బీజేపీ వారి అంతులేని స్వామిభ‌క్తి

తెర‌మీద చిరు స్టెప్పులేస్తుంటే కుర్రాళ్లు టిక్కెట్లుతో పాటు నోట్లు కూడా చింపి హాల్లో డాన్సులు వేయ‌డం వీరాభిమానానికి ప‌రాకాష్ట‌. త‌మ నాయ‌కుడి ఆరోగ్యం బాగుప‌డాల‌ని చాలాకాలం క్రితం కేర‌ళ ఉంచి తిరు ప‌తికి ఒక వ్య‌క్తి సైకిల్ యాత్ర చేశాడు..అదీ వీరాభిమాన‌మే. కానీ ర‌క్త‌దానం ఇవ్వ‌డం, మ‌రీ ఆవేశం ఎక్కువైతే అమితాబ్ బ‌చ్చ‌న్ కోసం ప్రాణ‌త్యాగం చేయ‌డం వంటివీ విన్నాం. కానీ బీజేపీ వారి స్వామి భ‌క్తి అంతంకు ఎన్ని రెట్ల‌యినా ఎక్కువే!  ప్ర‌ధాని వ‌స్తున్నారంటే దారంతా పూల‌దారి చేయ‌డం గురించి విన్నాం, నాయ‌కుని పుట్టిన‌రోజున ఊరంతా స్వీట్లుపంచి గుళ్ల‌లో పూజ‌లు చేయించ‌డం, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా హోమం చేయించిన వీరాభిమానులూ ఉన్నారు. కానీ వీరాభిమానం వీరావేశంలో వేళ్లు కోసుకోవ‌డం, బావిలో దూకడం, డ్యామ్‌ల మీంచి దూక‌డం, ఓడితే ఉరేసుకుంటామ‌న‌డం.. ఇలాంటి విప‌రీత మాన‌సిక ప‌రిస్థితుల్లో అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు చాలా ఎక్కువే వీరాభిమానం ప్ర‌క‌టిస్తూన్నారు. దీనికి అంతూ పొంతూ లేదు.  అక్క‌డితో ఆగిపోలేదు.. బీజేపీ వారి వీరాభిమానం మ‌రీ నాలుగు ఆకులు ఎక్కువే! ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో  రాకేష్ స‌చిన్ అనే ఒక మంత్రి ఏకంగా ప్ర‌ధాని మోదీజీ ప‌ట్ల స్వామిభ‌క్తి ఊహించ‌నివిధంగా ప్ర‌క‌టించారు. అది ఒక్క‌డే కాదు, కొంత‌మందితో క‌లిసి చేసింది. మోదీజీ పుట్టిన‌రోజున ఆయ‌న‌కు స్వామిభ‌క్తి ప్ర‌క‌టించ‌ డంలో శుభాకాంక్ష‌లు పంపించ‌వ‌చ్చు, వీలైతే స్వీట్లు, శాలువ‌లు ఫ్ల‌యిట్‌లోనూ పంప‌గ‌ల‌డు. కానీ ఈ మ‌హాను భావుడు ఏకంగా పూజ చేసాడు. ఎవ‌రికి ప్ర‌ధానికే. ఆయ‌న ఫాలోయ‌ర్ల‌తో క‌లిసి స్వీట్లు పంచుకోవ‌ డంతోపాటు ప్ర‌ధాని ఫోలోకి పూల‌దండ‌లు వేసి మ‌రీ ఆ స్వామి భ‌క్తికి ప‌రాకాష్ట తెలియ‌జేశాడు. సుబ్భ‌ రంగా బ‌తికున్న మ‌నిషి ఫోటోకి పూల‌మాల వేసి మ‌రీ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఏమిట‌ని క‌నీసం అక్క‌డున్న వారిలో ఏ ఒక్క‌రికీ అనుమానం త‌ట్ట‌లేదు. దాన్ని వీడియో చేసి మ‌రీ నెటిజ‌న్ల‌కు చూపారు. అంద‌రూ తిట్టేరు.. మీకిదేం బుద్ధ‌ని. మ‌రి మంత్రిగారి నిర్వాకం గ‌నుక‌, అక్క‌డే ఉన్న‌వారు గ‌ట్టిగా ఏమీ అన‌లేక‌పోయా రు. మంత్రిగారికి ఆ మాత్రం చిన్న‌విష‌యం తెలీకుండా ఎలా ఉంది?  అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌.  దీన్ని స్వామి భ‌క్తి అనాలా, పిచ్చ అనాలో బీజేపీ వారే తేల్చుకోవాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

....మ‌రి జిన్నా ట‌వ‌ర్ పేరు మారుస్తారా ?

