త్వరలో ప్రగతి భవన్ లో ఈడీ, ఐటీ జమిలి దాడులు

కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్యంగా ఇక ఈడీ, ఐటీ జమిలి దాడులకు రంగం సిద్ధమైందా అంటే అధికారవర్గాల నుంచి ఔననే బదులు వస్తోంది. ఒక అధికారి  బదలీ.. ఒకే ఒక్క అధికారి బదలీ... తెరాస ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ప్రకంపనలు సృష్టిస్తోంది.  తెలంగాణ డీజీపీ రేసులో ఉన్న ఒక  సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా  వసుంధర సిన్హా  బదలీ ,ఆమె స్థానంలో ముంబై ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్ ని తీసుకురావడంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   గత కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబ సన్నిహితులను విచారిస్తున్న ఈడీకి  ఇప్పుడు ఇక ఐటీ దాడులు తోడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.   కేసీఆర్ కు  సన్నిహితురాలైన వసుంధర సిన్హా   ఐటీ దాడులు, విచారణకు సంబంధించిన సమాచారాన్నికేసీఆర్ కు లీక్ చేస్తున్నట్లుగా అనుమానించిన  పై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఆ స్థానంలో నుంచి తప్పించి సమర్ధుడైన అధికారిగా పేరున్న సంజయ్ బహదూర్ ను తీసుకు వచ్చారని అంటున్నారు. సంజయ్ బహదూర్ ఇప్పటికే తన పని మొదలెట్టేశారని కూడా అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం.  ఈ నేపథ్యంలోనే  ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో   సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనే జరుగుతున్న సోదాలు ఏ క్షణంలోనైనా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు చేరే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేసిన ఈడీ బృందాలు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ సహకారం కోరాయి. దీంతో అగ్నికి అజ్యం పోసినట్లు  జమిలిగా ఈడీ, ఐటీలు దూకుడు పెంచినట్లైంది. ఢిల్లీ  లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ,ఐటీ  సమష్టిగా కేసీఆర్ కు బంధువు అయిన వెన్నమనేని శ్రీనివాసరావును విచారించాయి. ఈ విచారణలో ఆయన నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని తేలింది. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నవేననీ తెలినట్లు తెలుస్తోంది.  కాగా ఈ  దాడులపై టీఆర్ఎస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందాయన్న ప్రచారాన్ని కవిత వినా మిగిలిన టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించకపోవడమే ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో సంతోష్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈడీ..బోడీ ఎవరూ ఏమీ చేయలేరంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మోడీ నన్ను గోకకపోయినా నేను ఆయనను గోకుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మోడీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం నిగ్గు తేల్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు. కేసీఆర్ కు సమాచారం లీక్ చేస్తున్నారన్న అనుమానంతో వసుంధర సిన్హా ను బదిలీ చేసి ఆమె స్థానంలో సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన సంజయ్ బహదూర్ ను తీసుకురావడం కీలక పరిణామంగా చెబుతున్నారు. సంజయ్ బహదూర్ అప్పుడే తన పని ప్రారంభించేశారనీ, ఈ కేసులు సంబంధించి ఏ క్షణంలోనైనా సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికార వర్గాల బోగట్టా. ఇప్పుడు ఇక ఈడీ, ఐటీ దాడులు ప్రగతి భవన్ కు చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.  కేంద్ర హోమంత్రి హోదాలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా  ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ (ఎస్ వీపీ ఎన్ పిఏ) పోలీసు అకాడమీలో ఈడీ, ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా ఈ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయనడానికి తార్కాణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ సాగిన దాడులు, విచారణలు ఒకటైతే ఇక ముందు  జరగబోయే దాడులు, విచారణలు ఒకెత్తుగా వారు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా డిల్లీలిక్కర్ స్కాం తీగ లాగితే కేసీఆర్ కుటుంబం డొంక కదులుతోందన్న అభిప్రాయం అయితే అధికారులలో వెల్లడౌతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు మూడు రోజులలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

టిడబ్ల్యు జెెె ఎఫ్ పాద‌యాత్ర‌ను అనుమ‌తించండి.. కోర్టు  ఆదేశం

తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెెె ఎఫ్) మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నాయ‌కుడు వి.అశోక్ కుమార్ పాద‌యాత్ర‌కు అనుమ‌తించాల‌ని సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్‌, సిపిలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్‌పీకీ బుధ‌ వారం తెలంగాణా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె.ల‌లిత ఆదేశాలు జారీ చేశారు. వి.అశోక్ కుమార్ సెప్టెం బ‌ర్ 25 నుంచి 30 తేదీవ‌ర‌కూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు పాద‌యాత్ర చేయ‌ను న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 2008లో జారీచేసిన  జీఓ 424, 2008 ప్ర‌కారం జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వా ల‌ని  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌మ ఫెడ‌రేష‌న్ త‌ర‌ఫున ప్ర‌తిపాద‌న‌ను అంద‌చేయ‌ డానికి అశోక్ కుమార్ పాద‌యాత్ర చేయ‌త‌ల‌పెట్టిన‌ట్టు హైకోర్టుకు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  2008 జీఓ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు 2010లో త్రోసిపుచ్చారు. కాగా ఇటీవ‌ల మాజీ ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ నేతృత్వంలో  సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, దేశంలో జ‌ర్న‌లిస్టులు అంద‌రికీ ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిం చాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. 

లోకేష్ యాత్ర‌తో వైసీపీ సీన్ సితారేనా?

యాత్ర‌లంటే బామ్మ‌గారి తిరుప‌తి యాత్ర‌, కాశీయాత్రో అనుకునేవారు. కాల‌క్ర‌మంలో భ‌క్తిపూర్వ‌కంగానే కాదు, సామాజిక న్యాయం కోస‌మో, రాజ‌కీయ‌ల‌బ్ధికో ఒక యాత్రకు వెళ్ల‌డం చూస్తున్నాం. ఇపుడు  రాను రాను యాత్ర అంటే పాద‌యాత్ర‌లకే అధిక ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ‌కీయ‌పార్టీల‌వారు అన్ని ప్రాంతా ల్లోనూ ప్ర‌జ‌ల‌కు త‌మ అజెండానో, మానిఫెస్టోనో తెలియ‌జేడానికి, ఓట‌ర్ల‌ను త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికీ పాద యాత్ర‌లు చేప‌డుతున్నారు. వీటికీ రంగుమారి పాద‌యాత్రలే విజ‌య‌ర‌హ‌స్యాలు అన్న అభిప్రా యాలు స్థిరమైనాయి. ఒక్క పాద‌యాత్ర వీల‌యినంత దూరం చేస్తే రాజ‌కీయ‌భ‌విత‌ను మార్చే స్తుంద‌న్న గ‌ట్టి న‌మ్మ కం ఇపుడు రాజ‌కీయ‌పార్టీల అధినేత‌ల నుంచి మామూలు కార్య‌క‌ర్త‌కూ ఏర్ప‌డింది.  ఏపీలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కాపాడేందుకు, వారి ఆశ‌లు ఫ‌లించేలా చేయ‌డానికి, వారి వ్య‌ధ‌ల‌ను తొల‌గించ డానికి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రాన్ని జే గ్యాంగ్ సంకెళ్ల నుంచి త‌ప్పించ‌డానికి ఆయ‌న కంక‌ణం కట్టుకున్నారు. ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు వైసీ పీ పాల‌న ప‌ట్ల విముఖ‌త‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌లం కావ‌డం అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌. మూడేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఇద‌మిద్ధం చేసిన మేలు అంటూ ఏమీ లేక‌పోగా హామీలు, ఉప‌న్యాసాలు, బోధ‌న‌లే ఎక్కువ‌య్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అభి వృద్ధి అనేది ఏరంగంలోనూ క‌నిపించ‌డంలేదు. పైగా విప‌క్షాల మీద దుర్భాష‌లాడుతూ విరుచుకు ప‌డ‌టం త‌ప్ప ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమీ లేదు. ఇది ప్ర‌జ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత బాగా గ‌మ‌ని స్తున్నారు.  ప్ర‌శ్నించేవారిపై దాడులు చేప‌ట‌ట‌డం త‌ప్ప సంక్షేమప‌రంగా చేస్తున్న‌దేమీ లేదు.  ఈ ప‌రిస్థితుల్లో, నారా లోకేశ్ పాదయాత్రకు ముహూ ర్తం ఖరారైంది. నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జనవరిలో శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నిజానికి అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ మొదట అనుకున్నారు. ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేశారు. కానీ అంతర్గత చర్చల తర్వాత ఆ ముహూర్తాన్ని జనవరికి మార్చారు. ఎన్నికల వాతావరణం నెలకొన్నతర్వాత చివరి ఏడాదిలో పాదయాత్ర చేస్తే వ్యూహాత్మకంగా కలిసివస్తుం దని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. వచ్చే జనవరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తే ఆపై ఏడాది మార్చి నాటికి మొత్తం 450 రోజుల సమ యం ఉంటుందని టీడీపీ నేతలు లెక్కగట్టారు. 2024 మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉం ది. అప్పటికి రాష్ట్రం మొత్తం పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారు. రాయలసీమ నుంచి ప్రారంభ మయ్యే లోకేశ్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. వీలున్నంత వరకూ ఏపీలోని అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర స్పృశించేలా రూట్ మ్యాప్ను టీడీపీ నేతలు రూపొందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు వారంలో రెండు రోజులు విరామం ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉండడంతో ఆ రోజుతో పాటు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు మాత్రమే జగన్ నడిచేవారు. అయితే.. తనకు కోర్టు హాజరు సమస్య లేదు కాబట్టి వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్ని హితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి పక్ష నేతగా పాదయా త్ర  చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పాదయాత్ర చేసిన చివరి ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ పాదయాత్ర సమయానికి రాష్ట్రం విడిపోవడంతో ఆయన ఏపీలో మాత్రమే నడిచారు. ఈసారి టీడీపీ తరఫున పాదయాత్ర చేసే అవకాశం లోకేశ్ కు వచ్చింది. ఏపీలో నెలకొన్న వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూర మైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజావ్యతిరేక వైసీపీ పాలనను తూర్పారబట్టేందుకు పాద యాత్రే సరైన సాధనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా విస్తరిస్తున్నా ఆ స్థాయిలో మరికొన్నిచోట్ల పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరగలేదని, అలా వేగం పెరగడానికి పాదయాత్ర దోహదం చేస్తుం దని అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక తకు ప్రభంజన రూపం తేవాలంటే ఒక చోదకశక్తి అవసరం. లోకేశ్ పాదయాత్ర అలా ప్రభం జనం తీసుకొ స్తుం దని టీడీపీ నేతలు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

