ప్రజాప్రతినిథులపై కేసుల ఉపసంహరణ జీవోలను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్

అడుసు తొక్కడం.. కాళ్లు కడుక్కున్నట్లు చేయడం వైసీపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. గత మూడేళ్లుగా ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకున్న దాదాపు ప్రతి నిర్ణయానికీ న్యాయస్థానంలో చుక్కెదురైంది. కోర్టు అక్షింతలు వేయడం ప్రభుత్వం వెనక్కు తగ్గడం ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులు ఎత్తివేస్తూ జారీ చేసిన జీవోను కూడా సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించి మరీ రాష్ట్రంలో వైసీపీ ప్రజా ప్రతినిథులపై కేసులను ఉపసంహరిస్తూ జగన్ సర్కార్ మూడు జీవోలను  చేసిన సంగతి తెలిసిందే. అయితే  దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధు లపై కేసులవిచారణను వేగవంతం చేసి సాధ్యమై నంత త్వరగా తీర్పులు ఇవ్వాలనికోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్ ఉపాధ్యాయగతంలో సుప్రీం దాఖలు చేసిన  ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని విస్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు   2020 సెప్టెంబరు 16 నుంచి2021 ఆగస్టు 25 మధ్య రాష్ట్రంలో ప్రజాప్రతినిధు లపైఎన్ని కేసులు ఉపసంహర ణకు జీవోలు ఇచ్చారు తదితర వివరాల్ని పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. అలాగే   జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభా నుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్య క్షుడు చెవులకృష్ణాంజనేయులు హైకోర్టులోదాఖలు చేశారు. మరో వైపు వైకాపాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ఆమోదంతెలపాలని హైకోర్టును కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దాఖలు చేసింది.  సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రజాప్రతినిధులపై కేసులనుఉపసంహరించేందుకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం డేంజర్ జోన్ లో ఉందని హైకోర్టు గత విచారణలో వ్యాఖ్యానించింది. దీంతో సోమవారం హైకోర్టులో ఈ కేసులపై జరిగిన విచారణలో   ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి  ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరణకుగతంలో ఇచ్చిన 3 జీవోలనూ ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చినట్లు  తెలిపారు. ఆ వివరాలను మెమో రూపంలోకోర్టు ముందు ఉంచుతామన్నారు.  కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తామని కోర్టుకు తెలిపారు.  ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను అక్టోబరు13కు వాయిదా వేసింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్ర, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతోకూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకుఆదేశాలు జారీ చేసింది. 

 ఫ్ల‌యిట్‌లో సీటు మార్చారు ఎందుకో తెలుసా?

మొద‌టిసారి మెట్రో రైల్లోనో, విమానంలోనో ప్ర‌యాణించేవారికి త‌లుపులు తెరుచుకోవ‌డం తెలియాలి. క‌నీసం ఎవ‌ర‌న్నాచెబితే తెలుసుకోవాలి. అస‌లు అందుకు ప‌క్క‌నున్న‌వారితో మాట్లాడ్డం తెలియాలి. అంటే భాషాప‌ర‌మైన తేడాలు ఉంటే మాత్రం బ‌హుత్ క‌ష్ట్ హై! ఏది వ‌చ్చినా రాకపోయినా ఈ రోజుల్లో కాస్తంత ఇంగ్లీషు మాత్రం చ‌చ్చిన‌ట్టు వ‌చ్చితీరాలి. లేక‌పోతే అనామ‌కుని చూసిన‌ట్టు చూస్తారు. నువ్వు అరిచి గింజుకున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు.  విమానంలో సీటూ మారుస్తారు. ఇంగ్లీషోడి రూల్‌! ఈరోజుల్లో మ‌న‌వ‌ళ్ల‌ను చూసుకోను పెద్ద‌వాళ్లు ఓపిక తెచ్చుకుని మ‌రీ అవ‌కాయ‌జాడీల‌తో విదేశాల‌కు వెళు తున్నారు. బ‌స్సెక్కినంత సులువే అన్నా..అనుకుంటారు. కానీ అస‌లు స‌మ‌స్య కూచున్న‌త‌ర్వాత నుంచి మొద‌ల‌వుతుంది. మ‌నూరు బ‌స్సు సీట్ల కంటే మంచిసీట్ల‌ని విశ్రాంతి తీసుకోవ‌చ్చు. కానీ హ‌ఠా త్తుగా  ఓ అమ్మాయి వ‌చ్చి వాట్ యూ ఈట్‌? అనో ఆప్ క్యా ఖాతీ? అనో అడుగుతుంది. ఏవంట‌ది అన్నా.. అని ప‌క్కాయ‌న్నోసారి అడిగితే మీ ప‌ని అయిపోయిన‌ట్టే. ప‌క్క‌వాళ్లు చాలా చిరాగ్గా చూస్తారు. ఫ్ల‌యిట్ అటెండ‌ర్ న‌వ్వుతుంది. వెన‌కాల కూచున్నాయ‌న‌తో పెద్ద జోక్‌లా చెప్పి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంది. మ‌నం జోక‌ర్ అవుతాం. అదీ సంగ‌తి. అంచేత రెండు ముక్క‌లు ఇంగ్లీషు, నాలుగు ముక్క‌ లు హిందీ రావాలంటా రు మ‌రి! అన్న‌ట్టు మ‌రో ప్ర‌మాదం కూడా ఉందండోయ్‌. ప‌క్క‌వాళ్ల‌కి  మ‌నం మాట్లా డేది అర్ధంగాక‌పోయినా, ప్ర‌ధాన రెండు భాష‌లు రాక‌పోయినా అమాంతం సీట్లు మార్చేయ‌గ‌లరు. ఆ ప్ర‌మాద‌మూ ఉంది. బ‌స్సులో లా కిటికీ ద‌గ్గ‌ర సీటు దొరికింద‌ని ఆనందించొద్దు. ప‌క్క‌నున్న‌ది మీ వూరు వాళ్ల‌యితే ఫ‌ర‌వాలేదు.. కాక‌పోతేనే పెను ప్ర‌మాదం. అమాంతం మిమ్మ‌ల్ని వెన‌క్కి పంపేస్తారు. మొన్నీమ‌ధ్య‌నే ఇండిగో విమానంలో ఇలాం టి సంఘ‌ట‌నే జ‌రిగింది.  ఓ తెలుగు పెద్దావిడకి తెలుగు త‌ప్ప మ‌రో భాష రాదు. అది ఆమె త‌ప్పు కాదు. కానీ తోటి ప్ర‌యాణీకుడికి, ఫ్ల‌యిట్ అటెండ‌ర్‌కీ ఇబ్బంది క‌లిగింది. ఏది అడిగినా స‌రిగా స‌మాధానం రావ‌డం లేదు. అమెకు తెలుగు త‌ప్ప మ‌రో భాష రాద‌ని అర్ధ‌మ‌యింది. అందువ‌ల్ల ఆమెను వేరే సీట్లోకి మార్చేరు. ఆమె పాపం తెగ కంగారు ప‌డింది. ఇంగ్లీషు, హిందీ రాక‌పోతే దించేస్తారేమోన‌ని! పైగా సెక్యూరిటీ కార‌ణాల వ‌ల్ల ఆమె సీటు మార్చ‌వ‌ల‌సి వ‌చ్చిందని ఫ్ల‌యిట్ అటెండ‌ర్ స‌మాధానం చెప్ప‌డం విడ్డూరం. అస‌లు ఫ్ల‌యిట్‌లో ప‌నిచేసే సిబ్బందికి ప్ర‌యాణీకుల‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న‌ది శిక్ష‌ణ‌లో నేర్పు తారు. భాష‌ల విష‌యంలో ఇత రుల స‌హాయం తీసుకోమంటారు. కానీ పాపం ఆ పెద్దావిడ విష‌ యంలో ఆ ఫ్ల‌యిట్ అటెండ‌ర్ ఆ జాగ్ర‌త్త పాటించ‌లేదేమో! అన్న‌ట్టు మీర‌న్న రెండు ముక్క‌లు ఇంగ్లీషు, హిందీ నేర్చుకోండి ..ఇలాంటి గోల ఉండ‌దు. 

పెగాసన్ పై సభా సంఘం మధ్యంతర నివేదిక.. పెగాసన్ ప్రస్తావన ఏదీ?

పెగాసన్ పై గత అసెబ్లీ సమావేశాలలో నియమించిన సభా సంఘం.. గత ప్రభుత్వం డేటా చోరీ చేసిందని  ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే ఇది ప్రాథమిక నివేదికే అన్న భూమన నేతృత్వంలోని కమిటీ ఇంకా సేకరించాల్సిన సమాచారం ఎంతో ఉందని చెప్పింది.  ఇప్పుడు సభ ముందుంచినది మధ్యంతర నివేదిక మాతరమేనని భూమన కరుణాకరరెడ్డి సభకు తెలిపారు. ఇంతకీ పెగాసన్ సాఫ్ట్ వేర్ దుర్వినయోగంపై ఏర్పాటు చేసిన సభా సంఘం తన మధ్యంతర నివేదికలో ఆసలా విషయాన్నే ప్రస్తావించలేదు. గత   తెలుగుదేశం ప్రభుత్వం డేటా చెరీ చేసిందంటూ పాత పాటనే సభా సంఘం తన నివేదికలో వల్లె వేసింది. డేటా చోరీ పేరుతో  గతంలో వైసీపీ సర్కార్ పేట్టిన కేసులోని వివరాలనే ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం మరోసారి వల్లె వేసింది. అయితే ఆ కేసు ఎప్పుడో వీగిపోయింది.   పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వ్యక్తులపై నిఘా పెట్టారా లేదా అన్న అంశంపై తేల్చేందుకు నియమించిన హౌస్ కమిటీ  తన మధ్యంతర నివేదికలో పెగాసస్ అంశాన్ని కనీసం ప్రస్తావనగా కూడా తీసుకు రాలేదు.  స్టేట్ డేటా సెంటర్లో  ఉండాల్సిన సమాచారాన్ని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు నేరుగా ఆ సమాచారాన్ని చేరవేశారనీ,  తద్వారా వారికి  ప్రత్యేక లబ్ధి చేకూరిందనీ పాత పాటనే మరోసారి వినిపించింది.  ఓటర్ల జాబితా నుంచి 30 లక్షల మంది ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగిందని పేర్కొంంది. గత ప్రభుత్వం సేవామిత్ర యాప్ ను ఇందు కోసం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఓట్ల తొలగింపు ఆరోపణలపై అప్పట్లోనే ఈసీ స్పందించింది. ఎవరు పడితే వారు యాప్‌ల ద్వారా ఓట్లను తొలగిం సాధ్యం కాదని తేల్చేసింది.   అలాగే ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన వ్యక్తిగత డేటా చోరీకి అవకాశం లేదని అప్పట్లో ఆధార్ స్పష్టం చేసింది. ఇప్పుడు భూమన నేతృత్వంలోని సభా సంఘం తన మధ్యంతర నివేదికలో.. పాచిపోయిన ఆ విషయాలనే కొత్తగా కనుగొన్నట్లు పొందుపరిచింది.   రాష్ట్రంలో ఎన్నికల హీట్ ఆరంభమైన నేపథ్యంలో భూమన నేతృత్వంలోని సభా సంఘం మధ్యంతర నివేదిక అంటూ అరకొర సమాచారం అసెంబ్లీ ముందు ఉంచడం   ఆధారాలు బయట పెట్టకుండా   ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి చేకూర్చుకునేందుకేనని తెలుగుదేశం అంటోంది.  

