భావించాయి. కానీ తాజాగా కేసీఆర్ తన జాతీయ రాజకీయ పర్యటనల కోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం కార్లు సమకూర్చుకున్నట్లు బయట పడింది. అందుకు సంబంధించి కొన్ని కార్లు మొన్న (గురువారం) బెజవాడ మల్లపల్లి పారిశ్రామిక వాడలోని గ్యారేజీకి చేరుకున్నాయి. ఆ తరువాత కార్గో విమానంలో వాటిని తరలించారు. ఆ కార్లను వాటి తయారీ సంస్థ కార్గొ విమానాశ్రయంలో గన్నవరం ఏయిర్ పోర్టుకు అక్కడ నుంచి గ్యారేజీకి తీసుకువచ్చి అవసరమైన ఫిట్టింగ్ లు చేయించారు. ఆ వెంటనే మళ్లీ అదే కార్గొ విమానంలో హస్తినకు తరలించారు. వీటిని ఢిల్లీలోని టీఆర్ఎస్ భవన్ కు తరలించారని చెబుతున్నారు.  కేసీఆర్ ఢిల్లీ పర్యటనల్లో ఈ ఈ కాన్వాయ్ నే ఉపయోగిస్తారని అంటున్నారు. అంతు కాదు తన జాతీయ రాజకీయ పర్యటనలలో భాగంగా వీటినే వివిధ రాష్ట్రాలకు తిరగడానికి వినియోగిస్తారని చెబుతున్నారు. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా తన జాతీయ పర్యటనల కోసం కేసీఆర్ కాన్వాయ్ కార్లను రెడీ చేయించుకున్న సంగతి బయటకు పొక్కడం సంచలనం కలిగించింది. అధికారికంగా టీఆర్ఎస్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ కేసీఆర్ కొత్త కాన్వాయ్ కార్ల గురించి ఎటువంటి ప్రకటనా వెలువడకపోయినా.. కేసీఆర్ కోసం కొత్త కాన్వాయ్ రెడీ అవుతోందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.    ఎందుకంటే ఎన్డీయేను ఢీకొట్టడానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ముందుకు వచ్చే సూచలను కనిపించడం లేదు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఇంట్రెస్టు చూపుతున్నా టీఆర్ఎస్ చెప్పిన మాట వినే పొజిషన్లో లేదు. దీంతో టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా సక్సెస్ అవుతారోనని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

గ‌డియారంలో నిమిషాల ముల్లు క‌ద‌లిక‌లో జాప్యం!

బ‌డికి వెళ్లాల్సిన పిల్లాడితో ప‌రిగెట్టే స‌మ‌యంలో త‌ల్లి, ఆఫీస్ టైం అయిపోతోంద‌ని ఉద్యోగి, ఏదో సీరియ‌ల్ కోసం బామ్మ‌గారూ.. వీరంద‌రి చూపు గోడ‌కి వేలాడుతున్న గ‌డియారం మీదే ఉంటుంది. ఇది చాలా స‌హ‌జ దృశ్యం. టైం ప్ర‌కారం అన్నీ జ‌రిగిపోవాల్రా అబ్బాయ్ అంటూ పెద్దాయ‌న  అదే గోడ‌గ‌డియారం చూస్తూనే హితోప‌దేశం చేసేది. ఇంత‌మందికి ఆ గ‌డియారం రోజూవారీ జీవితాన్ని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో గ‌డిపేందుకు దారి చూపుతోంది. గ‌డియారంలో గంట‌లు, నిమిషాల ముల్లులా రోజూవారీ జీవితా న్ని మార్చుకుంటున్నారు ఈరోజుల్లో ఉద్యోగులు, యువ‌త‌! గ‌డియారంలోని ముల్లుల విష‌యంలో ఒక చిత్ర‌మైన సైన్స్ ఉందంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌నం గ‌డియారాన్ని అదే ప‌నిగా అలా ప‌ది నిమిషాలు త‌దేకంగా చూస్తే గ‌డియారంలోని నిమిషా ముల్లు కాస్తంత ఆగిన‌ట్టో, మ‌రీ నెమ్మ‌దిగా క‌దిలిన‌ట్టో అనిపిస్తుంది. అందుకు ఒక శాస్త్ర‌ప‌ర‌మైన అర్ధం ఉంద‌ట‌. ఈ కాన్సెప్ట్‌ను ఇటీవ‌ల యూట్యూబర్ ఆసాప్ సైన్స్ ఒక వీడియో ద్వారా వివ‌రించింది. గ‌డియారం వంక మ‌న చూసు మ‌న మెద‌డు కంటే వేగంగా క‌దిలి చూడ‌గ‌ల్గుతుందిట‌.   