ఇక సుప్రీం విచారణలు ప్రత్యక్ష ప్రసారం

ఇక కోర్టు సీన్లు సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనే  కాదు, ప్రత్యక్షంగానూ చూడ వచ్చును. అవును, సుప్రీం కోర్టులో విచార జరగే సమయంలోనే, వాద ప్రతివాదనలతో పాటుగా న్యాయమూర్తులు ఇచ్చేతీర్పులు, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం త్వరలో రాబోతోంది. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అందరికీ కలిపించాలని నిర్ణయించింది. ఇంత వరకు పార్లమెంట్,అసెంబ్లీ సమావేశాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, రాజకీయ సభలు, సమావేశాలకు ఇతరత్రా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విధంగానే, ఇకపై, సుప్రీంకోర్టులో కీలక విచారణలకు సంబంధించి వాద ప్రతివాదనలను ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు. లలిత్‌ ఆధ్వర్యంలో జరిగినమంగళవారం (సెప్టెంబర్ 20) జరిగిన ఫుల్ కోర్ట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. నిజానికి, కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఈనేపధ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సహా పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. కానీ, దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తాజాగా వచ్చేవారం నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్‌ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్‌ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోనుందని తెలిపాయి. అయితే, ఇటీవల భారత  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26న ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్‌ ధర్మాసనం కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో, జస్టిస్ రమణ  న్యాయస్థానాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు, మరో అడుగు ముందుకుపడింది. ముందు ముందు, అన్ని కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన ప్రజలకు ఫస్ట్ హ్యాండ్ సమాచారం అందుబాటులోకి రావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుంది.

ఆట‌ను ఆట‌గా చూడలేరా?

క్రికెట్ అన‌గానే అంత‌ర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పోటీకి స‌మానంగా చూసేది  భార‌త్‌, పాకి స్తాన్ పోటీలే. ఏ టోర్నీ అయినా, వేదిక ఏద‌యినాస‌రే ఇంగ్లండ్‌, ఆసీస్‌ల మ‌ధ్య మ్యాచ్‌ల‌కి ఉండే అత్యం త ప్రాధాన్య‌త  భార‌త్‌, పాక్ మ్యాచ్‌ల‌కీ ఉండ‌డం విశేషం. అలాగే ప్లేయ‌ర్ల‌న్నా వీరాభిమానుల మ‌ధ్య పెద్ద‌గా తేడా ఉండ‌దు. స‌చిన్‌, కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ను మ‌నం ఎంత‌గా అభిమానిస్తామో అటు పాకిస్తాన్‌ లోనూ అంతే అభిమానిస్తారు. అదేవిధంగా మ‌న‌దేశంలోనూ అబ్దుల్ ర‌జాక్‌, వ‌సీం అక్ర‌మ్‌ను అభిమా నించిన‌ట్టే బాబ‌ర్ అజామ్‌, ర‌షీద్‌, రిజ్వాన్‌ల‌ను అంతే స్థాయిలో అభిమానిస్తున్నారు.  కాబోతే మ్యాచ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఎవ‌రి దేశం జ‌ట్టు వారు గెల‌వాల‌నే  కోరుకుంటారు. ఓడినా ఈజీగా  తీసుకోలేక‌పోవ‌డ‌మే అభిమానుల  మ‌ధ్య విద్రోహ‌పు ఆలోచ‌నల‌కు దారితీస్తోంది. అదే మ‌ళ్లీ బ‌య‌ట ప‌డింది. ఆసియాక‌ప్ జ‌రిగి  చాలారోజుల‌యింది. చిత్ర‌మే మంటే తొలిమ్యాచ్‌లో భార‌త్‌చేతిలో పాకిస్తాన్ ఓట‌మి తాలూకు ప్ర‌భావం ఇంకా పోలేదు. పాక్ వీరాభిమా నులు లండ‌న్‌లో విప‌రీత ధోర‌ణిలో వ్య‌వ‌హ రిస్తున్నారు.  భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆయా జట్ల అభిమానుల్లో ఉత్కంఠ, ఉద్వేగం పీక్స్ కి వెళ్లి పో తుంది. ఇప్పుడు గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్- పాక్ ల మధ్య జరి గిన మ్యాచ్ లండన్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను తార స్థాయికి చేర్చింది. మ్యాచ్ జరిగి రోజు లు గడిచిపోతున్నా.. ఆ ఉద్రిక్తతలు సడలడం లేదు.తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో  అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  న హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్ల కు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయ కులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని  ఒక  పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  

ఏసీసీ టీ-20 కి  హ‌ర్మ‌న్‌ప్రీత్ జ‌ట్టు

ఏసీసీ టీ-20 ఛాంపియ‌న్‌షిప్‌కి  హ‌ర్మ‌న్ ప్రీత్ నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఎంపిక‌ చేశారు.  బెంగుళూరులో  ఈ టోర్నీ అక్టోబ‌ర్ 1 నుంచి 15 వ‌ర‌కూ జ‌రుగుతుంది.  ఇటీవ‌లి ఇం గ్లండ్ సిరీస్లో పాల్గొన్న జ‌ట్టులో ఉన్న‌వారే తిరిగి ఎంపిక‌య్యారు. స్టాండ్‌బైలుగా తానియా భాటి యా, సిమ్ర‌న్ బ‌హ‌దూర్ ఎంపిక‌య్యారు.  ఆరుప‌ర్యాయాలు ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో మొద‌టి మ్యాచ్ శ్రీ‌లంక‌తో  త‌లప‌డుతుంది. అక్టోబ‌ర్ 7న పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డు తుందని ఆలిండియా మ‌హిళ‌ల క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బెంగుళూరులో జ‌రిగే ఛాంపి య‌న్‌షిప్‌లో మొత్తం ఏడు జ‌ట్లు పాల్గొంటాయి. వీటిలో బంగ్లా దేశ్‌, పాకిస్తాన్‌, శ్రీ‌లంక‌, థాయ్‌లాండ్‌, మ‌లేషియా, యుఏఇ జ‌ట్లు ఉన్నాయి.  హ‌ర్మ‌న్‌ప్రీత్ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టులో స్మ్రితీ మంధాన‌(వైస్‌కెప్టెన్‌), దీప్తిశ‌ర్మ‌, ష‌ఫాలీవ‌ర్మ‌, రోడ్రిగ్స్‌, మేఘ‌న‌, రిచాఘోష్ (వికెట్‌కీప‌ర్‌), స్నేహారాణా, హేమ‌ల‌త‌, మేఘ్నాసింగ్‌, రేణుకాథాకూర్‌, పూజా, రాజేశ్వ‌రి గైక్వాడ్‌, రాధాయాద‌వ్‌, కె.పి.నావ‌గిరె ఉన్నారు. 

మునుగోడుకు ముందే ముందస్తు.. కేసీఆర్ వ్యూహమిదేనా?

 తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు రాజకీయ విజ్ఞత, వివేచన విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమనాలు అక్కరలేదు. సమయానుకూలంగా స్ట్రాటజీలను మార్చడంలో ఆయన దిట్ట. అందులో సందేహం లేదు. అయితే, కారు జోరు రివర్స్ లో పరుగులు తీస్తున్న ప్రస్తుత సమయంలో కేసీఆర్ అడుగులు తడబడుతున్నాయి. జాతీయ స్థాయిలో జెండా ఎగరేసే విషయంలో అయితే నేమి, రాష్ట్రంలో రోజు రోజుకు పైకి పాకుతున్న ప్రభత్వ వ్యతిరేకతను కట్టడి చేసే విషయంలో అయితే నేమి కేసేఆర్ వ్యూహాలు గతంలో పనిచేసినంత చురుగ్గా పనిచేయడం లేదు. జాతీయ రాజకీయాలకు ఒక బ్రేక్ ఇచ్చి, రాష్ట్రం  మీద దృష్టిని కేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వం ,బీజేపీపై యుద్ధాన్ని కొనాసగిస్తునే, రాష్ట్రంలో కరిగి పౌతున్న ఓటు బ్యాంకు కాపాడు కునేందుకు కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. కొత్త పథకాలతో కొత్త కొత్త ఎత్తులతో, పోగుట్టుకున్న ప్రతిష్టను, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనుల రిజర్వేషన్ ను ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నట్ల ప్రకటించారు. అది కూడా ఎప్పుడో కాదు, జస్ట్ ఒక వారం రోజుల్లోనే జీవో వస్తుందని తెలంగాణ విమోచన దినం ( సెప్టెంబర్ 17) రోజున ప్రకటించారు. అంతేకాదు,  తెలంగాణ ఏర్పాటయ్యాక గిరిజనుల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా.. ఇప్పటికీ స్పందన లేదని విమర్శించారు. కేంద్రానికి మొరపెట్టుకొని.. విసిగిపోయామని..ఇక ఓపిక లేదని.. వారం రోజుల్లోనే రిజర్వేషన్ల జీవోను జారీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ జీవోను గౌరవించి అమలు చేస్తావా? లేదంటే దానిని ఉరి తాడు చేసుకుంటావా? అని ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన విషయంలో, ఎవరికుండే అనుమానాలు వారికున్నాయి. ముఖ్యంగా, ఎస్సీలు, ఇతర వెనకబడిన కులాలు, గిరిజనుల రిజర్వేషన్ పెరిగితే, మొత్తం రిజర్వేషనలు, సుప్రీం కోర్టు విధించిన 50 శాతం పరిధ్జిని దాటి పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అయితే ముఖ్యంత్రి, అధికార పార్టీ నాయకులు  మాత్రం తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీం కోర్టు, తెలంగాణలో ఎందుకు అనుమతించదని ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలో ఇదే వ్యూహంతో అడుగులు వేసిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బొక్కబోర్లా పడ్డాయని, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.   తాజాగా, ఛత్తీస్ సగఢ్‌లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ పదేళ్ల క్రితం అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయం కారణంగా మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరుప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ పి.పి.సాహూల ధర్మాసనం రెండు రోజుల క్రితం (సోమవారం) తీర్పు వెలువరించింది. 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచడం సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యంపై ఎలాంటి అధ్యయనం కూడా చేయలేదని పేర్కొంది. ఛ త్తీస్ గఢ్‌ ప్రభుత్వం కూడా తమిళనాడు ఉదాహరణను ఉతకిస్తూ తెలంగాణ ప్రభుత్వ చేసిన వాదనే చేసింది.అయినా,  న్యాయస్థానం పెంపు చెల్లదని తీర్పునిచ్చింది. ఈ నేపధ్యంలో, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఎంతవరకు న్యాయ విచారణకు  నిలుస్తుందనే విషయంలో సందేహాలున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక గిరిజనులకు మేలు చేయాలనే సంక్సల్పం కంటే, పార్టీ, కుటుంబ సభ్యలను కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు నుంచి కాపాడుకునే కాపాడుకునే సంకల్పమే బలంగా పనిచేస్తోందని, అంటున్నారు. అంతే కాదు ముఖ్యమంత్రి, అక్కడితోనూ ఆగలేదు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన దళిత  బంధు తరహాలో, గిరిజన బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధుతో పాటుగా ఇంకా అనేక ప్రయోజనాలు వెదజల్లినా తెరాస అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి  ఉద్దేశపూర్వకంగా మరిచి పోతున్నారని అంటున్నారు.  ఆదలా ఉంటే, గిరిజనులకు ఈ జంట వరాలను ప్రసాదించడం వెనక ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన చేస్తున్నారా, అనే సదేహలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా, ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోంది. అది ఆందోళనల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత  ప్రతిష్టాత్మకం, పారదర్శకం అటూ తెచ్చిన ధరణి పోర్టల్ దగాకు మోసపోయిన నలుగురు రైతులు ఒకే రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే, ఒక్క ధరణి ఎకౌంటులో ప్రభుత్వ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో, ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయికి చేరిందో, వేరే చెప్పనవసరం లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చకక్దిద్దుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కాదు, తెరాస రెండవసారి, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మొదలైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.86 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెరాస, సంవత్సరం తిరగకుండా 2019 లోక్ సభ ఎన్నికల నాటికే, 41.29 శాతం ఓట్లతో తొమ్మిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే సంవత్సర కాలంలోనే ఐదు శాతం ఓటు కోల్పోయింది . మరో వంక  అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 7.1 శాతం ఓటుతో, ఒకే ఒక్క స్థానం గెలుచుకున్నబీజేపీ, లోక్ సభ ఎన్నికలలో 19.45 శాతం ఓటుతో, 4 లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. అంటే ఒకే ఒక్క సంవత్సరంలో బీజేపీ ఓటు షేర్ 12 శాతం పెరిగింది.   ఆతర్వాత జరిగిన దుబ్బాక, హుజురా బాద్ ఉపఎన్నికలు, జీహెచ్ఎంసి ఎన్నికలు బీజేపీ లో జోష్ ను పెంచాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తారుమారైతే, ఇక ఆతర్వాత ఏ బంధు ప్రకటించినా ఫలితం ఉందని ముఖ్యమంత్రి గమనించారు. అందుకే, మునుగోదుకు ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం మంచిదనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకే, మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే విషయంలోనూ ముఖ్యమంత్రి వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు.

 నెల్లూరు జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు  

జానెడు స్థ‌లం ఉన్నా వెయ్యేనుగుల బ‌లంతో ఉంటారు పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు, అదీ ప‌ట్ట‌ణ ప్రాం తంలో ఉంటే మ‌రీ ధైర్యంగా ఉంటారు. కానీ అది త‌మ‌ది అంటూ రిజిస్ట‌ర్ చేయించుకున్న కాయితాలు ఉంటే స‌రిపోదు. రోజూ వెళ్లి చూసుకున్నా చాల‌దు. ఎందుకంటే ఇది భూక‌బ్జాదారుల కాలం. వాళ్ల‌కి ఊరు, పేరు, కాలం, స్థ‌లం ఎంత అనేదానితో సంబంధం లేదు, చూపు ప‌డిందంటే అది వాళ్ల‌ది అయి పోవాలి. అందు కు ఎలాంటి దారుణాల‌యినా చేసేస్తున్నారు. వారికి చ‌ట్టాలు, కోర్టులు, పోలీసులు అంటే బొత్తిగ భ‌యం భక్తీ  ఉండ‌దు. దాడి చేయ‌డం ఆక్ర‌మించుకోవ‌డ‌మే తెలుసు.  తాజాగా రాజ‌కీయ‌రంగుపూసుకుని మ‌రీ దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఏమ‌న్నా అంటే ఫ‌లానా ఆయ‌న మ‌ద్ద‌తు ఉంద‌ని బాహాటంగానే ప్ర‌క‌టించి మ‌రీ కాజేస్తున్నారు. అదుగో అలా దాడిచేసిన సంఘ‌ట‌న ఒక‌టి నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. అబ్దుల్లా అనే ఆయ‌న‌ నెల్లూరుజిల్లా మ‌ర్రిపాడు మండ‌లం కృష్నాపురానికి చెందిన రైతు. ఆయ‌న‌కు మూడు ఎక‌రాల భూమిఉంది. పొలాన్ని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆమ‌ధ్య హ‌ఠాత్తుగా కొంద‌రు గూండాలు వ‌చ్చి ఇది మాది, దీన్ని వదిలేయ‌మ‌ని దాడి చేశారు.  వైసీపీ నేత చింత‌గుంట ర‌విరెడ్డి  అలా అబ్దుల్లా భూమిని ఆక్ర‌మించేసుకున్నాడు. దీన్ని గురించి అబ్దుల్లా కోర్టుకి వెళ్లాడు. ర‌విరెడ్డి దురాక్ర‌మ‌ణ చేశార‌ని, ఆ భూమి అబ్దుల్లాదేన‌ని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది.  కోర్టు తీర్పు ధైర్యంతో అబ్దుల్లా మ‌ళ్లీ పొలంప‌నుల‌కు వెళ్లారు. మ‌ళ్లీ ర‌వి గూండాల‌తో  వ‌చ్చి అబ్దుల్లా ను ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌పైనా విరుచుక‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. గాయ‌ప‌డిన‌వారు ఆత్మ‌కూరు ఆస్ప‌త్రిలో చికిత్స‌కు చేరారు. కోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత కూడా వైసీపీ నాయ‌కుడు ఇలా దాడికి పాల్ప డటం దారుణ‌మ‌ని గ్రామ‌స్తులు అంటున్నారు. కాగా త‌న కుటుంబానికి వైసీపీ నేత‌ల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అబ్దుల్లా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని అబ్దుల్లా వేడుకుంటున్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే!