పిల్ల‌వాడు ప‌రుగున ఇంట్లోకి వ‌చ్చి ఏడ‌వ‌డం మొద‌లెట్టాడు. పెద్దావిడ ఏమైంది, ఎందుకు ఏడుస్తు న్నావ‌ని అడిగింది. న‌న్ను వేరే పేరుతో పిలుస్తున్నార‌ని కోపంగా చూశాడు. నీ పేరు అంద‌రం అనుకుని పెట్టింది. ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నావ్ .. ఇపుడు నీ పేరు ఎవ‌ర్రా మార్చి పిలిచింది? అని ఆవిడా ఆగ్ర‌ హించింది. అదుగో అలా ఉంటుంది.. అంద‌రూ ఇష్ట‌ప‌డి పెట్టుకున్న పేరుని అమాంతం చెప్పాపెట్ట‌క మార్చేస్తానంటే  పిల్లాడి ఇంటివారే కాదు, ఆ వీధిలోవారూ అంగీక‌రించ‌రు.  అభిమానం ఉండ‌వ‌చ్చు, వీరాభిమానం ఉండ‌వ‌చ్చు. అలాగ‌ని మ‌న‌దే దేశ‌భ‌క్తి,, వీరాభిమానం అని భీష్మిం చుకునే కాలం కాదిది. అంద‌రినీ గౌర‌వించి మ‌న‌న‌వ‌ల‌సిన కాలం. ఒక‌రికి ఎన్టీరామారావు గొప్ప మ‌రొక‌రికి చిరంజీవి మ‌హాగొప్ప‌, ఒక‌రికి వైఎస్సార్ అంటే గొప్ప‌. అలాగ‌ని త‌మ ఇష్టం ప్ర‌కారం అన్నీ మ‌న‌ వాళ్ల‌పేర్లే ఉండాలంటే ఎలా అవుతుంది. అంద‌రికీ ఇష్ట‌మైన‌వారు, ఎలాంటి అభ్యంత‌రాలు పెట్ట‌ న‌వ‌స‌రం లేని రాజ‌కీయ‌వేత్త‌లు, నాయ‌కులు ఉంటారు.. గాంధీ, నెహ్రూ, వాజ్‌పేయి, పి,వి, న‌ర‌ సింహా రావు, ఎన్టీ రామారావు లాంటివారు. వారు సామాజికంగా, రాజ‌కీయంగానూ త‌మ ప్ర‌త్యేక‌త‌ ల‌తో దేశ ప్ర‌జ‌ ల్ని అమితంగా ఆక‌ట్టుకు న్న‌వారు. అందువ‌ల్ల వారి మ‌ర‌ణానంత‌రం ఏదో ఒక ప్ర‌త్యేక క‌ట్ట‌డానికో, ఉన్న క‌ట్ట‌డానికో వారి పేరు పెట్టు కుని గౌర‌వించుకోవ‌డం చాలా స‌హ‌జం. అంతేగాని అధికారం ఉందిగ‌దా అని పేర్లు మార్చేస్తానంటే ఎలా?  ఇపుడు తెర‌మీదకి తాజాగా పేర్ల మార్పిడి చిత్రం వ‌చ్చింది. ఎవ‌రికి తోచిన‌ట్టు వారు మార్చేయ‌డానికి పూనుకుంటున్నారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌బుత్వం ఏకంగా విమానాశ్ర‌యానికి రాజీవ్‌గాంధీ పేరెట్టేసు కున్నారు. కేంద్రంలో బీజేపీవారు ఏకంగా ప‌ట్ట‌ణాల‌పేర్లు మార్చే య‌జ్ఞం చేయ‌డానికి పూనుకుంది. అంత‌టితో ఆగ కుండా ఏకంగా తాజ్‌మ‌హ‌ల్ పేరునీ మార్చేస్తామ‌ని ఆమ‌ధ్య ప్ర‌క‌టించింది. ఇంత‌కంటే ప్ర‌జాసంక్షేమ ప‌థకాల‌ అమ‌లు గురించి ప‌ట్టించుకుంటే చాలుగ‌దా  అన్నాడు ఢిల్లీలో ఆటోవాడు. తాజ్‌ మ‌హ‌ల్  పేరు అదే ఉన్నా, మార్చినా ఎవ‌రు ప‌ట్టించుకుంటారన్న‌ది సాధార‌ణ ప్ర‌జానీకం అభిప్రా యం. కానీ ప్ర‌భుత్వా లు ఊరుకునేట్టులేవు. ఇపుడు తాజాగా అదే ఆలోచ‌న ఏపీ స‌ర్కార్‌కీ వ‌చ్చింది. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్ట‌డానికి గ‌ట్టి నిర్ణ‌యం తీసేసుకుంది. విప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. కానీ మొండి వాడి ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌దుగ‌దా! ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చి తీరుతాన‌ని తీర్మానించారు. వెంట‌నే విప క్షాలు, తెలుగు ప్ర‌జ‌లు, అన్ని పార్టీల నాయ‌కులు అంతా పేరు మార్చ‌ద్ద‌య్యా సామీ ఎందుకు భ్ర‌ష్టుప‌డ తావు అని అన్నారు. స‌సెమిరా కాద‌న్నాడు. బీజేపీ వారికి కోపం చిర్రెత్తుకొచ్చింది. అయితే గుంటూరు లోని  జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చండి సార్ అన్న డిమాండ్ మ‌ళ్లీ తెర‌మీద‌కి తెచ్చారు. బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ రెడ్డి గుంటూరులోని జెన్నా సెంట‌ర్ పేరు మార్చాల‌ని అన్నారు. నిజానికి ఈ డిమాండ్ ఇపుడే వ‌చ్చింది కాదు,  ఆ మ‌ధ్య కూడా త‌లెత్తింది. కానీ అది అర్ధంలేని డిమాండ్ అంటూ స‌ద‌రు ఏపీ ప్ర‌భుత్వ‌మే కొట్టిప‌డేసింది. జిన్నా ట‌వ‌ర్ అనేది మ‌త‌మౌఢ్యంతో పెట్టిన పేరు కాద‌ని, అప్ప‌టి కాల ప‌రిస్థితులు, జిన్నా భార‌త్‌తో ఉన్న అనుబంధానికి గుర్తుగా పెట్టిన‌ద‌ని స‌మా ధానం ఇచ్చుకున్నారు. స‌రే చరిత్ర ఏమి చెబుతున్న‌ప్ప‌టికీ, ఒక దురాలోచ‌న వ‌చ్చిన‌పుడు దానికి ధీటుగా మ‌రో ఇర‌కాటంలో పెట్టే ఆలోచనే వ‌స్తుంది. అదే పెద్ద స‌మ‌స్య‌గా, ప్ర‌శ్న‌గా ప్ర‌బుత్వాన్ని నిల‌దీస్తుంది. ఇపుడు అదే ఇర‌కాటంలో ప‌డింది ఏపీ ప్ర‌భుత్వం. త‌మ తండ్రిగారు మంచి డాక్ట‌ర్‌గా, మంచి పాల‌కునిగా, నాయ‌కునిగా అనేక‌మంది వీరాభిమానుల‌ను సంపాదించుకోవచ్చు కానీ  మ‌రో మ‌హానుభావుడి పేరున ఉన్న సంస్థ‌కు తండ్రిపేరు పెట్టాల‌నుకోవ‌డంలో ప్ర‌త్యేక వివ‌ర‌ణ అంటూ జ‌గ‌న్ ఇవ్వ‌లేదు.  వైఎస్సార్ అంటే అంద‌రికీ అభిమాన‌మే. అంద‌రికీ ఇష్ట‌మే. అలాగ‌ని ఇబ్బందిక‌రంగా ఉండే నిర్ణ‌యా ల‌తో ప్ర‌జ‌లు, విప‌క్షాలు ఆగ్ర‌హించి, ఎదురుతిరిగే ఆలోచ‌న‌లు చేయ‌డం ప్ర‌భుత్వానికే న‌ష్టం అన్న‌ది జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే అనుకోవాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇపుడు బీజేపీ నాయ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్ లేవ‌నెత్తిన అంశం కాస్తంత పాత‌దే, ప్ర‌జ‌లు పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోలేదు. కానీ ప్ర‌స్తుతం హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చాల‌న్న ఆలోచ‌న‌తో మొండిగా సీఎం వ్య‌వ‌హ‌రిచ‌డంతో మ‌ళ్లీ బీజేపీ వారి డిమాండ్‌కి ప్రాధాన్య త ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. విప‌క్షాలకు ఆ అవ‌కాశం ఇచ్చి నెత్తిన మొట్టికాయ‌లు వేయించుకోవడంలో స‌ర‌దా ఏమిటన్న‌ది వైసీసీ నాయ‌కులే చెప్పాలి. 

మోడీకి జన్మదిన కానుక నా ఆత్మహత్య.. మహారైతు సూసైడ్ నోట్

ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన కానుకగా ఓ రైతు తన మరణాన్నే ఇచ్చారు. మహారాష్ట్రకు చెందిన రైతు దశరథ లక్ష్మణ్ కేదారి అనే రైతు మోడీ జన్మదినం రోజునే ఆత్మహత్యకు పాల్పడి.. ఇదే తాను ప్రధానికి ఇస్తున్న జన్మదిన కానుకగా తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. తాను ఓ సాధారణ రైతుననీ, ఉల్లి పంటకు మద్దతు ధర లేదనీ, టమాటాలదీ అదే పరిస్థితనీ పేర్కొన్నారు. కరోనా విలయం, భారీ వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, అన్ని కష్టాలూ తట్టుకుని పంట పండించినా మార్కెట్ లో ధర ఉండట లేదనీ, ఈ అనుభవాలతో జీవితంపై విరక్తి కలిగిందనీ దశరథ్ లక్ష్మణ్ కేదారి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రైతులు బిచ్చగాళ్లు కాదనీ, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. రైతు గోస ప్రపంచానికి అర్థం కావాలనే, తెలియజెప్పాలనే తాను ప్రధాని మోడీ జన్మదినం రోజున ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. 

హెల్త్ వర్సిటీ పేరు మార్పు జగన్ తుగ్లక్ చర్య.. మాజీ ఎంపీ కంభంపాటి

 ఏపీ సీఎం జగన్ తుగ్లక్ ను మించిపోయారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. జగన్ తీరు పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండన్నట్లుగా ఉందన్నారు.   తెలుగుజాతికి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కుల,మతాలకు అతీతంగా అన్నివర్గాలకు అభిమానపాత్రుడు, అజాత శత్రువైన ఎన్టీఆర్ పేరు మార్చాలనుకోవడం తెలుగుజాతికే అవమానమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలకు నిదర్శనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. వైద్య విద్యా రంగాన్ని ఆధునీకరించి, అన్ని మెడికల్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ఎన్టీఆర్ సత్సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం దారుణమని, దుర్మార్గమని కంభంపాటి ధ్వజమెత్తారు. వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ కృషిని చరితార్ధం చేసేందుకే నారా చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి గౌరవించారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటై ఇప్పటికి 36 ఏళ్లయ్యిందనీ, ఆ వర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లయ్యిందనీ పేర్కొన్న ఆయన  ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం  వైకాపా ప్రభుత్వ   తుగ్లక్ చర్య అని విమర్శించారు. తక్షణమే ఈ పేరుమార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

స్టూడెంట్ త‌ల్లికి టీచ‌ర్ పెట్టిన ప‌రీక్ష‌!