వాస్తవానికి ఇది జరగడానికి నిజంగా మంచి కారణం ఉంది. మీరు దానిని ఊహించడం లేర‌ని యూట్యూబర్  చెప్పాడు, మీ కళ్ళు రెండు రకాల ఆపరేషన్లను కలిగి ఉన్నాయని వివరించాడు. మీరు నెమ్మదిగా కదులుతున్న దాన్ని గమనించడం. మరోవైపు, సాకేడ్స్ అంటే మీరు త్వరగా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి దూకడం. ఇది జరగడానికి నిజంగా మంచి కారణం ఉంది మరియు మీరు దానిని ఊహించడం లేదు," అని అతను చెప్పాడు, యూట్యూబర్ మీ కళ్ళకు రెండు రకాల ఆపరేషన్ మోడ్‌లు ఉన్నాయని వివరించాడు: మృదువైన ముసుగు సాకేడ్‌లు. మీరు నెమ్మదిగా కదులుతున్న దాన్ని గమనించడం. మరోవైపు, సాకేడ్స్ అంటే మీరు త్వరగా ఒక పాయింట్ నుండి మరొక పాయింట్‌కి దూకడం. సకేడ్‌లతో, మీ కన్ను పాయింట్ ఎ నుండి పాయింట్ బికి దూకినప్పుడు, మెదడు వాస్తవానికి ఎటువంటి సమాచారాన్ని తీసు కోదని యూట్యూబర్ చెప్పారు. మీ మెదడు బి పాయింట్ నుండి చిత్రాన్ని తీసుకుంటుంది, చిత్రం బి తో తప్పిపోయిన గ్యాప్‌ను బ్యాక్‌ఫిల్ చేస్తుంద‌ని అతను చెప్పాడు. కాబట్టి, మీరు గడియారాన్ని పరిశీలించినప్పుడు, మీరు చివరి వస్తువును చూసిన సెకను నుండి మీరు దానిని తదేకంగా చూస్తున్నారని మీ మెదడు చెబుతోంది. ఫలితంగా, మొదటి సెకను నిజానికి మిగతా వాటి కంటే ఎక్కువగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది అని యూట్యూబర్ చెప్పారు.

రావ‌ల్సిండి బాల్య‌ఛాయ‌లో 95 ఏళ్ల  రీనా వ‌ర్మ‌

పిల్లాడిని ఊరు నించి పంపేయ‌వ‌చ్చేమోగాని, పిల్లాడి మ‌న‌సులోంచి ఊరుని విడ‌దీయ‌లేమ‌ని ఆంగ్లంలో ఓ సామెత‌. ఇది అక్ష‌ర స‌త్యం. పుట్టిపెరిగిన ఊరు అన‌గానే తెలీకుండానే ఏదో ఆనంద‌పు కెర‌టం కేరింత‌లు కొట్టిస్తుంది. దీనికి వ‌య‌సుతో సంబంధం లేదు. త‌మ ఊరు నుంచి బ‌య‌ట‌ప‌డి ఎన్నేళ్ల‌యినా, వ‌య‌సు మీద‌ప‌డినా ఒక్క‌సారి ఆ ఊరి క‌బురు వినాల‌నే ఉంటుంది. అదో బాల్య ఆనందం, అదో తీపి మ‌ధుర‌స్మృతి, అదో అద్భుతం, అదో మ‌న‌సు తేలిక ప‌రిచే ఔష‌ధం. వృత్తి ఉద్యోగాలు, వ్యాపార హ‌డావుడిలో బిజీగా గ‌డిపేస్తున్న ఈ కాలంలో ఎక్క‌డో ఒక‌చోట మ‌న ఊరువాళ్లు ఒక్క‌రు క‌లిసినా, పోనీ ఆ మాట‌లు విన్నా ప‌ని ఒత్తిడి తాలూకు టెన్ష‌న్ అంతా కొంత‌సేపు మ‌న‌ల్ని ఒదిలేస్తుంది. దానికి అంత మ‌హ‌త్తుంది. అలాంటిది 75 ఏళ్ల త‌ర్వాత రీనా వ‌ర్మ త‌న స్వ‌గ్రామం వెళితే ఇంకెంత ఆనందం ఉర‌క‌లేసి ఉంటుందో ఆలోచించండి. రీనా వ‌ర్మ 90 ఏళ్ల వృద్ధురాలు, పూణె