ఢిల్లీ లిక్క‌ర్‌స్కామ్‌.. జోనాట్రావెల్స్ స్పెష‌ల్ ఫ్లైట్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌  కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. లిక్కర్‌ పాలసీ కార్యకలాపాల కోసం స్పెషల్ ఫ్లైట్స్‌ బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. జోనా ట్రావెల్స్ వివరాల ఆధారంగా ఫ్లైట్స్‌ వెళ్లి నట్లు నిర్ధారించారు. జోనా ట్రావెల్స్‌ను రమాసింగ్‌ లీడ్ చేస్తున్నట్లు గుర్తించారు. లిక్క‌ర్ పాల‌సీ కార్య‌ క‌లాపాల కోసం ప్ర‌త్యేక విమానాల‌ను బుక్చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు అందుకు సంబంధించి జోనాట్రావెల్స్వ‌ద్ద స్వాధీనం చేసుకున్న‌ వివరాల ఆధారంగానే ఈ సంగ‌తి బ‌య‌ట‌ ప‌డింది.  పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావా దేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీల పైన శ్రీనివాస్ రావును  ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసా గిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్ప‌టికే అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (సీఏ), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమ వారం ఆరు చోట్ల సోదాలు  నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచా రించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవు తున్నారు. ఈడీ అధికారులు నిన్న సుదీర్ఘంగా 7 గంటలపాటు శ్రీనివాసరావును విచారించి అతని స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన తర్వాత కీలక పత్రాలతోపాటు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకు న్నారు. వివిధ కన్నాల్టెన్సీలు, కంపెనీల్లో సోదాలు చేసి వాటిని సీజ్ చేశారు. మంగళవారం మరికొంత మందికి నోటీసులు జారీ చేయడం, మరికొన్ని కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేసే అవకాశముంది. ఇప్పటివరకు దాదాపు నాలుగుదఫాలుగా 23 బృందాలు.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూ రు లో సోదాలు చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఉన్న కంపెనీలకు.. హైదరాబాద్‌లోని పలు కంపెనీలు, అలాగే శ్రీనివాసరావు కు చెందిన కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగినట్లు నిర్దారించారు. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. పిళ్ళై, శ్రీనివాసరావు మధ్య సంభాషణలను ఈడీ అధికారులు రిట్రైవ్ చేశారు. ఆ ఇద్దరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. కాగా ఈడీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ. 200కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. శ్రీనివాసరావు ద్వారానే కోట్లలో లావాదేవీలు జరిగి నట్లు గుర్తించారు. రూ.200 కోట్ల లావాదేవీలపై శ్రీనివాసరావును అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ టెండ ర్ల కోసం చెల్లించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని తొమ్మిది  లిక్కర్ కంపెనీలతో హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ డబ్బు ఎవరి ఖాతా నుంచి వెళ్లిందనే అంశం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అత్యవసర మందుల జాబితాలో మరో 34 డ్రగ్స్

అత్యవసర మందుల జాబితాలో యాంటి క్యాన్సర్ డ్రగ్స్ ను  ప్రభుత్వం చేర్చింది. బెండా ముస్టీన్ ,హైడ్రో క్లోరైడ్,ఐరి నోటి కాన్ ట్రై హైడ్రేట్ ,లేనా లైడో మైడ్,వంటి మందులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది. ౩4 రకాల అత్యవసర మందులను వివిధ  క్యాటగరీలుగా విభజించారు. అందులో 27 రకాల థెరఫీ కేటగిరీలు క్యాన్సర్ యాంటి బయోటిక్స్,  వ్యాక్సిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అవి అనుబాతులో కొనుగోలు చేసే విధంగా ఉండే వీలు కల్పించినట్లు ఇది క్యాన్సర్ పెరుగుదల ఆధునిక చికిత్సల  మందుల ధర పెరుగుదల నేపథ్యం లో వీటిని అత్యవసర   జాబితాలో చేర్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైద్య వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఇప్పటికే ౩84 రకాల మందులు ఈ అత్యవసర జాబితాలో ఉన్నాయనీ,   అదనంగా మరో 26 మందులను గతంలో ఉన్న జాబితానుండి తొలగించారు. 2౦15 నాటి జాబితాను పునరుద్దరించిన ఈ మందుల ధరలను నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ ఆధారిటీ (ఎన్ఎల్ఇఎం) ధరలను నియంత్రిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 

చిరు పొలిటికల్ ఎంట్రీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓ 10 సెకన్ల ఆడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.   నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం.. నా నుంచి దూరం కాలేదంటూ... చిరంజీవి చెప్పిన ఆడియో ట్విట్.. అ హాట్ టాపిక్  అయిపోయింది. అయితే మెగాస్టార్ చేసిన ఈ ట్విట్‌పై ఓ వైపు మెగా అభిమానులు, మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అంటు కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌లోని డైలాగ్ అంటూ  కామెంట్స్ పెడుతున్నారు.ఏదీ ఏమైనా చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌పై భిన్న అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయన్నది మాత్రం నిజం. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అధినేతలు.. తమ పార్టీల విజయం  కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వేళ.. మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కామెంట్స్... అదీ రాజకీయంపై చేయడం పట్ల రాజకీయ పరిశీలకులు సైతం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి... 2009 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 18 సీట్లు కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టి... కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా జరిగారు.  మరో వైపు  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా థియేటర్ల టికెట్ల ధరలను భారీగా తగ్గించింది.  ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో తాడేపల్లిలో చిరంజీవి భేటీ అయ్యారు. దాంతో చిరంజీవికి మళ్లీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ప్రచారమే జరిగింది. దీంతో చిరంజీవి.. స్వయంగా   మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్విట్టర్‌లో వదిలిన ఆడియో..  ఆయన తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీ వారి భ‌క్తి పిచ్చి