చింటూ స్కూల్ నుం చి వ‌స్తూనే ఒక పెద్ద క్వ‌శ్చ‌న్‌పేప‌ర్ తెచ్చా డు. ఇదేమిటే నిన్న‌ నేగా ప‌రీక్ష‌ రాశావ్ ఇదేమిటి? అని అడి గింది త‌ల్లి అమాయ‌ కంగా. ఇది నీకోస‌మే అన్నాడు.  నేనేం రాయాలి? అంది. వెంట‌నే ఇద్ద‌రూ లోప‌ల గ‌దిలోకి వెళ్లి కూచుని ఆ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ తీసి చూశారు. అందులో ప్ర‌శ్న‌ల‌కు ఏమి రాయాలో తోచ‌ క త‌ల‌గోక్కుంది త‌ల్లి. ఇదేం ప్ర‌శ్న‌లు... అయినా న‌న్ను స‌మాధా నాలు రాయ‌మ‌ని టీచ‌ర్ అడ‌గ‌డ‌మేమిటి అంది త‌ల్లి ..త‌ప్ప‌ద‌మ్మా అంటూ కాయితం అందించి పారిపోయాడు చింటూ. పాఠశాల పిల్లల తల్లిదండ్రులతో తరచుగా సంభవిస్తుంది, వారు తమ పిల్లలకు పాఠశాలల నుండి నియమాలు విధానా లను అర్థం చేసు కోలేరు. కానీ పాఠశాలకు సంబంధించిన ఏదైనా పేపర్ వర్క్‌ను పూర్తి చేసేటప్పుడు వారు తమ బిడ్డను మ‌హా తెలివిగ‌ల‌వాడిగా చిత్రీకరిస్తారు. కానీ ఒక అమెరికన్ తల్లి పాఠశాల ఫారమ్‌పై చిత్ర‌మైన‌ వ్యాఖ్యతో ప్రతిస్పందించింది. ఒక మహిళ  నిజాయితీ సమాధానాలపై ఇంటర్నెట్ వినియోగదారులు బిగ్గరగా నవ్వారు. నవలా రచయిత, న్యూయార్క్ మ్యాగజైన్‌లో ఫీచర్ల రచయిత, ఎమిలీ గౌల్డ్, తన 4 ఏళ్ల కొడుకు ఇల్యా కోసం సమాధానమిచ్చిన పాత్ర అభివృద్ధి ప్రశ్నల  స్నీక్ పీక్‌ను అందించడానికి ట్విట్టర్‌ని ఉపయో గించారు. చదివిన తర్వాత మీరు ఎమిలీ హాస్యాన్ని నిస్సందేహంగా ప్రశంసిస్తారు ఎందుకంటే ఇది చాలా త‌మాషాగా ఉంది. పాఠశాల నుండి వచ్చిన ప్రశ్నలు, అతని కొడుకు పాఠశాల ఫారమ్‌పై ఎమిలీ ఇచ్చిన ప్రతిస్పందనలు ఇక్కడ ఉన్నాయి. 1: సామాజికంగా, నా బిడ్డ పని  చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎమిలీ సమాధానం,  పేరున్న తల్లి కొడుకుగా కాకుండా ప‌నిచేయాలి. 2: విద్యాపరంగా, ఈ సంవత్సరం నా బిడ్డ ఉండాల్సిన స్థాయి..        సమాధానం: ఎవరు పట్టించుకుంటారు, ఉండాల్సింది 4! 3: నా బిడ్డను వివరించడానికి నేను 3 పదాలను మాత్రమే ఎంచుకోవలసి వస్తే నేను ఎంచుకుంటాను: ఎమిలీ ఈ మూడు పదాలను ఎంచుకుంది..  వికాస‌వంతంగా, ఆత్మ‌విశ్వాసం, కూల్. 4: ఫారమ్‌లోని చివరి ప్రశ్న మీ బిడ్డ గురించి నేను తెలుసుకోవాలనుకునే ఇంకేమైనా ఉందా? ఆ తర్వాత తల్లి మరో గ‌ట్టి స‌మాధాన‌మే ఇచ్చింది. ఆమె ఇలా రాసింది, మీరు ఇలియాను ప్రేమిస్తారు. అతను చాలా మంచి  వ్యక్తి, అతను పుట్టినప్పుడు మారేవాడా అని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను. (అప్పుడు  ఇంట్లో పుట్టినట్లు గుర్తుంది ). చాలా మంది వ్యక్తులు ట్వీట్‌పై వ్యాఖ్యానించారు. ఎమిలీ  హాస్యభరితమైన, ఘాటైన ప్రతిచర్యలను వినోదభరితంగా కనుగొ న్నారు. ఇతర వినియోగదారులు తమ స్వంత సందర్భాలలో ఎమిలీ చమత్కారమైన ప్రతిస్పందనలను ఉపయోగించు కుంటారని చెప్పారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వెల్లువెత్తుతున్న నిరసనలు

తాటిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగట్టి కోసం అన్నడట అన్నది సామెత అలాగే ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుకు కారణమేమిటంటే జగన్ ఎన్టీఆర్ డాక్టర్ కాదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పడం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ పాపాల లెక్క పరిమితి దాటేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలలో ఆగ్రహాన్ని నింపాయనీ.. అయితే ఎన్టీఆర్ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం ప్రజలలో ఆయన పట్ల ఏహ్య భావాన్ని కలిగించిందని అంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇదే పంథా అనుసరించి ఉంటే..  జగన్ పాదయాత్ర చేయగలిగే వారా? వైఎస్ పేరు ఏపీలో ఎక్కడైనా కనిపించనిచ్చే వారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహం, జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది.     ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మార్చేందుకు బుధవారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీ ఆమోదం తెలపడం రాష్ట్రంలో రాజకీయ రచ్చ రేపింది. ఎన్టీఆర్‌ హెల్త్‌  ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి  డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హెల్త్‌ యూనివర్సిటీగా పేరు  మార్చే నిర్ణయంపై ఈ నిర్ణయంపై తెలుగు దేశం సహా అన్ని రాజకీయ పార్టీలు, అన్న విర్గాల ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి వల్లభనేని వంశీ లాంటి జగన్ భక్తులు కూడా ఈ విషయంలో పునరాలోచించాలని సీఎంను కోరారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి  డాక్టర్‌ ఉంది ఎన్టీఆర్‌  డాక్టర్‌ కాదు. అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని జగన్ చెబుతున్నారు. అలాగూ వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన  ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ ప్రవేశపెట్టారనీ    ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్ దేననీ అందుకే పేరు మార్చాననీ అంటున్నారు. అయితే పేరు మార్పు నిర్ణయంపై జగన్ ఇచ్చిన వివరణ, చేసుకున్న సమర్థన ఎవరూ అంగీకరించడం లేదు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసన వ్యక్తమౌతోంది. వైఎస్ తనయుడిగా తన తండ్రి పేరును సంస్థలకు పెట్టాలంటే.. తాను స్థాపించన సంస్థలకు పెట్టు కోవాలనీ.. అంతే కానీ ఎవరో కట్టిన ఇంటిని కబ్జా చేసినట్లు మహానుభావుల పేర్లను మార్చేయడం ఎంత మాత్రం సబబు కాదనీ అంటున్నారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కటంటే ఒక్క సంస్థను స్థాపించిన పాపాన పోలేదనీ, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ తన పతనానికి తానే బాట వేసుకున్నట్లుందని విమర్శకులు అంటున్నారు. 