నివాసి. ఆమె పుట్టి పెరిగిందంతా పాకిస్తాన్ రావ‌ల్‌పిండి. ఎప్పుడో డెబ్బ‌య్ ఐదేళ్ల క్రితం దేశ విభ‌జ‌న త‌ర్వాత నుంచి ఆమె పూణెలోనే ఉండిపోయారు. ఆమె మూడు నెల‌ల వీసా సంపాదించి సొంతూరుకి వెళ్లింది. అదీ ఇప్ప‌టి పాకిస్తాన్ రావ‌ల్పిండికి. అక్క‌డికి వెళ్ల‌గానే ఆ గాలి, ఆ ప్ర‌జ‌ల్ని, ఆ వీధులు చూస్తూ ఒక్క‌సారిగా రీనా త‌న బాల్యాన్ని పాఠం చెప్పిన‌ట్టు అల‌స‌ట లేన్న‌ట్టు చుట్టూ చేరిన‌వారికి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పింది. కాదు.. ఆ వూరే ఆమెను కావ‌లించుకుని చెప్పించింది. అమె త‌న స్వ‌గ్రామానికి వ‌స్తున్న‌ట్టు ఫేస్‌బుక్ ద్వారా భారీ ప్ర‌చార‌మే జ‌రిగింది. అక్క‌డి ఝాంగ్‌, రావ‌ల్సిండిల‌లో గ‌డిపిన జీవితాన్ని ఆమె నెమ‌రేసుకుంది. అక్క‌డి  వారి పొలాలు, పంట‌లు, పుస్త‌కాల దుకాణాలు, ఇత‌ర చిరు వ్యాపారాల గురించి రీనా ఒక పుస్త‌కం రాయ‌ద‌గ్గ స‌మాచారాన్ని ఆ 90 యేళ్ల వ‌య‌సులోనూ చిన్న‌పిల్ల‌లా చెబుతూనే ఉంద‌ని ఆమె మ‌న‌వ‌రాలు మీడియాతో చెప్పి బుగ్గ‌లు నొప్పిపుట్టేలా న‌వ్వుకుంది. త‌న‌కంటే ఓ అమ్మ‌మ్మ భార‌త‌దేశంలో ఉంద‌ని తెలుసుగాని ఆమెను ఫోటోలోనే చూడ‌టం ఇప్పుడు చూడ‌ట‌మే కాదు ఆమెతో రావ‌ల్సిండీ వీధుల్లో తిర‌గ‌డం, తెలిసిన‌వారికి ఆమెను ప‌రిచ‌యం చేయ‌డం.. అదంతా ఓ అద్భుతం.. నిజానికి చూసి తీరాల్సిన బాంధ‌వ్య దృశ్యం. నిజానికి రీనా రావ‌ల్సిండికి వెళ్లాల‌ని అంద‌ర్నీ క‌నుమూసేలా చూడాల‌ని తెగ ఆరాట‌ప‌డ్డారు. వీసా కోసం 1965 నుంచి ప్ర‌య‌ త్నిస్తున్నారు. కానీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. 1945లో దేశ విభ‌జ‌న సమ‌యంలో త‌ప్ప‌నిస్థితిలో మ‌హారాష్ట్ర పూణెకి రావ‌ల‌సి వ‌చ్చింది. మొన్న కోవిడ్ స‌మ‌యంలో ఆమె రావ‌ల్సిండి వెళ్లాల‌ని ఎంతో అనుకు్న్నారు. ఆమె త‌మ జీవితం తొలి 15 ఏళ్లు గ‌డిపిన  ఆ పట్ట‌ణానికి వెళ్లిపోవాల‌ని ఎంతో ఆరాట‌ప‌డ్డారు. త‌న కోరిక‌ను తెలియ‌జేస్తూ కోవిడ్ స‌మ‌యంలో పంజాబ్ హెరిటేజ్ ఫేస్ బుక్ పేజీలో తెలియ‌జేశారు. రెండు దేశాల స‌రిహ‌ద్దుల‌కు రెండు వేపులా వున్న పంజాబీలు ఒక్క‌టి కావాల‌ని ఆమె ఎంతో ఆకాంక్షిస్తున్నారు. ఆమెది రావ‌ల్సిండికి వెళ్లాల‌న్న ప‌సిపిల్ల ఆరాటంతో పాటు, పంజాబీలంతా ఒక్క‌టిగా ఉండాల‌న్న దేశ‌భ‌క్తి కూడా!  ఆమె క‌థ తెలిసిన రావ‌ల్సిండి వ్య‌క్తి స‌జ్జ‌ద్ భాయ్ ఆమె బాల్యంలో గ‌డిపిన ఇంటి వివ‌రాలు, ఫోటోలు ఆమెకు చేరేలా చేశాడు. ఆమె కుమార్తె సోలాన్ అనే ప్రాంతంలో ఉంటున్నారు. విభ‌జ‌న త‌ర్వాత తిరిగి వెళ్లాల‌ని అనుకున్నారు కానీ సాధ్య‌ ప‌డ‌లేదు.  రీనా మూడు మాసాలు రావ‌ల్సిండిలో వ‌దిలేసిన బాల్యాన్ని వీధుల్లో వెతుక్కుంటూ ఆ జా్ఞ‌ప‌కాల‌తో, ఆ ఇంటి ప‌రిస‌రాల్లో తిరుగుతూ గంపెడు గొప్ప అనుభూతుల్ని, జ్ఞాప‌కాల‌ను మ‌న‌కోసం తీసుకువ‌స్తారేమో!