పెద్దాయ‌న‌కు నాగేస్స‌ర్రావంటే ఇష్టం, బ‌బ్లూకి చిరు అంటే వీరాభిమానం, పింకీకి చ‌ర్రీ అంటే..! వీరాభి మానం వింత‌పోక‌డ‌లే పోకూడ‌దు. సినిమాహాల్లో కాయితాలు చింపి ఎగ‌రేయ‌డం, ఫ్లెక్సీల‌కు పాలాభిషేకం చేయ‌డం వ‌ర‌కూ భ‌రించొచ్చు. ఏకంగా గుడిక‌ట్ట‌డంతో పిచ్చి పాకాన‌ప‌డింద‌ని అర్ధం. ఇప్ప‌టికే సినీస్టార్ల‌కు గుడిక‌ట్టి ఇలాంటి పిచ్చిత‌నాన్ని ఎంతో శాతం ప్ర‌ద‌ర్శించారు. గుడిక‌ట్టి ఏం చేస్తార న్నది వేరే విష‌యం. మ‌న‌సులో క‌ట్టాల్సింది బ‌య‌ట‌క‌డితేనే పెద్ద స‌మ‌స్య. ఎందుకంటే ఎగ‌స్పార్టీ వోరు కూల‌దోస్తే మ‌న‌సు విరిగి ఆత్మ‌హ‌త్య‌ల‌దాకా వెళ్ల‌కుండా ఉంటే చాలు. వీరాభిమానం ప్రాణాలు తీసుకునే స్థితి కి దిగ‌జార్చ‌కూడ‌దు. ఇపుడు కొత్త‌గా తెర‌మీద‌కి వ‌చ్చిన గుడిదేవుడు యోగి ఆదిత్యానాథ్‌! రాజ‌కీయాల్లో ఇలాంటి పిచ్చి ఎంత‌వ‌ర‌కూ దారితీస్తుంద‌నేదానికి స‌మాధానం లేదు. పార్టీ నాయ‌కునిగా త‌న‌కు దేవుడిగా భావించే ఆ పార్టీ వీరాభిమాని మ‌హా అయితే వీధిలో వాళ్ల‌చేత ఓటు వేయించి ఆనందిం చొచ్చు. అంత‌కుమించి వీరాభిమానికి ద‌క్కే సంతృప్తి ఉండ‌దు. కానీ గుడి క‌ట్టుకుంటే దేవుణ్ణి చూసిన‌ట్టు రోజూ చూసుకుంటూ, త‌న వీధిలో త‌నతో ఉన్న‌ట్టు భావించుకుని రెండింత‌ల ఉత్సాహంతో పార్టీ విజ‌యా నికి  ప‌ని చేయవ‌చ్చు. ఇలాంటి వారిని పార్టీ నాయ‌కులు పెద్ద‌గా కాద‌న‌రు. వారికి ఇలాంటి పిచ్చాళ్లే బాగా అవ‌స‌రం. వీరివ‌ల్ల ప్ర‌చారం రెండింత‌లు అవుతుంది గ‌దా! అయోధ్యకు చెందిన ప్రభాకరన్‌ మౌర్య అనే వ్యక్తి మాత్రం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌పై ఉన్న అభి మానంతో ఏకంగా గుడినే కట్టించారు. బాణం, విల్లు పట్టుకొని కాషాయ వస్త్రాధారణతో సీఎం యోగి విగ్రహాన్ని గుడిలో ఏర్పాటుచేశారు. రోజూ ఉదయం, సాయంత్రం ఆ విగ్రహానికి పూజలు కూడా చేస్తు న్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంచుతున్నారు. బీజేపీవారికి తెలిసిన దేవుడు రాముడే క‌నుక నాయ‌కుడిని కూడా రాముడిగానే ఊహించుకున్నాడు స‌ద‌రు వీరాభిమాని. దీనికి యోగిగారు ఏమాత్రం అడ్డు చెప్ప‌క‌పోవ‌డ‌మే ఇక్క‌డ త‌లెత్తే ప్ర‌శ్న‌. ముఖ్య‌మంత్రిగారు యోగి అయిన‌ పుడు రాము డిలా విల్లంబు లు, బాణాల‌తో కాషాయి వ‌స్త్రంతో విగ్ర‌హం ఏర్పాటును ఎలా అంగీక‌రిస్తారు. అది పార్టీకి ఎంత‌వ‌ర‌కూ ప‌నికి వ‌స్తుంది. విప‌క్షాలు విరుచుకుప‌డ‌తాయ‌న్న ఆలోచ‌నా రాలేదా? అనే ప్ర‌శ్న‌ల‌కు వీరాభిమాని కోరిక‌కు బొత్తిగా సంబంధం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే అది యోగీని అడిగి మ‌రీ ఏర్ప‌ర‌ చిన‌ది కాద‌ని పార్టీ ఇత‌ర వీరాభిమానుల స‌మాధానం.  అయోధ్యలో రాముడి జన్మభూమికి 25 కి.మీల దూరంలో భరత్‌కుండ్  సమీపంలో ఫైజాబాద్‌- ప్రయాగ్ రాజ్‌ హైవే వద్ద ఈ గుడిని నిర్మించారు.  రాముడికి గుడి క డుతున్న యోగీజీకి  తాము గుడి కట్టామని మౌర్య అన్నారు. యోగీ ప్రజల కోసం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని, అం దుకే  ఆయనకు గుడి నిర్మించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. తనకు ఉద్యోగం లేదని, భూమి లేదని అయినా యూట్యూబ్‌లో భజనలు, భక్తిగీతాలు పోస్టుచేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తు న్నానని తెలిపారు. ఆ డబ్బుతోనే ఈ గుడి నిర్మించానని మౌర్య చెప్పారు.  ఈ త‌ర‌హా భ‌జ‌న‌ప‌రులు, వీర‌భ‌క్తులు, మ‌తం పిచ్చాళ్ల‌తో  బీజేపీ పార్టీ నిండిపోతే మామూలు ఓట‌రుకు గెలిపించాల‌న్న ఆలోచ‌న పోతే మోదీ, షా  ఏం చేస్తారు? ఇప్ప‌టికే బీజేపీ అంటే మ‌త‌పిచ్చితో ముందుకు వెళుతూన్న పార్టీ అని ముద్ర‌ప‌డింది. ఇపుడు ఇలాంటి బ‌క్తాగ్రేస‌రులు పార్టీ ఫాలోయ‌ర్స్‌గా ఉంటే పార్టీ రాజ‌కీయ‌స‌మాలోచ‌న స‌మావేశాల కంటే పురాణ కాల‌క్షేప స‌మావేశాల సంఖ్య పెరిగే అవ‌కాశాలున్నాయి. మ‌రి భ‌క్తి త‌త్వంలో ప‌డితే సామాన్య ఓట‌రు ఎందుకు ఓటు వేస్తాడు? 

కౌన్ బనేగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు ప్రకారం, మరో రెండు రోజులో  అంటే గురువారం (సెప్టెంబర్‌ 22) నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. సెప్టెంబర్‌ 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అవసరం అయితే, అక్టోబర్‌ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్ నిర్వహిస్తారు.అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.   అయితే, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అసలు ఎన్నికంటూ జరుగుతుందా?  ఆ అవసరం ఉంటుందా? అంటే, పార్టీ కీలక నేతలు సహా ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ మనసులో ఏముందో ఎవరికీ తెలియక పోవడంతో, అధ్యక్ష ఎన్నికల వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అయితే, సోనియా గాంధీ ఎట్టి పరిస్థితిలోనూ, పగ్గాలు పరాయి చేతికి ఇవ్వరని, అవసరం అయితే, మళ్ళీ ఆమే బాధ్యతలు చేపట్టినా చేపడతారని అంటున్నారు. నిజానికి, సోనియా గాంధీ విదేయ వర్గం ఇప్పటికే, ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. ఆదలా ఉంటే, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపధ్యంలో,  రాహుల్ గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ బలాన్ని పుంజు కుంటోంది. పార్టీ కీలక నేతలు కొందరు రాహుల్ గాంధీకి, విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు.పీసీసీ తీర్మానాలు చేస్తున్నాయి. అలాగే, రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నికోవాలని సీనియర్ నేతలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వంక  మరో వంక కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతమైన సంస్కరణలు అవసరమంటూ రెండేళ్ళ క్రితం నుంచి డిమాండ్ చేస్తున్న జీ23 గ్రూప్ కు మద్దతు పెరుగుతోంది. పార్టీలో నిర్మాణాత్మక సంస్కరణలు జరగాలని కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిటిషన్ కు ఇంచుమించుగా ఓ వెయ్యి మంది వరకు యువనేతలు మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందా? ఏకగ్రీవం అవుతుందా అనే విషయంలో,పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ వ్యక్తమవుతోంది. అదలా ఉంటే కాంగ్రెస్‌ యంగ్‌ గ్రూప్‌  పిటిషన్ స్వాగతించిన పార్టీ సీనియర్‌ నేత,  తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌’ పోటీకి సై అంటున్నారు. ఆయన  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తమ మనసులోని మాటను ఆమె ముందుంచారు. అందుకు ఆమె కూడా  సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాదు, అంతర్గత ప్రజాసామ్యం అవసరమని,పార్టీకి మేలు చేస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ అన్నిటినీ మించి, పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్దంగా ఉన్నారా? లేదా? అనేది, ఇంకా ఆయన మనసులోని మాటగానే ఉంది. ఇటీవల కన్యాకుమారి నుంచి  భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సమయంలోనూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే విషయంలో తమ మనసులో స్థిరమైన అభిప్రాయం ఉందని చెప్పారు,  కానీ  అదేమిటో మాత్రం బయట పెట్టలేదు. నామినేషన్ల ఘట్టం మొదలైన తర్వత తాను పోటీ చేసేది లేనిది తెలిసి పోతుందని, సస్పెన్స్ ను మరింత పెంచారు.  నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి ఓడిపోయిన నేపధ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మరో మారు అధ్యక్ష పదవి చేపట్టాలనే డిమాండ్ అప్పటి నుంచి వినిపిస్తూనే వుంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారని అంటున్నారు. మరోమారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేరనే ప్రచారం బలంగానే సాగుతోంది. ఇప్పటికీ ఆయన అదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.  అదలా ఉంటే  రాహుల్ గాంధీ చివరి వరకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు వద్దే వద్దనే మాట మీద నిలబడితే, సోనియా విదేయ వర్గం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  ను పోటీకి సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది.  నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగానే, గెహ్లాట్ నామినేషన్ వేస్తారని, అంటున్నారు. అలాగే, రాహుల్ గాంధీ నిర్ణయంతో సంబంధం లేకుండా శశిథరూర్‌ కూడా నామినేషన్ వేస్తారని అంటున్నారు. అయితే చివరకు రాహుల్ గాంధీ, ఓకే అంటే ఇద్దరూ ఉపసంహరించుకునే అవకాశమే ఉందనీ అలాగే  గెహ్లాట్, శశిథరూర్‌లలో ఎవరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనేది కూడా, చివరకు సోనియానే నిర్ణయిస్తారని అంటున్నారు.ఆ అవగాహనతోనే సోనియా గాంధీ, శశిథరూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.నిజంగా అదే జరిగితే, చాంతాడంత రాగం తీసి, అదేదో పాట పడినట్లుగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు, మరో ప్రహసనంగా ముగుస్తుందని అంటున్నారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో మళ్లీ ముసురేసింది. వాతావరణం చల్లబడింది. రానున్న రెండు రోజులూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ నగరంలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకావం ఉందని పేర్కొంది. నగరంలో సాయంత్రం, రాత్రి సమయాలలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  అల్పపీడన ప్రభావంతో మంచిర్యాల, జగిత్యాల, ములుగు, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. 