హ‌ర్మ‌న్ వీర‌విహారం...2వ వన్డేలో  భార‌త్ విజ‌యం

ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డు తున్న వ‌న్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌ లోనూ భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కేవలం 111 బంతుల్లో అజేయంగా 143 పరు గులు చేయడంతో ఇంగ్లాండ్‌పై భారత్ ఐదు వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీ స్కోరు చేసింది. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఐదో వన్డే సెంచరీ, హర్లీన్ డియోల్ తొలి వన్డే అర్ధ సెంచరీ సహాయంతో భారత్ రికార్డు స్కోరును నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (143 నాటౌట్) ముందుండి నడిపించింది అద్బుత‌ ఇన్నింగ్స్‌ను ఆడింది, ఇది ఇంగ్లండ్‌కు రికార్డు ఛేజింగ్‌లో భారత్‌కు సహాయపడింది. కౌర్, హర్లీన్ డియోల్ మరియు మంధానల అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్ల నష్టానికి 333 పరుగుల వద్ద ముగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన‌ భారత్ రెండో ఓవర్‌లో ఓపెనర్ షఫాలీ వర్మను కోల్పోయింది తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాది భారీ స్కోరు సాధించేలా కనిపించినా కేట్ క్రాస్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేట్ తన 50వ వ‌న్డేకి అద్భుతమైన శుభారంభం చేసింది, తన మొదటి ఓవర్‌లో ఎనిమిది పరుగుల వద్ద షఫాలీని అవుట్ చేసి, మ్యాచ్ రెండవ ఓవర్‌లో భారతదేశం 12/1 వద్ద నిలిచింది. యాస్టికా భాటియా క్రీజులోకి ప్రవేశించి, 10వ ఓవర్ వరకు ఆతిథ్య జట్టుకు ఎలాంటి వికెట్ ఇవ్వకుండా 10 ఓవర్ల వద్ద స్కోరును 60/1తో హెల్తీగా తీసుకువెళ్లేందుకు ఫామ్‌లో ఉన్న స్మృతి మంధానతో కలిసి 54 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని కుదు ర్చుకుంది. ఇద్దరు బ్యాటర్లు క్రమం తప్పకుండా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును మంచి రేటుతో ఉంచారు.ఈ  క్ర‌మంలో మంధాన 3000 వన్డే పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా అక్కడికి చేరుకున్న భారత మహిళగా నిలిచింది. షార్లెట్ డీన్ 12వ ఓవర్‌లో యాస్టికా భాటియాను అవుట్ చేసి ఇంగ్లండ్‌కు చాలా అవసరమైన పురోగతిని అందించింది, ఈ జంట ఆతిథ్య జట్టు నుండి ఆటను దూరం చేసే ప్రమాదం కనిపిస్తోంది. 34 బంతుల్లో 26 పరుగుల వద్ద భాటియాను అవుట్ చేయడా నికి డీన్ తన బౌలింగ్‌లోనే అద్భుతమైన క్యాచ్ తీసుకుంది. దీంతో ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో భారత్‌న 2 వికెట్ల న‌స్టానికి 66 ప‌రుగులు చేసింది. భాటియా వికెట్ భారత కెప్టెన్‌ను చేరింది. సోఫీ ఎక్లెస్టోన్ ఓపెనర్ ప్యాడ్‌కు తగిలే ముందు ఆమె మంధానతో కలిసి 33 పరుగుల భాగస్వామ్యంలో పాల్గొంది. ఆమె 51 బంతుల్లో ఒక సిక్సర్ , నాలుగు బౌండరీలతో 40 పరుగులతో మరో సులభ నాక్ ఆడింది. 20వ ఓవర్ ముగిసే సమయానికి భారత స్కోరు 104/3, హర్లీన్ డియోల్ భారత కెప్టెన్‌తో జతక‌ట్టింది. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ ఇంగ్లీష్ బౌలర్లు తమ లైన్ మరియు లెంగ్త్‌లతో స్థిరపడేందుకు వీలుక‌ల్పించ‌లేదు.ఇద్దరు బ్యాటర్లు కొన్ని కళ్లు చెదిరే షాట్లు ఆడారు మరియు 40వ ఓవర్‌లో భారత స్కోరును 200 పరుగుల మార్కుకు పైగా తీసుకెళ్లారు.కౌర్ తన సిగ్నేచర్ స్లాగ్ స్వీప్ షాట్‌తో బంతిని మిడ్-వికెట్ బౌండరీపై నిక్షిప్తం చేయడంతో తన హాఫ్ సెంచరీని అందుకుంది. డీన్ బౌలింగ్‌లో 37వ ఓవర్‌లో భారత కెప్టెన్ తన 18వ వన్డే అర్ధశతకం సాధించాడు. ఆమె బ్యాటింగ్ భాగస్వామి డియోల్ కూడా కెప్టెన్ అడుగుజాడలను అనుసరించింది మరియు తర్వాతి ఓవర్‌లో మిడ్-వికెట్ వైపు సంప్రదాయవాద సింగిల్‌తో ఆమె తొలి వ‌న్డే యాభైని సాధించింది. చివరి 10 ఓవర్లలో ద్వయం నిల‌దొక్కుకునే  సమయంలో, డియోల్ స్టంప్‌ల మీదుగా నడిచి స్లో బాల్‌కు ఫ్లిక్ ఆడింది, కానీ ఫెన్స్ ను క్లియర్ చేయలేకపోయింది. స్క్వేర్ లెగ్ వద్ద నిలబడిన వ్యాట్ క్యాచ్‌ను ప‌ట్టింది. డియోల్ 72 బంతుల్లో రెండు సిక్సర్లు, ఐదు బౌండరీలతో సహా 58 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడి వెనుదిరిగింది.కౌర్, డియోల్ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ను డ్రైవర్‌ సీటులో కూర్చోబెట్టారు. 40 ఓవర్ల మార్క్ వద్ద, భారత్‌ స్కోరు 212/4ని చేరింది, మ్యాచ్ చివరి దశను ఉపయోగించుకోవడానికి బ్యాటర్లకు అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది.ఇన్నింగ్స్ ముగిసే సమయా నికి ఇంగ్లిష్ బౌలర్లను కొల్లగొట్టాలనే పట్టుదలతో ఉన్న కౌర్‌తో పాటు పూజా వస్త్రాకర్ చేరింది. కెప్టెన్‌తో కలిసి వస్త్రాకర్ దూకుడు షాట్లు ఆడి 45వ ఓవర్‌లో భారత్‌ను 250 పరుగుల మార్కును అధిగమించాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ పాదాలను పెడల్‌పై ఉంచారు మరియు ఇంగ్లీష్ దాడిని విచ్ఛిన్నం చేస్తూ వేగంగా పరుగులు సాధిం చాలని చూశారు.  భారత ఆల్ రౌండర్ వస్త్రాకర్ 46వ ఓవర్లో బౌండరీలు సాధించే ప్రయత్నంలో ఫ్రెయా కెంప్ చేతిలో ఆమె వికెట్ కోల్పోయింది.కౌర్ 47వ ఓవర్‌లో ఒక ఎక్లెస్టోన్‌తో వ‌న్డేలలో తన ఐదవ సెంచరీని కొనసాగించింది. భారత కెప్టెన్‌గా బ్యాటర్ రెండో సెంచరీని నమోదు చేసింది.దీప్తి శర్మ, కౌర్ ఇద్దరూ నాలుగు సార్లు బంతిని బౌండరీకి ​​పంపడంతో 48వ ఓవర్‌లో 26 పరుగులు ఇవ్వడంతో ఫ్రెయా కెంప్ క్లీనర్‌గా మారింది.ఇన్నింగ్స్ రెండో చివరి ఓవర్‌లో భారత కెప్టెన్ ఎక్లెస్టోన్‌ను ఒక సిక్స్, రెండు బౌండరీలతో కొట్టడంతో 17 పరుగులు వచ్చాయి. దీప్తి శర్మతో కలిసి కెప్టెన్ చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుకుప‌డింది. వీరిద్దరూ కేవలం 24 బంతుల్లోనే 71 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఇంగ్లండ్‌పై భారత్‌ను తమ అత్యధిక వ‌న్డే స్కోరుకు తీసుకెళ్లారు.

కర్నాటక సీఎం మార్పు తప్పదా?.. నాలుగో కృష్ణుడు ఎవరో?

దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఎన్నికలలో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్న కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గతంలో కాంగ్రెస్ అనుసరించిన ఏ విధానాలనైతే విమర్శిస్తూ వచ్చిందో.. ఇఫ్పుడు అవే విధానాలను బీజేపీ అనుసరిస్తోంది. చీటికీ మాటికీ మంత్రులను మార్చే సంస్కృతి ఇప్పుడు బీజేపీది అయ్యింది. బొటాబొటీ మెజారిటీతో కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి ముఖ్యమంత్రి మార్పు కు రంగం సిద్ధం చేసిందంటున్నారు.   ఒక వైపు పార్టలో అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై వల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు.   బెంగళూరు నగరాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వర్షాలు,వరదల సమయంలో ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై ఎగసిపడుతున్న ప్రజాగ్రహం. ఇలా అన్ని వైపుల నుంచీ ప్రభుత్వాన్ని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్నా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బీజేపీ. అప్పటి నుంచి అధికారాన్ని నిలుపుకోవడానికి నానా తంటాలూ పడుతోంది.   ఇటీవలకురిసిన వర్షాలకు బెంగళూరు ముంపునకు గురైంది. ఐటి కంపెనీలు నీట మునిగిపోయాయి.   ప్రభుత్వ పథకాల్లో అవినీతి పెచ్చరిల్లింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికలలో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాగ్రహాన్ని తగ్గించి, వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు పావులు కదపడం మొదలెట్టింది. అందులో మొదటిగా  ప్రజాభిమానం పొందడంలో అన్ని విధాలుగా విఫలమైన ముఖ్యమంత్రి బొమ్మై స్థానంలో మరొకరిని సీఎం కుర్చీలో కూర్చో పెట్టాలని భావిస్తోంది. నాలుగో కృష్ణుడు ఎవరా అన్న ఆసక్తి కర్నాటక బీజేపీలో నెలకొంది. అసలే బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వ బండిని లాగిస్తున్న కర్నాటక బీజేపీలో సీఎం ఆశావహుల సంఖ్య భారీగానే ఉందంటున్నారు. ఇప్పుడు బొమ్మై స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తే ఎవరు అసమ్మతి రాగం ఆలపిస్తారో అన్న ఆందోళన బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది. 

