అలిగి పోతానంటున్న త‌మ్ముడు..

పిల్లాడు బొత్తిగా మాట విన‌డం లేదని టీచ‌ర్ నుంచి పిల్లాడి తల్లికి అందిన వార్త‌. పిల్లాడి రిపోర్టు తెప్పించు కున్న తండ్రి. పోనీలేద్ద‌రూ చిన్నవెధ‌వా.. అంటూ బామ్మ‌గారు మ‌ధ్య‌వ‌ర్తిత్వం.. ఇవేమీ ప‌ట్ట‌న‌ట్టు పిల్లాడి ఆట‌లు, మాట‌లు. వీడ‌స‌లు ఎవ‌రితో తిరుగుతున్నాడో తెలుసుకో.. వాడి బాబాయి ప్ర‌శ్న‌.  ఎనిమిదో త‌ర‌గ‌తి పిల్లాడి గురించి ఇంత‌మంది వాక‌బు చేస్తుంటారు. వాడి మీద ఎంతో మంది నిఘా.  మ‌రి కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి మీద ఎంద‌రి డిటెక్టివ్ క‌ళ్లు ఉన్నాయో మ‌రి! రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ అధ్య‌క్ష‌స్థానానికి త‌న సోద‌రుడిని ప్ర‌తిపాదించి మ‌ద్ద‌తునిచ్చిన రాజ‌గోపాల్ రెడ్డిని క్ర‌మేపీ పార్టీ వ్య‌వ‌హార‌శైలి  ఇబ్బంది పెట్టింది. ఇన్నాళ్లు న‌మ్ముకున్న పార్టీ త‌న‌ను అవ‌మానిస్తున్నందుకు నిర‌స‌న‌గా పార్టీ తీరు తెన్నుల మీద విమ‌ర్శ‌నాస్త్రాలూ సంధించారు.  చిలికిచిలికి గాలివాన‌గా మారి పార్టీతో సంబంధాలు దెబ్బ‌తినే స్థాయికి వ‌చ్చాయి. ఇక లాభం లేద‌ని బీజేపీ వారితో చేతులు క‌ల‌ప‌డానికి నిశ్చ‌యించుకున్నారు. బీజేపీ సీనియ‌ర్ల‌ను క‌లిసేరు. కానీ వారు త‌ప్ప‌కుండా గెలిచే అవ‌కాశాలున్నాయ‌న్న హామీనిస్తే ఎలాంటి సాయ‌మ‌న్నాచేస్తామ‌ని హామీనిచ్చారు. ఇది ర‌హ‌స్య స‌మావేశం కాదు నిజంగానే క‌లిసి మాట్లాడ‌ని రాజ‌గోపాల్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దీంతో పార్టీని త్వ‌ర‌లో వ‌దిలేస్తార‌న్నది విప‌క్షాల‌కూ అర్ధ‌మైంది.  అస‌లు పార్టీని ఆయ‌న వ‌ద‌లేంత ప‌రిస్థితులు ఎందుకు తెచ్చుకున్నార‌ని తెలంగాణా కాంగ్రెస్ వ్య‌వ‌హా రాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం కోరారు. అల‌క వ‌చ్చేట్టు చేసినం దుకు అత్త‌గారిని అన‌కుండా ఎందుకు కోప‌గించుకుని తిండి మానేశావే అని సోద‌ర స‌మాన చిన్న కోడ‌ల్ని పెద్ద కోడ‌లు అడిగిన‌ట్టు ఆయ‌న అంద‌రి నుంచీ ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం కూడా అట్టి  స‌మా చారం స్ప‌ష్టం చేయ‌మ‌ని  కోరింది. అలిగిన‌వాడు వెన‌క్కి తిరిగి వ‌స్తాడ‌ని ఆశించ‌డం క‌ష్ట‌మే. క‌నుక కాంగ్రెస్  సీనియ‌ర్లు ఇపుడు త‌మ్ముడు ఎందుకు అలిగాడో స‌రిగ్గా క‌నుక్కుని బుజ్జ‌గించాల‌ని కోమ‌టిరెడ్డి  వెంక‌ట రెడ్డిని కోరుతున్నారు. కానీ అన్న‌ద‌మ్ములు ఇంట్లోంచి బ‌య‌ట‌కి వ‌చ్చాక కాంగ్రెస్‌, రెబెల్ అనే స్థితికి  ఇద్ద‌రూ త‌యార‌య్యారు. ఈ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు, ఉత్త‌మ్‌కుమార్  కూడా అన్నా.. నీ త‌మ్ముడిని శాంతింప‌చేయ‌మ‌ని అడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెళ్లిపోతే కాంగ్రెస్‌ పార్టీకి ఇక నలుగురే ఎమ్మెల్యేలు ఉంటారని.. దీనిపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా స్పందిం చాలని వీహెచ్ కోరారు. రాజ‌గోపాల్ మాత్రం అవ‌మాన భారంతో ఆగ్ర‌హిస్తున్నారేగాని పార్టీ అధిష్టానం వచ్చి చెప్పినా వినే స్థితిలో లేరు. పైగా బీజేపీ నుంచి  గ్రీన్ సిగ్న‌ల్ కూడా వచ్చింది గ‌నుక మ‌రీ  ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. తాను పార్టీని వీడ‌డానికే కంక‌ణం క‌ట్టుకున్నా న‌ని పార్టీలో ఉండి విసిగెత్తే కంటే దూరంగా,  ప్ర‌శాంతంగా వేరే పార్టీ నీడ‌లో అడుగు ముందుకేయ‌డం శ్రేయస్క‌ర‌మ‌న్న ధోర‌ణి బ‌య‌ట‌పెట్టారు.  తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చాలా కాలంగా  తీవ్ర  అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయ్యేందుకు ముందు ఆయన పార్టీ మారతారంటూ చాలా కథనాలు వచ్చాయి. అయితే సీనియర్లు నచ్చచెప్పడంతో ఆయన ఆలోచనను విరమించుకున్నా రు. కొన్నాళ్లుగా రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కూడా అనేకసార్లు విమర్శలు చేశారు. గతంలో నల్గొండ జిల్లాలో రేవంత్‌రెడ్డి సభ పెట్టకుండా ప్రయత్నించడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను వీడడం తథ్యం అనే సంకేతాలు కూడా ఇచ్చాయి. ఇహ ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు.  ప్రెస్‌మీ‌ట్‌‌‌లో కోమటిరెడ్డి  మాట్లాడిన అంశాలను అధిష్టానం క్లిప్పింగ్స్ తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పార్టీ విషయంలో చేసిన కామెంట్స్, ఇచ్చిన వివరణలను ఠాగూర్ తెప్పించుకున్నారు. గతంలో ఆర్సీ కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి  రేవంత్ రెడ్డి పార్టీ విషయంలో అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన కామెంట్స్‌ను కూడా ఠాగూర్ పరిశీలిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీ  విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. పార్టీ మారడం చారిత్రాత్మక అవసరం అంటూ కోమటిరెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.  ఎవ‌రు ఎంత ప్ర‌య‌త్నించినా జ‌ర‌గ‌వ‌ల‌సిన అనివార్యం జ‌ర‌గ‌కాపోదు. కాంగ్రెస్‌కు ఇవేమీ కొత్త కాదు. అనేకానేక మంది పార్టీని విడిచిపోయారు. కాకుంటే కొత్త రాష్ట్రంలో పార్టీకి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నా య‌న్న కాస్తంత ఆశ‌లు క‌ల్పిస్తున్న నాయ‌కుల మధ్యే విభేదాలు త‌లెత్త‌డం,  రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ వ‌దిలేయాల‌న్న నిర్ణ‌యాన్ని చూచాయిగా వ్య‌క్తంచేయ‌డం అధిష్టానానికి మింగుడుప‌డ‌టం లేదు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కుల‌ను, ఇన్ ఛార్జ్‌నీ ప‌రుగులు పెట్టిస్తున్నారు. త‌మ్ముడు సామాన్యుడు కాదు బ్రో!