చౌతాలా ఆహ్వానం.. లైట్ తీసుకున్న‌ కేసీఆర్

తెలంగాణా ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కే.చంద్ర‌శేఖ‌ర్ రావు కేంద్రంలో చ‌క్రం తిప్పాలనే ప్ర‌య‌త్నాలు అడుగ‌డుగునా కుంటుప‌డుతున్నాయి. తాజాగా ఇండియ‌న్ నేష‌న‌ల్ లోక్‌ద‌ళ్‌(ఐఎన్ ఎల్ డి) అధినేత ఓం ప్ర‌కాష్ చౌతాలా కూట‌మిలో చేరేందుకు కేసీఆర్ ఆస‌క్తి చూప‌డం లేదు. హ‌ర్యానాలో ఈ నెల 25న చౌతాలా నేతృత్వంలో స‌మ్మాన్ స‌మారోహ్ నిర్వ‌హించ‌నున్నారు. ములాయంసింగ్ యాద‌వ్‌, టీఎంసీ అధినేత మ‌మ‌తాబెన‌ర్జీ, బీహార్ ముఖ్య‌మంత్రి నీతిస్ కుమార్‌, మాజీ ప్రధాని హెచ్‌డి దేవ‌గౌడ‌, ఎన్‌సిపి నేత శ‌ర‌ద్‌ప‌వార‌, అకాలీద‌ళ్ నేత ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ వంటివారంతా ఈ స‌మావేశంలో పాల్గొన డా నికి సిద్ధ‌మ‌య్యారు.  అయితే ఈ స‌ద‌స్సులో పాల్గొన‌డం వ‌ల్ల త‌న‌కు ప్ర‌త్యేకించి క‌లిగే ప్రయోజ‌నం ఏమీ లేద‌న్న అనుమానం తోనే కేసీఆర్ స‌ద‌స్సుకు డుమ్మా కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు  ప‌రిశీల‌కులు పేర్కొన్నారు. గ‌తంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల్లో క‌లిసిన ఈ నాయ‌కులు త‌న‌కు ప్ర‌త్యేకించి మ‌ద్ద‌తునిచ్చేంత‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌నే లేదు. దేశంలో ప్ర‌తిప‌క్షాల‌న్నీ బీజేపీని వ్య‌తిరేకించి కేంద్రంలో బీజేపీ ప‌ర‌ప‌తిని దెబ్బ‌తీయాల‌న్న ఏకైక ల‌క్ష్యంగా క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. అందుకు అన్ని విప‌క్షాలు ఒక్క‌తాటి పై న‌డ‌వాల్సిన అవ‌స‌రాన్ని వారూ గుర్తించారు. కానీ కార్యాచ‌ర‌ణ‌కు కేసీఆర్‌తో క‌లిసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. దీంతో కేసీఆర్ ఆశ‌లు దెబ్బ‌తిని ఇంటిముఖం ప‌ట్టారు.  ఆ త‌ర్వాత టీఎంసీ నేత మ‌మ‌తా బెన‌ర్జీ దాదాపు అదే సూత్రం మీద స‌మావేశం ఏర్పాటుచేసి అంద‌రం చేతులు క‌లిపి ఒక మాట మీద నిలిచి ముంద‌డుగు వేయాల‌ని ప్ర‌క‌టించారు. కానీ అందులో ఆమె ప్రాధా న్య త‌ను, ఆమె ఆధిప‌త్యాన్ని ప‌సిగ‌ట్టి కేసీఆర్ అందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. తాను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగిన‌పుడు చూప‌ని ఆస‌క్తి హ‌ఠాత్తుగా అదే ప‌థంలో ముందుకు వెళ‌దామంటూ చేతులు క‌ల‌ప మ‌ని అడ‌గ‌డంలో అర్ధంలేద‌ని కేసీఆర్ భావించారు.  ఇక ఇపుడు తాజాగా చౌతాలా అదే రాగాన్ని అందుకున్నారు. మ‌నం ఒక మాట అనుకుంటే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని యుద్ధానికి స‌న్న‌ద్ధం కావ‌చ్చున‌నే ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కానీ గ‌తానుభ‌వం మెండుగా వున్న కేసీఆర్ ఇందుకు విముఖ‌తే ప్ర‌ద‌ర్శించారు. ఐఎన్ ఎల్‌డి కేసీఆర్‌కు ఆహ్వానం పంపింది కానీ కేసీ ఆర్ ఇంకా స‌దస్సుకు వెల్లేదీ లేనిదీ నిర్ణ‌యించ‌లేదు. ఆహ్వానించిన మాట వాస్త‌వమేన‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. అయినా కేసీఆర్ స్వ‌యంగా జాతీయ పార్టీ ఏర్పాటు విష‌యంలో కంక‌ణం క‌ట్టుకున్న ప‌రిస్థితిలో మ‌ళ్లీ తాను వేరే కూట‌మిలో ఎలా చేర‌తార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాల మాట‌. పైగా కేసీ ఆర్ కూడా ఇటీవ‌లి బీహార్ ప‌ర్య‌ట‌న‌లో తాను ఏ కూట‌మిలో చేరే ప్ర‌సక్తి లేద‌ని ప్ర‌క‌టించారు కూడా. ఇపుడు అది కాద‌ని మ‌న‌సు మార్చుకుంటార‌న్న‌ది అనుమాన‌మే.  అయితే చౌతాలా పిలుపు, ఆ స‌మావేశంలో పాల్గొనాలా వ‌ద్దా అన్న‌ది కేసీఆర్ త‌న పార్టీ సీనియ‌ర్ల‌తో సంప్ర దిస్తున్నార‌ని తెలుస్తోంది. నీతిష్‌, శ‌ర‌ద్‌, మ‌మ‌తాబెన‌ర్జీ, దేవెగౌడ త‌దిత‌రుల‌ను గ‌తంలోనే త‌మ నాయ‌కు డు క‌లిశారు గ‌నుక ఇపుడు ప్ర‌త్యేకించి ఆ స‌మావేశానికి వెళ్లి వారితో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం పెద్దగా లేద‌నే అంటున్నారు. 

ఇన్ని డెంగ్యూ కేసులు చ‌రిత్ర‌లో ఎన్న‌డూ న‌మోదుకాలేదు.. అచ్చెన్నాయుడు

ప్ర‌జారోగ్యం గురించి ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోందే గాని వాస్త‌వానికి ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయ‌ని మంగ‌ళ‌వారంనాడు ఏపీ అసెంబ్లీలో ప్ర‌భుత్వం పై టీడీపీ అభ్య‌ర్ధులు విరుచుకు ప‌డ్డారు. ఆరోగ్య‌శాఖ మంత్రి స‌భ‌కు త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నార‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నా యుడు పేర్కొన్నారు. మంత్రి గారు పట్టణ ప్రాంతంలో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగాల గురించి తెలుసా?’ అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం నమోదు అయినన్ని డెంగ్యూ కేసులు చరిత్రలో ఎప్పుడూ నమోదు కాలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.    డెంగ్యూ వ్యాధి వస్తే ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయని.. లోకల్‌గా వైద్యం చేయించుకున్నాక పరిస్థితి విష మించి చాలా మంది చనిపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా ల్యాబ్‌లు పనిచేయడం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో చూపించుకోవాలని అంటున్నారని వాపోయారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పాత బకాయిలు ఇవ్వలేదని వారు వైద్యం చేయడం లేదన్నారు. పేదలకు డెం గ్యూ వస్తే ప్లేట్ లెట్స్ పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విష‌జ్వ‌రాలు ముఖ్యంగా డెంగ్యూవ‌ల్ల ప్ర‌జ‌లు చ‌నిపోతున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామా నాయుడు పేర్కొన్నారు. విష‌జ్వ‌రాల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం పై ఆయ‌న పెద్ద ఎత్తున విరుచుకుప‌డ్డారు. చెత్త‌ప‌న్ను వేస్తున్నారేగాని, చెత్త తీసుకువెళ్ల‌డం లేద‌న్నారు. ఆరోగ్య‌శ్రీ‌లో విష‌జ్వ‌రాలు చేర్చ‌మన‌డం అన్యాయ‌మ‌ని, అది వెంటిలేట‌ర్ మీద‌కు వెళితేనే వ‌ర్తిస్తుంద‌ని అన‌డం దారుణ‌మ‌ని ఆయన ఆగ్రహిచారు. ప్లేట్ లెట్స్ దోరక్కపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నా రని నిమ్మల రామానా యుడు పేర్కొన్నారు. చింతూరు లో సంధ్య అనే అమ్మాయి స్థానికంగా వైద్యం అందక భద్రాచలం లో చనిపో యిందని ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు. 