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు: స్పష్టం చేసిన సీఈసీ

ఏపీ సీఎంకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ   శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎంపిక చెల్లదని విస్పష్టంగా తేల్చేసింది.ఒక్క వైసీపీ అనే కాదు ఏ రాజకీయ పార్టీలోనూ  శాశ్వత పదవులు అనేవి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. పార్టీ శాశ్వత ఎన్నిక నియమాల ఉల్లంఘనేనని పేర్కొంది. ఈ మేరకు వైసీపీ  జనరల్ సెక్రటరీకి సీఈసీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లుబాటు కాదని ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డిని ఎన్నుకున్న సంగతి విదితమే. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా సవరించిన సంగతి విదితమే  సీఈసీ గైడ్ లైన్స్ మేరకు గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ  రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి  అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. అంతే తప్ప పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియామకాలు వీలు కాదు. నిబంధనలు విస్పష్టంగా ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీ నిర్దుష్ట కాలపరిమితిలో ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి.  అందుకే వైసీపీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడంటూ ఆ పార్టీ చేసిన తీర్మానం, ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది.

చిరును వదలని రాజకీయ బొమ్మాళి

అవును .. నిజం చిరును రాజకీయం వదలనంటోంది.  అవునండోయ్ .. నిజమే నండోయ్ తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఆడియో ట్వీట్,  గాడ్ ఫాదర్ సినిమా డైలాగే అయినా, నిజమేనండోయ్. చిరంజీవి రాజకీయాలకు దూరమైనా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదన్నది మాత్రం ‘రియల్’ గానూ నిజమేనండోయ్.   ఆయన రాజకీయాలను వదిలేసి చాలాకాలమే అయింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత ఇంకొంత కాలం, రాజ్యసభ సభ గడువు ముగిసే వరకు రాజకీయాల్లో ఉండీ ఉండన్బట్లు ఉన్నా, ఆ తర్వాత, రాజేకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. సినిమాల్లో బిజీ అయి పోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్’ రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు, ఎన్నికల్లో పోటీ చేసినా, చిరంజేవై మాత్రం, అసలు ఆ దిక్కు కేసి .. ఒక్క  స్టెప్ కూడా వేయలేదు. కనీసం ఒక్కసారి పేస్ టర్నింగ్ ‘ ఇచ్చి ఒక్క లుక్కైనా వేయలేదు.  అయినా .. .అయన పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, రాహుల్ గాంధీ ఏపీ పార్టీ అధ్యక్ష పదవి చిరంజీవికి ఇచ్చే ఆలోచన చేశారు. చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతున్నారని అమరావతిలో-హైదరాబాద్’లో పార్టీ సమావేశాలు నిర్వహించినా దూరందూరంగానే ఉన్నారు. అప్పట్లోనే చిరంజేవి కాంగ్రెస్ పార్టీలో  ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సినిమా టికెట్’ రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా ప్యాలెస్కు పిలిచి చర్చలు జరిపారు. ఓ చిరు సన్మానం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూ, ‘ఇదిగో తోక, అదిగో పులి’ వార్తలు షికారు చేశాయి. చివరాఖరుకు మెగా స్టార్, అబ్బే అలాంటిదేమీ లేదని సంజాయషీ లాంటింది ఇచ్చుకునేందుకు చాలా చాలా శ్రమ తీసుకోవలసి వచ్చింది.  అలాగే, ఈ మధ్యనే అల్లూరి సీతరామరాజు 125వ జయంతి సందర్భంగా, భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నఅల్లూరి విగ్రహవిష్కరణ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిపిచారు. ప్రధాని మోడీ ఎదురెళ్ళి మరీ చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానించారు. హగ్గులు, అలింగానాల ద్వారా ప్రధాని మోడీ స్వయంగా  ఇద్దరి మధ్య, ‘సంథింగ్, సంథింగ్’ ఎదో ఉందనే సంకేతాలను పంపించారు. అదే వేదిక మీదున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరకు మంత్రి రోజా, కంటే కూడా చిరంజీవికి మోడీ కొంచెం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చిరంజీవిని బీజేపీ దువ్వుతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే మెగా బ్రదర్  నాగబాబు, ఆ వేదిక మీద ఒక్క చిరంజీవి మినహా మిగిలిన అందరూ అద్భుతంగా నటించారని, ఓ కాంట్రవర్షల్ కామెడీ కామెంట్ కూడా చేశారు. బట్ ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి. సో .. చిరంజీవి, గాడ్ ఫాదర్ చితం ప్రమోషన్ కు రిలీజ్ చేసిన, డైలాగులో చెప్పినట్లుగా,  తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదన్నది... నిజంగానే నిజం.అయిత ఇక్కడితో కథ కంచికి చేరలేదు. అసలు  అసలు ట్విస్ట్ ఇక్కడే ..ఉంది. ఇంచుమించుగా ఓ 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగతున్న ఎన్నికల్లో, చిరంజీవికి ఓటు హక్కు ఉంది. అవును, అవును కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనకు తెలుసో లేదో కానీ, కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవి పేరుతో ఉన్న ఐడీకార్డును కాంగ్రెస్ పార్టీ  విడుదల చేసింది. పోనీ అదేదో ఆకతాయలు పననుకుందామా అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా  స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు కాంగ్రెస్ పార్టీ  జారీ చేసింది. దీంతో, చిరంజీవి రాజకీయాలకు దూరమైనా .. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదని మరో మారు పక్కగా, కన్ఫర్మ్ అయింది ... అంతే మరి మామూలు గజ్జీ, తామర అయితే ఏ  జాలింలోషన్’తోనో నయం అవుతాయి.. ఇది రాజకీయ గజ్జీ,అంటుకుంటే అంతే.. ఇక వదలనే వదలదు. గోకుతూనే ఉంటుంది.

ఇది అనైతిక‌, అనారోగ్య రాజ‌కీయం.. సుజ‌నా చౌద‌రి 

ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్చ‌డం అంశంపై బుధ‌వారం అసెంబ్లీలో విప‌క్షం విరుచుకు ప‌డింది. తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌.టి.రామావు హెల్త్ యూనివ‌ర్సిటీ క‌ల సాకారం చేయ‌ డానికి స్థాపించిన వ‌ర్సిటీకి ఆపేరు ఉండ‌డాన్ని అన్ని వర్గాల‌వారూ, అన్ని పార్టీల‌వారూ ఆమోదించార‌ని. అదే పేరుతో కొన‌సాగుతోంద‌ని ఇపుడు ఆ పేరు మార్చాల‌నుకోవ‌డం దారుణ‌మ‌ని తెలుగుదేశం స‌భ్యులు ఆగ్ర హించారు.  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ  అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి  అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా  కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని అన్నారు. ఇలాం టి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుజనా చౌదరి అన్నారు. కాగా,  బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ బుధవారం  మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు పిచ్చి బాగా ముదిరిందన్నారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని మండి పడ్డారు. బుద్ధి, జ్థానం లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఆభిమా నులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరకు వచ్చింది.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయా లని సీఎం రమేష్‌ పిలుపిచ్చారు. అలాగే,  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి పీతల సుజా త మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు మార్చి యావత్ తెలుగుజాతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోని జగన్రెడ్డి.. యూనివర్శిటీ నిధులు రూ.400 కోట్లు లాక్కు న్నారని ఆమె ఆరోపించారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించకపోతే.. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు.  ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ,  అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  ఎక్కడ ఉన్నారని ప్రశ్నిం చారు. లక్షలాది డాక్టర్‌లు తయారయ్యే యూనివర్శిటీకి రౌడీ పేరు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయం మార్చుకోకపోతే  చరిత్ర కూడా క్షమించదని హెచ్చరించారు. 