మళ్ళీ ఢిల్లీకి కేసీఆర్ ఈసారి అజెండా అదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పయనమవుతున్నారు.ఇంచుమించుగా రెండు నెలల విరామం తర్వాత, అయన మరో మారు ఢిల్లీ వెళుతున్నారు.  సోమవారం (జులై 25) సాయంత్రం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మరో కొందరు మంత్రులు, ముఖ్యనాయకులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెసుస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు, అంటే, భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని అధికార వర్గాల సమాచారం. అయితే, కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పేందుకేనా? అంటే, కావచ్చును, కాకపోవచ్చును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే, ముఖ్యమంత్రి జాతీయ పార్టీ ఏర్పాటు విషయంగానూ, అటూ ఇటూ అడుగులు వేస్తున్నారు. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు.  అయితే, ముఖ్యమంత్రి ఇలా వెళ్లి అలా రావడం లేదు, రెండు మూడు రోజులు అక్కడే ఉంటారని అంటున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసే చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అంటే కేవలం నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు చెప్పడం ఒక్కటే కార్యం కాదు. అదొక్కటే ముఖ్యమంత్రి హస్తిన యాత్ర పరమార్ధం కాదు, చక్క పెట్టవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ సహ ఇతర ప్రతిపక్ష పార్టీలతో, కలిసి నడిచేందుకు ఒక విధంగా మానసికంగా సిద్దమైన ముఖ్యమంత్రి, ఈ పర్యటనలో ఆ దిశగా ఒకడుగు ముందుకేసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అందులో భాగంగా.. విపక్ష పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి,  యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. అలాగే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని విచారించడాన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ  పార్లమెంట్ లోపల వెలుపల నిర్వహించిన  నిరసన ప్రదర్శనలకు తెరాస ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు నిచ్చింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ప్రతిపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధిగా  ప్రకటించాయి. అయితే తెరాస మాత్రం ఇంకా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. కానీ,ఒక  విధంగా కాంగ్రెస్ కు దూరం అంటూనే దగ్గరయ్యే ప్రయత్నాలు తెరాస సాగిస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఈ విషయంలో మరో ముందడుగు వేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఇదమిద్దంగా ఎందుకు వెళుతున్నారు ... అనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత లేదని, అవకాశం చిక్కితే, ఒకరిద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

  రూ.4.10ల‌క్ష‌లు ప‌లికిన పుంగ‌నూరు గోవు 

బ‌డి  పిల్ల‌ల‌కి ర్యాలీ సైకిలు ఇష్టం, పెద్ద ఉద్యోగికి మారితీ కారు ఇష్టం, కోటీశ్వ‌రుడికి బిఎండ‌బ్ల్యూ  మ‌రీ యిష్టం. కానీ బాబా రాందేవ్ మాత్రం మూడున్న‌ర సంవ‌త్స‌రాల గోవును కొనుక్కున్నారు.  అన్ని వ‌స్తువు లూ అన్ని చోట్లా నాణ్య‌మైన‌వి  ల‌భించ‌వు. నాణ్య‌మైన వ‌స్తువుల దుకాణాల‌కే వెళ‌తాం. అది కారు అయినా, చేతి కంక‌ణం అయినా.  మ‌రి గోవు కావాల‌న్న‌పుడు మంచి జాతి గోవునే ఆశిస్తారు గ‌దా.   గోవులు ఎక్క‌డ‌న్నా దొరుకుతాయి. కానీ కొన్ని ప్ర‌త్యేక జాతుల‌వి కొన్ని ప్రాంతాల్లోనే దొరుకుతాయి.  రాందేవ్ బాబా మాత్రం పుంగ‌నూరు జాతి గోవునే కావాల‌నుకున్నారు. అందుకు ఏకంగా రూ.4.10 ల‌క్ష‌లు పెట్టారు. చిత్తూరుజిల్లాలో ఎక్కువ‌గా క‌నిపించే పుంగ‌నూరు జాతి ఆవును గుంటూరు జిల్లా తెనాలిలో రాందేవ్ కొన్నా రు.  ఈ గోవు వ‌య‌సు మూడున్న‌ర సంవ‌త్స‌రాలు, ఎత్తు కేవ‌లం 30 అంగుళాలు. ప్ర‌ముఖ యోగా గురు రాందేవ్ ఆశ్ర‌మం నుంచి ఆయ‌న ప్ర‌తినిధుల‌ను పంపారు. తెనాలిలో మంచి జాతి గోవులు ఉన్నాయ‌ని తెలిసి. తెనాలిలో  కంచర్ల శివకుమార్‌ను కలిసి ఆవును కొనుగోలు చేశారు. అంతకు ముందు  దానికి పశు వైద్యాధికారి నాగిరెడ్డి వద్ద పరీక్షలు చేయించారు. అనంతరం దానిని వారు తీసుకెళ్లారు. ప్రత్యేకమైన ఈ జాతి పెంపకానికి అనువుగా ఉంటుందని బాబా రాందేవ్ ఆశ్రమ ప్రతి నిధులు తెలి పారు.  ప‌తంజ‌లి ఆయుర్వేద ఉత్ప‌త్తుల ప్ర‌చారంలో  బాబా రాందేవ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిం దే. ఆయ‌న హ‌రిద్వార్‌లో నిర్వ‌హిస్తున్న గోశాల కూడా అంతే ప్రాచుర్యం పొందింది. దేశ విదేశాల నుంచి కూడా ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌డంలో భాగంగా గోశాల‌ను కూడా త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తుంటారు. అక్క‌డ గోవుల సంర‌క్ష‌ణకు ఎంతో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. అనేక ర‌కాల గోవులను అక్క‌డ చూడ‌వ‌చ్చు. దేశం లో అంత‌రించిపోతున్న గో జాతిని సంర‌క్షించ‌డం బాబా ఆశ్ర‌మం ప్ర‌ధాన చ‌ర్య‌గా స్వీక‌రించింది. అందు లో భాగంగానే తెనాలి లో ఉన్న గోవు స‌మాచారం తెలిసి ఆయ‌న ప్ర‌త్యేకంగా హ‌రిద్వార్ గోశాల‌కు త‌ర‌లిం చారు.  అంత‌గా ల‌భించ‌ని జాతి గోవు గ‌నుక‌నే ల‌క్ష‌లు పోసి హ‌రిద్వార్‌కు త‌ర‌లించార‌న్న అభిప్రా యాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఉప ఎన్నిక ఖాయం?.. వరాల మూట విప్పిన తెరాస !

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాకు సిద్దమయ్యారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి  అమిత్ షా, ను కలిసినప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో రాజగోపాల రెడ్డి కూడా గత రెండు రోజులుగా అవును, కాదంటూనే అవునే సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే, శాసన సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని, చెప్పారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్నికలలో ఓడించే లక్ష్యంతోనే బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. తెరాసను ఓడించడం కాంగ్రెస్ తో కాదని,అందుకే, కాంగ్రెస్ ను వాదులుతున్నానని చెపుతున్నారు.  నిజానికి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాసపై వత్తిడి పెంచేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా  వినవస్తోంది. అందులో భాగంగానే, అమిత్ షా, మునుగోడు ఉపఎన్నికకు స్కెచ్ సిద్దం చేశారని అంటున్నారు. అంతే కాకుండా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా తెరాస మీద వత్తిడి పెంచడంతో పాటుగా, ఇటీవల చేరికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ వ్యతిరేక వర్గాన్ని ‘ఉత్సాహ’ పరిచే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిని మూడవ స్థానానికి నేట్టేస్తే, రేవంతే రెడ్డి  దూకుడుకు బ్రేకులు పడతాయని, అందు కోసం అయినా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ల సహకారం కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంటుందని అంటున్నారు. మునుగోడులో హుజురాబాద్  రిపీట్ ఆయితే, రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవని, అందుకే అమిత్ షా ఉప ఎన్నిక వ్యూహం సిద్దం చేశారని అంటున్నారు.  ఆదలా ఉంటే, తెరాస కూడా ఉపఎన్నిక ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెసుస్తోంది. అందుకే, సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. ఉప ఎన్నికల వరాల మూటను విప్పింది. గతంలో బౌన్స్ అయిన కల్యాణ లక్ష్మి చెక్కుల స్థానంలో కొత్త చెక్కులను పంపిణీని మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారమే ప్రారంభించారు. పనిలో పనిగా, చెక్కుల బౌన్సుకు, ఇంత కాలం పంపిణీ ఆగిపోవదానికీ కూడా ఎమ్మెల్యే రాజగోపాల రెడ్డి అందుబాటులో లేక పోవడమే కారణమని మంత్రి జగదీశ్  రెడ్డి  తొలి మిస్సైల్ పేల్చారు. అలాగే, ప్రజలు అడిగినప్పుడ కాదన్న, గట్టుప్పలను ప్రత్యేక మండల కేంద్రంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే, అక్కడ, ‘పనులు’ ప్రారంభించే అలవాటైన పద్దతిలో మునుగోడులోనూ పెండింగ్ పనులపై అధికారులు దృష్టి సారించారు.  మరో వంక నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పే క్రతువు ప్రారంభమైంది. ఒక సర్పంచ్‌, ఒకరిద్దరు ఎంపీటీసీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పారు.మరి కొంతమంది కూడా చెప్పుల్లో కాలు పెట్టుకుని, కారేక్కేందుకు రెడీ’గా ఉన్నారని అంటున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా, మునుగోడు ఓటర్లు మాత్రం ఉప ఎన్నిక అనగానే ఉబ్బు తబ్బిబ్బవుతున్నారు. హుజురాబాద్. వైభోగం తమకూ పడుతుందని అంటున్నారు. అదలా ఉంటే మునుగోడు ఉపఎన్నిక బాధ్యతలు ముఖ్యమంత్రి, వరసగా రెండు నియోజక వర్గాల్లో (దుబ్బాక,హుజురాబాద్)తెరాస అభ్యర్ధులను దిగ్విజయంగా ఓడించిన, మంత్రి హరీష్ రావుకు, ‘హ్యాట్రిక్’ ఛాన్స్ ఇస్తారా, లేక జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగిస్తారా లేక స్వయంగా కేసీఆర్, కేటీఆర్ బుజానికి ఎత్తుకుంటారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు.