యాంటి బాయిటిక్స్ తో ముప్పే.. నిపుణుల హెచ్చరిక

మోతాదుకి మించి యాంటి బాయిటిక్స్ వినియోగిస్తే ముప్పు తప్పదు. అయితే భారత్ మాత్రం పరిమితికి మించి యాంటీబయాటిక్స్ ను వినియోగించిందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది.  కోవిడ్ మొదటి, రెండవ దశలలో బారత్ లో మోతాదుకు మించిన యాంటి బాయిటిక్స్,పరిమితిని మించి  మించి మత్తు మందులు వినియోగించి నందువల్లనే స్ట్రోక్స్ వచ్చి చనిపోయరాని, అసలు కోవిడ్ సమయంలో ఏమందులు ఎంత మోతాదులో వాడాలో నియంత్రణ లేకుండా విచ్చల విడిగా స్టెరాయిడ్స్, ఇతర  ఇంజక్షన్లు (రేమిడి సివిర్) ఇష్టా రీతిన వాడినందు వల్లె బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలతో  కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయాన్ని లన్సెట్ తన నివేదికలో పొందుపరిచింది.   అయితే లాన్సేట్ రిపోర్ట్ లో 2౦19 సంవత్సరంలో భారత్ లోని ప్రైవేట్ వైద్యులు 47%యాంటి బాయిటిక్స్ వినియోగించారంటు నివేదికలో పేర్కొనడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య ఎస్ ఎన్ సి ఎం స్టాండింగ్ నేషనల్ కమిటి మేదిసిన్స్ ఉపాధ్యక్షుడు సీనియర్ ఫర్మాకాలజిస్ట్ వై కే గుప్తా లాన్సేట్ నివేదికను తీవ్రంగా ఖండించారు. ఈమేరకు లాన్సేట్ నివేదిక అనంతరం  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూర్ మండవీయ  ఆదేశం మేరకు వై కే గుప్తా వివరణ ఇస్తూ అత్యవసర మందుల జాబితాను తయారు చేసి ఇస్తామని,  ఆయా రాష్ట్రాల నియంత్రణ మండలి డ్రగ్ ఆధారిటీ అనుమతితోనే  ఫార్ములాను వెలువడతాయని పేర్కొన్నారు. లాన్సెట్ నివేదికలో ఆమోదం పొందని ఫార్ములా అన్న పదం వాడారని అంటే దాని ఆర్ధం సి డి ఎస్ సి ఓ కాదని ఈ ఫార్ములాలు ఆయా రాష్ట్రాల డ్రగ్ రెగ్యులేటరీ  అధారిటీ ఆమోదించినవే అని అందుకే, ఈ విషయం లో ఆమోదం పొందని అన్నపదం ప్రయోగించడం  పై వై కే గుప్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ   డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఫార్మా రంగం లో ఉందని తెలిపారు. లాన్సెట్ స్టడీ రిపోర్ట్  చదివిన తరువాత కేంద్ర ఆరోగ్య శాఖ  మంత్రి వివరణ కోరారని గుప్తా తెలిపారు. లాన్సెట్ నివేదికను ఉటంకిస్తూ యాంటి బాయటిక్స్ అతిగా వాడారని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈమేరకు బ్రెజిల్,రష్యా,యురప్ దేశాల తో పోలిస్తే యాంటి బయటిక్స్ వాడకం భారత్ లో తక్కువేనని పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్లో యాంటి బయటిక్స్ వినియోగం లో అగ్రభాగాన నిలిచిందని నివేదికలో పేర్కొనడం సరికాదని గుప్తా వెల్లడించారు. భారత్ లో రోజుకు 1౦౦౦ డోస్ లు వాడితే ప్రపంచవ్యాప్తంగా 1౦.4శాతం ఎక్కువగా వినియోగించారని గుప్తా స్పష్టం చేసారు. కాగా 2౦15 లో 1౩ .6% వినియోగించారని,లాన్సెట్ నివేదిక ప్రకారాం దేశంలో యాంటి బాయిటిక్స్ వినియోగం,నియంత్రణ, అమ్మకాలు నిలువరించాల్సిన అవసరం ఉందని  గుప్తా అభిప్రాయపడ్డారు. యాంటి బయటిక్స్ పై మరిన్ని పరిశోదనలు అవసరమని పేర్కొన్నారు. 2౦19 లో అజితో మైసిన్ విరివిగా వాడారని, యాంటి బాయిటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. మార్కెట్ లో నేడు 1౦% ఫార్ములాలు ఉన్నాయని,  అదనంగా మరో 5౦ % పైగా ఫార్ములాలు ఉండడం వల్ల యాంటి బాయిటిక్స్ వాడినట్లు కనిపిస్తోందని ,అజిత్రో మైసిన్ 5౦౦ ఎంజి ,అమోక్సిలిన్ 5౦౦ ఎం జి,125 ఎం జి సిసిక్షిన్ 2౦౦ ఎం జి విరివిగా వాడారనివాటి పై అవగాహన కల్పించాలని గుప్తా అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మార్కెట్ లో ప్రైవేట్ రంగం అమ్మకాల సమాచారం మాత్రమే అని ఇంకా పూర్తి వివరణాత్మక సమాచారం కావాలాని గుప్తా విజ్ఞప్తి చేసారు. రోగుల సంరక్షణ వారికి వైద్యులు ఎలాంటి ప్రిస్కేఫ్షణ్ లో ఎలాంటి యాంటి బాయిటిక్స్ వాడారు అన్న సమాచారం. మైక్రో బయాలాజికల్ టెస్ట్ లు యాంటి బాయిటిక్స్ వినియోగం  వంటి నిశితంగా పరిశీలించాల్సి ఉందని ప్రిస్కిప్షన్ సూక్ష్మం గా పరిశీలించడం అసాధ్యమని ఆయాత్యవసర సమయాలాలో ఎలావినియోగించారన్నది అంచనా అసాధ్య్యమని గుప్తా వివరించారు. ఫర్మా ట్రాక్ స్యంపుల్ కవర్స్, స్టాకిస్టులు 6౦% మంది మాత్రమే ఉన్నారని.ప్రైవేట్ రంగంలో ఫర్మా అమ్మకాలపై లక్ష్యంగా చేసుకుని నివేదిక చేసినట్లు ఉందని గుప్తా విమర్శించారు. ప్రభుత్వ శాఖాలలో మందుల ప్రోక్యుర్మేంట్ జాతీయ,లేదా అయారాస్త్రాల స్థాయలో నిర్ణయించిన లిస్ట్ మేరకు మందులు మాత్రమే అని వివరించారు. యాంటి బయటిక్స్ వినియోగం పై అవగాహన అవసరమని ప్రస్తుతం యాంటి బాయిటిక్స్ ప్రభావం ఉందని కొత్త యాంటి బాయిటిక్స్ వాడే అధికారం ఉందని తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉంటె కోవిడ్ సమయం లో లేదా యురిన్ ఇన్ఫెక్షన్ సమయం లో గనక యాంటి బాయిటిక్స్ వినియోగించడం పై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతాదుకు మించి యాంటి బయటిక్స్ వాడడం వల్ల శరీరంలో అత్యవర సమయంలో యాంటి బయటిక్స్ పనిచేయవని. శరీరంలో మెటాబాలిజం దెబ్బతిని   హార్మోన్ సంబంధిత ఇతర సమస్యలు వస్తాయని,  మన శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోతుందని చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని. యాంటి బడీలు ఇమ్యునిటి వ్యవస్థ పై  తీవ్ర ప్రభావం చూపిస్తుందని  నిపుణులు పేర్కొన్నారు కాగా శరీర తత్వాన్ని బట్టి మాత్రమే యాంటి బాయిటిక్స్ మోతాదును డాక్టర్ సలహామేరకు వాదాలె తప్ప మరేఇతర సమాచారం  ఆధారంగా యాంటి బాయిటిక్స్ వాడరాదని సూచించారు.        

