రోజాకు ‘జబర్దస్త్’ సెగే తగిలిందా?

రోజా పరిచయం అక్కర్లేని పేరు. సినీ  నటిగా, రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె ఎప్పుడూ సుపరిచితురాలే. వివాదాలు ఆమె వెంట ఉంటాయో, వివాదాలనే ఆమె ఆహ్వానిస్తారో తెలియదు కానీ  ఆమె పేరుతోనే పాటే వివాదాలూ గుర్తుకు వస్తాయి. సరే రోజా చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి ఎట్టకేలకు దక్కింది. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రోజాకు అవకాశం  కల్పించారు. అందు కోసం జగన్ సామాజికవర్గ సమీకరణాలను కూడా పక్కన పెట్టి చిత్తూరు జిల్లా నుంచి అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నా కూడా మరో మంత్రిగా రోజారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఒక జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడమే అరుదైతే.. అలా మంత్రి పదవులు పొందిన వారిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం మరీ అరుదు. కానీ జగన్ రెడ్డి రో  ఆ సామాజిక వర్గ సమీకరణాలను సైతం పట్టించుకోకుండా రోజాను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంత వరకూ బానే ఉంది. కానీ మంత్రి పదవి దక్కిన ఆనందం పూర్తిగా అనుభవించకుండానే రోజాకు పదవీ గండం తప్పదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే గడప గడపకూ టెస్ట్ లో ఫెయిలయ్యారనీ, అధిష్ఠానం సూచనలు పట్టించుకోవడం లేదనీ, ప్రజాదరణ కోల్పోయారనీ ఇలా పలు కారణాలు చూపుతూ జగన్ వచ్చే నెలలో (నవంబర్) మరో సారి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని ఇటీవల జరిగిన వర్క్ షాపులో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అంతే కాదు తన ప్రస్తుత కేబినెట్ లో కనీసం ఐదో వంతు మందికి ఉద్వాసన తప్పదన్న సూచనలు కూడా ఇచ్చారు. ఇదిగో అక్కడ నుంచీ రోజా మంత్రి పదవికి ఎసరు వచ్చేసిందన్న వార్తలు సమాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఉద్వాసనకు గురయ్యే మంత్రులలో మొదటి పేరు రోజాదే అన్న స్థాయిలో వార్తలు వినవస్తున్నాయి. అందుకు కారణాలను కూడా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పేస్తున్నారు. ఆ కారణాలలో మొదటిది ఆమెకు జబర్ దస్త్ కార్యక్రమం మీద ఉన్న మమకారంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల పాటు జబర్దస్త్ జడ్జి పొజిషన్ లో విరగబడి, పగలబడి నవ్వినందుకే  ఆమెకు సినీ నటిగా, రాజకీయ నాయకురాలిగా ఉన్నందువల్ల వచ్చిన పాపులారిటీని మించి ఎన్నో రెట్లు గుర్తింపు వచ్చింది. అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని పలు సందర్భాలలో ఎన్నో మార్లు ఆమే స్వయంగా చెప్పారు. తనకు అంత పాపులారిటీ తీసుకువచ్చిన షోను మంత్రి పదవి రాగానే వదిలేశారు. అయితే అంతటి పాపులారిటీ తీసుకువచ్చిన షో నిర్వాహకులు దసరా ఈవెంట్ కు ఆహ్వానిస్తే ఎలా కాదనగలరు? అందుకే వెళ్లారు. ఇదిగో ఇప్పుడు ఆ షోకు హాజరైన కారణంగానే రోజా పదవికి ఎసరు వచ్చిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ షో వచ్చేది జగన్ నిత్యం ఆగ్రహంతో చెప్పే దుష్టచతుష్టయంలోని ఒకరికి చెందిన చానెల్ లో.. చెప్పాపెట్టకుండా ఆ షోలో రోజా ప్రత్యక్షం కావడంపై జగన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయనీ, జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ రోజాను ఫైర్ చేయాలని అనుకోవడానికి ఇది ఒక కారణం.. కాగా మంత్రిగా పదవీ స్వీకారం చేసిన క్షణం నుంచీ ఆమె పార్టీ హై కమాండ్ ఆదేశాలు, సూచనలను ఖాతరు చేయడం మానేశారని పార్టీ వర్గాలే అంటున్నాయి. మంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అలా హైదరాబాద్ వెళ్లి ‘జగన్’మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అప్పట్లోనే ఈ విషయంపై పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అప్పటికే జగన్ తల్లిని, చెల్లిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కూడా రోజా తన చిత్తం వచ్చిన తీరులోనే వ్యవహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వచ్చారు. సరిగ్గా ఆమె కేసీఆర్ ను కలిసిన సమయంలోనే మంత్రి కేటీఆర్ క్రెడాయ్ సదస్సులో ఏపీలో జగన్ హయాంలో కరెంటు కష్టాలు, రోడ్ల దుస్థితిపై హేళన చేస్తూ మాట్లాడారు. ఇక మంత్రిగా రోజా పనితీరుపై కూడా జగన్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. మంత్రిగా గత ఐదు నెలల కాలంలో తన నియోజకవర్గం విషయంలో కానీ, తన శాఖ విషయంలో కానీ ఏ మాత్రం పట్టింపు లేని ధోరణిలో వ్యవహరిస్తున్నారని  జగన్ చేయించిన సర్వేలలో తేలిందని అంటున్నారు. అందుకే తాజాగా గడప గడపకు కార్యక్రమంపై  నిర్వహించిన వర్క్ షాపులో జగన్ మంత్రి రోజా పేరు ప్రస్తావిస్తూ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజా మంత్రి అయిన తరువాత ఆ స్థాయిలో విపక్షాన్ని విమర్శిస్తూ విరుచుకుపడటంలేదని కూడా జగన్ భావిస్తున్నారంటున్నారు. ఇక సొంత నియోజకవర్గంలో కూడా ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని వివిధ సర్వేలలో తేలిందని కూడా అంటున్నారు. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రిగా కూడా ఆమె తన స్వంత నియోజకవర్గం నగరిపై పెద్దగా దృష్టి పెట్టలేదని చెబుతున్నారు. ఈ కారణాలన్నిటినీ ప్రస్తావిస్తూ వైసీపీ వర్గాలే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసనకు గురయ్యే మంత్రుల జాబితాలో తొలి పేరు రోజాదే అని అంటున్నారు. 

అభిమాని డేటింగ్‌కి రూ.500 ఇచ్చిన క్రికెట‌ర్ అమిత్‌

ప్ర‌భాస్ వీరాభిమాని సెల్ఫీ అడిగాడు, రిటైర్ అయ్యే ఉద్యోగి తోటివాళ్ల‌తో టీపార్టీ చేసుకున్నాడు, ఒక కుర్రాడు త‌న ల‌వ‌ర్ కోసం వేరే స్నేహితుడి ద‌గ్గ‌ర అప్పు తీసుకున్నాడు. ఇవి విన‌డానికి స‌ర‌దాగా ఉంటాయి, కానీ వాటిలో చిన్న ఆనందం కూడా ఉంది. చాలా కాలం గుర్తుండే  జ్ఞాప‌క‌మే అవుతుంది ప్ర‌తీదీ!  ఓ కొంటె కుర్రాడు త‌న ల‌వ‌ర్‌తో ఓ పూట స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని అనుకున్నాడు. కానీ అందుకు ప‌ర్సు ఫుల్‌గా లేదు. ఆమెను స‌ర‌దాగా అలా షికారుకి తీసికెళ్ల‌డం, హోట‌ల్‌లో తిన‌డం, వీల‌యితే సినిమాకి తీసికెళ్ల‌డానికి దేనికి అత‌ని ద‌గ్గ‌ర త‌గినంత డ‌బ్బు లేదు. క‌నీసం మంచి హోట‌ల్లో కొద్దిసేపు క‌బుర్లు చెప్పుకోవ‌డానికి కాఫీ తాగ‌డానికీ లేవు. అత‌ను క్రికెట్ వీరాభిమాని. క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి స్కూల్లో ఉన్న‌పుడు ఫ్రెండ్స్‌తో క‌లిసి చాలా స‌ర‌దాగా గ‌డిపాడు. అత‌నికి భార‌త్ మాజీ టెస్ట్‌ప్లేయ‌ర్‌, స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా అంటే వీరాభిమానం. అంతే వెంట‌నే.. అన్నా! జ‌ర ఓ మూడొంద‌లు గూగుల్ పే చేస్తావా? అని అడిగాడు. అంతే కాదు వీల‌యినంత త్వ‌ర‌లో వాస‌స్ ఇస్తాన‌న్నాడు. స‌రే బాగే ఉంది, ఇంత‌కీ మూడొంద‌ల‌తో ఏం చేస్తావ‌ని స్పిన్న‌ర్ అమిత్ అడిగాడు. ఆ కుర్రాడు త‌న ల‌వ‌ర్‌ని అలా షికారుకి తీసికెళ్లాలి అని స‌మాధానం చెప్పాడు.. ఆ కుర్రాడు చాలా సిన్సియ‌ర్‌గా! అంతే అమిత్ ఆ స‌మాధానం న‌చ్చి ఒకే  అని డ‌బ్బులు పంపాడు. అత‌ని అభ్య‌ర్ధ‌న‌లో సిన్సియారిటీ గుర్తించాన‌న్నాడు అమిత్‌. ఇదంతా ట్విట‌ర్‌లో జ‌రిగిన సంభాష‌ణ‌. కానీ లెగ్ స్పిన్న‌ర్ వెంట‌నే సానుకూల స్పంద‌న ఇస్తాడ‌ని ఆ వీరాభిమాని అనుకోలేదు. పైగా మ‌రో ట్విస్ట్ ఏమిటంటే, రూ.300 లు మాత్రమే కాదు, అమిత్ మ‌రో రూ.200 కూడా అద‌నంగా ఇచ్చాడు.. మ‌రింత ఆనందంగా గ‌డ‌ప‌మ‌ని! ఆ కుర్రాడి ఆనందానికి అంతే లేదు. అమిత్ పంపిన డ‌బ్బు క్ష‌ణాల్లో అందాయి. ఆ స్క్రీన్ షాట్ ను అమిత్‌కి పంపాడు ఆ కుర్రాడు. ఇదో ఊహించ‌ని అభిమానం. భార‌త్ మాజీ ప్లేయ‌ర్ అమిత్‌కి మ‌రింత ఆనంద‌దాయ‌క సంఘ‌ట‌నే!  అందేరూ మీ డేటింగ్‌కి ఆల్ ది బెస్ట్  అంటూ మెసేజ్ పెట్టాడు!