కొంద‌రికి శ‌త్రువులు, మిత్రులు, వీరాభిమానుల కంటే భ‌క్త‌గ‌ణ‌మే ఎక్కువ ఉంటారు. అదుగో అలాంటి మ‌హామ‌నిషి నంద‌మూరి తార‌క‌రామారావు. ఎన్‌టిఆర్ అంటూ వీరాభిమానంతో పిలుచుకునే తార‌క రాముడు సినీన‌టునిగా, రాజ‌కీయ‌నాయ‌కునిగా, మ‌రీ ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రిగానూ ప్ర‌జ‌ల హృద యాల్లో నిలిచిన వ్య‌క్తి. ఆయ‌నంటే ఇష్ట‌ప‌డ‌ని వారు చాలా అరుదు. ఆయ‌న పేరుతో హెల్త్ యూని వ‌ర్సీటీ ఏర్పాటు అయిన‌పుడు సంతోషించ‌ని వారులేరు. అది ఆయ‌న్ను హృద‌య‌పూర్వ‌కంగా గౌర‌వించు కోవ‌డ మే అన్నారంతా.  ఇపుడు ఆ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం విష‌యంలో అన్ని పార్టీల‌వారూ ప్ర‌బుత్వా న్ని ప్ర‌శ్నిస్తున్నారు. హెల్త్ యూనివ‌ర్సిటీ అనేది ఎన్టీఆర్ క‌ల అని అందువ‌ల్ల‌నే ఆయ‌న పేరిట‌నే స్థాపించడం జ‌రిగింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు.   ఆయ‌నంటే పార్టీలు, కుల‌మ‌త వ‌ర్గాల‌తో సంబంధంలేకుండా ప్రేమించేవారి శాత‌మే ఎక్కువ‌. ప్రాంతీయా భిమానానికి ప్ర‌తినిధిగా పార్టీ పెట్టి అన‌తికాలంలో ముఖ్య‌మంత్రి అయి, అటు కేంద్ర రాజ‌కీయాల్లోనూ ప్ర‌భావం చూపిన ఘ‌నుడు ఎన్టీ ఆర్‌. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు జాతికి దుర‌దృష్ట‌మంది యావ‌త్ లోకం. అందులో ఏమాత్రం సందేహం లేద‌న్నారు అన్నివ‌ర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ. అదీ ఎన్టీఆర్ అంటే. వ‌ర్సిటీ పేరు మార్చ‌డం స‌బ‌బు కాద‌ని అంటూ  అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు. వ‌ర్సిటీకి ఆయ‌న పేరు మార్చాల‌న్న‌ది స‌రైన నిర్ణ‌యం కాద‌ని ఆయ‌న అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉంది. ఎన్టీఆర్ పేరు తొలగించ డం సరైన నిర్ణయం కార‌ని ఆయ‌న అన్నారు.  ఆయ‌నే కాదు,  ట్విట్టర్ ద్వారా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా స్పందించ‌డం గ‌మ‌నార్హం.  ఆయ‌న కావ‌డానికి వైసీపీకి చెంద‌న‌వార‌యిన‌ప్ప‌టికీ  ఎన్టీఆర్ విష‌యంలో త‌న మ‌న‌సును చంపుకోలేక పోయారు. అందుకే  ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మార్చుకోవాల‌ని ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్‌కు విన్న‌వించారు. మీరు ఎంతో పెద్ద మనసుతో  తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం..విప్లవాత్మకం..అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవ తోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాన‌ని  వల్లభనేని వంశీ ట్విట‌ర్ ద్వారా కోరారు. 

ట్రాఫిక్ జామ్  సాక్షిగా ..!

ప్రేమ‌వ్య‌వ‌హారాలు ఎప్పుడూ చిత్రంగానే ఉంటాయి. పొలంలో ప‌నిచేస్తూ నాగేస్స‌ర్రావు సావిత్రిని, ప్ర‌బాస్ వ‌ర్షంలో త్రిష‌ని, క్లాస్లో రామ్ని నిధిఅగ‌ర్వాల్ ప్రేమించేసారు.. ఓ కుర్రాడు చాలారోజుల క్రిత‌మే బెంగు ళూరులో ట్రాఫిక్ జామ్‌లో ఓ అమ్మాయిని అమాంతం ప్రేమించేశాడు! అదెలా సాధ్యం అని ప్ర‌శ్నించుకోవ‌డం, ఆలోచించి బుర్ర‌పాడుచేసుకోవ‌డం అక్క‌ర్లేదు. ఎందుకంటే అది ప్రేమ‌.. దానికి ప్లేసు, టైమ్, వ్య‌క్తుల‌తో పెద్ద స‌మ‌స్య ఉండ‌దు. అదంతే ఎవ‌ర్నియినా ఎవ‌ర‌యినా ఫ్రేమిం చే య‌చ్చు! రైల్వే జ‌ర్నీలో తీరిగ్గా ప్రేమించేయ‌డం, దిగి పాట‌లు పాడేసుకోవ‌డం సినిమాల్లో చూపుతున్నా రు. అలాంటిది నిజ‌జీవితంలో జ‌రుగుతుందా? అని మామ్మ‌గారు మ‌న‌వ‌డినో మ‌న‌వ‌రాలినో తిట్ట‌వ‌చ్చు.. కానీ అదీ జ‌ర‌గ‌నూ వ‌చ్చు! కాల మ‌హిమ‌.  ట్రాఫిక్‌లో అంతా ఇళ్ల‌కు వెళ్లే స‌మ‌యంలో విసిగెత్తి ఉంటారు. ఎవ‌రో ఏదో గొడ‌వ‌ప‌డి ట్రాఫిక్ జామ్ అయిన సంద‌ర్భంలో ఈ ప్రేమ‌లు, బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు జ‌రుగుతాయా? ఇది ఊహించ‌ లేని వ్య‌వహారం. కానీ ప్రేమ వ్య‌వ‌హారాలెప్పుడూ ఇంతే గురూ! అయినా ఈ బెంగుళూరు ల‌వ్‌స్టోరీ తెలుసుకోను కాస్తంత ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంటుంది. బెంగుళూరులో ఓ ప్రాంతంలోని సోనీ వ‌ర‌ల్డ్ సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర ఒక రోజు మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయింది. వాహ‌నాల రొద‌. అంత‌లో ఒక కుర్రాడు విసుగ్గా  అటూ ఇటూ చూస్తున్న‌పుడు మెరుపుతీగె లాంటి అమ్మాయి క‌న‌ప‌డింది. ఆమె కూడా అదే ట్రాఫిక్‌ లో  కాస్తంత దూరంలో ఇబ్బందిప‌డుతోంది. ఆమె అవ‌స్థ‌లు చూసి న‌వ్వొచ్చిం ది. న‌వ్వుకున్నాడు. ఆమె విసుగ్గా చూస్తూ  అతన్ని చూసింది. ఈ హీరోగారు చాలా స‌ర‌దాగా అంద‌రినీ చూస్తూ న‌వ్వుకుంటున్నాడు. ఇంత చిరాకు స‌మయంలోనూ అంత ఆనందంగా ఎలా ఉన్నాడ‌ను కుందిట‌. అంతే ట్రాఫిక్‌లో ఉన్న సంగతి మ‌ర్చిపోయి అత‌న్నే చూస్తూండిపోయింది. త‌ర్వాత హార‌న్ల మోత కూడా అంత‌గా తెలియ‌లేదు. అదే ఫ్రేమ మ‌హ‌త్తు! అత‌గా డూ అంతే. త‌ర్వాత ఇద్ద‌రిమ‌ధ్యా మాట‌లు క‌లిశాయి.  ఇక్క‌డ ట్విస్ట్ ఏమంటే... వాళ్లిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం జ‌రిగి మూడేళ్ల‌యింది. అంటే వారి పెళ్లీ అయింది. కానీ వారు తొలిచూపుల్లో క‌లిసిన ఆ మ‌హ‌త్త‌ర ప్ర‌దేశం లోని ఎజిపూర ఫ్లైఓవ‌ర్ ప‌నులు మాత్రం ఇంకా పూర్తి కాలేదుట‌!