కాంగ్రెస్ అధ్య‌క్ష రేసులో శ‌శిథ‌రూర్‌, గెహ్లాట్

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుని ఎంపిక వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నుంది. పార్టీ యువ‌నేత రాహుల్ గాంధీ పార్టీ ఉన్న‌త ప‌ద‌విని ఆశించ‌డం లేదు. అయినా పార్టీ సీనియ‌ర్లు, దేశంలో కాంగ్రెస్ పార్టీ వివిద స్థాయి నాయ‌కులు రాహుల్‌నే కోరుకుంటున్నారు. కానీ రాహుల్ మాత్రం అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేష‌న్ల ప్ర‌క్రియ మ‌రో మూడురోజుల్లో ఆరంభం కానుంది. ఈ   ప‌రిస్థితుల్లో ఆ ప‌ద‌వి కోసం పార్టీ సీని యర్లు కొంద‌రు ఆశ‌ప‌డ‌టం గ‌మ‌నిస్తున్నాం. తాజాగా తెర‌మీద‌కు శ‌శిథ‌రూర్‌, అశోక్ గెహ్లాట్ వ‌చ్చారు. వీరిద్ద‌రికి ఆ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు ఏ మేర‌కు ఉన్నాయ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.  కేంద్ర‌మాజీ మంత్రి శ‌శిథ‌రూర్‌ గ‌త పాతికేళ్లుగా సోనియా గాంధీ లేదా రాహుల్ వెంట ఉన్నారు. ఆయ‌న ఇపుడు పార్టీ ఉన్న‌త‌ప‌ద‌వికి అర్హుడ‌న‌ని భావించి ముందుకు వ‌చ్చారు. కాంగ్రెస్ జి-23 లో కీల‌క స‌భ్యుడు. పార్టీ నాయ‌క‌త్వం  లోపంతో పార్టీ ప్ర‌తిష్ట దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆ ప‌ద‌విని వీలువెంట భ‌ర్తీ చేయ‌న‌వ‌స‌రం ఎంతో ఉంద‌ని మొద‌ట‌గా హెచ్చ‌రించింది ఆయ‌నేన‌ని అంటారు. 2020 నుంచి కూడా పార్టీ ప‌టిష్ట‌తా లోపాన్ని గురించి సోనియాగాంధీకి ఏదో ఒక స‌మ‌యంలో  చెబుతూవ‌చ్చారు. సోనియా ఆరోగ్య స‌మ‌స్య‌తో విదేశాల‌కు వెళ్లి తిరిగి రాగానే సోమ‌వారం ఆమెను క‌లిసిన‌పుడు పార్టీ ప‌ద‌వికి పోటీ చేయడానికి ఆమె నుంచి స‌మ్మ‌తి కూడా థారూర్ పొందారు.  కానీ ఆ త‌ర్వాత  రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి  అశోక్ గెహ్లాట్ కూడా పోటీలో ఉన్నార‌న్న‌ది బ‌య‌ట‌ప‌డ‌డంతో ఎన్నిక అంత సుల‌భంగా తేలే వ్య‌వ‌హారంగా లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌యింది.  గాంధీ కుటుంబానికి ఎంతో స‌న్ని హితునిగ పేరున్న గెహ్లాట్ మొద‌ట నుంచీ రాహుల్ కే మ‌ద్ద‌తునిస్తూ వ‌చ్చారు. కానీ ధారూర్ పోటీ చేస్తున్నా ర‌న్న‌ది ఆయ‌న‌కు మింగుడు ప‌డ‌టం లేదు. అందుకే గెహ్లాట్ కూడా బ‌రిలోకి దిగాల‌నే అనుకు న్నారు. అయితే ఇలాంటి పోటీల గోల‌ని విన‌డం ఇష్టంలేని మేడ‌మ్‌గారు ఎవ‌రు పోటీ చేయాల‌నుకున్నా ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేద‌ని జ‌నాంతికంగా అనేశారు. కానీ దాని సారాంశం అదికాదు, పోటీ చేయ‌డానికి ఎవ‌రి ఆదేశం అవ‌స‌రం లేద‌ని, ఎవ‌రు రాహుల్ జీ కంటే గొప్ప అర్హుల‌ని భావించుకుంటే వారు పోటీ చేయ‌వ‌చ్చ ని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ ర‌మేష్ మ‌రింత స్ప‌ష్టం చేశారు.  మ‌రో మూడురోజుల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ ఆరంభ‌మ‌వుతుంది. గ‌తేడాది పార్టీ లో సీనియ‌ర్లు, కీల‌క స‌భ్యు లు బ‌య‌టికి వెళిపోవ‌డంతో పార్టీ  ఉన్న‌త ప‌ద‌వికి ఎన్నిక జ‌రుగుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియ‌ర్ మోస్ట్ గులాంన‌బీ అజాద్ వెళిపోవ‌డం ఎన్నిక ప్రాధాన్య‌త సంత‌రించుకుంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌విని 19 ఏళ్ల‌పాటు చేప‌ట్టిన సోనియాగాంధీ 2017లో త‌న కుమారుడు రాహుల్ గాంధీని ఆ స్థానంలో పెట్టారు. అది తాత్కాలిక‌మే, 2019లో ఆయ‌న దాన్ని వ‌దులుకున్నారు. ముఖ్యంగా పార్టీ ఓట‌మికి బాద్య‌త‌వ‌హిస్తూ ఆయ‌న పార్టీ ఉన్న‌త‌ప‌ద‌విని తాను ఆశించ‌డంలేద‌నే ప్ర‌క‌టించారు. దీనికి తోడు పార్టీ నాయ‌క‌త్వం, ఆదేశాలు ప‌టిష్టంగా లేక‌పోవ‌డంతో పార్టీ ఆ త‌ర్వాత రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనూ వెనుక‌బ‌డింది.  ప‌రిస్థితుల‌ను చేజార‌నీయ‌కుండా చేయ‌డానికి,  పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి, పార్టీ అభిమానులు, ఓట‌ర్ల ను మ‌రింత‌గా ఆక‌ట్టుకుని ప‌టిష్ట‌ప‌రిచేం దుకు రాహుల్ భార‌త్ జోడో యాత్ర‌ను ఆరంభించారు.  పార్టీని దేశ‌వ్యాప్తంగా ప‌టిష్ట‌ప‌ర‌చ‌డంలో త‌ల‌మున‌క‌లై పార్టీకోస‌మే జీవించాల‌న్న ఆశ‌తో ముంద‌డుగు వేస్తున్న రాహుల్ పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి తిరిగి రాన‌ని భీష్మించారు. ఈ త‌రుణంలోనే గెహ్లాట్ వంటి సీనియ‌ర్లు మ‌ళ్లీ రాహుల్ పై ఒత్తిడి తెచ్చారు. ఆయ‌నే పార్టీ అధ్య‌క్షునిగా ఉంటార‌ని ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా పార్టీ సీనియ‌ర్లు, ఆయ‌న వీరాభిమానులు  ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్ పార్టీలో ఈ త‌ర‌హా ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌న్న త‌లంపుతో మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వంలోని  తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఇంత‌టితో కాంగ్రెస్ ప‌ని అయిపో యిం ద‌ని బాహాటంగానే ప్ర‌క‌టిస్తూ కాంగ్రెస్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూనే ఉన్నా రు. ఈ ప‌రిస్థితుల్లో శ‌శిథ‌రూర్‌గాని, అశోక్ గెహ్లాట్ గానీ కాంగ్రెస్ ను ఓట‌ములు, అవ‌మానాల తీరం దాటిస్తార‌న్న‌ది అనుమాన‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం, గాంధీ కుటుంబం అంటే కాంగ్రెస్ అన్న సిద్ధాంతంలో ముంద‌డుగు వేసిన కాంగ్రెస్ నాయ‌కులు, వీరాభిమానులు ఇపుడు బ‌య‌టి వారి నాయ‌క‌త్వాన్ని ఏమాత్రం అంగీక‌రించి, అదే ఉత్సాహంతో పార్టీ విజ‌యాల‌కు తోడ్ప‌డ‌తార‌న్నది చూడాలి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కాకుంటే ప్రియాంకా వ‌ర్దాలే పార్టీకి కావ‌ల‌సిన ప‌రిస్థితుల్లో కేవ లం ఎంపీగా, సోనియా మెచ్చుకున్న పార్టీ వ్య‌క్తులుగా శ‌శిథ‌రూర్‌, గెహ్లాట్‌లు పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అంతే బ‌రువు బాధ్య‌త‌ల‌తో చేప‌ట్ట‌గ‌ల‌గ‌టం మీద అనుమానాలే వ్య‌క్తం అవుతున్నాయి. రాష్ట్రాల స్థాయిల్లో  పార్టీ బాధ్య‌త‌లు, పార్టీకోసం పాటుప‌డ‌టం వేరు ఏకంగా దేశం మొత్తం మీద పార్టీ వ్య‌వ‌హారాల‌ను అధీనంలో పెట్టుకుని పార్టీ వ‌ర్గాల‌ను ఎన్నిక‌ల్లో క‌దం తొక్కించ‌డం అనేవి చిన్న విష‌యాలు కావు. అందుకు వేరే ప్రాంతాల‌వారి అభీష్టం తెలియాలి. థారూర్‌, గెహ్లాట్‌ను దేశం యావ‌త్ కాంగ్రెస్ నాయ‌కులు, అభిమానులు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌తారు, ఏమాత్రం అంగీక‌రించి తోడుంటామ‌న్న‌దీ అనుమాన‌మే. క‌నుక  బతిమాలో, బామాలో రాహుల్‌నే ఇంటికి రారా నాయ‌నా అని కాళ్లు క‌డిగి అంతా వెన్నుద‌న్నుగా ఉంటామ ని ధైర్యం పాఠాలు చెప్పి పీఠం ఎక్కించ‌డ‌మే మేలు అని ప‌రిశీల‌కుల మాట‌. 

జగన్ నియోజకవర్గ సమీక్షలకు మంగళం.. ఎందుకో తెలుసా?

రాజుగారికి వేగులు ఎలాగో రాజకీయ పార్టీకి క్యాడర్ అలగ..ఇది ఏపీ సీఎం జగన్ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. రాజుగారి వేగులు రాజ్యంలో ప్రజలేమనుకుంటున్నారన్నది రహస్యంగా సమాచారం సేకరించి రాజుగారికి చేరవేస్తారు. ఆ చేరవేసే సమాచారం అంతా రాజుగారి చెవులకు, మనసుకు హాయి కలిగించేదిలాగే ఉండాలన్నది అలిఖిత షరతు. ఎవ్వరూ ఆ సంగతిని వేగులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకి అలా తెలిసిపోతుందంతే. ఏదో సినిమాలో నటి అంజలి మాటమాటికీ ‘ఏమో నాకన్నీ తెలిసిపోతాయంతే’ అంటుంటుంది. అలా ప్రత్యకమైన హేతుబద్ధమైన కారణం ఏమీ లేకుండానే రాజుగారి వేగులకు రాజుగారికి ఏం చెబితే నచ్చుతుందో అలా తెలిసిపోతుందంతే. అలా తెలియని వేగులకు ఎలాగూ సమస్యలు తప్పవు. తల కోటగుమ్మానికైనా వేలాడొచ్చు. వేగు కొలువు ఊడిపోయినా ఊడిపోవచ్చు. జగన్ విషయంలో కూడా అంతే తమ పార్టీ అధినేతకు ఏం చెబితే రుచిస్తుందో ఆయన పార్టీ క్యాడర్ కు తెలుసు. ఏమో వారికి అలా తెలిసిపోయిందంతే. కానీ అదే క్యాడర్ లో అలాంటి లోకజ్ణానం లేని వారు కూడా ఉన్నారు. వారు అధినేత ముందు సమస్యలు ఏకరవు పెట్టారు. అభివృద్ధి, చేసిన పనులకు బిల్లులు, ఆగిపోయిన పెన్షన్లు అంటూ కొండవీటి చాంతాడంత జాబితాను జగన్ ముందు ఉంచారు. ఎలా అంటారా? తనకు అవసరమైతే తప్ప మంత్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్ పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కలిశారు అన్న అనుమానం కలుగుతోంది. జగన్ ను కలిసిన వారు ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన క్యాడరే. వాళ్లని కూడా అనేక వడపోతల తరువాత.. వారంతా జగన్ కు పరమ భక్తులని నిర్ణయించుకున్న తరువాత వారిని జగన్ ముందు ప్రవేశ పెట్టారు.  అయితే వందిమాగధుల ఊహలు తల్లకిందులయ్యాయి. అంతటి భక్తులూ అధినేత ముందు సమస్యల చిట్టా విప్పేశారు. పార్టీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అధినేతకు నివేదించారు. అసలు విషయమేమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ సమీక్షలకు ఉపక్రమించారు. ముందుగా ఆయన కుప్పం, రాజాం నియోజకవర్గాల క్యాడర్ తో భేటీ కావాలని అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేసి మరీ పిలిపించారు. వరుసగా రెండు రోజుల పాటు రోజు కో నియోజకవర్గం చొప్పున జగన్ సమీక్షించారు. అంతే అక్కడితో నియోజకవర్గ సమీక్షలను జగన్ బంద్ చేశారు. నియోజకవర్గ సమీక్షలు, క్యాడర్ తో సమావేశాలు అంటేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎందుకు అలా అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. పరిశీలకుల కథనం ప్రకారం జగన్ అభిమానులు టుది కోర్ అనుకున్న 50 మంది పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి మరీ నియోజకవర్గ సమీక్షల కోసం పిలిపిస్తే.. జగన్ ముందు వారు హాజరు ప్రభో అనడానికి ముందే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల అంశాలు తప్ప ప్రతికూల అంశాలు ఏ మాత్రం ప్రస్తావించవద్దని విస్పష్ట ఆదేశాలు ఇస్తే.. వారు మాత్రం జగన్ ముందు సమస్యలనే ఏకరవు పెట్టారట. బిల్లులు, పథకాలలో కోతలు, రోడ్లపై గుంతలు, అడుగంటిన అభివృద్ధి అంటూ ఓ పేద్ద జాబితాను జగన్ ముందు ఇచ్చారు. కుప్పం క్యాడర్, రాజాం క్యాడర్ కూడా కూడబలుక్కున్నట్లు ఇవే విషయాలు ప్రస్తావించడంతో జగన్ ఇక క్యాడర్ తో కలిసే ప్రశక్తే లేదని ఖరాఖండిగా నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జగన్ నియోజకవర్గాల సమీక్ష రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక నియోజకవర్గాన్ని కాపాడుకుని, అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యతను ఉన్న చోట ఎమ్మెల్యేలకూ లేని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జీలకు అప్పగించేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి కొండలా పేరుకు పోతోంది. ఈ పరిస్థితిపై పార్టీ క్షత్రస్థాయి క్యాడర్ లో ఆందోళన పెరుగుతోంది. జగన్ ఇప్పటికైనా పట్టించుకుని క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున పని చేయడానికి క్యాడర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుడివాడ నుంచి పోటీ చేస్తా.. నానిని ఓడిస్తా.. తెలుగువన్ ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసి కొడాలినానిని ఓడిస్తానని రేణుకా చౌదరి అన్నారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన రేణుకా చౌదరి   ప్రస్తుతం అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో పాల్గొని రైతుల ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్ గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పని? అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి వ్యాఖ్యలపై రేణుక ఘాటుగా స్పందించారు.   తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేణుక  కొడాలి నాని లారీలు కడుక్కునే సమయంలోనే తాను కార్పొరేటర్ ని అని రేణుకా చౌదరి అన్నారు. "బుజ్జీ నీకు చరిత్ర తెలియదు... రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఫోన్ లో గూగుల్ కొట్టు. రేణుకా చౌదరి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నువ్వు మాజీ మినిస్టర్ కదా. నువ్వు ఏదో పదవి కోసం అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చావ్. చాలా థ్యాంక్స్ అన్నారు. కొడాలి నాని ఎంత అమాయకుడు కాకపోతే... ఏపీ అసెంబ్లీలో నా పేరు తీసుకొచ్చి... నాకు బొచ్చెడు పబ్లిసిటీ తీసుకొచ్చారనీ, ఇంతటి పబ్లిసిటీ  ఎంత ఖర్చు పెట్టినా రాదనీ, కానీ నాని వల్ల నాకు పబ్లిసిటీ ఫ్రీగా వచ్చింది. అయితే కొడాలి నాని నియోజకవర్గం నుంచే తాను అసెంబ్లీకి పోటీ చేస్తాను, గెలుస్తానని రేణుకా చౌదరి  అన్నారు. తాను గుడివాడ నుంచి  పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను గుడివాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని చెప్పిన రేణుకా చౌదరి, కొడాలినానిని మళ్లీ ఎన్నుకోవడానికి గుడివాడ ప్రజలు సిద్ధంగా లేరని రేణుక అన్నారు.నా   చరిత్ర, ఛరిష్మా, నా పోరాట తత్వం ఇవే తనను గెలిపిస్తాయని రేణుకా చౌదరి అన్నారు.  