గిరిజనులను పార్టీకి దూరం చేసిన కేసీఆర్ నిర్ణయం!?

తెలంగాణలో అధికార   తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ పరంగా  గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ దెబ్బ పార్టీపై తీవ్ర ప్రభావం చూపేట్టుగా  కనిపిస్తుందనేది రాజకీయ  పరిశీలకుల అభిప్రాయం. తమ వర్గానికి చెందిన నేతకు ఒక్క ఓటు కూడా టిఆర్ఎస్ వేయలేదంటూ పార్టీ తరపున ఇంత వరకూ కీలక బాధ్యతలను నిర్వర్తించిన నేత టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో టీఆర్ఎస్ మాజీ ప్రత్యేక ప్రతినిధి, ఐఏఎస్ మాజీ అధికారి రామచంద్రు తేజావత్ పార్టీకి రాజీనామా చేశారు. గిరిజన మహిళకు దేశ చరిత్రలోనే తొలి సారిగా రాష్ట్రపతి అవకాశం వస్తే.. తెరాస మాత్రం ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రామచంద్రు తేజావత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా, అందుకు ఆయన చెప్పిన కారణం రెండూ కూడా   తెలంగాణలో హాట్ టాపిక్  అయ్యాయి. తమ వర్గానికి చెందిన నేత రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలబడితే టిఆర్ఎస్ ఆమెకు  మద్దతునివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ గిరిజన వర్గానికి చెందిన నాయకుడు, మేధావి,  ఐఎఎస్  మాజీ అధికారి పార్టీకి రాజీనామా చేయడం  పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో నిలిచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని, అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని విస్పష్టంగా వెల్లడించిన  రామచంద్రు తేజావత్ వెల్లడించారు..తన రాజీనామాను వెంటనే  ఆమోదించాలని  పార్టీ అధినేతకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  నాయకుల మధ్య అభిప్రాయభేదాలు, అసంతృప్తి, పార్టీలో గుర్తింపునివ్వడం లేదనీ, టిక్కెట్టు రాలేదనీ రాజీనామా చేయడం లేదా వేరే పార్టీలోకి జంప్ కావడం సాధారణంగా రాజీనామాలకు కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ, తమ వర్గాని(గిరిజన)కి చెందిన నేతకు మద్దతు పలకలేదనీ,  ఓటు వేయలేదంటూ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించిన ఓ ఐఏఎస్ మాజీ అధికారి ప్రకటించడం, పార్టీకి రాజీనామా చేయడం.కచ్చితంగా టీఆర్ఎస్ పై వ్యతిరేక ప్రభావం పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా  గిరిపుత్రులను టీఆర్ఎస్ నిర్ణయం  తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఆదివాసి రాష్ట్రపతి అవడం కలగానే మిగిలేదని ఆయన అన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ను తాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశానని రామచంద్రు తేజావత్ తెలిపారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థి గా నిలిపిన ప్రధాని మోడి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా తమ వర్గానికి టిఆర్ఎస్ గుర్తింపునివ్వకపోవడంతో ఓ కీలక నేత రాజీనామా చేయడంపై సొంత పార్టీని కూడా కాస్తంత విస్మయానికి లోనుచేసినట్టు పార్టీవ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాజీనామా.. ఇతర వర్గాలకు చెందిన నేతల్లోనూ ఓ ఆలోచనకు ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా అందులో 9 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. తెలంగాణలో 9.8 శాతం ఎస్టీ జనాభా ఉంది. అయితే, తెలంగాణ మంత్రి వర్గంలో కేవలం ఒక్క మంత్రి పదవిని కేటాయించడం జరుగుతూ వస్తుంది. 2014లో జరిగిన ఎన్నికల అనంతరం జరిగిన మంత్రివర్గంలో ఆజ్మీరా చందులాల్, 2018లో జరిగిన ఎన్నికల అనంతరం సత్యవతి రాథోడ్  మంత్రి వర్గంలో ఉన్నారు. కానీ, ఓసిలకు  (రెడ్డి సామాజిక వర్గానికి   6   వెలమలకు నాలుగు) మొత్తం 10  మంత్రి పదవులు, బిసిలకు 4 మంత్రి పదవులు, ఓ ఎస్సీకి, ఓ మైనార్టీకి మంత్రి పదవులు లభించాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 9.8శాతం ఉన్న గిరిజన జనాభ ఇప్పుడు టిఆర్ఎస్ కు కాస్తంత దూరం కావడం ఖాయమని పరిశీలకలు భావిస్తున్నారు. \ముందస్తు ప్రచారం జోరుగా ఉన్న సమయంలో  ఓ కీలక నేత పార్టీకి రాజీనామా చేయడం ఇటు పార్టీ వర్గాల్లోనూ, అటు గిరిజనుల్లోనూ, ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామం  రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గిరిజన ఓట్లు చాలా వరకు తగ్గే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా , కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి కాంగ్రెస్ తో ప్రభత్వాన్ని పంచుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికార పార్టీ జెఎంఎం, మహారాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో స్నేహపూర్వకంగానే ఉన్న శివసేన కేడా బిజెపి బలపరిచ అభ్యర్థికే మద్దతు అంటూ ప్రకటించింది. కానీ, టిఆర్ఎస్ మాత్రం మద్దతునివ్వకపోవడంపై రాష్ట్రంలో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌జాస్వామ్యంలోనే పేద‌వారి క‌ల‌లు సాకారం .. ముర్ము

స్వతంత్ర భార‌త దేశంలో జ‌న్మించి రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని చేప‌ట్టిన తొలి మ‌హిళ‌ను తానేన‌ని భార‌త  రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అన్నారు. ఒడిషాలో ఎక్క‌డో మారుమూల గ్రామంలో జ‌న్మించి దేశ ఉన్న‌త ప‌ద‌వికి రావ‌డం భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యం గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేస్తుంద‌ని ఆమె అన్నారు. ఆజాదీ కా అమృతోత్స‌వ్ జ‌రుగు తున్న వేళ తాను దేశ ఉన్న‌త‌ప‌ద‌విని అలంక‌రించ‌డం కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త విజ‌యం కాద‌ని దేశ ప్ర‌జ‌లం ద‌రికీ ద‌క్కుతుంద‌ని ఆమె అన్నారు. మంచి విద్య‌ను ఆశించిన తాను ఈ స్థాయికి అభివృద్ధి చెంద‌డం ప్ర‌జా స్వామ్య దేశంలో పేద ప్ర‌జ‌ల క‌ల‌లు సాకారం కాగ‌ల‌వ‌నడానికి గొప్ప నిద‌ర్శ‌న‌మ‌ని ముర్మూ అన్నారు.  దేశంలో యువ‌త కేవ‌లం త‌మ భ‌విష్య‌త్తునే ప్ర‌ధానంగా తీసుకోవ‌డం గాకుండా దేశాభివృద్ధికి త‌మ వంతు  కృషి చేయాల‌న్నారు. యువ‌త ప్ర‌గ‌తికి  రాష్ట్ర‌ప‌తిగా త‌మ మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంద‌ని ఆమె హామీ నిచ్చారు. స‌మాజంలో నిమ్న‌వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  దేశం అన్ని రంగాల్లోనూ స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తున్న‌ద‌ని, ముఖ్యంగా కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యం లో దేశంలో ఐక‌మ‌త్యం ప్ర‌తిఫ‌లించేట్టు ముంద‌డుగు వేసింద‌ని, ప్ర‌పంచ దేశాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా నిలి చింద‌ని ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు.  భార‌త దేశ 15వ రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్మూ సోమ‌వారం పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాలులో ఉభ‌య‌స‌భ‌ల స‌భ్యుల స‌మ‌క్షంలో ప్రమాణం చేశారు. ముర్మూతో సీజేఐ ఎన్‌.వి. ర‌మ‌ణ ప్ర‌మాణం చేయించారు.  ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌పతి ఎం.వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, స్పీక‌ర్  ఓం బిర్లా, కేంద్ర‌మంత్రులు, ఎంపీలు, గ‌వ‌ర్న‌ర్లు, సీఎంలు, త్రివిధ ద‌ళాధిప‌తులు హాజ‌ర‌య్యారు. కాగా, రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అలంక‌రించిన తొలి ఆదివాసిగా ముర్మూ చ‌రిత్ర సృష్టించ‌గా, ఆమెతో  రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకా రం చేయించిన తొలి తెలుగు జీజేఐగా ఎన్‌.వి. ర‌మ‌ణ చ‌రిత్ర‌కెక్కారు. 