చేప‌ల‌కు వ‌ల‌వేస్తే....పురాత‌న క్యూబ్స్ బ‌య‌ట‌పడ్డాయి!

మత్స్యకారుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి రోజూ వెళ్లిన‌ట్టే స‌ముద్రం మీద‌కు వెళ్లి వ‌ల విసిరాడు. లాగితే వ‌ల అంత సుల‌భంగా క‌ద‌ల్లేదు. తీరా ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి లాగారు. వారంతా పెద్ద చేప దొరికింది మంచి తిండి దొరికింది అనుకున్నారు. కానీ ఎన లేని నిధి బ‌య‌ట‌ప‌డింది.  సెంట్రల్ ఇంగ్లండ్‌లోని కోవెంట్రీలో సోవ్ నది నుండి తీయబడిన 60 విస్తృతంగా చెక్కబడిన వెండి మెటల్ క్యూబ్‌లను లాగడం ద్వారా స్థానికులు ఆశ్చర్యపోయారు. స్థానికులు వాటిని ప్రత్యేక హిందూ ప్రార్థనలో ఉపయోగించే అదృష్టాన్ని చెప్పే రాళ్లుగా గుర్తిం చారు. మిగిలిన వివరాల విషయానికొస్తే-వారు అక్కడికి ఎలా చేరుకున్నారు, ఆచారం తర్వాత ఎవరూ వాటిని ఎందుకు తిరిగి పొందలేదు. అయితే వాటి కాలం .. అంటే అవి ఎప్ప‌టివ‌న్న‌ది తెలియ‌లేదు.  విల్ రీడ్ క్యూబ్ ల‌ను కనుగొన్నప్పుడు తన చిన్న పిల్లలతో కలిసి మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నాడు. నిపుణులు కొన్నిసార్లు అయ స్కాంత చేపలను ఉపయోగించవద్దని ప్రజలను హెచ్చరిస్తారు, ఇది కేవలం శబ్దం వలె ఉంటుంది, ఎందుకంటే అయస్కాం తాలు నీటి  దిగువ నుండి ఖర్చు చేయని మందుగుండు సామగ్రి లేదా గ్రెనేడ్ల వంటి వస్తువులను లాగ గలవు. ఈ సంద ర్భంలో, రీడ్ అత‌ని పిల్లలు లోతులేని నీటిలో సీసం బ్లాక్‌లను కనుగొన్నారు, అయస్కాంతాలు అవసరం లేదు. (సీసం ఏమై నప్పటికీ నిజంగా అయస్కాంతం కాదు.) తెలిసిన అత్యంత పురాతన సీసం కళాఖండాలు 6,000 సంవత్సరాల నాటివి, నదిలో కనిపించే కొన్ని యాదృచ్ఛిక సీసం వస్తు వులను డేటింగ్ చేయడానికి నిపుణుడు అవసరం. వారు హిందువులు అనే వాస్తవం తేడాను కలిగిస్తుంది, కానీ భారత దేశం నుండి ఇంగ్లండ్‌కు వెళ్లే వ్యక్తులు ఎలిజబెత్ కాలం నుండి 500 సంవత్సరాల క్రితం ఉన్నారు. పిహెచ్‌, ఉష్ణోగ్రత, పైపుల పాతవి వంటి అనేక అంశాల ఆధారంగా