అయ్యో...ఆమె గొర్రెల‌కాప‌రి అనుకునేరు!

ఆరోగ్యం కోసం, ఉల్లాసంగా ఉండేందుకు ఇటీవ‌లికాలంలో వ‌య‌సుతో నిమిత్తంలేకుండా జాగింగ్ ప‌ట్ల అంతా ఆక‌ర్షితుల‌య్యారు. గ్రామాల్లో ఉండేవారికి ఇబ్బంది లేదు. ప‌ట్ట‌ణాల్లో,పెద్ద పెద్ద న‌గ‌రాల్లో ఉండే వారే జాగింగ్ ట్రాక్ ఉన్న‌పార్కుల‌నే ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంది. ఒక‌రిని అనుస‌రించి చాలామంది జాగింగ్ ట్రాక్స్ పిచ్చిలో ప‌డుతున్నారు. కానీ అంతే వేగంగా చేయాల‌నేమీ లేదు. ఎవ‌రికి వీలుగా వారు చేయాల‌నే అంటున్నారు డాక్ట‌ర్లు కూడా. అయితే గ్రామాల్లో ప‌రుగులు తీసేవారు, జాగింగ్ పేరుతో పొలాల్లో తిరిగే వారు మాత్రం ర‌వ్వంత జాగ్ర‌త్త‌గానే ఉండాలి. గేదెలో, మేక‌లో, కుక్క‌లో వెంట‌ప‌డినా ప‌డ‌వ‌చ్చు.   ఫ్రాన్స్‌లో ఒక గ్రామంలో ఒకామె జాగింగ్ పేరుతో అలా తిరిగివ‌ద్దామ‌ని అనుకుంది. చాలాదూరం వెళ్లింది. కొంత‌సేప‌య్యాక చూస్తే ఆమె దాదాపు అట‌వీప్రాంతంలోకి వెళ్లింది. చెట్లు, చ‌ల్ల‌టిగాలి ఎంతో హాయిగా ఉంద‌ని ఓ క్ష‌ణం ఆగింది. చుట్టూ చూసింది. ఒక్క‌సారిగా భ‌య‌ప‌డింది. కార‌ణం ఆమె వెనుక గొర్రెల మంద ఉంది. ఆమె క‌దిలిగే అవీ క‌దులుతున్నాయి. అవి త‌న‌ని ఫాలో అవుతున్నాయ‌ని అప్ప‌టికి గాని ఆమె గ్ర‌హించ‌లేక‌పోయింది. ఆ గొర్రెల కాప‌రి ఎటు వెళ్లాడో తెలీదు, ఇవి మాత్రం ఆమెను త‌మ కాప‌రి అనుకు న్నాయో ఏమోగాని ఆమె వెంట‌ప‌డ్డాయి. ఆమేమీ ఎర్ర‌టి దుస్తుల్లో లేదు, పోనీ వెంటాడ‌టానికి. కొద్దిగా భ‌య ప‌డి ఆగిపోయింది. చెట్టుకింద క్ష‌ణం కూచుని మెల్ల‌గా బ‌య‌లుదేరింది.  కొంత‌దూరం వెళ్లే స‌రికి వాటిలో కొన్ని మ‌ళ్లీ ఆమె వెన‌కే వ‌స్తుండ‌డం గ‌మ‌నించింది. ఈసారి నిజంగానే ఆమె ఆగిపోయి అవి ఎవ‌రివో తెలుసుకోవాల‌నుకుంది. ఓర్నాయ‌నో ఇవ‌న్నీ త‌న ఇంటిదాకా వ‌స్తే ఏం కావా లి? అనుకుంది. ఎవ‌రో క‌నిపిస్తే పిలిచింది. కానీ ఎవ‌రూ ఆమె పిలుపు ప‌ట్టించుకోలేదు. కానీ ఒక వ్య‌క్తి మాత్రం ఆమె వెంట గొర్రెలు ఫాలో అవ‌డం మాత్రం వీడియో తీసి త‌ర్వాత నెట్‌లో పెట్టాడు. ఇపుడు దానికి వేల‌ల్లో అభిమానులు త‌యార‌య్యారు. ఇదో పెద్ద కామెడీ సీన్ అని పేరు పెట్టుకున్నారు. చూడ్డా నికి అదేదో సినిమాలో మోడ‌ర్న్డ్ర‌స్ వేసుకున్న హీరోయిన్ వెంట కుక్క‌లు ప‌డిన‌ట్టు వీక్ష‌కుల‌కు అనిపించింది. కాల‌క్షేపానికి వారికి బాగానే దొరికింద‌నుకున్నారు. కానీ ఆమె మాత్రం భ‌యంతో ఒణికి పోయింది. వాటి య‌జ‌మాని వ‌చ్చి త‌న‌ను తిడ‌తాడేమోన‌ని, ఎందుకంటే అవి త‌న‌నే అనుస‌రిస్తు న్నా యి మ‌రి. ఆమె వాటిని మందుపెట్టి త‌న వెంట తీసుకువ‌చ్చాన‌ని అనుకుంటే పెద్ద కేసే అవుతుంది క‌దా!  మొత్తానికి తేలిందేమంటే, ఆ గొర్రెల మంద అట‌వీప్రాంతంలో త‌ప్పిపోయాయి. ఆమెను చూసి గ్రామం లోకి వెళ్లే త‌మ య‌జ‌మాని అనుకున్నాయి. ఆమె వెళుతోంటే వెంట‌ప‌డింది ఆ మంద‌!

కాంగ్రెస్ కబ్జాకు రేవంత్ స్కెచ్..