క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన కాళేశ్వరం పంప్ హౌస్ లూ చూడండి.. కేటీఆర్ కు షర్మిల సూచన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉచిత సలహా ఇచ్చారు. ఆయన ప్రగతి భవన్ లో జారి పడి కాలి చీలమండ గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాను గాయపడినట్లు ఆయన ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ లో ప్రగతి భవన్ లో జారిపడి చీలమండ వద్ద లిగమెంట్ దెబ్బతిందని పేర్కొన్న ఆయన వైద్యుల సలహా మేరకు మూడు వారాలు పూర్తి విశ్రాంతిలో ఉంటానని తెలిపారు. అక్కడితో ఆగకుండా విశ్రాంతి సమయంలో ఓటీటీలో వీక్షించడానికి మంచి షోలు ఏమైనా సూచించాల్సిందిగా ఆయన ఆ ట్వీట్ లో తన ఫాలోవర్స్ ను కోరారు. కేటీఆర్ ను ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారు ఆయనకు ఏ షోలు సూచించారో తెలియదు కానీ.. వైఎస్సార్ టీవీ నాయకురాలు షర్మిల మాత్రం కేటీఆర్ ఏం చూస్తే బాగుంటుందో సూచించారు. ఈ మేరకు ఆ ట్వీట్ లో కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన షర్మిల కేటీఆర్ విశ్రాంతి సమయంలో చూసేందుకు చాలా ఉన్నాయనీ, వాటిలో కుట్ర సిద్ధాంతం గురించి తెలియజేసే కార్యక్రమాలు, నీట మునిగిన కాళేశ్వరం పంపు హౌజ్ లు, క్లౌడ్ బరస్ట్, అలాగే ముంపునకు గురైన గృహాలు, జనం కష్టాలు చూస్తే కాలక్షేపానికి కాలక్షేపం, ఆనందానికి ఆనందం దొరుకుతుందని సెటైర్ వేశారు. 

మునుగోడు ప్రేమలో బీజేపీ, టిఆర్ ఎస్‌

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం మీద‌  అంద‌రి దృష్టీ ప‌డింది. మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆయ‌న కూడా బిజెపీ హేమాహేమీల‌తో సంప్ర‌దించాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి అంగీక‌రించ‌డంతో ఆయ‌న అతి త్వ‌ర‌లో కాంగ్రెస్‌కు టాటా చెప్ప‌డం ఖాయ‌మ‌నే భావన అందిరిలో వ్యక్తమౌతోంది. ఈ కార‌ణంగా ఇక్క‌డ ఉప ఎన్నిక‌ అనివార్యమన్న భావనతో అందరి దృష్టీ ఇప్పుడు మునుగోడుపై పడింది కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుని చాలాకాలం నుంచీ ఆ పార్టీలోనే ఉన్న రాజ‌గోపాల్ రెడ్డి. తెలంగాణా ఏర్ప‌డిన‌పుడు  అందలం ఎక్కిస్తారని  ఆశించారు. కానీ అది జరగలేదు. పుండు మీద కారం జల్లినట్లుగా టీపీసీపీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి దక్కడంతో ఆ పదవి ఆశించి భంగపడ్డ తనసోదరుడు కోమటి రెడ్డి కంటే రాజగోపాలరెడ్డికే ఎక్కువ ఆగ్రహం వచ్చింది.  పదే పదే తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటిస్తూ వచ్చిన రాజగోపాల రెడ్డి కారణాలేమైతేనేం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇందు కోసం ఆయన బీజేపీ విధించిన షరతును అంగీకరించేందుకు కూడా సిద్ధపడ్డారని తెలుస్తోంది.  మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే పార్టీ సభ్యత్వం ఇస్తామనీ, రాజీనామా వల్ల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో ఆయనను బీజేపీ టికెట్ పై గెలిపించుకుంటామనీ బీజేపీ పెద్దలు ఆయనకు చెప్పినట్లు సమాచారం.  తెలంగాణాలో పాగావేయాలంటే ఇలాంటి సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పార్టీలోకి రావ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని బీజేపీ భావించ‌డంతో రాజ‌గోపాల్ రెడ్డి రాక‌ను వారూ కోరుకుంటున్నారు.  తెలంగాణాలో కేసీ ఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాలంటే టీఆర్ ఎస్ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారిని వీల‌యినంత మందిని ఆక‌ట్టుకోవ‌డం, వారిని కమలం గూటికి ఆహ్వానించడం బీజేపీకి అవ‌స‌రం.  ఇపుడు తాజాగా బీజేపీకి రాజగోపాల్ రెడ్డి ద‌గ్గ‌ర‌వ‌డం పార్టీ తెలంగాణాలో టిఆర్ ఎస్‌ను దించ‌గ‌లి గేందుకు స‌త్తాను పెంచుతుందని కమలం బావిస్తోంది.   ఇదిలా ఉండ‌గా, నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంపై అధికార టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఖాయ మనీ, దీంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యమని గులాబీ పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోం ది. ఈ మేరకు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది. గత మూడు రోజులుగా ప్రగతి భవన్‌ నుంచే ఇందుకు సంబంధించిన వ్యూహరచన కొనసాగుతోంది. ఆగస్టు నెలాఖరుకు రాజగోపాల్‌రెడ్డి  రాజీనామా చేసేలా బీజేపీ కీలక నేతలతో చర్చ జరిగిందని టీఆర్‌ఎస్‌ నేత లు భావిస్తున్నారు.  దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమైన మరుసటి రోజే సీఎం కేసీఆర్‌, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్య‌ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఇం దులో భాగంగా  ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి కారణమైన గట్టుప్పల్‌ మండల ఏర్పాటును వెను వెంటనే ప్రకటించారు. ఆ తరువాత నియోజక వర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ‘ఆపరేషన్‌ మునుగోడు’లో భాగంగా నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలకు ఆదివారం హైదరాబాద్ లో మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత వేగవం తం చేయనున్నా రు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారని బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రధాని మోదీ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కేంద్రంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువు తీస్తున్న జగన్