జగన్ సర్కార్ పతనం ఖాయం.. రైతల పాదయాత్రలో కంఠంనేని రవిశంకర్

అమరావతి రైతుల పాదయాత్రలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ పాల్గొన్నారు. వరుసగా రెండో రోజూ ఆయన అమరావతి రైతులతో అడుగు కలిపి నడిచారు.  అమరావతి నినాదంతో దివిసీమ మార్మోగింది.  అమరావతి రైతుల మహాపాదయాత్ర పదో రోజు బుధవారం (సెప్టెంబర్21) కృష్ణా జిల్లా చల్ల పల్లి నుంచి చిన్నాపురం వరకూ సాగింది.  తెలుగువన్ ఎండీ, తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్ వందలాది మంది మద్దతుదారులతో కలిసి రైతులతో పాటు  నడిచారు. చల్లపల్లిలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి పదో రోజు యాత్ర ప్రారంభించిన రైతులకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర అరసవల్లి చేరేసరికి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకతప్పదని, ఆ తరువాత జగన్ సర్కార్ పతనం కావడం కూడా తథ్యమని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న మద్దతే జనం మూడు రాజధానులను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నారనడానికి తార్కాణమన్నారు.  రైతుల పాదయాత్రకు రవిశంకర్ స్వంత నియోజకవర్గమైన అవనిగడ్డలో  జనం బ్రహ్మరథం పట్టారు.  రైతుల పాదయాత్రకు మద్దతుగా దివి సీమ  జనం  ఉప్పెనలా కదిలారు. రైతులపై పూల వర్షం కురిపించారు. దీంతో రైతులు నేల మీద కాకుండా పూలపాన్పుపైన నడుస్తున్నారా అనిపించింది. ఆకుపచ్చ ప్రవాహంలా రైతుల పాదయాత్ర సాగుతుంటే, వారికి మద్దతుగా  జనం జై అమరావతి నినాదాలు చేశారు. ఎడ్ల బళ్లకు అమరావతి ప్రభలు కట్టి అమరావతి రైతుల పాదయాత్రకు దివిసీమ వాసులు స్వాగతం పలికారు. జనసేన, కాంగ్రెస్, వామపక్షాల నేతలు కూడా తరలి వచ్చి అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలికారు. 

వినాశకాలే విపరీత బుద్ధి..!

రాజకీయాలలో, ఆత్మ హత్యలే కానీ, హత్యలు ఉండవు అంటారు పెద్దలు. అది నిజమని గతంలో అనేక మంది రుజువు  చేశారు. ఇప్పుడు ఎన్డీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ దేవుడు ఏ కలలో ఆదేశించాడో ఏమో కానీ, అయన  రాత్రికిరాత్రి  ఆత్మహత్యా సద్రుస్యమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఉన్నమంద బలాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో తెలుగు ప్రజలను అవమానించే నిర్ణయాన్ని తీసుకున్నారు.  తెలుగు దేశం పార్టీతో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో,అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి  ఎన్నైనా విభేదాలు ఉండవచ్చును. కానీ, ఆ కారణంగా, దివంగత నేత, నందమూరి తారక రామా రావు పేరును తుడిచేయడం అపచారం, నేరం అంటే సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే,  వినాశకాలే విపరీత బుద్ధి.. అంతకు మించి వేరే చెప్పవలసింది లేదు, ఉండదు. రాజకీయంగా, పోగాలం దాపురించిన వారు మాత్రమే ఇలాంటి అపచారానికి ఒడిగడతారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాలలో తనకు తానుగా ఎన్నెన్ని గోతులు తవ్వుకుందో లెక్కలేదు. అయితే, ఇప్పుడు చేసిన తప్పు, సామాన్యమైన  తప్పు కాదు. మహా పాపం. ఒక విధంగా తమ రాజకీయ సమాధికి తామే ఇటుకలు పేర్చుకోవడంతో  సమానం. ఎన్టీఅర్, తెలుగు దేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు పరిమితం అయిన సమాన్య వ్యక్తి, నాయకుడుమ నటుడు మాత్రమే కాదు. కుల మత రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామ రావు. ఆంధ్రుల  అన్నగా తెలుగు వారి గుండెల్లో గుడికట్టుకున్న శ్రీరామ చద్రుడు. శ్రీ కృష్ణుడు, ఎన్టీఅర్. అలాంటి మహనీయుని  ఇలా అవమానిస్తే, తెలుగు ప్రజలు క్షమించరు. క్షమిస్తే వారు తెలుగు ప్రజలు కాదు. నిజానికి, వైఎస్సార్ బతికుంటే, ఎన్టీఆర్ పేరు తీసి తన పేరు తగిలించడాన్ని, ఎట్టి పరిస్థితిలో అంగీకరించకపోవునేమో, నిజమే, వైఎస్సార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒత్తిడితో  ఎన్టీఆర్ పేరును తీసి, రాజీవ్ గాంధీ పేరును తగిలించారు. కానీ, ఆయన ఏ నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచన కూడా చేయలేదు. కారణం ఎన్టీఅర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఅర్ మానస పుత్రిక. హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన ఎన్టీఆర్‌ది. ఆచరణలోకి తెచ్చింది ఎన్టీఆర్. అందుకే ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఆయన పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అలాగే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. అసలు పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. జగన్మోహన్ రెడ్డికే వచ్చింది. అవును, తమ గొయ్యి తామే తవ్వుకునే వారికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలోస్తాయి. దుష్ట సంకల్పం కలుగుతుంది. అందుకే, వినాశకాలే విరీత బుద్ధి: అనవలసి వస్తోంది.

త్వరలో ప్రగతి భవన్ లో ఈడీ, ఐటీ జమిలి దాడులు

కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్యంగా ఇక ఈడీ, ఐటీ జమిలి దాడులకు రంగం సిద్ధమైందా అంటే అధికారవర్గాల నుంచి ఔననే బదులు వస్తోంది. ఒక అధికారి  బదలీ.. ఒకే ఒక్క అధికారి బదలీ... తెరాస ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ప్రకంపనలు సృష్టిస్తోంది.  తెలంగాణ డీజీపీ రేసులో ఉన్న ఒక  సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా  వసుంధర సిన్హా  బదలీ ,ఆమె స్థానంలో ముంబై ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్ ని తీసుకురావడంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   గత కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబ సన్నిహితులను విచారిస్తున్న ఈడీకి  ఇప్పుడు ఇక ఐటీ దాడులు తోడయ్యే అవకాశం ఉందని అంటున్నారు.   కేసీఆర్ కు  సన్నిహితురాలైన వసుంధర సిన్హా   ఐటీ దాడులు, విచారణకు సంబంధించిన సమాచారాన్నికేసీఆర్ కు లీక్ చేస్తున్నట్లుగా అనుమానించిన  పై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఆ స్థానంలో నుంచి తప్పించి సమర్ధుడైన అధికారిగా పేరున్న సంజయ్ బహదూర్ ను తీసుకు వచ్చారని అంటున్నారు. సంజయ్ బహదూర్ ఇప్పటికే తన పని మొదలెట్టేశారని కూడా అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం.  ఈ నేపథ్యంలోనే  ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో   సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనే జరుగుతున్న సోదాలు ఏ క్షణంలోనైనా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు చేరే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేసిన ఈడీ బృందాలు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ సహకారం కోరాయి. దీంతో అగ్నికి అజ్యం పోసినట్లు  జమిలిగా ఈడీ, ఐటీలు దూకుడు పెంచినట్లైంది. ఢిల్లీ  లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ,ఐటీ  సమష్టిగా కేసీఆర్ కు బంధువు అయిన వెన్నమనేని శ్రీనివాసరావును విచారించాయి. ఈ విచారణలో ఆయన నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని తేలింది. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నవేననీ తెలినట్లు తెలుస్తోంది.  కాగా ఈ  దాడులపై టీఆర్ఎస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందాయన్న ప్రచారాన్ని కవిత వినా మిగిలిన టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించకపోవడమే ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో సంతోష్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈడీ..బోడీ ఎవరూ ఏమీ చేయలేరంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మోడీ నన్ను గోకకపోయినా నేను ఆయనను గోకుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మోడీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం నిగ్గు తేల్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు. కేసీఆర్ కు సమాచారం లీక్ చేస్తున్నారన్న అనుమానంతో వసుంధర సిన్హా ను బదిలీ చేసి ఆమె స్థానంలో సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన సంజయ్ బహదూర్ ను తీసుకురావడం కీలక పరిణామంగా చెబుతున్నారు. సంజయ్ బహదూర్ అప్పుడే తన పని ప్రారంభించేశారనీ, ఈ కేసులు సంబంధించి ఏ క్షణంలోనైనా సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికార వర్గాల బోగట్టా. ఇప్పుడు ఇక ఈడీ, ఐటీ దాడులు ప్రగతి భవన్ కు చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.  కేంద్ర హోమంత్రి హోదాలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా  ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ (ఎస్ వీపీ ఎన్ పిఏ) పోలీసు అకాడమీలో ఈడీ, ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా ఈ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయనడానికి తార్కాణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ సాగిన దాడులు, విచారణలు ఒకటైతే ఇక ముందు  జరగబోయే దాడులు, విచారణలు ఒకెత్తుగా వారు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా డిల్లీలిక్కర్ స్కాం తీగ లాగితే కేసీఆర్ కుటుంబం డొంక కదులుతోందన్న అభిప్రాయం అయితే అధికారులలో వెల్లడౌతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు మూడు రోజులలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.  