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సంగతి చెప్పననక్కర లేదు. అసలే అనారోగ్యం, ఆ పైన కన్నతల్లిని కోల్పయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రియాంక, ఇక్కడో కాలు, అక్కడో  కాలు అన్నట్లుగా ఎక్కడెక్కడి పనులో చక్కపెట్టుకోవడంలో చాలా చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడున్నారో, అసలు దేశంలో ఉన్నారో లేదో ఏమో కానీ, చాలా కాలంగా రాబర్ట్ వాద్రాకు సంబందించిన వార్తలు ఎక్కడా వినిపించడం లేదు. కనిపించడం లేదు. నిజం ఏమిటో కానీ, ఆయన కూడా పీకల్లోతు కష్టాల్లోనే ఉన్నారని కొందరు అంటుంటే, అందుకే ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారని ఇంకొందరు  అంటున్నారు. ఇలా కాంగ్రెస్ కీలక నేతలు ఎవరు అందుబాటులో లేక పోవడం వలనో, ఏమో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా ప్రయాణం సాగిస్తోందని, పార్టీలో మిగిలిన పెద్దలు, పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉన్నారు.  అదలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ‘ఓనర్ షిప్’ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పుట్టెడు ఆశలతో పార్టీలో చేరారు. పార్టీలో చేరడం ఏమిటి మూడేళ్లు తిరక్కుండానే, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్లను పడగొట్టి మరీ పీసీసీ పీఠం దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డితో సన్నిహిత పరిచయం ఉన్న ఎవరైనా, ఆయనకు ముఖ్యమంత్రి కుర్చీ మీద మక్కువ ఎక్కువని అంటారు. ఆఫ్కోర్స్, రాజకీయ నాయకులు అందరికీ పదవీ కాంక్ష ఉండడం సహజం కానీ,  రేవంత్ రెడ్డికి, అది ఇంకొంచెం ఎక్కువని అంటారు. అందరిలా ఆయన ఏ మంత్రి పదవితోనో సంతృప్తి చెందే రకం కాదని, ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఆయన లక్ష్యమని అంటారు. అందుకే ఆయన అన్ని పార్టీలు తిరిగి చివరకు కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కుర్చీ టార్గెట్ గా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకులను సాగనంపి, పార్టీని కబ్జాచేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని కొందరు సీనియర్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ పార్టీ సీనియర్లు అసంతృప్తితో రగిలి పోతూనే ఉన్నారు. అది అనేక మార్లు బహిర్గతం అవుతూనే ఉంది. పార్టీ అధిష్టానం దృష్టికీ వెళ్ళింది. ఒకటి రెండు పర్యాయాలు రాహుల్ గాంధీ నేతలందరినీ ఢిల్లీకి పిలిపించి రేవంత్, సీనియర్ నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ప్రియాంకా వాద్రా కుడా జోక్యం చేసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పిలిపించుకుని, ‘పరిస్థితి’ చర్చించారు.  మరోవంక రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీనియర్లతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నా, సీనియర్లను సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగానే వినిపిస్తున్నాయి.కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జగ్గా రెడ్డి, వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్ వంటి కొందరు సీనియర్లు  బహిరంగంగా బయట పడితే, ఇంకొందరు సైలెంట్ గా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.  నిజానికి, రేవంత్ రెడ్డి మునుగోడుకు ముందు నుంచి కుడా, సీనియర్లను పొమ్మనకుండా పొగబెట్టి పంపించే ప్రయత్నాలు సాగిస్తున్నారని,. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ మద్దతు ఇస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన సమయంలో, మర్యాద పూర్వకంగా యశ్వంత్ సిన్హాను కలిసిన పార్టీ సీనియర్ నాయకుడు  వీహెచ్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద వాలడానికి వీలులేదని, పీసీసీ చీఫ్ హుకుం జారీ చేశారు. అంతే కాదు, ఎవరైనా,తాను గీసిన గీత దాటితే, బండ కేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాకుండా  పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి. గీతదాటితే మాత్రం ఎంతటి వారినైనా ఉపెక్షించేంది లేదని సీనియర్ల  కు డైరెక్ట్ గానే  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక ఎపిసోడ్ మొదలైన తర్వాత, రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ మరి  కొందరు  నాయకులు చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డిని ఉద్దేశించి దయాకర్   బహిరంగ సభ వేదికగా చేసిన.  బూతు   వ్యాఖ్యలు, అలాగే రేవంత్ రెడ్డి సీనియర్లను, హోంగార్డ్స్ అంటూ చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి, సీనియర్ల మధ్య దురాన్ని మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి చాల సీరియస్ అయ్యారు. అంతే కాకుండా, విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే ప్రియాంకా వాద్రా  రేవంత్ రెడ్డికి అక్షింతలు వేశారని, అందుకే రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారని అంటున్నారు.  అలాగే, రేవంత్ రెడ్డితో చేతులు కలిపి సీనియర్ల మాటకు విలువ లేకుండా చేస్తున్నారని ఆరోపణలు ఎదురుకుంటున్న  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మాణిక్యం ఠాగూర్‌ కు కూడా ప్రియాంక తలంటు పోశారని, పార్టీ సీనియర్ నాయకుడు  మాజీ ఎంపీ మధు యాష్కి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  అయితే, అదెలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్ నాయకుల అడ్డు తొలిగించుకుని, పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారని అంటున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు ఉప ఎన్నిక విషయంలో సీనియర్ నాయకులను ఇరికించే విధంగా వ్యూహ రచన చేస్తున్నారని అంటున్నారు. మునుగోడు ఆటలో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచినా ఓడినా, ఆటలో తమదే పై చేయి అయ్యేలా, రేవంత్ పావులు కదుపుతున్నారని  అంటున్నారు. అదలా ఉంటే, ప్రియాంక ఎంట్రీతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్లు కూడా వ్యూహాత్మకంగా పవువులు కదుపుతున్నారని అంటున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి కేరళలో  భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి వచ్చారని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై సర్వాధికారాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది నిజమే అయినా, కాంగ్రెస్ సీనియర్లు, ఆయన ఆటలు ఎంతవరకు సాగానిస్తారనేది చూడవలసి ఉందని విశ్లేషకులు అంటున్నారు. అదలా ఉంటే రేవంత్ కు రాహుల్ అండదండలుంటే. సీనియర్లకు ప్రియాంక మద్దతు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడు ఉపఎన్నిక ఫలితంపైనే రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని సీయర్లు కొందరు ముక్తాయింపు నిస్తున్నారు.

రైతుల దీక్ష‌కు వెళ్ల‌కుండా టీడీపీ, సీపీఐ, సీపీఎం నాయకుల అరెస్టు

లేపాక్షి భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం సోమవారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, ప్రజా సంఘాల నాయకులను ఎక్కడిక క్కడ నిర్బంధించారు.  లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ నిర్వాసిత రైతుల హక్కుల పరిరక్షణ వేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నుంచి కొడికొండ చెక్‌పోస్టు వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, పోలీసులు అనుమ తించలేదు. అయినా వెనక్కు తగ్గేది లేదని నాయకులు ప్రకటించారు. దీంతో పోలీ సులు ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు, అరెస్టులు కొనసాగించారు. టీడీపీ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని రొద్దం మండలం మరువపల్లిలో, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబి కా లక్ష్మీనారాయణను హిందూపురంలో హౌస్‌అరెస్ట్‌ చేశారు. దీక్షకు వెళుతున్న సీపీఐ నాయకులను హిందూపురంలో అడ్డుకుని, టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. చిల మత్తూరు లో టీడీపీ, సీపీఎం నాయకులను అరెస్ట్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, ఇతర నాయకు లను అరెస్టుచేశారు. మాజీమంత్రి  పల్లె రఘునాథ్‌రెడ్డిని  అనంతపురంలోని ఆయన నివాసం లో నిర్బంధిం చారు. ఇదిలా ఉండ‌గా, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ, తెలుగు రైతు ఆధ్వర్యంలో సోమవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా జ‌గ్గ‌య్య పేట‌ మండలంలోని బూద వాడకు చెందిన తెలుగు రైతు విభాగం విజయవాడ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం హుస్సేన్‌, రాష్ట్ర టీడీపీ గ్రీవెన్స్‌ సెల్‌ కో కన్వీనర్‌ ముల్లంగి రామకృష్ణారెడ్డితో పాటు మరో వ్యక్తికి చిల్లకల్లు పోలీసులు ఆదివారం రాత్రి నోటీసులు అందించారు. అలాగే గంగ‌ప‌ల‌గూడెంలో  రైతులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో తల పెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తూ తెలుగు రైతు జిల్లా అధ్య క్షుడు చెరుకూరి రాజేశ్వరరావును సోమవారం పోలీసులు ఊటుకూరు గ్రామంలో హౌస్‌ అరెస్టు చేశారు. తెలుగు రైతు సంఘ జిల్లా నేతలురెడ్డిగూడెం: ప్రజా సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డు కోవడం ప్రభుత్వం నిరంకుశ ధోరణికి నిదర్శనమని తెలుగు రైతు సంఘ జిల్లా నాయకులు వేణుగోపాల రెడ్డి, రాయుడు వెంకటేశ్వర్లు అన్నారు. వారివురిని కూనపరాజుపర్వలో వారి నివాసాల వద్ద ఆదివారం సాయంత్రం నుంచి  సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. 

ఎలిజ‌బెత్‌-2 రాణికి అంతిమ‌వీడ్కోలు

రాజ‌కుటుంబం స‌మ‌క్షంలో ఎలిజ‌బెత్‌-2  అంత్య్ర‌కియ‌లు సోమ‌వారం జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో వివిధ దేశాధినేత‌లు, ప్ర‌త్యేక ఆహా్వ‌నితులు రెండువేల‌మంది పాల్గొన్నారు. కింగ్‌ చార్లెస్‌-3 ఆధ్వర్యంలో వెస్ట్ మినిస్టర్‌ హాల్‌లో క్యాటఫాక్‌పై నుంచి రాణి శవపేటికను విండర్స్‌ క్యాసల్‌ కు తరలించారు. ఈ కార్యక్ర మం లో యావత్‌ రాజ కుటుంబం పాల్గొంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా ప్రపంచ దేశాల ప్రతినిధులు రాణికి నివాళులర్పించారు.  రాణి పార్థివదేహాన్ని రాయల్‌నేవీ స్టేట్‌ గన్‌క్యారేజీలో వెల్లింగ్టన్‌ఆర్చ్‌ మీదుగా విండర్స్‌ క్యాసల్‌కు తరలించారు. భారీ ఎత్తున జరిపిన ఎలిజబెత్‌-2 అంతిమ యాత్రలో ఆరు వేల మంది సాయుధులైన సైని కులతో మార్చ్‌ నిర్వహించారు. రాణి అంత్యక్రియలు ప్రారంభమైన వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌ మొదలు.. రోడ్డుకు ఇరువైపులా పౌరులు దాదాపు 8 కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఎలిజబెత్‌-2కు నివాళిగా బ్రిటన్‌లో ఉద యం 8 గంటలకు ప్రజలంతా నిమిషం పాటు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్‌లో రాణి పార్థివ దేహాన్ని ఖననం చేసే సమయంలో కూడా ప్రపంచ నేతలు రెండేసి నిమిషాల పాటు మౌనం వహించి, ఆమె ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు. కామన్వెల్త్‌ ప్రధాన కార్యదర్శి బారోనెస్‌ ప్యాట్రిసియా, బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ బైబిల్‌ వాక్యాలను పఠించి, కీర్తనలు అలపించారు. రాణి అంతిమ యాత్ర సందర్భంగా లండన్‌లోని బిగ్‌ బెన్‌ గంటను ఎలిజబెత్‌-2 96 ఏళ్లు జీవించినదానికి గుర్తుగా నిమిషానికి ఒకసారి చొప్పున 96 సార్లు మోగిం చారు. క్వీన్‌ ఎలిజబెత్‌ తన 96వ ఏట స్కాట్‌లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో ఈ నెల 8న మరణించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ‘గాడ్‌ సేవ్‌ ద కింగ్‌’ అనే బ్రిటన్‌ జాతీయ గీతాన్ని ఆలపించారు.  వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో రాణి అంత్యక్రియలు ప్రారంభమవ్వడానికి ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురు దేశాధినేతలతో మాట్లాడారు. వారిలో టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ హసన్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఉన్నారు. షేక్‌ హసీనా, ఆమె సోదరి షేక్‌ రెహెనాతో ముర్ము భేటీ అయినట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి వెంట విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా ఉన్నారు.