ముఖ్యమంత్రి ఎవరైనా ఏం చేయాలి? తెలిసో తెలియకో పొరపాటు చేసిన తన పార్టీ ఎమ్మెల్యేలకు వారి పొరపాటు ఏమిటో తెలియజేయాలి. సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి. మరో సారి ఇలా చేయవద్దని మందలించాలి.  మన్నించి వారి ఆబోరు కాపాడాలి. ఆ మాటకు వస్తే.. తన పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా విపక్ష ఎమ్మెల్యేల అభిమానం కూడా దెబ్బ తినకుండా చూసుకోవాలి. కానీ ఏపీ సీఎం జగన్ తీరు ఇందుకు పూర్తి  భిన్నంగా ఉంది.సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువును ఆయనే తీసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ తన మాటే నెగ్గాలని, తానే అన్నింటికీ సుప్రీం అన్నట్లు జగన్ వ్యవహారం ఉందంటున్నారు. మూడేళ్లు సాధన చేసి మూలన ఉన్న ముసలిదాని నడ్డి విరగ్గొట్టాడన్న చందంగా ఉంది జగన్ ధోరణి అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇజ్జత్ తీస్తే.. తన ఇజ్జత్ తీసుకున్నట్లేనని జగన్ గుర్తించలేకపోతున్నారని అంటున్నారు. మూడేళ్లుగా ప్రజల కష్టాలు, ఇబ్బందులు, కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తనకు జనం కావాలని, జనం ఓట్లు మళ్లీ తనకే కావాలంటూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకూ వెళ్లాలని తరుముతున్నారు. ఇక్కడ మళ్లీ జనం గోడు కాదు జగన్ కు కావాల్సింది. వాళ్ల ఓట్లు మాత్రమేనట. గడప గడపకూ వెళ్లి తన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో చేసేసిందంటూ ప్రచారం చేయాలని జగన్ తన ఎమ్మెల్యేలను పంపుతున్నారు. వైసీపీ సర్కార్ ఈ మూడేళ్లలో ఒరగబెట్టింది ఇదిగో.. అంటూ ఏదో ఒక పేపర్ ఎమ్మెల్యేల చేతిలో పెట్టి.. జనాన్ని చెవిలో జోరీగలాగా ఊదర గొట్టాలని చెబుతున్నారు. తద్వారా తన పార్టీ ఎమ్మెల్యేలను కొరియర్ బాయ్ లుగా మార్చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి. అంతే కాదు తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు రోడ్లు లేవు, నీళ్లు రావు, విద్యుత్ సరఫరా ఇవ్వలేదు, టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడంలేదేం.. ఇలా ఎన్నెన్నో స్థానిక సమస్యలతో   నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. జనం తాము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తిట్లు, శాపనార్థాలు పెడుతూ.. తీవ్రంగా అవమానించి మరీ వెళ్లగొడుతున్న సంఘటనలు ఎదురవుతుండడం గమనార్హం. నిజానికి ఎవరైనా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కాగలిగారంటే.. జగన్ హవా కొంత తోడైనప్పటికీ.. ఆ ఎమ్మెల్యే విజయం వెనుక ఎంతో కొంత తన కృషి, సేవ, జనంలో పలుకుబడి తప్పకుండా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు వెనుక కేవలం తన కష్టం, కృషే ఉందనే ధోరణి జగన్ లో బాగా వేళ్లూనుకుపోయి ఉందంటున్నారు. అందుకే వారిని తన పోస్టుమాన్ ల మాదిరి, కొరియర్ బోయ్ ల మాదిరిగా పరిగణిస్తున్నారంటున్నారు. తద్వారా ప్రజాస్వామ్యం అనే మాటకు విలువే లేకుండా తూట్లు పొడుస్తున్నారని సొంత పార్టీ వారే దుయ్యబడుతున్నారు. వాస్తవానికి స్థానిక సమస్యలపై ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిలదీయాలి?  తమ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, జెడ్పీ చైర్మన్ నో అడగాలి. కానీ, గడప గడపకూ అంటూ తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పట్ల కొన్ని చోట్ల కడుపు మండిన జనం నిలదీస్తున్నారు. దీంతో  గడప గడపకు మన ప్రభుత్వం దేవుడెరుగు   తమ గడపనే దాటలేని పరిస్థితి పలువురు ఎమ్మెల్యేలకు వచ్చింది. ఒక పక్కన జనం మధ్యకు వెళ్లాల్సిందే అని జగన్ హుంకరిస్తున్నా పబ్లిక్ లోకి వచ్చేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారంటున్నారు. తన మాటే శాసనం అనే తీరులో జగన్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా స్థానిక సమస్యలపైనా, అభివృద్ధి లేమి పైనా జనానికి జవాబు చెప్పేందుకు తమ వద్ద పాయింట్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో గుర్తుకు రాని తాము ఎన్నికల తరుముకొస్తున్న వేళ మాత్రమే గుర్తొచ్చామా? అనే ప్రశ్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, శ్రేయోభిలాషుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దాఖలాలు ఉంటున్నాయి. అధినేత తమను గౌరవిస్తే.. జిల్లా స్థాయి నేతలు, అధికారులు గౌరవిస్తారని, సీఎం వద్దే తమకు విలువ లేనప్పుడు ఇంకెవరు తమను పట్టించుకుంటారని అంటున్నారు. మూడేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసి, తమను ఇబ్బందుల పాలు చేయడంలో ప్రజల్లో వైసీపీ పట్ల, జగన్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనం మధ్యకు వెళ్లి, వారి మధ్యే తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి మనసులు గెలుచుకోవలసిన అవసరం ఉందని తెలిసి వచ్చినట్లుందని పలువురు అంటున్నారు. అందుకే  ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాలకు బలవంతంగా తరుముతున్నారంటున్నారు. ఇంతవరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ లు నొక్కి పాలన సాగించిన జగన్ కు చేతులు కాలినట్లున్నాయని, అందుకే జనం గుర్తుకు వచ్చారంటున్నారు. చివరిగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి.. ‘వైసీపీలో జగన్.. పార్టీ జెండా మోసిన వారు మాత్రమే ఉంటారు’ అన్న మాజీ మంత్రి పేర్ని నాని మాటలు అక్షర సత్యాలు కావచ్చంటున్నారు. ఎమ్మెల్యేలకు కనీసం ద్వార దర్శన భాగ్యం అయినా కల్పించాలని పేర్ని చేసిన ప్రతిపాదన త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

నాడూ నేడూ ఐదూళ్లే సమస్య!

ఈ ఐదు అంకే చాలా చిత్రం. పూర్వం ఐదూళ్లివ్వండి మా బ‌తుకులు మేం బ‌తుకుతాం, ఈ భోగాలేమీ అక్కర్లేద‌న్నారు పాండ‌వులు. ఐదూ లేదు ఏమీ  లేదు పొండ్రాబ‌య్‌..అన్నాడు దుర్యోధ‌నుడు,  ఫ‌లితంగా కురుక్షేత యుద్ధం. ఆ త‌ర్వాత సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో కూడా ఓ ఐదూళ్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పి తెస్తున్నాయి. ఆ ఐదూళ్ల‌ నూ ప‌క్క‌నే ఉన్న తెలంగాణా రాష్ట్రంలో క‌ల‌పాల‌ని ఆ ఊళ్ల వారే డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్ర‌జాభీష్టం. దీనికి స‌ర్కారువారు అంగీక‌రించాలి గ‌దా.. అసలు ఆ ఊళ్ల వారు ఏపీ మాకొద్దు బాబోయ్ అంటూ తెలంగాణ వైపు చూడడానికి ఏపీ సీఎం జగన్ నిర్వాకమే కారణం అని విమర్శలకులు అంటున్నారు.  రెండుగా తెలుగు రాష్ట్రం విడిపోయిన మొదటి ఐదేళ్లు అభివృద్ధిలో, ఆదాయంలో, ర్యాంకింగ్ లలో తెలంగాణలో పోటీపడి దూసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆ తరువాత ఈ మూడేళ్ల కాలంలో అన్ని రంగాలలో వెనుకబడిపోయింది.  జ‌గ‌న్ హయంలో ఆంధ్రప్రదేశ్ దుస్థితి గురించి ఎవ‌ర్నిడిగినా చెబుతారు. వ‌చ్చాడ‌య్యో సామీ అని పాడుకున్న‌వారంతా ఇప్పుడు నాలిక్క ర్చుకుంటున్నారు. పెద్దాయ‌న్ని (చంద్రబాబు) కాద‌ని పొర‌పాటే చేశామ‌ని తెగ బాధ‌ప‌డుతున్నారు.  అస‌లు ఏ మాత్రం ప్ర‌జ‌ల అభ్య‌ర్ధ‌న‌లు, స‌మ‌స్య‌లు ప‌ట్ట‌న‌ట్టే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేవ‌లం ప్ర‌చార ప‌టాటోపంతో పాల‌న సాగిస్తున్నారంటున్నారంతా.  విలీన మండ‌లాల్లోని ఐదు గ్రామాల ప్ర‌జ‌లు త‌మ గ్రామాల్ని తెలంగాణాలో క‌ల‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలో ఐదు పంచాయ‌తీలు తీర్మానాలు చేశాయి. అవన్నీ వైసీపీ మ‌ద్ద‌తుదార్ల  పంచాయతీలు కావడంతో తర్వాత రెండు , మూడు గ్రామాల కు చెందిన కొంతమంది ప్రతి నిధులతో అలాంటి తీర్మానాలు చేయలేదని చెప్పించారు. కానీ ఇప్పుడు ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆంధ్రా -తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాస్తారోకో చేశారు.  తమ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని నడిరోడ్డుపై బైటాయించి భారీ ఎత్తున ధర్నా చేశారు. ‘జై తెలంగాణ.. ఆంధ్రా వద్దు – తెలంగాణ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో పిచ్చుకలగూడెం, కన్నాయిగూడెం, ఎటపాక, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాల ప్రజలు భారీగా పాల్గొ ని, తమను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు.  ఎవ‌ర‌న్నా స‌మ‌స్య వ‌స్తే గ్రామ‌పెద్ద ద‌గ్గ‌రికి వెళ్లేవారు, కాకుంటే క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లేవారు. కానీ ఈ ఐదు గ్రామాలు ఆంధ్రా, తెలంగాణా మ‌ధ్య ఉండ‌డంతో ద‌గ్గ‌ర‌లోని ఆంధ్రా ప్రాంత కార్యాల‌యం కంటే 40 కిలీమీటర్ల దూరంలో  ఉన్న భ‌ద్రాచ‌లం వెళ్ల‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు.   గోదావ‌రి వ‌ర‌ద స‌మ‌యంలో కూడా ఈ ఐదు గ్రామాల వారిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు. అత్యంత అవ‌స‌ర స‌మ‌యంలో, ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం, అధికారుల‌కు ప‌ట్ట‌న‌పుడు ఈ గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని ఎందుకు ప‌ట్టించుకుంటారు. మున్ముందు వీరితో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయోనన్న భ‌యంతోనే ఇపుడు తెలంగాణాయే ముద్దు అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెబుతున్నారు. మ‌హాప్ర‌భో.. మీరు వ‌ద్దు, మీ పాల‌నా వ‌ద్ద‌ని త‌మ‌ను కేసీఆర్ నీడ‌లోకే పంపేయ‌మ‌ని ఏకంగా డిమాండ్ చేస్తున్నారు. త‌మ గ్రామాల‌ను భ‌ద్రాచ‌లం జిల్లాలో క‌లిపితేనే స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్నది వారి న‌మ్మ‌కం.  ఒక పాల‌న‌ను ఈ విధంగా ప్ర‌జ‌లే ఘోరంగా తిర‌స్క‌రించ‌డం ద‌క్షిణాదిలో ఇదే తొలిసారి కావ‌చ్చు. రాజ‌కీ య స‌మ‌స్య‌ల కంటే సామాజిక స‌మ‌స్య‌లు ప్ర‌జ‌లే స్ప‌ష్టంగా ప్ర‌భుత్వానికి చెప్పుకోగ‌ల్గుతార‌న్న‌ది ఈ ఐదు గ్రామాల డిమాండ్ స్ప‌ష్టం చేస్తోంది.  ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కూడా గోదావరి కరకట్ట కట్టడానికి ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలన్నారు. సాంకేతికంగా సాధ్యం కాదని తెలిసినా ఈ అం శాన్ని రోజు రోజుకు హైలెట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఇక ఇప్పుడు తెలంగాణా ప్ర‌భుత్వం ఆ ఐదు గ్రామాల‌వారినీ త‌మ ప్రాంతంలోకి తీసుకోవడం పై  చ‌ర్చిం చాలి. ఇదేమీ దుస్తులో, వ‌స్తువులో, పుస్త‌కాలో మార్చుకున్నంత సుల‌భ‌మేమీ కాదు. ఒక‌సారి విభ‌జ‌న జ‌రి గిన త‌ర్వాత ఇపుడు ఏకంగా గ్రామాల‌ను త‌మ రాష్ట్రంలోకి విలీనం చేయ‌డ‌మన్న‌ది కేంద్రం అంగీకరించా లి. కానీ ఇక్క‌డ తిర‌కాసేమంటే అస‌లు వారిని రెచ్చ‌గొడుతున్న‌దే తెలంగాణా ప్రభుత్వ‌మ‌న్న అభిప్రాయా లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అక్క‌డి ప్ర‌భ‌త్వం ఆ గ్రామాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని కేంద్రానికి తెలిసేలా నాట‌కాలు ఆడుతోంద‌నే అనుకోవాలి. ఇక అధికారం ఉన్న‌ది కొద్దికాల‌మే గ‌నుక  ఈ  కుంప‌టి ఇలా మండే లా కొన‌సాగించి అప్పుడ‌పుడు న‌వ్వుతూ కొన్ని బొగ్గులు వారిచేత వీరిచేత వేయిస్తుంటే ఆన‌క చ‌ట్ట స‌వ‌ర‌ణ గురించి ప్ర‌స్తావించ‌వ‌చ్చ‌న్న‌ది తెలంగాణా వ్యూహ‌మూ కావ‌చ్చునేమో!

రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ.. యూపీలో 8 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కనీసం 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ రెండు బస్సులూ కూడా బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న బస్సు దానిని ఢీ కొంది. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం లక్నో ట్రూమాకేర్ సెంటర్ కు తరలించారు.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం

జపాన్ లో  అగ్ని పర్వతం బద్దలైంది. పలు పట్టణాలలో లావా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా పట్టణాలను ఖాళీ చేయించినా అపార నష్టం సంభవించింది. గత కొంత కాలంగా దక్షిణజపాన్ లోని సకురజీమా అగ్ని పర్వతం లావా వెదజల్లుతూ, యాక్టివ్ గా ఉంది. ఇది ఎప్పుడో అప్పుడు బద్దలౌతుందని భావిస్తూనే ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి హఠాత్తుగా ఒక్క సారిగా బద్దలైంది. దీంతో ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అగ్నిపర్వతానికి సమీపంలోని అరిమురా, పురుస తదితర పట్టణాలు, ప్రాంతాల ప్రజలను హుటాహుటిక ఖాళీ చేయించారు. అయితే అగ్నిపర్వతం బద్దలైన సమయం రాత్రి కావడంతో వెంటనే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. సకురజిమా అగ్ని పర్వతం కొన్నేళ్లుగా యాక్టివ్ గా ఉంది. తరచూ బూడిద, పొగను వెదజల్లుతోందని అధికారులు తెలిపారు. గత కొంత కాలంగా ఆ పర్వతాన్ని సందర్శించేందుకు, దాని సమీపంలోనికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. తాజాగా   ఆదివారం రాత్రి ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలైందనీ,   2.5 కిలోమీటర్ల ఎత్తున రాళ్లు, దుమ్ము ఎగజిమ్మిందని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి.. ఆ ప్రాంతమంతా చిమ్మచీకటి అలుముకుందని వివరించారు. 

తెలంగాణను వదలని వానలు.. తొలగని వరద భయం

తెలంగాణను వర్షాలు వెంటాడి వేధిస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలోనే వానలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. జనం అష్టకష్టాలూ పడుతున్నారు. వాగులు, వంకలు, చెరువులు పూర్తిగా నిండి పొంగి పొరలుతున్నాయి.  వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. జలాశయాలన్నీ జలకళతో కలకలలాడుతున్నాయి. పంటలు నీట మునిగాయి. పాత ఇళ్లు కుప్పకూలాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు ఇప్పటి వరకూ ఉత్తర తెలంగాణను ముంచెత్తిన వానలు   ఇప్పుడు దక్షిణ తెలంగాణను వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇళ్ల గోడలు కూలి నలుగురు మరణించారు. జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు అవరోధం ఏర్పడింది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది.  పంట నష్టం తీవ్రంగా ఉంది. అయినా ఇప్పటి వరకూ అధికారులు  పంట నష్టంపై ఎలాంటి అంచనా వేయలేదు. ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించ లేదు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 26 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, జనగామలనూ వర్షాలు ముంచెత్తి పంటలు నీట మునిగాయి.   చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. రహదారులపై నీరు నిలుస్తోంది.   మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి నీరు చేరింది. హల్దీ, కూడవెళ్లి, నల్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను రెవెన్యూ, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. దీంతో  ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకులంలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేశంలోనూ విస్తరిస్తున్న మంకీపాక్స్.. నాలుగుకు పెరిగిన కేసుల సంఖ్య

ఒక వైపు కరోనా వ్యాప్తి నాలుగో వేవ్ దిశగా సాగుతోంది. మరో వైపు మరో కొత్త వైరస్ మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తోంది. రెండు  వైరస్ లకూ ఒకే ప్రొటో కాల్ పాటింకాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలనీ, తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెబుతోంది. అయితే ఆ జాగ్రత్తలు పాటిస్తున్న దాఖలాలు దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో దేశంలో మంకీ పాక్స్ వ్యాప్తి కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. ఎటువంటి విదేశీయానం చేయని ఢిల్లీ వ్యక్తికి మంకీ పాక్స్ పాజిటివ్ రావడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఢిల్లీలో ఇదే తొలి మంకీ పాక్స్ కేసు కావడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఇటీవల ఒక పార్టీకి హాజరయిన 34 ఏళ్ల వ్యక్తి మూడు రోజుల క్రితం జ్వరం, చర్మంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరారు. ఆ వ్యక్తి శాంపిల్‌ను డాక్టర్లు పుణఎలోని నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవి)కి పంపగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.   మంకీపాక్స్‌ వ్యాప్తి నియంత్రణకు కొవిడ్‌ కు పాటించే ప్రొటోకాల్‌నే పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.  వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యుహెచ్‌ఓ) మంకీపాక్స్‌ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  భారత్ లో మంకీ పాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆదివారం న్యూఢిల్లిలో మంకీపాక్స్‌ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ మరియు ఐసీఎంఆర్‌ ఉన్నతాధికారుల హాజరయ్యారు.   రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రొటోకాల్ పాటించాలని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ మంకీ పాక్స్ డేంజర్ బెల్స్ మోగాయి. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడతున్నాడు.   అతడికి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ, శాంపిల్స్ సేకరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపామనీ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. అయితే మంకీపాక్స్ గురించి ఆందోళ‌న అవసరం లేదన్నారు.  కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయనీ, ఈ వ్యక్తి జులై 6న కువైట్ నుంచి వ‌చ్చాడ‌నీ, 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్‌ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లిన‌ట్టు డీహెచ్ తెలిపారు. దీంతో అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశార‌ని, అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్‌‌ హాస్పిటల్‌కు తరలించామన్నారు.  నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామనీ, వారెవరికీ మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు లేవ‌నీ చెప్పారు.