త్రాగునీటిలోకి సీసం లీచ్ అయితే, చల్లని, మంచినీటిలో ఉన్న‌ కొన్ని సీసం వస్తువులు చాలా  కాలంపాటు ఉంటాయి. కాబట్టి ఈ రహస్యమైన ఘనాల ఏమిటి? రెడ్డిట్‌లోని ఒక సమగ్ర సమాధానం అవి ఒక విధమైన ప్రార్థన టోకెన్‌లుగా కనిపిస్తా యని వివరిస్తుంది. హిందూజ్యోతిషశాస్త్రంలో, గ్రీకో-రోమన్ , ఇతరులలో వలె, సాంప్రదాయ గ్రహాలకు ప్రతి ప్రాతినిధ్యం ఉంటుం ది. శాస్త్రీయ అంశాలు గ్రహాలతో కూడా ముడిపడి ఉన్నాయి, రసవాదం, అదృష్ట చరిత్రలలో ముడిపడి ఉన్నాయి. రోమన్ జ్యోతి ష శాస్త్రంలో, సీసం అనేది శనితో ముడిపడి ఉన్న మూలకం-గ్రహం, దేవుడు. హిందూ జ్యోతిషశాస్త్రంలో, చంద్రుని కక్ష్యలో ఒక వైపు సీసం ముడిపడి ఉంటుంది, దీనిని రాహు అని పిలుస్తారు. క్యూబ్‌ల గురించి వ్యక్తులు గుర్తించిన విషయం ఏమిటంటే, అవి మ్యాజిక్ స్క్వేర్‌లతో చెక్కబడి ఉన్నాయి. ఇవి సుడోకు గ్రిడ్‌ లను పోలి ఉండే, మించిన లక్షణాలతో కూడిన పూర్ణాంకాల గ్రిడ్‌లు ప్రతి అడ్డు వరుస, నిలువు వరుస,  హిందూ ఆరాధనలో, వీటిని యంత్రంగా లేదా పవిత్ర గ్రిడ్‌లుగా లేదా జ్యామెట్రీగా ఉపయోగించ వచ్చు. రాహువు యంత్రం ఈ ఘనాలపై కని పిస్తుం ది, అవి రాహువుకు ప్రార్థనలు లేదా అర్పణలుగా లేదా మరొక ఆచారంలో భాగంగా ఉపయోగించేందుకు రూపొందించ బడ్డా యి. (హిందూదేవత దుర్గా, మాతృ దేవత, ఆమె వాహనాన్ని, సింహాన్ని స్వారీ చేయడం షోలలో మరొక అంశాన్ని చెప్పడానికి ఒక పాఠకుడు వ్రాసాడు, కనుక ఇది ఆమెకు ప్రార్థన కావచ్చు.) ఎటువంటి సందర్భోచిత సమాచారం లేకుండా, శాస్త్రవేత్తలు ఈ ఘనాల వయస్సు ఎంత అని ఎలా చెప్పగలరు? చాలా కాలం గా, నిపుణులు కూడా సీసం కళాఖండాల వయస్సును ఖచ్చితంగా అంచనా వేయలేరు. సీసం మానవ చరిత్రలో చాలా కాలం నాటిది కాబట్టి ఇది నిరాశకు మూలం. వోల్టామెట్రీ అని పిలువబడే ఒక ప్రక్రియ ఇప్పుడు సీసానికి సంబంధించిన ప్రక్రి యల కోసం ఉప యోగించబడుతుంది, నీటిలో స్థాయిలను గుర్తించడం,150 సంవత్సరాలలోపు కళాఖండాలను గుర్తించడం.

ర‌జ‌కుల వినూత్న నిర‌స‌న‌!

