ప్రక్షాళన పేరిట వైసీపీ సిట్టింగులకు జగన్ ఉద్వాసన?
ప్రభుత్వ వ్యతిరేకత, కేసులు, పార్టీలో అసమ్మతి ఏపీ సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే.. ముందుగా ప్రజా వ్యతిరేకత అధికంగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి వారికి స్థాన చలనం కల్పించడమే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు.
అందుకే వచ్చే ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 58 నియోజకవర్గాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే 11 లోక్ సభ నియోజకవర్గాలలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గల్లంతేనని చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాల ద్వారా ఎమ్మేల్యేలను మార్చే నియోజకవర్గాల జాబితా ఒకటి బయటకు వచ్చింది. ఆ జాబితా మేరకు ఉత్తరాంధ్ర నుంచి కురుపం, ఎచ్చర్ల, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎస్. కోట, బొబ్బిలి, గజపతినగరం, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణ, పాయకరావుపేట, నర్సిపట్నం, అరకు వేలీ, గాజువాక, పాడేరు, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా నుంచి జగ్గంపేట, పిఠాపురం, పత్తి పాడు, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నుంచి పాలకొల్లు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల నుంచి సిట్టింగులకు కాకుండా కొత్త వారికి టికెట్లిచ్చి రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
అలాగే విజయవాడ వెస్ట్, కైకలూరు, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, సత్తెనపల్లి, మంగళగిరి, తాడికొండ, తెనాలి, బాపట్న, పొన్నూరు, వేమూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, వెంకటగిరి, గూడూరు, కందుకూరు, మర్కాపురం, కొండెపి, సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం, పూతలపట్టు, శ్రీ కాళహస్తి, పలమనేరు సింగనమల, హిందూపురం, పుట్టపర్తి, అనంతపురం, కల్యాణదుర్గం, కర్నూలు, పత్తి కొండ, నందికొట్కూరు, మైదకూరు, పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సిట్టింగులకు కాకుండా కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇక లోక్ సభ నియోజకవర్గాల సంగతి తీసుకుంటే.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, బాపట్ల, విజయవాడ, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, నర్సాపురం, ఏలూరు లోక్ సభ స్థానాలలో సిట్టింగులకు అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. ఆయా స్థానాలలో కొత్త వారికి పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
వివిధ సర్వే బృందాల నుంచి అందిన నివేదికల ఆధారంగా ఆయా నియోజకవర్గాలలో సిట్టింగులకు 2024 ఎన్నికలో పోటీకి అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇవే కాకుండా రానున్న రోజులలో మరిన్ని నియోజకవర్గాల విషయంలో కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఆయా సిట్టింగుల పని తీరు, వారిపై నెలకొన్న ప్రజావ్యతిరేకత ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.