కేంద్రం అంబుల పొదిలో ఆర్ధిక మండ‌లి అస్త్రం!

ఉద్యోగం స‌ద్యోగం లేని యువ‌కుడిని తండ్రి నిత్యం సంపాదన అవసరం గురించి చెబుతూ జ్ణాన బోధ చేస్తూనే ఉంటాడు. చీటికీ మాటికీ అక్క‌డా ఇక్క‌డా అప్పులు చేసి ఎక్కడ త‌ల‌ మీద‌కి తెస్తాడో అన్న  భ‌యమే తండ్రిని  కొడుకుకు బాధ్యత గుర్తు చేసే విధంగా పురిగొల్లుతుంది. అందువ‌ల్ల కొడుకు అల‌వాట్ల‌ు, ఖర్చులపై ఎప్పుడూ ఒక కన్నేసి వాటిని నియంత్రించడానికి,  క‌ట్టుదిట్టం చేయ‌డానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇందుకు బంధువు నుంచో, మిత్రుడి నుంచో స‌ల‌హా తీసుకుని మ‌రీ కార్యాచరణకు దిగుతాడు. కానీ దానివ‌ల్ల తండ్రీ కొడుకుల మధ్య సత్సంబంధాలు దెబ్బ‌తింటాయ‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌కు రాదు. ఇప్పుడు రాష్ట్రాల మీద ఆర్ధిక నియంత్ర‌ణ‌కు కేంద్రం దాదాపు ఇదే ఆలోచ‌న చేస్తోంది. తండ్రిగానో, పెద్ద‌న్న‌గానో ఓవ‌రాక్ష‌న్ చేస్తోంది. దీని వల్ల ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగుతోందని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. అలా కాకుండా కాస్తంత భ‌విష్య‌త్తు దృష్టి, దూర‌దృష్టితో ఆలోచించాల్సిన అవ‌స‌రం కేంద్రానికి ఉంది.  దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు అప్పులు చేస్తున్నాయ‌న్న మాట విన‌ప‌డుతోంది. వాటిలో తెలుగు రాష్ట్రాలు ముందు పీటిన ఉన్నాయనుకోండి. అది వేరే సంగతి. వాటి వ్య‌వ‌హారం, తీరు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం వల్ల దేశ ఆర్ధిక వ్య‌వ స్థ‌కే న‌ష్టంవాటిల్లుతోందన్న భయాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో ఆర్దిక ఎమ‌ర్జెన్సీ విధించాల్సిన అవ‌స‌రం ఉందని భావిస్తోంది. అందుకు శ్రీలంక పరిస్థితుల్నీ, ఆర్ధిక‌వేత్త‌ల హెచ్చరికల్ని చూపుతోంది. దీన్ని అధిగమించేందుకు ఆర్ధిక మండ‌లి ఏర్పాటు అవ‌స‌రాన్ని  తెరమీదకు తీసుకువస్తోంది. ఆర్ధిక వ్య‌వ‌హారాల విష‌యాల్లో కేంద్రం,రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరుగుతున్నం దు వ‌ల్ల నిపుణుల స‌ల‌హా మేరకు ఆర్థిక మండలి ఏర్పాటును కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.  దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు అవసరమైన చర్యలను చేపట్టాల్సిందేనని 15వ ఆర్థిక సంఘం గతంలోనే ప్రభుత్వానికి సూచిం చిన విషయాన్ని కేంద్రం గుర్తు చేస్తోంది. ఆర్ధిక మండ‌లి ఏర్పాటు చేస్తే దాని  ద్వారా రాష్ట్రాల నుంచీ కేంద్రం నుంచీ కూడా ఆర్దిక లావాదేవీల రికార్డుల‌ను తెప్పించి ప‌రిశీలించే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణుల అభిప్రాయం.  పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, బీహార్‌, రాజస్థాన్‌లలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సిన పరిస్థితులు సమీప కాలంలో రావచ్చునని ఇప్పటికే అనేకమంది ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ప్ర‌స్తుతం  అన్నిదేశాలూ శ్రీ‌లంక‌నే ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటూ  ఆ దుస్థితికి రాకుండా జాగ్ర‌త్త‌ ప‌డాల‌న్న‌యోచ‌న‌లో ఉన్నాయి. కానీ దేశంలో విప‌క్షా ల‌న్నీ కేంద్రాన్ని, బీజేపీ పాల‌న‌లోని ఇత‌ర రాష్ట్రాలలోని ప‌రిస్థితుల‌తో బేరీజు వేసుకుని కేంద్రం ప్ర‌ద‌ర్శించే వివక్ష పూరిత వ్య‌వ‌హారా ల‌తో విసిగెత్తి ఉన్నాయి. క‌నుక ఆర్ధిక నిపుణుల స‌ల‌హా మేర‌కు ఆర్ధిక మండ‌లి ఏర్పాటును బీజేపీయేతర రాష్ట్రాలు వ్య‌తిరేకించే అవ‌కాశాలే ఉన్నాయ‌న్నది విశ్లేష‌కుల మాట‌.  

పులివెందులలో ప్రజలకు కనిపించకుండా పరదాలు.. కోనసీమలో వరద కష్టాలను కప్పేయడానికి తెరలు!

ఏ నాయకుడైనా ప్రజలకు ఎప్పుడు ముఖం చాటేస్తాడు. ప్రజలలో తన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు. అని వార్యంగా ప్రజల ముందుకు రావలసినప్పుడు అధికారంలో ఉన్న నాయకుడైతే తనను వ్యతిరేకించే వర్గాన్ని నిర్బంధించి.. తన అనుకూల వర్గాలను చుట్టూ పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు విధానాలనూ ఇప్పటికే ఉపయోగించేశారు. నెలల తరబడి ప్యాలెస్ దాటి జనంలోకి రాకుండా ఉండటమూ అయిపోయింది. పులివెందుల పర్యటనలో జనం ఆయనకు సమీపంలోకి రాకుండా బ్యారికేడ్లు పెట్టడమూ అయిపోయింది. ఇప్పుడాయన విపక్షాల విమర్శల కారణంగా అనివార్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళుతున్నారు. మంగళవారం (జులై 26)న ఆయన కోనసీమ జిల్లాలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ పక్కాగా ఖరారైపోయింది. ఆయన పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లూ చేసేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లేమిటంటారా? ఉంటాయి. రాజుగారు ప్రజల అవస్థలను చూడలేరు. అందుకు అవేమీ ఆయనకు కనిపించకుండా తెరలు కట్టేయడమే ఏర్పాట్లన్న మాట. తెరల మాటున వరద నష్టాన్ని, బాధితుల ఇబ్బందుల్నీ కప్పేసిన తరువాత తీరికగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారన్న మాట. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ప్రకటనో, ప్రసంగమో, లేదా మీడియా సమావేశంలోనో చెప్పేసి తన భుజాలను తానే చరిచేసుకుని పర్యటన ముగిస్తారన్న మాట. నాయకుడు బాధితులతో మమేకం అవ్వాలి. కష్టాల్లో ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి. వరద ముంపులో ఉన్న సమయంలోనే వారి దగ్గరకు వెళ్లాలి. ముంపు బాధలను ప్రత్యక్షంగా చూడాలి. అందుకు భిన్నంగా వదర నీటిలో జనం నిండా మునిగి ఉన్న సమయంలో ఏరియల్ వ్యూ అంటూ గాలిలో తిరిగి వెళ్లిపోయిన జగన్.. అసందర్బంగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహించారే తప్ప వరద బాధితుల కష్టాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు విపక్ష నేత వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి వరదలోనే ముంపు బాధితులకు కలిసి వారికి భరోసా ఇచ్చి వచ్చిన తరువాత అనివార్యంగా జగన్ పర్యటనకు బయలు దేరుతున్నారు.   అది కూడా వరద తీసేసిన తరువాత. అది కూడా వదర ఛాయలు కూడా జగన్ కు కనిపించకుండా అధికారలు తెరలతో కప్పేసిన తరువాత. భారీ నష్టం జరగలేదని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ అధికారులు చేసేసిన తరువాత.   వరద బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..  వరద బాధితులను తాము బ్రహ్మాండంగా ఆదుకున్నాం.. వారికి కష్టమనేది తెలియకుండా అన్ని చర్యలూ తీసుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో విపక్ష నేత పర్యటనపై విమర్శలు గుప్పించింది. అసలాయన ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారంటూ నిలదీసింది. ఆయన పర్యటన వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందంటూ దుయ్యబట్టింది. వాస్తవంలో వరద బాధితులను గోదారికి వదిలేసిందన్న బాధితుల ఆగ్రహాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో జగన్ కోనసీమలో పర్యటించి తెరల వెనుక ఉన్న కష్టాన్ని, నష్టాన్ని చూడకుండా తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేసిందనీ, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందనీ చెప్పడానికి ఒక రోజు పర్యటనకు రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లు పర్యటించేస్తారన్నమాట.