జీతాలు పెంచ‌మ‌ని, పెన్ష‌న్ ప‌థ‌కం స‌రిగా అమ‌లుచేయాల‌నో, ఉద్యోగాల కోస‌మో వివిధ ర‌కాల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చూస్తూనే ఉంటాం. డిమాండ్లు రాసిన ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ప్ర‌భుత్వ కార్యాల‌యాల ద‌గ్గ‌ర‌, అసెంబ్లీ ద‌గ్గ‌రా ఉద్యోగులు భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తుంటారు. కానీ ర‌జ‌కుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న అంత హ‌డావుడి లేకుండా మంచి ఎఫెక్టివ్‌గా చేప‌ట్టారు.  డిమాండ్ల సాధ‌న‌కు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోకి, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోకి ప్ల‌కార్డుల‌తో, గొంతు చించుకుంటూ నినాదాలు చేస్తూ, ప్ర‌భుత్వాన్ని తిడుతూ జ‌నం దూసుకుపోతుంటారు. అందుకు ప్ర‌జ‌ల, మీడియా మ‌ద్ద‌ తూ ల‌భిస్తుం టుంది. నిర‌స‌న‌కు ఒక ప్ర‌త్యేక ప‌ద్ధ‌తి అంటూ ఉండాల‌న్న నియ‌మం పెద్ద‌గా ఎవ్వ‌రూ పాటించ‌రు. తోచిన‌విధంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఈరోజుల్లో మ‌రీ ఈ ధోర‌ణి ఎక్కువ‌యింది. ప్ర‌భు త్వం ఉన్న‌ది ప్ర‌జా సేవ చేయ‌డానికి త‌ప్ప ఓట్లు వేయించుకుని ప్ర‌శాంతంగా ఉండ‌డానికి కాద‌న్న ఆగ్ర‌ హంతో రెచ్చిపోతుంటారు. అన్నివ‌ర్గాల స‌మ‌స్య‌లూ ప‌రిష్క‌రించ‌డానికే ప్ర‌భుత్వాలు, ఎమ్మెల్యేలు, మం త్రులూ అంతా ఉన్న‌ది. చిన్న‌పాటి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ ఉద్యోగులు చిన్న‌పాటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పూనుకోవాలి. అంతేగాని తోచిన విధంగా వ్య‌వ‌హ‌రిస్తే ప్ర‌జ‌లు ఆగ్ర‌హించ‌క‌పోరు.  క‌ర్నూలు లో ర‌జ‌కుల‌కు కోపం వ‌చ్చింది. వాళ్ల‌కి ఎంతో స‌హ‌క‌రిస్తున్న గాడిద‌ల‌ను కార్పోరేష‌న్ సిబ్బంది లారీ ల‌కు ఎక్కించి ఊరు బ‌య‌ట వ‌దిలేశారు. ప‌ట్ట‌ణంలో ట్రాఫిక్ కి గాడిద‌లు అంత‌రాయం క‌లిగిస్తున్నా య‌ని, నిత్యం వాహ‌న‌దారులు రోడ్లమీద తిరుగుతున్న గాడిద‌ల‌తో నానా ఇబ్బందీ ప‌డుతున్నార‌ని మున్సి ప‌ల్ సిబ్బంది వాద‌న‌. అవి లేకుంటే మా ప‌నులు సాగ‌వు, వాటిమీదే త‌మ జీవ‌నం సాగుతోంది అంటూ ర‌జ‌కులు రెచ్చిపోయారు. వాటిని ఒక్క మాటా త‌మ‌కు చెప్ప‌కుండా బ‌య‌టికి త‌ర‌లించ‌డం మీద కోపగించి, గాడిద‌ల‌తోనే కార్పొరేష‌న్ కార్యాల‌యానికి వెళ్లి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కార్యాల‌యంలో సిబ్బంది ఈ హ‌ఠాత్ప‌రిణామానికి ఖంగారు ప‌డ్డారు. గాడిద‌ల‌ను తెప్పిస్తాంగాని వాటిని మీ ఇళ్ల‌వ‌ద్ద‌నే క‌ట్టేసుకుంటేనే అనుమ‌తిస్తామ‌న్నారు కార్పోరేష‌న్ వారు. ఏమైన‌ప్ప‌టికీ  ర‌జ‌కుల వినూత్న నిర‌స‌న‌, రేపో మాపో అవ‌స‌రం వ‌స్తే అన్ని వృత్తుల వారూ ఏదో ర‌కంగా వారి ప‌ద్ధ‌తిలో ఇలా నిర‌స‌న‌కు దిగ‌డానికి మార్గ‌ద‌ర్శిగా ఈ గాడిద‌ల నిర‌స‌న‌ని పేర్కొనాలి.  