కేసీఆర్ జాతీయ‌పార్టీకి  కుద‌ర‌ని ముహూర్తం

అన్నీ అనుకోగానే అయిపోతాయా? అది కొంద‌రికి ప‌ట్టే అదృష్టం.  చాలామంది విష‌యంలో జ‌ర‌గ‌ని క‌ల‌. కొంద‌రికి ఇవాళ‌, రేపు.. అంటూ ముహూర్తాల తేదీ మారిపోతూంటుంది. ఇపుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఆయ‌న జాతీయ‌పార్టీ ఏర్పాటు ముహూర్తం తేదీ మళ్లీ మారింది. అదిగో ఇదిగో అన్న‌ది అభిమానుల‌ను ఊరించింది. ఈమ‌ధ్య ఇదుగో ద‌స‌రాకి ప్ర‌క‌టిస్తార‌ని అంతా సినిమాకోసం ఎదురుచూసిన‌ట్టు చూస్తున్నారు. ఇంత‌లో అబ్బే అక్టోబ‌ర్ 5కి ప్ర‌క‌టించ‌డం క‌ష్టమ‌న్న‌ది తేలిపోయింది. ద‌స‌రా ముహూర్తం దాటిపోయింది గ‌నుక ఇక ఈ ఏడాది డిసెం బ‌ర్ లోనే బిఆర్ ఎస్ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌వ‌చ్చు.  ముహూర్తం మార్పు పంతులుగారు ఇంకా తేల్చ‌లేక‌పోవ‌డం కాదుట‌..కొత్త పార్టీ మానిఫెస్టోలో అంశాలు ఇద మిద్ధం ఏమి ఉండాల‌న్న‌ది ఇంకా తేల‌క‌పోవ‌డ‌మేన‌ట‌. మ‌రీ ముఖ్యంగ నీరు,విద్యుత్‌, వ్య‌వ‌సాయం, జాతీ య పార్టీ ప‌తాక రూప‌క‌ల్ప‌న మొద‌లైన అంశాల్లో పాల‌సీ ఎలా ఉండాల‌న్న‌ది  ఇంకా నిపుణుల క‌మిటీ తేల్చలేద‌ట‌. అంతేకాదు పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి ముందు మ‌రిన్ని కీల‌కాంశాల గురించి దాదా పు ప్ర‌తీరోజూ ఇంకా చ‌ర్చిస్తున్నారని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. జాతీయ‌స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌పుడు విజ‌య‌ద‌శ‌మిరోజునే ప్ర‌క‌టించా ల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద పార్టీ రిజిస్ట‌ర్ చేయించే ప‌నులు ఇంకా పూర్త‌గాక‌పోవ‌ డంతో అపుడు అధికారికంగా ప్ర‌క‌టించ‌డానికి వీలులేక‌పోయింది. కాగా టీఆర్ ఎస్ పార్టీని  కొత్త‌గా ప్ర‌తిపాదిస్తున్న జాతీయ‌పార్టీలో క‌ల‌ప‌డం విష‌యంపైనా  పార్టీ ఎగ్జిక్యూటివ్ స‌మావేశంలో ఇంకా చ‌ర్చిం చాల్సి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై సుదీర్ఘ చ‌ర్చ త‌ర్వాత ఆ రిజ‌ల్యూష‌న్ కాపీని ఈసీకి అంద‌జేయ వ‌ల‌సి ఉంటుంది.  ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జాత‌కాల‌మీద ఎంతో న‌మ్మ‌కం ఉంది. క‌నుక మంచి ముహూర్తం కోసం ప‌ట్టుప‌డు తుం డ‌డంతోనూ కొత్త జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న జాప్యం అవుతోందని అంటున్నారు. అంద‌రూ ఎంతో ఆలోచించి, ఎంత‌మందితోనో స‌మాలోచ‌న చేసి అక్టోబ‌ర్ 5ని నిర్ణ‌యించారు. ఆ రోజు మంచి కార్య్ర‌ క‌మాలు ఆరంభించ‌వ‌చ్చ‌ని అంద‌రూ ఒక్క‌మాట‌గా సీఎంకి తెలియ‌జేశారు.  కాగా ప్ర‌స్తుతం మూఢాలు న‌డుస్తున్నాయి క‌నుక కొత్తపార్టీ ప్ర‌క‌ట‌న ముహూర్తాన్ని డిసెంబ‌ర్ 12కి వాయిదా వేశారు. అందువ‌ల్ల అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుంది. ఈలోగా పార్టీ సంబంధించిన ఇత‌ర అంశా ల‌పై, విధివిధానా ల‌ను నిర్ణ‌యించుకో వ‌డంపై చ‌ర్చ‌లమీద దృష్టిపెడుతున్నారు.  ఒక‌వేళ డిసెంబ ర్ 12 కూడా కుద‌ర‌క‌పోతే ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ వేచి ఉండాల్సి వ‌స్తుందని రామ‌డుగు క‌ళ్యాణ‌శ‌ర్మ పండితులు తెలియ‌జేశార‌ట‌. 

మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కనిపించుట లేదు..!

ఎంత అన్నారు.. ఎంత ఎగిరారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.. మంత్రి హోదాలో ఆ  టైమ్‌లో హీరోలాగా కోర మీసాన్ని   మెలి తిప్పేశాడు.. తొడ కొట్టేశాడు. కానీ మంత్రి పదవిని   మిఠాయి పొట్లాన్ని కాస్తా కాకి ఎత్తుకుపోయిన చందంగా ఆయన జిల్లాకే చెందిన కాకాణి గోవర్థన్ రెడ్డి ఎత్తుకెళ్లిన తర్వాత, మాజీ అయిన అనిల్ కుమార్ యాదవ్ సోదిలోనే లేకుండా పోయారు. దీంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ అదృశ్యమైపోయారంటూ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  మంత్రి పదవి ఊడిపోయి ... ఇంకా   ఆరు  నెలలు పూర్తి కాలేదు... అప్పడే... అనీల్ కుమార్ యాదవ్ కషాయం కట్టేశారా?.. కమండలం పట్టేసి.. సైలెంట్‌గా చెక్కేశారా? అంటూ ఆయన ప్రత్యర్థి వర్గం వ పంచ్‌లు మీద పంచులు పేలుస్తున్నారు తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఆ సమావేశాల్లో ఎక్కడా అనిల్ కుమార్ యాదవ్ కనిపించలేదు. దీంతో వైసీపీలోనే  అనీల్ కుమార్ అంతర్ధానంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్ష టీడీపీని చీల్చి చెండాడే  బృహత్తర అవకాశం. ఇలాంటి అవకాశాన్ని  నెల్లూరు సీటి ఫైర్ బ్రాంబ్ అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు ఉపయోగించుకోలేదన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.    మరోవైపు నెల్లూరు నగర ప్రజలు తమ ఎమ్మెల్యే   కనిపించడం లేదంటూ రేపో మాపో  స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుు సమాయత్తమౌతున్నారని ప్రచారంలో ఉంది.   2019 ఎన్నికల్లో   విజయం సాధించి  జగన్   తొలి కేబినెట్‌లో అత్యంత కీలక శాఖల్లో ఒకటైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లను కూడా   కాదని అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు  జగన్ మంత్రి పదవి కట్టబెట్టడంతో సీనియర్లు మింగలేక కక్కలేక మథన  పడ్డారు.  అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లను మీడియా సమావేశాలలో  విమర్శలతో రఫ్పాడించాలంటే  కొడాలి నాని  తరువాత  అనిల్ కుమార్ యాదవే అని అనుకునే స్థాయికి ఆయన ఎదిగిపోయారనడంలో సందేహం లేదు.  మరోవైపు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్.... ఆయన సొంత జిల్లా నేతలతోనే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించేవారని.. కానీ మంత్రి పదవి కాస్తా పోయే సరికి ఇటు  సొంత జిల్లాలో పార్టీ నేతలతో సఖ్యత లేక.. అటు నియోజకవర్గంలో ఏ పనులూ చేయకపోవడంతో జనానికి ముఖం చూపించలేక సైలంటైపోయారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.    కాగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మార్పుపై అనిల్ కుమార్ యాదవ్ దృష్టి కేంద్రీకరించారని.. ఆయన వెంకటగిరి నుంచి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారని.. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలాగే  అనిల్ కుమార్ యాదవ్‌కు ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య రాజకీయంగా ఓ రేంజ్ లో ఫైట్ జరుగుతోందనీ, దీంతో  పరిస్థితి ప్రతికూలంగా ఉందని అర్థమైన అనిల్ కుమార్ యాదవ్ సైలంటై సైడైపోయారని అంటున్నారు.   

ఎన్టీఆర్ వ‌ర్సీటీకీ మీకూ సంబంధ‌మేమిటి.. చంద్ర‌బాబు

ఏపీ అసెంబ్లీ ఐదో రోజు బుధ‌వారం స‌మావేశం అయిన వెంట‌నే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నోత్త రాలు చేప‌ట్టారు. కానీ ఎన్టీఆర్ హెల్త్వ‌ర్సిటీ పేరు మార్పుపై స‌భ‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. హెల్త్ వ‌ర్సిటీ పేరు ఎలామారుస్తారంటూ టీడీపీ స‌భ్యులు భారీ నినాదాల‌తో హోరెత్తించారు. అయితే ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్ప టికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన ల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.  ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీకి వైఎస్ఆర్‌  పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో  వైఎస్ఆర్‌కు సంబంధమేమిట‌ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వ విద్యాలయానికి  మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని సీఎం జ‌గ‌న్‌ని ప్ర‌శ్నించారు. హెల్త్ యూనివ ర్సి టీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగానిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకి స్తుందని ఆయన అన్నారు. వైద్య‌విద్య‌కు ప్ర‌త్యేక వ‌ర్సిటీ అవ‌స‌ర‌మ‌ని భావించే నాడు ఎన్టీఆర్ ఈ వ‌ర్సిటీని ఏర్పాటు చేశార‌ని చంద్ర బాబు గుర్తుచేశారు. ఆయ‌న మ‌ర‌ణాంత‌రం త‌మ ప్ర‌భుత్వంలో ఆ వ‌ర్సిటీకీ ఎన్టీఆర్ పేరు పెట్టామ‌న్నారు. కానీ  వ‌ర్సిటీ స్థాపించిన 36 యేళ్ల త‌ర్వాత ఈ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించి వైఎస్ ఆర్ పేరు పెట్ట‌డం అర్ధ ర‌హిత‌మ‌ని టీడీపీ అధినేత అన్నారు.  మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని ఈ ప్రభుత్వం ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. వర్సిటీ  రూ.450 కోట్ల నిధులు కూడా బల వంతంగా కాజేసిన ఈ ప్రభుత్వం.. ఏ హక్కుతో పేరు మార్చుతుందని నిలదీశారు. కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసి వర్సిటీ పరువు తీసి ఇప్పుడు పేరు మార్చుతారా అంటూ బాబు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు. వ్యవస్థలను, సంస్థలను నిర్మిస్తేనే పేరు వస్తుంది అనే విషయాన్ని సీఎం జగన్ తెలుసు కోవాలి .ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యథావిధిగా కొనసాగిం చాల‌ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

మునుగోడు ముహూర్తం ఖరార్ .. ఉపఎన్నిక ఎప్పుడంటే ..!

మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖారరైందా? సెప్టెంబర్ 17 న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్’ లో నిర్వహించిన తెలంగాణ  విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన, కేంద్ర హోం మంత్రి అమిత్  షా, పార్టీ రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా పరిస్థితిని సమీక్షించింది, అందుకేనా? అంటే, అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. నిజానికి,  బీజేపీలో చేరేందుకు, మునుగోడు సిట్టింగ్ (కాంగ్రెస్) ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి  ఆగష్టు 7 న, రాజీనామా చేశారు. ఆ తేదీ నుంచి ఆరు నెలలోపు  మునుగోడు అసెంబ్లీ స్థానికి ఉప ఎన్నిక జరగవలసి ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు టైముంది. అయితే, అంతవరకు ఆగితే,పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందో అనే అనుమానంతో కావచ్చు, కమల దళం అక్టోబర్ లేదా నవంబర్’ నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.  నిజానికి, సాధారణంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్, దేశంలో ఎక్కడైనా ఒకటి రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం అయిన పరిస్థితిలో, ఆరు నెలల గడవు ముగిసేలోగా జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లతో పాటుగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది. అందుకే, డిసెంబర్’లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మునుగోడు ఉపఎన్నిక జరుగుతుందని అందరూ భావించారు. అయితే, నియోజక వర్గంలో పరిస్థితి వేగంగ మారుతున్నా నేపధ్యంలో ఆలస్యం అమృతం విషం అని భావించారో ఏమో కానీ,  మునుగోడు వ్యూహ రచనకు కేంద్ర బిందువుగా ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా, ముందుగానే ఉప ఎన్నిక  నిర్వహించాలనే  నిర్ణయానికి వచ్చారని, అదే విషయాన్ని  బీజేపే రాష్ట్ర నాయకులతో చర్చించారని అంటున్నారు. ఈ నేపధ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెల, (అక్టోబర్) చివరి వారంలో  మునుగోడుతో పాటుగా, ఇతర రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ , లోక్ సభ స్థానాల ఉపఎన్నికల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది.  నిజానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాధికారం పరిదిలోకి రాదు. కేంద్రం ప్రభుత్వం నిర్ణయించదు. కేంద్ర ఎన్నికల సంఘం, నిర్ణయిస్తుంది. కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు  కొదవేముంది అన్నట్లు, మోడీ షా పాలనలో, కేంద్ర దర్యాప్తు సంస్థలే సర్కార్ చేతిలో కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కుంటున్నపరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని అనుకోవడం, తీసుకోవాలని అసిచంచడం పేరాశే అవుతుంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఉపఎన్నిక కావాలని అనుకుంటే అప్పుడు ఈసీ షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఎన్నిక నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి అయితే, నెక్స్ట్ 45 డేస్’ లో మునుగోడు ఉప ఎన్నిక కథ ముగింపుకు వస్తుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ప్రపంచం  ప్రమాదంలో ఉంది: యు.ఎన్‌ చీఫ్  హెచ్చరిక‌

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రపంచం  పెద్ద ప్రమాదంలో ఉందని హెచ్చ రించారు. ఐక్యరాజ్యసమితి అధిపతి, మూడు సంవత్సరాలలో మొదటిసారిగా వ్యక్తిగతం గా కలుసుకునే నాయకులు సంఘర్షణలు వాతావరణ విపత్తులను, పెరుగుతున్న పేదరికం, అసమానతలను ఎదుర్కో వాలని, ప్రధానశక్తుల మధ్య విభజనలను పరిష్కరించాలని. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి ప‌రిస్థితులు దారుణంగా మారాయ‌ని ఛీఫ్ ఆందోళ‌న‌వ్య‌క్తం చేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితి దేశాల  నాయకుల సమావేశం  ఆరంభిస్తూ గుటెర్రెస్,  ప్ర‌పంచాన్ని రక్షించడం మాత్ర మే కాకుండా, అక్షరాలా మంటల్లో ఉందన్నారు.  కానీ నిరంతర కోవిడ్‌ ని ఎదుర్కోవడం  అపారమైన పని ని ఉదహరించారు. కోవిడ్‌-19 మహమ్మారి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కోలుకోవడానికి  ఆర్ధిక  వెసులు బాటు  లేకపోవడం, ఒక తరంలో కనిపించని సంక్షోభమ‌ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. విద్య, ఆరోగ్యం, మహిళల హక్కుల కోసం కోల్పోయిన లోకాన్ని గురించి స‌విస్త‌ర వివ‌ర‌ణ ఇచ్చారు. భౌగోళిక రాజకీయ విభజనలు మనందరినీ ప్రమాదంలో పడేస్తున్నప్రపంచానికి ఇది హుందాగా, వాస్తవిక మైన  పరిష్కా రాల పై దృష్టి కేంద్రీ కరించిన నివేదిక కార్డు అని యు.ఎన్‌ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు. ప్రపంచ నాయకుల 77వ జనరల్ అసెంబ్లీ సమావేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత  యూరప్ యుద్ధ నీడ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం.. ఇది ప్రపంచ ఆహార సంక్షోభాన్ని స్ప‌ష్టంచేసింది. అంతే గాక‌,  ప్రధాన శక్తుల మధ్య చీలికలను యుద్ధ‌వాతావ‌ర‌ణం స్ప‌ష్టంచేసింది. దాదాపు 150 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు తాజా స్పీకర్ల జాబితాలో ఉన్నారు. గ్రహం ఛిన్నా భిన్నమైన స్థితి ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి అధ్యక్షులు, ప్రధానులు, చక్రవర్తులు, మంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మాత్రమే కాకుండా, గ్లోబల్ ఎజెండాలోని సవాళ్లను చర్చించడానికి ప్రైవేట్‌గా కలవడానికి కీలకమైన సమావేశ స్థలంగా మిగిలిపోయింది - మరియు ఆశాజనక కొంత పురోగతి.  రష్యా ఫిబ్రవరి 24 ఉక్రెయిన్‌పై దాడి, ఇది దాని చిన్న పొరుగువారి సార్వభౌమత్వాన్ని బెదిరించడమే కాకుండా ఇప్పుడు రష్యా ఆక్రమిత ఆగ్నేయ ప్రాంతంలోని యూరప్‌లోని అతిపెద్ద అణు కర్మాగారంలో అణు విపత్తు గురించి భయాలను పెంచింది. అనేక దేశాలలో నాయకులు విస్తృత యుద్ధాన్ని నిరోధించడానికి మరియు ఐరోపాలో శాంతిని పునరుద్ధ రించడానికి ప్రయత్నిస్తున్నారు. దౌత్యవేత్తలు, అయితే, ఈ వారం ఎటువంటి పురోగతిని ఆశించడం లేదు. ఉక్రెయిన్, రష్యా నుండి ముఖ్యమైన ధాన్యం మరియు ఎరువుల ఎగుమతుల నష్టం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార సంక్షోభానికి దారితీసింది, అనేక ఇతర దేశాలలో ద్రవ్యోల్బణం  పెరుగుతున్న జీవన వ్యయం. అనే అంశాలు ఎజెండాలో ఎక్కువగా ఉన్నాయి. 2030 కోసం యు.ఎన్‌ లక్ష్యాలను ప్రోత్సహించడానికి సోమవారం జరిగిన సమావేశంలో - తీవ్రమైన పేదరి కాన్ని అంతం చేయడం, పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడంవంటివి- గుటెర్రెస్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక తీవ్రమైన ప్రమాదాలు మన దీర్ఘకా లిక అభివృద్ధి ప్రాధాన్యతలను ఒక వైపు ఉంచడానికి ఉత్సాహం  క‌లిగిస్తు న్నాయ‌న్నారు. కానీ కొన్నివిషయాలు వేచి ఉండలేవని యుఎన్ చీఫ్ చెప్పారు. వాటిలో విద్య, గౌరవప్రదమైన ఉద్యో గాలు, మహిళలు బాలికలకు పూర్తి సమానత్వం, సమగ్ర ఆరోగ్య సంరక్షణ  వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించ డానికి చర్యలు. ప్రభుత్వ  ప్రైవేట్ ఫైనాన్స్ మరియు పెట్టుబడులు అన్నింటికంటే శాంతి కోసం అతను పిలుపునిచ్చారు. జనరల్ డిబేట్ అని పిలిచే  గ్లోబల్ గాదరింగ్, మహమ్మారి కారణంగా 2020లో పూర్తిగా వర్చువల్‌గా 2021లో హైబ్రిడ్‌గా మారింది. ఈ సంవత్సరం, 193-సభ్యుల జనరల్ అసెంబ్లీ వ్యక్తిగత ప్రసంగాలకు మాత్రమే వీలుంటుంది, ఒక్క మినహాయింపు తో ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జ‌ల‌న్‌స్కీ రష్యా, కొన్ని మిత్రదేశాల అభ్యంతరాలపై, ఉక్రేనియన్ నాయకుడు తన నియంత్రణకు మించిన కార ణాల వల్ల - కొన సాగుతున్న విదేశీ దండయాత్ర  సైనిక శత్రుత్వాల కారణంగా అతని దేశ రక్షణ  భద్రతా విధులు. సంప్రదాయం ప్రకారం, బ్రెజిల్ ఏడు దశాబ్దాలకు పైగా మొదట ప్ర‌స్థావించింది. 