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ నిల్!

అరి చేతిలో వైకుంఠం చూపించేసి చివరకు అరిటాకులో చద్దన్నం పెట్టారన్నది ఓ నానుడు. జగన్ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి.. ఇప్పుడు వాటి అమలు  చేయలేక కోతలు, వడ్డింపులు, బాదుడు అంటూ జనం నెత్తిన బండ పడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు స్వర్గం అని తేలిపోయింది. ఆయా సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది.  అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రొబేషన్ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష అన్నారు.  తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్ లేదట. ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి. 

మువ్వన్నెల రాజకీయం ..! మోడీతో కేసీఆర్ ‘ఢీ’

అనుకుంటాం కానీ, అసలు అసలే. అరువు అరువే. కడుపులో లేంది కౌగిలించుకున్నా రాదు.  అది దేశ భక్తి అయినా, దైవ భక్తి అయినా, మరో భక్తి భావన ఏదైనా స్వతహాగా లోపలి నుంచి రావాలి, కానీ, పెదవుల పై పూసుకుని పలికే  లిప్ స్టిక్ పలుకులు  పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభావం చూపావు. ఒరిజినల్, డూప్లికేట్ల  మధ్య  పొంతన పోలిక కుదరదు. అసలు అసలే,, నకిలీ నకిలీనే.. అసలు నకిలీ కాదు, నకిలీ అసలు కాలేదు.  అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, మీరు ‘జై శ్రీరామ్’ అంటే  మేము ‘జై హనుమాన్’ అంటాం అంటూ బీజేపేతో భక్తి పోటీకి దిగారు. అన్నట్టుగానే కొంతా కాలం పాటు, అక్కడక్కడ హనుమాన చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకనో, ఆమె సైలెంటై పోయారు.  అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్  కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు, నేను చేసినన్ని పూజలు, యాగాలు ఎవరు చేశారు? అంటూ అప్పుడప్పుడు, ‘నేనూ హిందువునే ... అని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే,,ఆయన కడుపులోంచి వచ్చిన  హిందుగాడు బొందు గాడు డైలాగు పాపులర్ అయినంతగా, ఆయన  చెప్పిన నేనూ హిందువునే ...డైలాగు పాపులర్ కాలేదు.  అదలా  ఉంటే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీతో  దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్ మహోత్సవ్  పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర  మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా  పేరిట  దేశ వ్యాప్తంగా జెండా పండగ  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.  మామూలుగా అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ళలో ఆయన ఏనాడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొన లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొన లేదు. ఈ సంవత్సరం రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోను ముఖ్యమంత్రి  పాల్గొన లేదు, మీ జెండా మీది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో  ముఖ్యమంత్రి కేసీఆర్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో  మరిచి పోయారు.  అయితే, దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.  హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని,  ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే,   మేమూ హిందువులమే .. అన్నట్లుగా,  మాకూ దేశ భక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి  వ్యూహ రచన చేశారని అంటున్నారు.  అయితే, అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న హ‌ర్‌ ఘ‌ర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా, జెండా కర్రతో సహ త్రివర్ణ పతాకాన్ని, ఇంటింటికి అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే, ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు  అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు  తీసుకుంది. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  దేశ భక్తీ పోటీలో  తమదే పై చేయి అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అయితే.... అధికారులు కొందరు ఇదంతా చూస్తుంటే  పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు .. అన్న సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు తోడి కోడ‌ళ్ల పోరు!

పెర‌ట్లో చెవి క‌మ్మ దొరికితే నాదంటే నాద‌ని కోడ‌ళ్లు తిట్టుకున్నారు. అత్త‌గారు వెళ్లి ఇదెవ‌రిదో వాళ్లు ఇవాళ క‌మ్మ‌టి వంట చేస్తే నేనే తేలుస్తాన‌న్న‌ది. అంతే అత్త‌గారు ప‌క్కింటి క‌ల‌గూర‌గంప క‌బుర్ల‌కు వెళ్లింది, కోడ‌ళ్లు త‌మ బంగారాన్ని కాపాడుకోవ‌డానికి వ‌చ్చీ రాని వంట‌ చేయ‌డంలో త‌ల‌ మున‌క‌ల‌య్యారు. ఆన‌క తిండి ఎలా గున్నా అవ‌స్థ‌ మాత్రం పెద్ద కోడ‌లిదే. అదుగో అలా ఉంది ఉద్ధ‌వ్, షిండేల సంగ‌తి. అస‌లు శివ‌సేన అంటేనే మొన్న‌టి దాకా  ఉద్ద‌వ్ థాక్రే నాయ‌క‌త్వంలోనిదే. ఇపుడు షిండే  రాజ‌కీయ హ‌డావుడితో ఆయ‌న దుకాణం కూడా శివ‌సేన‌గా మారింది. దీంతో పార్టీ గుర్తు త‌మ‌కే ఉండాల‌న్న పోరు తోడికోడ‌ళ్ల ర‌గ‌డ‌లానే మారింది. మ‌హా రాష్ట్ర‌కే కాదు యావ‌త్ భార‌తా వ‌నికి వీరి గోడు మంచి కాల‌క్షేపంగా మారింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు ఇరు వర్గాలూ పార్టీ, సింబ‌ల్ త‌మ‌కు ఎందుకు ఇవ్వాల‌న్న‌ది వివ‌రిస్తూ సంబంధిత ప‌త్రాలు అధికారుల ముందు పెట్టారు. ఇక వారే తేల్చ‌వ‌లె.  షిండే 40 మంది ఎమ్మెల్యేల‌తో ఉద్ధ‌వ్ థాక్రేను ఎదిరించి వేరు కుంప‌టి పెట్ట‌డం అధికారంలోకి వ‌చ్చేయ‌డం జ‌రిగి నెల రోజులు అయింది. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇంత‌టి సంక్షోభం శివ‌సేన ఎప్పుడూ ఎదుర్కొన‌లేదు. జూన్ 30న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. బిజెపి మ‌ద్దతుతో షిండే ముఖ్య‌మంత్రిగా , ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన సంగతి అంద‌రికీ తెలిసిందే. అధికారం చేజిక్కించుకోవ‌డం  అయిపోయింది. కానీ పార్టీ గుర్తు విష‌యంలో గోల ఆరంభ‌మయింది. అస‌లు శివ‌సేన పార్టీ అంటేనే థాక్రే వారిది క‌నుక పార్టీ,  సింబ‌ల్ రెండూ  మాకే చెందుతాయ‌ని ఉద్ధ‌వ్ థాక్రే గొంతు చించు కుంటున్నారు.  కానీ మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌స‌భ ఎంపీలు త‌న వేపు వ‌చ్చేరు గ‌నుక శివ‌సేన మాదే అవుతుంద‌ని షిండే గొడ‌వ పెట్టుకున్నారు. అధికారం పోయి, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, ఎమ్మెల్యేల‌ను కోల్పోయిన  థాక్రేకు శివ‌సేన అస‌లు పార్టీ సింబ‌ల్ ఇవ్వ‌డం న్యాయం కాద‌ని షిండే వాద‌న‌. అందు వ‌ల్ల ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై ఇద్ద‌రూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే  ఇంత‌కు ముందు థాక్రే వ‌ర్గాన్ని ర‌ద్దు చేయాల‌ని, పార్టీ సింబ‌ల్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని  మ‌హా అసెంబ్లీ స్పీక‌ర్ రాహుల్ న‌ర్వేక‌ర్‌ను షిండే కోరారు. కానీ ఆ విష‌యంలో నిర్ణ‌యం అప్పుడే తీసుకోవ‌ద్దంటూ ఇటీవ‌ల  స్పీక‌ర్‌కు  సుప్రీం కోర్టు చెప్పింది.  ఇదిలా ఉండ‌గా, ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు అనేక ప్రాంతీయ సంస్థ‌ల ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ కార‌ణంగా పార్టీ సింబ‌ల్ విష‌యంలో ఇరు వ‌ర్గాలు త్వ‌ర‌ప‌డుతున్నాయి. ఇసి కి పార్టీ పేరు,  గుర్తు విష‌యంలో త‌మ వాద‌న‌లు వినాల‌ని కోరుతూ ఇరువ‌ర్గాలు ఇప్ప‌టికే అభ్య‌ర్ధ‌న‌లు అంద‌జేశారు.