ఇంతవరకు ఇదీ ... కథ.. కహానీ ఔర్ బాకీ హై!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ముందునుంచి నేను రేసులో ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌’ అన్నంత  పని చేశారు. ముందుగా  ప్రకటించిన విధంగా  నామినేషన్ల గడువు చివరి  రోజు శుక్రవారం( సెప్టెంబర్ 30)  నామినేషన్‌ దాఖలు చేశారు.  అంతే కాకుండా, పరోక్షంగానే అయినా, గాంధీలకు వ్యతిరేకంగా జీ 23 స్వరాన్ని వినిపించారు. గాంధీ కుటుంబ బయటి వ్యక్తిగా బరిలో దిగారు. నిజానికి గతంలో శరద్ పవార్, రాజేష్ పైలెట్, జితేంద్ర ప్రసాద , సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదివికి బరిలో దిగినా, ఒకటి రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేక పోయారు. ఈ నేపధ్యంలో, అధిష్టానం అధికారిక అభ్యర్ధికి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారంటే, ఒక విధంగా శశిథరూర్‌ సాహసమే చేస్తున్నారు. ఆఫ్కోర్స్, ఈ ఎన్నికల్లో అయన ఓడి పోయినా, ఆయనకు పోయేదేమీ లేదు. మహా అయితే, మళ్ళీ మరో మారు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే అవకాశం రాక పోవచ్చును, కానీ అదే ఆయన గెలిస్తే మాత్రం  అది కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయిగా నిలిచి పోతుంది. చరిత్ర సృష్టించిన హీరో అవుతారు.  సరే  శశిథరూర్‌ విషయం అలా ఉంటే  10 జనపథ్ (సోనియా గాంధీ నివాసం) కేంద్రంగా సాగిన అసలు కథ హాలీవుడ్  సస్పెన్స్ థిల్లర్ ను మరిపించింది. సోనియా గాంధీ ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను పికప్ చేశారు. ఆయన, ముఖ్యమంత్రి పదవి వదిలి,  ఢిల్లీ వచ్చేందుకు సిద్ధంగా లేక పోయినా, ఒప్పించి, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దించారు. ఆ తర్వాత ఏమి జరిగిందన్నది అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవలసిన అవసరం లేదు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడు అనుకున్న గెహ్లాట్ , ఎదురు తిరిగారు. సచిన్ పైలెట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రి చేస్తే ఒప్పుకునేది లేదని షరతు విధించారు. ఎక్కడా ఎవరికీ, అనుమానం రాకుండా, ఏకంగా 90 మంది ఎమ్మెల్యేలను కూడగట్టి, మూకుమ్మడి రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అధిష్టానం ఆదేశాలను దిక్కరించారు. సరే ఆ తర్వాత సారీ చెప్పారనుకోండి అది వేరే విషయం.  కట్ చేస్తే... రెండు రోజుల  హై డ్రామా తర్వాత సోనియా గాంధీ గెహ్లాట్ ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించారు. మరో  గాంధీ ఫ్యామిలీ విధేయుడు దిగ్విజయ్ సింగ్ ను తెర మీదకు తెచ్చారు. ఓ 24 గంటలు ఆయన చుట్టూనే కథ నడిచింది. దిగ్విజయ్ స్వయంగా, కాంగెస్ అధక్ష్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకటించారు.  శుక్రవారం  నామినేషన్ వేస్తున్నట్లు కూడా చెప్పారు. అంతే కాదు అంతకు నాలుగు రోజుల ముందు, అలాంటి ఆలోచన లేదని చెప్పిన దిగ్విజయ్ రాహుల్ గాంధీ యాత్ర నుంచి నేరుగా, ఢిల్లీ వచ్చి  ఎన్నికల బరిలో ‘టోపీ’ వేశారు. కానీ, ఆఖరి క్షణంలో ఆయన డ్రాప్ అయ్యారు.  ఆయన స్థానంలో లేటుగా వచ్చినా లేటెస్టుగా .. వచ్చినా .. అమ్మ ఆశీస్సులు ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్య సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే  ఆఖరి క్షణంలో వచ్చి నామినేషన్ వేశారు. దిగ్విజయ్ సింగ్ తనకు ఖర్గే పై ఉన్న ‘అపరిమిత’ గౌరవం కారణంగా పోటీ నుంచి తప్పుకుని ఖర్గే కు మద్దతు ప్రకటించారు. నిజమే ఇక్కడ ఎక్కడా  సోనియా గాంధీ ప్రత్యక్షంగా తెర మీదకు రాలేదు కానీ, కథ మొత్తం 10 జనపథ్  కేంద్రంగానే జరిగింది. అదేమీ రహస్యం కాదు. నిజానికి,  సోనియా గాంధీ చాలా స్పష్టంగా తను న్యూట్రల్ గా ఉంటానని, ఎవరైనా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని శశిథరూర్‌ కు మాటిచ్చారు. కానీ, జరిగిన కథ అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.  అయితే, ఇంతటితో అయిపొయినట్లేనా లేక ఇంకా కథ మిగిలే ఉందా.. అంటే .. కహానీ ఔర్ బాకీ హై అనే అంటున్నారు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది, అప్పటి వరకు, ఏదైనా జరగవచ్చును. ఇంతవరకు ఇదీ కథ .