మాటే మారెనా.. మమత తానే మారెనా.. మోడీనే శరణు కోరెనా?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి అంటారు. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మమతా బెనర్జీకి ఆ విషయం ఇటీవలే తెలిసొస్తోంది. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా విమర్శలతో విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గొంతు సవరించుకున్నారు. స్వరం మార్చారు. విమర్శల వాడిని తగ్గించారు. మెడీ మంచివాడేనన్నట్లుగా మాట్లాడారు. ఇంతకీ అసెంబ్లీ వేదికగా ఆమె మోడీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన సందర్భం ఏమిటయ్యా అంటే... కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదితర ఏజెన్సీలకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఇటీవలి కాలంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై ఈడీ సీబీఐలు దూకుడుగా వ్యవహరిస్తుండటం, కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండటం తెలిసిందే. ఇటీవలి కాలంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థ ఛటర్జీ ఉపాధ్యాయ నియామక స్కాంలో అరెస్టయ్యారు. సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడిగా పేరొందిన పార్థా ఛటర్జీ అరెస్టు అయిన తరువాత పార్టీ కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండయ్యారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ బీర్బూమ్ జిల్లా అధ్యక్షురాలు అనుబ్రతా మోండల్ పశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యారు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ అనేమిటి.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో నాన్ బీజేపీ  పార్టీలు, నేతలు లక్ష్యంగా సీబీఐ,ఈడీ,ఐటి దాడులు జరుగుతున్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వాస్తవానికి కేంద్ర దర్యాప్తు సంస్ధల   దాడుల్లో నాన్ బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలే ఎక్కువమంది అరెస్టవుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్,తెలంగాణా  రాష్ట్రాల్లో కూడా బీజేపీయేతర పార్టీల నాయకులు లక్ష్యంగా దాడులు జరిగాయి, జరుగుతున్నాయన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే  నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి మరీ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. తృణమూల్ సభ్యులు నిర్మల్ ఘోష్, తపస్ రాయ్  శాసనసభలో రూల్ 169 కింద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ నేతలను ఎంపిక చేసి భయాందోళనకు గురిచేస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. ఇంత వరకూ బానే ఉంది ఆ తరువాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభలో చేసిన ప్రసంగమే అందరినీ ఆశ్చర్య పరిచింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్షాలను టార్గెట్ చేసి నిర్వహిస్తున్న దాడులు ప్రధాని మోడీకి తెలిసే జరుగుతున్నాయని తాను విశ్వసించడం లేదని మమతా బెనర్జీ అన్నారు. ఈ దాడుల వెనుక మోడీ ప్రమేయం లేదని చెప్పారు. అయితే మమత తన ప్రసంగంలో మోడీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేసి అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నలలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే మొత్తం మీద మమతా బెనర్జీ మోడీ పట్ల సానుకూల ధోరణిలో మాట్లాడటమే రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల నజర్ లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరింత మంది ఉండటంతో ఆమె మోడీతో ఘర్షణాత్మక ధోరణిలో కాకుండా సామరస్యంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తన సహజ శైలికి భిన్నంగా విపక్ష నేతలు టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వెనుక మోడీ ఉన్నారని తాను భావించడం లేదని అన్నారు. ఒక వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, మరో వంక మోడీకీ ఈ దాడులకూ సంబంధం లేదనడం ద్వారా మమతా రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించారని, కేంద్రంతో పోరాడుతూనే.. మోడీ ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలన్న వ్యూహంతోనే ఆమె అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. పార్థా ఛటర్జీ అరెస్టు తరువాత నుంచీ కూడా కేంద్రంపై మమత విమర్శల దూకుడు తగ్గించిన విషయాన్ని వారీ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా పార్థ ఛటర్జీ అరెస్టు విషయంలో మమతా బెనర్జీ స్పందించకపోవడాన్ని, పార్థ ఛటర్జీ స్వయంగా ఫోన్ చేసినా కూడా ఆమె ఆన్సర్ చేయకపోవడాన్నీ కూడా వారీ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. చిక్కుల్లో పడటం కంటే తగ్గి స్వాంతన పొందడమే మేలని మమత భావిస్తున్నారని విశ్లేషణలు చేస్తున్నారు. 

గ్రీన్‌, వేడ్ వీర‌విహారంతో ఆసీస్ విజ‌యం

మొహాలీలో ఆసీస్‌తో త‌ల‌ప‌డిన మొద‌టి టీ20లో గ్రీన్‌, వేడ్ వీర‌ బాదుడుతో, భువ‌నేశ్వ‌ర్, హ‌ర్ష‌ల్‌ చెత్త బౌలింగ్‌తో భార‌త్ ఓడి పోయింది. మూడుమ్యాచ్‌ల  సిరీ స్‌లో మొద‌టి మ్యాచ్‌లో ఆసీస్ చివ‌రి ఓవ‌ర్లో ఇంకా నాలుగు బంతులు ఉండ‌గానే గెలి చింది. మొదట బ్యాటింగ్ చేసిన భార‌త్ అత్య‌ధికంగా 209 ప‌రుగులు చేసింది. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజ‌ యం సాధించింది. స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ అద్భుతంగా బౌలిం గ్ చేసి 4 ఓవ‌ర్ల‌లో 17 ప‌రుగు లిచ్చి 3 వికెట్లు తీశాడు.  మొద‌ట బ్యాట్చేసిన భార‌త్ ప‌వ‌ ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి 46 ప‌రుగులే చేసి కెప్టెన్ శ‌ర్మ‌, కింగ్ కోహ్లీ వికెట్లు కోల్పోయింది. శ‌ర్మ 9 బంతుల్లో 11 ప‌రుగులే చేశాడు. మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాడు అనుకున్న కోహ్లీ 7 బంతుల్లో కేవ‌లం 2 ప‌రుగులే చేసి వెనుదిర గ‌డం అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. భార‌త్ 50 ప‌రుగులు 7వ ఓవ‌ర్లో పూర్తిచేయ‌గ‌లిగింది. ఒక వంక కెప్టెన్ వెను దిరిగి న‌ప్ప‌టికీ మ‌రోవంక కె.ఎల్‌. రాహుల్ జాగ్ర‌త్త‌గా ఆడుతూ ఇన్నింగ్స్ నిల‌బెట్టేడు. రాహుల్ మంచి షాట్స్ ప్ర‌ద‌ర్శించాడు. ఊహిం చ‌ని విధంగా సిక్స్లు కొట్టి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. 8వ ఓవ‌రో్ల కొట్టిన సిక్స్‌తో రాహుల్‌ టీ20ల్లో 2000 ప‌రుగులు అధిగ‌ మించాడు. ప‌ది ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగులు చేసింది. 11వ ఓవ‌ర్లో రాహుల్ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 2 సిక్స్‌ల‌తో స‌హా రాహుల్ 50 ప‌రుగులు 32 బంతుల్లో కొట్టాడు. అప్ప‌టికి భార‌త్ 91 ప‌రుగులు చేసిన‌ట్ల‌యింది. రాహుల్‌, సూర్య‌కుమార్లు అప్ప‌టికి 39 బంతుల్లో 56ప‌రుగులు పూర్తిచేశారు. 12వ ఓవ‌ర్లో భార‌త్ వంద‌ప‌రుగులు పూర్తిచేసింది. హాజ‌ల్ఉడ్ ఓవ‌ర్లో రాహుల్ వెనుదిరిగాడు. అత‌ను 35 బంతులో్ల 55 ప‌రుగులు చేయ‌ గ‌లిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాట్ చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. 13వ ఓవ‌ర్ స్పిన్న‌ర్ జాంపా వేయ‌గా ఆ ఓవ‌ర్లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. ముఖ్యంగా పాండ్యా ఇర‌గ‌దీశాడు. 14వ ఓవ‌ర్లో సూర్య అవుట‌ య్యాడు. అత‌ను 24 బంతుల్లో 46 ప‌రుగులు చేశాడు. పాండ్యాతో క‌లిసి వేగంగా ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ స్కోర్ 126 ప‌రుగుల‌కు చేరుకుంది. 15వ ఓవ‌ర్లో క‌మిన్స్ ప‌ది ప‌రుగులు ఇచ్చుకున్నాడు. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యేస‌రికి భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులుచేసింది. 16వ ఓవ‌ర్లో అక్ష‌ర్ అవుట‌య్యాడు. త‌ర్వాత కార్తిక్ వ‌చ్చాడు కానీ అత‌ను కేవ‌లం రెండు ప‌రుగుల‌కే వెనుదిరిగి నిరాశ‌ప‌రిచాడు. భార‌త్ 150 ప‌రుగులు 17వ ఓవ‌ర్లో పూర్త‌య్యాయి. 18వ ఓవ‌ర్లో భార‌త్ కు 16 ప‌రుగులు రావ‌డంతో భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 176 చేసింది. మ‌రో ఎండ్‌లో పాండ్యా వీర‌బాదుడుతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 208 ప‌రుగులు చేసింది. పాండ్యా కేవ‌లం 30 బంతులోల్ 71 ప‌రుగులు చేశాడు. భార‌త్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 13 సిక్స్‌లు రావ‌డం గ‌మ‌నిచ‌ద‌గ్గ అంశం.  ఆసీస్ ఇన్నింగ్స్ విష‌యానికి వ‌స్తే మొదటి నుంచే ధాటిగా ఆడారు. భార‌త్ బౌల‌ర్లు ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేదు. ఫించ్‌, గ్రీన్‌ లు భార‌త్ పేస‌ర్లు భువ‌నేశ్వ‌ర్‌, ఉమేష్ యాద‌వ్‌ల‌ను సునాయాసంగా ఆడారు. ఏదో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నంత సులువుగా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌లోనే జ‌ట్టు స్కోర్ 50 ప‌రుగుల‌కు చేర్చారు. ఆ స‌మ‌యంలో ఫించ్‌ను స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డం కాస్తంత ఊపిరిపీల్చుకున్న‌ట్ల‌యింది.  కానీ గ్రీన్ రూపంలో ఆసీస్‌కు సూప‌ర్ బ్యాట‌ర్ విజృంభ‌ణ ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. బౌల‌ర్లు వారి మీద ఎలాంటి ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో పాటు కీల‌క స‌మ‌యంలో రెండు క్యాచ్‌లు వ‌దిలే య‌డంతో ఆసీస్‌కు సువ‌ర్ణ అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌యింది. గ్రీన్ 30 బంతులోల్ల 61 ప‌రుగులు స్మిత్ 24 బంతులో్ల 35 ప‌రుగులు చేయ‌డంలో భార‌త్ బౌల‌ర్ల‌ను ఛండాడారు. మాక్స్‌వెల్ స్కోర్ చేయ‌కుండానే వెనుతిరిగిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత వ‌చ్చిన మాథ్యూవేడ్ భార‌త్బౌల‌ర్ల‌ను బౌలింగ్ మ‌ర్చి పోయేట్టు బాద‌డంతో ఆసీస్ విజ‌యం సునాయాసం అయింది. ముఖ్యంగా భువ‌నేశ్వ‌ర్ చాలా దారుణంగా బౌలింగ్‌ చేశాడు. చివ‌రి ఓవ‌ర్ల‌లో చాలా ప‌రుగులిచ్చాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఇంకా నాలుగు బంతులు ఉండ‌గానే ఆసీస్ విజ‌యం సాధించింది. ఆసీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర వ‌హించిన వేడ్‌కు గేమ్ ఛేంజ‌ర్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా గ్రీన్‌కు అవార్డ ఇచ్చారు.  