టిడబ్ల్యు జెెె ఎఫ్ పాద‌యాత్ర‌ను అనుమ‌తించండి.. కోర్టు  ఆదేశం

తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెెె ఎఫ్) మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నాయ‌కుడు వి.అశోక్ కుమార్ పాద‌యాత్ర‌కు అనుమ‌తించాల‌ని సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్‌, సిపిలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎస్‌పీకీ బుధ‌ వారం తెలంగాణా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కె.ల‌లిత ఆదేశాలు జారీ చేశారు. వి.అశోక్ కుమార్ సెప్టెం బ‌ర్ 25 నుంచి 30 తేదీవ‌ర‌కూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు పాద‌యాత్ర చేయ‌ను న్నారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం 2008లో జారీచేసిన  జీఓ 424, 2008 ప్ర‌కారం జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వా ల‌ని  తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను త‌మ ఫెడ‌రేష‌న్ త‌ర‌ఫున ప్ర‌తిపాద‌న‌ను అంద‌చేయ‌ డానికి అశోక్ కుమార్ పాద‌యాత్ర చేయ‌త‌ల‌పెట్టిన‌ట్టు హైకోర్టుకు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  2008 జీఓ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు 2010లో త్రోసిపుచ్చారు. కాగా ఇటీవ‌ల మాజీ ప్రధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ నేతృత్వంలో  సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, దేశంలో జ‌ర్న‌లిస్టులు అంద‌రికీ ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిం చాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. 

లోకేష్ యాత్ర‌తో వైసీపీ సీన్ సితారేనా?

యాత్ర‌లంటే బామ్మ‌గారి తిరుప‌తి యాత్ర‌, కాశీయాత్రో అనుకునేవారు. కాల‌క్ర‌మంలో భ‌క్తిపూర్వ‌కంగానే కాదు, సామాజిక న్యాయం కోస‌మో, రాజ‌కీయ‌ల‌బ్ధికో ఒక యాత్రకు వెళ్ల‌డం చూస్తున్నాం. ఇపుడు  రాను రాను యాత్ర అంటే పాద‌యాత్ర‌లకే అధిక ప్రాధాన్యం ఏర్ప‌డింది. రాజ‌కీయ‌పార్టీల‌వారు అన్ని ప్రాంతా ల్లోనూ ప్ర‌జ‌ల‌కు త‌మ అజెండానో, మానిఫెస్టోనో తెలియ‌జేడానికి, ఓట‌ర్ల‌ను త‌మ‌వేపు తిప్పుకోవ‌డానికీ పాద యాత్ర‌లు చేప‌డుతున్నారు. వీటికీ రంగుమారి పాద‌యాత్రలే విజ‌య‌ర‌హ‌స్యాలు అన్న అభిప్రా యాలు స్థిరమైనాయి. ఒక్క పాద‌యాత్ర వీల‌యినంత దూరం చేస్తే రాజ‌కీయ‌భ‌విత‌ను మార్చే స్తుంద‌న్న గ‌ట్టి న‌మ్మ కం ఇపుడు రాజ‌కీయ‌పార్టీల అధినేత‌ల నుంచి మామూలు కార్య‌క‌ర్త‌కూ ఏర్ప‌డింది.  ఏపీలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు కాపాడేందుకు, వారి ఆశ‌లు ఫ‌లించేలా చేయ‌డానికి, వారి వ్య‌ధ‌ల‌ను తొల‌గించ డానికి తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్రాన్ని జే గ్యాంగ్ సంకెళ్ల నుంచి త‌ప్పించ‌డానికి ఆయ‌న కంక‌ణం కట్టుకున్నారు. ప్ర‌తీ ప్రాంతంలోనూ ప్ర‌జ‌లు వైసీ పీ పాల‌న ప‌ట్ల విముఖ‌త‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల వైసీపీ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మం ఘోరంగా విఫ‌లం కావ‌డం అందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌. మూడేళ్ల పాల‌నలో ప్ర‌జ‌ల‌కు ఇద‌మిద్ధం చేసిన మేలు అంటూ ఏమీ లేక‌పోగా హామీలు, ఉప‌న్యాసాలు, బోధ‌న‌లే ఎక్కువ‌య్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో అభి వృద్ధి అనేది ఏరంగంలోనూ క‌నిపించ‌డంలేదు. పైగా విప‌క్షాల మీద దుర్భాష‌లాడుతూ విరుచుకు ప‌డ‌టం త‌ప్ప ప్ర‌త్యేకించి చేస్తున్న‌దేమీ లేదు. ఇది ప్ర‌జ‌లు ఇటీవ‌లి కాలంలో మ‌రింత బాగా గ‌మ‌ని స్తున్నారు.  ప్ర‌శ్నించేవారిపై దాడులు చేప‌ట‌ట‌డం త‌ప్ప సంక్షేమప‌రంగా చేస్తున్న‌దేమీ లేదు.  ఈ ప‌రిస్థితుల్లో, నారా లోకేశ్ పాదయాత్రకు ముహూ ర్తం ఖరారైంది. నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జనవరిలో శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నిజానికి అక్టోబర్ నుంచే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టాలని లోకేశ్ మొదట అనుకున్నారు. ఆ దిశగా కొంత కసరత్తు కూడా చేశారు. కానీ అంతర్గత చర్చల తర్వాత ఆ ముహూర్తాన్ని జనవరికి మార్చారు. ఎన్నికల వాతావరణం నెలకొన్నతర్వాత చివరి ఏడాదిలో పాదయాత్ర చేస్తే వ్యూహాత్మకంగా కలిసివస్తుం దని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. వచ్చే జనవరిలో లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తే ఆపై ఏడాది మార్చి నాటికి మొత్తం 450 రోజుల సమ యం ఉంటుందని టీడీపీ నేతలు లెక్కగట్టారు. 2024 మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉం ది. అప్పటికి రాష్ట్రం మొత్తం పాదయాత్ర పూర్తవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారు. రాయలసీమ నుంచి ప్రారంభ మయ్యే లోకేశ్ పాదయాత్ర ఉత్తరాంధ్రలో ముగుస్తుంది. వీలున్నంత వరకూ ఏపీలోని అన్ని ప్రాంతాలనూ లోకేశ్ పాదయాత్ర స్పృశించేలా రూట్ మ్యాప్ను టీడీపీ నేతలు రూపొందిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు వారంలో రెండు రోజులు విరామం ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరు కావలసి ఉండడంతో ఆ రోజుతో పాటు మరో రోజు కూడా విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు మాత్రమే జగన్ నడిచేవారు. అయితే.. తనకు కోర్టు హాజరు సమస్య లేదు కాబట్టి వారంలో ఏడు రోజులూ పాదయాత్ర చేయాలని లోకేశ్ భావిస్తున్నట్లు ఆయన సన్ని హితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి పక్ష నేతగా పాదయా త్ర  చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పాదయాత్ర చేసిన చివరి ప్రతి పక్ష నేత చంద్రబాబు. జగన్ పాదయాత్ర సమయానికి రాష్ట్రం విడిపోవడంతో ఆయన ఏపీలో మాత్రమే నడిచారు. ఈసారి టీడీపీ తరఫున పాదయాత్ర చేసే అవకాశం లోకేశ్ కు వచ్చింది. ఏపీలో నెలకొన్న వివిధ అంశాలపై తెలుగుదేశం పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, దూర మైన వర్గాలను దరి చేర్చుకోవడానికి.. ప్రజావ్యతిరేక వైసీపీ పాలనను తూర్పారబట్టేందుకు పాద యాత్రే సరైన సాధనమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా విస్తరిస్తున్నా ఆ స్థాయిలో మరికొన్నిచోట్ల పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరగలేదని, అలా వేగం పెరగడానికి పాదయాత్ర దోహదం చేస్తుం దని అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక తకు ప్రభంజన రూపం తేవాలంటే ఒక చోదకశక్తి అవసరం. లోకేశ్ పాదయాత్ర అలా ప్రభం జనం తీసుకొ స్తుం దని టీడీపీ నేతలు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