ప్ర‌జ‌లు విసిగెత్తితే ఇలానే చేస్తారు

రాజ‌కీయ‌నాయ‌కుల‌కు, సినీస్టార్స్‌కు వారి ప‌నులే కాకుండా బ‌ట్ట‌ల దుకాణాలు, మాల్స్ ఓపినింగ్ ప‌ని కూడా గొప్ప ప్ర‌తిష్టా త్మ‌కం. వారి వీరాభిమానుల‌కు అదో పండ‌గానందం! వీల‌యితే ప్ర‌తీ గ‌ల్లీలోని పెద్ద పెద్ద దుకాణాల ఓపినింగ్ వారి చేత చేయిం చాల‌న్న పిచ్చి అభిమానంతో పిలుస్తుంటారు. ఏ ప్రాంతంలోనైనా స‌రే కొన్ని కేవ‌లం శిలాఫ‌ల‌కంతోనే ప‌నులు ఆగిపోతుంటాయి. ఓపినింగ్‌కి వెళ్లిన‌వారు ఆ త‌ర్వాత పెద్దా సీరియ‌స్‌గా తీసుకోరు. అయితే ప్ర‌జ‌లు త‌మకు ఉప‌యోగ‌ప‌డేవాటిని నాయ‌కుల‌తో ఆరంభించాల‌నుకుంటారు. కానీ చాలా ప్రాంతాల్లో అది అంత త్వ‌ర‌గా అనుకున్న స‌మ‌యానికి అవ్వ‌దు. ఉదాహ‌ర‌ణ‌కి క‌ర్ణాట‌క గ‌డ‌గ్ జిల్లాలో ఒక బ‌స్షెల్ట‌ర్‌ను ఆరంభించ‌డానికి చాలారోజుల నుంచి అక్క‌డి రాజ‌కీయ‌నాయ‌కులు ఎగ‌నామం కొడుతున్నారు. ప్ర‌జ‌లు ఎదురు చూసి చూసి విసిగెత్తారు. చివ‌రికి గేదె ను ఛీఫ్ గెస్ట్‌గా తీసుకువ‌చ్చి మ‌రీ  ఆరంభించారు.   గ‌డ‌గ్ జిల్లా బాల‌సూర్‌లో ఒక బ‌స్ షెల్ట‌ర్ క‌ట్టి చాలా కాల‌మే అయింది. అంటే ఓ న‌ల‌భ‌య్యేళ్లు! కొంత‌కాలం క్రితం అది కూల‌డం కూడా జ‌రిగింది. కానీ దాని ఆరంభోత్స‌వం మాత్రం జ‌ర‌గ‌లేదు. ప్ర‌జ‌లు దాన్ని వినియోగించ‌డం కుద‌ర‌లేదు. చాలాకాలం నుంచి అధికారుల‌ను ఆ బ‌స్‌షెల్ట‌ర్ గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ అస‌లు ఆరంభోత్స‌వం జ‌ర‌గ‌కుండా ఎలా ఉప‌యోగిస్తార‌ని వారి స‌మాధానం. జ‌నం విసిగెత్తారు, కోపం వ‌చ్చింది. నాయకులు, అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రికి మండిప‌డ్డారు. పైగా బ‌స్ షెల్ట‌ర్ అందుబాటులో లేక‌పోయేస‌రికి విద్యార్ధులు, ఉద్యోగులు అంద‌రూ అక్క‌డి ఇళ్ల ద‌గ్గ‌ర‌, దుకాణాల దగ్గ‌ర బ‌స్సుల కోసం వేచి ఉండాల్సి వ‌స్తోంది. వ‌ర్షాకాలం ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా మార‌తాయి.  ఇక లాభంలేద‌ని ఆమ‌ధ్య అక్క‌డివారే బ‌స్ ష‌ల్ట‌ర్‌ను ఆరంభించారు. అయితే అందుకు ఛీఫ్ గెస్ట్‌గా మాత్రం ఒక గేదెను తీసుకువ‌చ్చారు. దీని సారాంశ‌మేమిటో మ‌రీ వివ‌రిం చ‌క్క‌ర్లేదేమో!