నియోజకవర్గాల పెంపు.. పునర్విభజన చట్టంలో ఉన్నా.. మొండి చెయ్యే!

కొన్నివార్తలు అంతే, చస్తూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. పునరపి జననం.. పునరపి మరణం...అన్నట్లు అన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజక వర్గాల పెంపుకు  సబందించిన వార్త కూడా అంతే. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన చాలా చాలా చెల్లని హామీలలో ఇది కూడా ఒకటి. ఎపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అనేక ఉత్తుత్తి హమీల్లాగానే, ఉభయ తెలుగు తెలుగు రాష్టాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్య పెంచే హామీ కూడా ఉత్తుత్తి హమీనే అనే  విషయం అందరికీ తెలిసిందే. అయినా, నియోజక వర్గాల పెంపు అనే మాట వినగానే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సందడి మొదలవుతుంది. నిజానికి ఇందుకు సంబంధించి గడచిన ఎనిమిదేళ్ళలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్ లో అనేక సందర్భాలలో ప్రస్తావన తెచ్చారు.అయితే ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం, అది ఇప్పట్లో కాదని ఖరాఖండిగా చెపుతూనే వుంది. 2026 జనాభా లెక్కలు తేలిన తర్వాత చూద్దాం అన్నట్లుగా దాటవేస్తోంది.  అయితే ఇప్పడు కొత్తగా మరో ఆశ చిగురించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆ ప్రక్రియ  మొదలు పెట్టలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రావు రంజిత్‌ వివరించారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందనీ, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం   చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే, సుప్రీం ధర్మాసనం కేంద్ర, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఈసీకి నోటీసులు జారీ చేసింది.   ఇంతవరకు రాజకీయ  పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇదే ప్రశ్న వేసినా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టిచుకోలేదు. మంత్రులు నియోకజకవర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సమధాన్నాని దాట వేస్తూ వచ్చారు. అయితే ఇప్పడు, సుప్రీం కోర్టు  నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.   సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై ఏదో ఒక వైఖరి తీసుకోకుండా ఇక కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని న్యాయనిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.  నిజానికి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాలను పెంచాలని రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ కేంద్రానికి టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేస్తూనే ఉంది. అయితే, నియోజక వర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ ఆవు కథను వినిపిస్తూ వచ్చింది. అయితే తెరాస నియోజక వర్గాలు పెంచాలని కోరినా, బీజేపీ ప్రభుత్వం కాదన్నా అందుకు ప్రధానంగా రాజకీయమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా లాభ నష్టాలను బీజేపీ బేరీజు వేసుకుంటుందని, నియోజక వర్గాలు పెంచితే తమకు అనుకూలమని అంచనాకు వస్తేనే ఈ అంశంపై ముందుకెళ్లే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకూ కేంద్రం కాలయాపన చేస్తూనే ఉంటుందని చెబుతున్నారు. కాగా, తెలంగాణలో నియోజక వర్గాలు పెరిగితే రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజక వర్గాల్లోనే మెజారిటీ స్థానాల్లో తమ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరని, నియోజక వర్గాలను పెంచితే బలమైన అభ్యర్థులు దొరకడం కష్టతరమన్నది వారి అభిప్రాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, తెరాస నియోజక వర్గాల సంఖ్య పెరిగితే మరింత మంది పార్టీ నేతలకు అవకాసం కలిపించి,అసంతృప్తిని తగ్గించుకోవచ్చని ఆశిస్తోంది. అయితే, కోర్టుల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సరికి పుణ్య కాలం పూర్తవుతుందని అంటున్నారు.

అమరావతే ఏపీ రాజధాని: తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్

అమరావతి రైతుల మహా పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. ఏపీకి ఒకటే రాజధాని అది అమరావతే అని నినదిస్తూ అమరావతి రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన  పాదయాత్ర మంగళవారం తొమ్మిదో రోజు బాపట్ల జిల్లా రేపల్లె నుంచి మొదలై పెనుమూడి వారథి మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.  ఈ సందర్బంగా కృష్ణా జిల్లాలోని పల్లె పల్లె నుంచీ జనం అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికారు. పెనుమూడి వారధి కింద కృష్ణానది ప్రవహిస్తుంటే.. వారథిపైనా ఆకుపచ్చ ప్రవాహం సాగుతోందా అన్నట్లుగా రైతుల పాదయాత్ర సాగింది. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా జగన్ యావత్ రాష్ట్రాన్నీ అధోగతి పాలు చేశారనీ, ఈ విషయాన్ని రాష్ట్రప్రజలు గుర్తించారని రైతులు పేర్కొన్నారు.  జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు కల్పించినా, అసత్య ప్రచారాలు చేసినా జనం మాత్రం అమరావతే రాజధాని కావాలని కోరుకుంటున్నారనీ, అందుకు తమ పాదయాత్రకు వస్తున్న అపూర్వ స్పందనే నిదర్శనమని రైతులు పేర్కొన్నారు.  కృష్ణా జిల్లాలోకి రైతుల మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతూ తెలుగువన్ ఎండీ కంఠంనేని రవి శంకర్ జగన్ ప్రభుత్వం తుగ్లక్ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. కర్నాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాజధాని చెన్నై ఎలాగో  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమేనన్నారు. రైతుల మహాపాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.    ఈ పాదయాత్రలో తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వివిధ పార్టీలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో వచ్చారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ రైతుల పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించింది.  మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ప్రారంభించిన ఉద్యమం ఈ ఏడాది సెప్టెంబర్ 12వ తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని రైతులు అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  రాజధాని పరిధిలోని 29 గ్రామాల నుంచి రైతులు, రైతు కూలీలు, మహిళలుతోపాటు అన్ని వర్గాల వారు ఈ మహా పాదయాత్రలో పాల్గొంటున్నారు.  ఈ మహా పాదయాత్ర... వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భాగవానుడి చెంతకు చేరనుంది. ఈ మహా పాదయాత్రకు అధికార వైసీపీ మినహా  అన్ని రాజకీయ పార్టీలూ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.