ఇక సుప్రీం విచారణలు ప్రత్యక్ష ప్రసారం

ఇక కోర్టు సీన్లు సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనే  కాదు, ప్రత్యక్షంగానూ చూడ వచ్చును. అవును, సుప్రీం కోర్టులో విచార జరగే సమయంలోనే, వాద ప్రతివాదనలతో పాటుగా న్యాయమూర్తులు ఇచ్చేతీర్పులు, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం త్వరలో రాబోతోంది. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అందరికీ కలిపించాలని నిర్ణయించింది. ఇంత వరకు పార్లమెంట్,అసెంబ్లీ సమావేశాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, రాజకీయ సభలు, సమావేశాలకు ఇతరత్రా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విధంగానే, ఇకపై, సుప్రీంకోర్టులో కీలక విచారణలకు సంబంధించి వాద ప్రతివాదనలను ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు. లలిత్‌ ఆధ్వర్యంలో జరిగినమంగళవారం (సెప్టెంబర్ 20) జరిగిన ఫుల్ కోర్ట్‌ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. నిజానికి, కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఈనేపధ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సహా పలువురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది. కానీ, దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తాజాగా వచ్చేవారం నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్‌ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్‌ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోనుందని తెలిపాయి. అయితే, ఇటీవల భారత  ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26న ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్‌ ధర్మాసనం కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో, జస్టిస్ రమణ  న్యాయస్థానాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు, మరో అడుగు ముందుకుపడింది. ముందు ముందు, అన్ని కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన ప్రజలకు ఫస్ట్ హ్యాండ్ సమాచారం అందుబాటులోకి రావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుంది.

ఆట‌ను ఆట‌గా చూడలేరా?

క్రికెట్ అన‌గానే అంత‌ర్జాతీయ స్థాయిలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పోటీకి స‌మానంగా చూసేది  భార‌త్‌, పాకి స్తాన్ పోటీలే. ఏ టోర్నీ అయినా, వేదిక ఏద‌యినాస‌రే ఇంగ్లండ్‌, ఆసీస్‌ల మ‌ధ్య మ్యాచ్‌ల‌కి ఉండే అత్యం త ప్రాధాన్య‌త  భార‌త్‌, పాక్ మ్యాచ్‌ల‌కీ ఉండ‌డం విశేషం. అలాగే ప్లేయ‌ర్ల‌న్నా వీరాభిమానుల మ‌ధ్య పెద్ద‌గా తేడా ఉండ‌దు. స‌చిన్‌, కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ను మ‌నం ఎంత‌గా అభిమానిస్తామో అటు పాకిస్తాన్‌ లోనూ అంతే అభిమానిస్తారు. అదేవిధంగా మ‌న‌దేశంలోనూ అబ్దుల్ ర‌జాక్‌, వ‌సీం అక్ర‌మ్‌ను అభిమా నించిన‌ట్టే బాబ‌ర్ అజామ్‌, ర‌షీద్‌, రిజ్వాన్‌ల‌ను అంతే స్థాయిలో అభిమానిస్తున్నారు.  కాబోతే మ్యాచ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి ఎవ‌రి దేశం జ‌ట్టు వారు గెల‌వాల‌నే  కోరుకుంటారు. ఓడినా ఈజీగా  తీసుకోలేక‌పోవ‌డ‌మే అభిమానుల  మ‌ధ్య విద్రోహ‌పు ఆలోచ‌నల‌కు దారితీస్తోంది. అదే మ‌ళ్లీ బ‌య‌ట ప‌డింది. ఆసియాక‌ప్ జ‌రిగి  చాలారోజుల‌యింది. చిత్ర‌మే మంటే తొలిమ్యాచ్‌లో భార‌త్‌చేతిలో పాకిస్తాన్ ఓట‌మి తాలూకు ప్ర‌భావం ఇంకా పోలేదు. పాక్ వీరాభిమా నులు లండ‌న్‌లో విప‌రీత ధోర‌ణిలో వ్య‌వ‌హ రిస్తున్నారు.  భారత్- పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆయా జట్ల అభిమానుల్లో ఉత్కంఠ, ఉద్వేగం పీక్స్ కి వెళ్లి పో తుంది. ఇప్పుడు గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ టోర్నీలో భారత్- పాక్ ల మధ్య జరి గిన మ్యాచ్ లండన్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను తార స్థాయికి చేర్చింది. మ్యాచ్ జరిగి రోజు లు గడిచిపోతున్నా.. ఆ ఉద్రిక్తతలు సడలడం లేదు.తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో  అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  న హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్ల కు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయ కులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  తాజాగా లండన్ లోని వెస్ట్ మిడ్ లాండ్స్ లోని  ఒక  పట్టణంలోని దేవాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసనకు దిగారు. అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.  భారత్- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత  తూర్పు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో  హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్ష ణల  నేపథ్యంలోనే వెస్ట్ మిడ్ లాండ్స్ లోని ఒక పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  లీసెస్టర్ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు పలువురిని  అరెస్టు చేశారు. మరోవైపు హిందూ, ముస్లిం సంఘాల నాయకులు మంగళవారం ఉదయం లీసెస్టర్‌లోని మసీదు మెట్లపై సమావేశమై శాంతి, సామరస్యాన్ని కోరుతూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.  

ఏసీసీ టీ-20 కి  హ‌ర్మ‌న్‌ప్రీత్ జ‌ట్టు

ఏసీసీ టీ-20 ఛాంపియ‌న్‌షిప్‌కి  హ‌ర్మ‌న్ ప్రీత్ నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఎంపిక‌ చేశారు.  బెంగుళూరులో  ఈ టోర్నీ అక్టోబ‌ర్ 1 నుంచి 15 వ‌ర‌కూ జ‌రుగుతుంది.  ఇటీవ‌లి ఇం గ్లండ్ సిరీస్లో పాల్గొన్న జ‌ట్టులో ఉన్న‌వారే తిరిగి ఎంపిక‌య్యారు. స్టాండ్‌బైలుగా తానియా భాటి యా, సిమ్ర‌న్ బ‌హ‌దూర్ ఎంపిక‌య్యారు.  ఆరుప‌ర్యాయాలు ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో మొద‌టి మ్యాచ్ శ్రీ‌లంక‌తో  త‌లప‌డుతుంది. అక్టోబ‌ర్ 7న పాకిస్తాన్‌తో త‌ల‌ప‌డు తుందని ఆలిండియా మ‌హిళ‌ల క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. బెంగుళూరులో జ‌రిగే ఛాంపి య‌న్‌షిప్‌లో మొత్తం ఏడు జ‌ట్లు పాల్గొంటాయి. వీటిలో బంగ్లా దేశ్‌, పాకిస్తాన్‌, శ్రీ‌లంక‌, థాయ్‌లాండ్‌, మ‌లేషియా, యుఏఇ జ‌ట్లు ఉన్నాయి.  హ‌ర్మ‌న్‌ప్రీత్ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టులో స్మ్రితీ మంధాన‌(వైస్‌కెప్టెన్‌), దీప్తిశ‌ర్మ‌, ష‌ఫాలీవ‌ర్మ‌, రోడ్రిగ్స్‌, మేఘ‌న‌, రిచాఘోష్ (వికెట్‌కీప‌ర్‌), స్నేహారాణా, హేమ‌ల‌త‌, మేఘ్నాసింగ్‌, రేణుకాథాకూర్‌, పూజా, రాజేశ్వ‌రి గైక్వాడ్‌, రాధాయాద‌వ్‌, కె.పి.నావ‌గిరె ఉన్నారు.