ఆంబులెన్స్‌కు  దారిచ్చిన  ప్ర‌ధాని కాన్వాయ్‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కాన్వాయ్ శుక్ర‌వారం మాన‌వీయ కోణాన్ని ప్ర‌ద‌ర్శించింది.  ప్ర‌ధాని శుక్ర‌వారం గాంధీ న‌గ‌ర్ రాజ‌భ‌వ‌న్ కు వెళుతూండ‌గా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.  గుజ‌రాత్‌లో  రెండురోజుల  ప‌ర్య‌ట‌న లో భాగంగా  రెండ‌వ‌రోజు శుక్ర‌వారం  ప్ర‌ధాని మోదీ  గాంధీన‌గ‌ర్‌-ముంబై  మ‌ధ్య వందే భార‌త్ ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రాజెక్టును  ప్రారంభించారు. ఈ  కార్య‌క్ర‌మం ముగించు కుని  గాంధీన‌గ‌ర్ వెళుతూండ‌గా అహ్మ‌దాబాద్‌-గాంధీన‌గ‌ర్ హైవేలో కొంత  స‌మయం త‌ర్వాత  ప్ర‌ధాని కాన్వాయ్ ఎడ‌మ‌వేపు నెమ్మ‌దిగా వెళ్లింది. అదే స‌మ‌యంలో వెళుతోన్న ఒక  అంబులెన్స్ కి దారి ఇచ్చా ర‌ని బీజేపీ నాయ‌కులు చెప్పారు. ఈ సంఘట‌న ప్ర‌ధాని గాంధీన‌గ‌ర్  రాజ్భ‌వ‌న కు వెళుతూండ‌గా జ‌రిగింది.  ఎక్క‌డ‌యినా ఏ న‌గ‌రం, ప‌ట్ట‌ణంలోనైనా స‌రే వాహ‌న‌దారులు త‌మ‌కు ఎదురుగా వ‌స్తున్న‌, లేక వెనక‌ వ‌స్తు న్న ఆంబులెన్స్ కు దారి ఇవ్వ‌డం దేశ పౌరుని బాధ్య‌త‌గా పాటించాల‌న్న‌ది మోదీ తెలియ‌జేశారు. కాగా, సాయిం త్రం ప్ర‌ధాని బ‌న‌స్కంత జిల్లాలో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు, అనంత‌రం ఆయ‌న ప్ర‌ముఖ అంబాజీ దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తార‌ని బిజేపీ నాయ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 

వ‌న్డేల గెలుపు దూకుడుతో  ఆసియాక‌ప్ కి హ‌ర్మ‌న్‌ప్రీత్ జ‌ట్టు

ఇటీవ‌లే ముగిసిన ఇంగ్లండ్ వ‌న్డేసిరీస్‌లో ఎంతో దూకుడుగా ఆడి సిరీస్ కైవ‌సం చేసుకున్న భార‌త్ మ‌హిళ‌ల జ‌ట్టు ఆసియాక‌ప్ లోనూ అదే ధాటితో ఆడి విజేత కావాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. సూప‌ర్ స్టార్ హ‌ర్మ‌న్ ప్రీత్ నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌హిళల జ‌ట్టు శనివారం ఆరంభం కానుంది. మొద‌టి మ్యాచ్ శ్రీ‌లంక‌తో త‌ల‌ప‌డుతుంది.  ఇటీవ‌లి కాలంలో టీ-20లో భార‌త్ అంత‌గా రాణించ‌డం లేదు. ముఖ్యంగా ఆసియాలో చెప్పుకోద‌గ్గ ప్రావీ ణ్యత ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. అయితే మొత్తం మీద చూసుకుంటే, ఆసియా క‌ప్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి 2004 నుంచీ టైటిల్విజేత భార‌త్ నిల‌వ‌డం భార‌త్ మ‌హిళ‌ల క్రికెట్‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌నే చెప్పాలి. ఈ టోర్నీలో నాలుగు పర్యాయాలు వ‌న్డే టైటిల్స్, 2 టి-20 టైటిల్స్ కైవ‌సం చేసుకుంది. కాగా ఆసియాక‌ప్ వ‌న్డే ఫార్మాట్ నుంచి టీ-20 ఫార్మాట్‌కి 2012లో మారింది. అప్ప‌టి నుంచి రెండు ప‌ర్యా యాలు విజేత‌గా నిలిచింది. కాగా 2018లో మాత్రం శ్రీ‌లంక చేతిలో ఓడిపోయింది.  కాగా, ఈ టోర్నీలో భార‌త్ ఆధిప‌త్యం మ‌రింత కొన‌సాగించాల్సి ఉంది. నాలుగేళ్ల తర్వాత ఇపుడు మంచి అవ‌కాశం వ‌చ్చింది. పైగా ఇంగ్లండ్ మీద గెలిచిన ఊపులో ఉన్న జ‌ట్టు త‌ప్ప‌కుండా టోర్నీ విజేత‌గా నిలిచే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్ పండితులు అంటున్నారు.  బంగ్ల‌దేశ్ లో  2020 లో జ‌ర‌గాల్సిన టోర్నీ కోవిడ్ కార‌ణంగా వాయిదాప‌డింది. త‌ర్వాత అప్ప‌టి టోర్నీ ర‌ద్ద‌యింది. బ‌ర్మింగ్‌హామ్‌లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించిన త‌ర్వాత  భార‌త్ జ‌ట్టు కాస్తంత ఇబ్బందుల్లో ప‌డింది. ఆ వెంట‌నే జ‌రిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. కానీ హ‌ర్మ‌న్‌ప్రీత్ జ‌ట్టు వ‌న్డేల్లో ఇంగ్లండ్ జ‌ట్టును 3-0 తేడాతో ఓడించి ప‌గ‌దీర్చుకుంది. సిరీస్ విజ‌యం ప్ర‌ముఖ ఆల్‌రౌండ‌ర్ ఝుల‌న్ గోస్వామి చివ‌రి సిరీస్ అయింది. దీని త‌ర్వాత ఆమె రిటైర‌య్యారు. ఆమెకు భార‌త్ జ‌ట్టు ఆ విజ‌యాన్ని అంకితం చేసింది.  జ‌ట్టు కూర్పు విష‌యానికి వ‌స్తే, కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ అద్భుత ఫామ్‌లో ఉంది, అలాగే స్మృతీ మంధాన‌, ష‌ఫాలీవ‌ర్మ‌, స‌బ్బినేని మేఘ‌న‌, హేమ‌ల‌త కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరంతా ఆసియా క‌ప్‌లో ప‌రుగుల వ‌ర‌ద సృష్టించే అవ‌కాశాలున్నాయి. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న స‌మ‌యానికి గాయంతో జ‌ట్టుకు దూర‌ మయిన రోడ్రిగ్స్ ,  వికెట్ కీప‌ర్ రిచాఘోష్ కూడా  జ‌ట్టులోకి వ‌చ్చారు. బౌలింగ్ విభాగంలో  రేణుకా సింగ్‌, రాధా యాద‌వ్‌, రాజేశ్వ‌రీ గైక్వాడ్‌, దీప్తి ప‌టిష్టంగా మంచి ఫామ్‌లో ఉన్నారు. కాగా శ్రీ‌లంక విష‌యానికి వ‌స్తే, కెప్టెన్ చ‌మ‌రి అట‌ప‌ట్టు మీద‌నే ఎక్కువ బాద్య‌త ఉంది. విష్మి గుణ‌ర‌త్నే జ‌ట్టులో లేక‌పోవ‌డంతో ఆమె అన్ని విధాలా జ‌ట్టు బాధ్య‌త‌ను స్వీక‌రించాల్సి వ‌స్తుంది. మిడిల్ ఆర్డ‌ర్‌లో హాసిని పెరెరా, హ‌ర్షిత స‌మ‌ర‌విక్ర‌మ గ‌ట్టి పోటీనివ్వ‌వ‌చ్చు.  హ‌ర్మ‌న్ ప్రీత్ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టులో  స్మృతి,దీప్తి, ష‌ఫాలీ, రోడ్రిగ్స్, స‌బ్బినేని, రిచా ఘోష్‌, స్నేహ‌రాణా, హేమ‌ల‌త‌, మేఘ‌నా సింగ్‌, రేణుకా ఠాకూర్‌, పూజావ‌స్త్ర‌కార్‌, రాజేశ్వ‌రీ గైక్వాడ్‌, రాధాయాద‌వ్‌, కె.పి.నావ‌గ‌రి ఉన్నారు.   చ‌మ‌రి అట్ట‌ప‌ట్టు నాయ‌క‌త్వంలోని లంక జ‌ట్టులో నీలాక్షి డి సిల్వా, కావిష దిల్హారి, అచ్చిని కుల‌సూర్య‌, సుగంధిక‌, హ‌ర్షిత‌, మ‌ధుషిక‌, హాసిని పెరీరా, ఒషాడి ర‌ణ‌సింఘే, ఇనోకా ర‌ణ‌వీరా, అనూష్క సంజీవిని, కౌషాని, మాల్సా షెహానీ, ర‌ష్మీ సిల్వా, త‌రికా సివాండీ ఉన్నారు. 

అర్థమవుతోందా..? సామీ..!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీ సీఎం జగన్ సమర శంఖం పూరించేశారు. ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉందంటూనే.. ఇప్పటి నుంచే రెడీ కావాలని తన ఎమ్మెల్యేలకు హుకుం జారీచేసేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిర్వహించిన గడప గడపకు వర్క్ షాపులో వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల బాధ్యులకు ఊపిరాడని విధంగా జగన్ ఇబ్బంది పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశంలో సీఎం జగన్ వారితో నిర్మొహమాటంగా, కఠినంగానే మాట్లాడారు. ‘నవరత్నాల ద్వారా 88 శాతం మంది ఓటర్లకు లబ్ధి చేకూరుస్తున్నాం. ఎన్నికల దాకా ఇలాగే చేస్తాం. మన వల్ల లబ్ధి పొందిన వారు మనకు కాక ఇంకొకరికి ఎందుకు ఓట్లు వేస్తారని ఎమ్మెల్యేలను జగన్ ప్రశ్నించారు.  151 స్థానాలు కాదు.. మొత్తం 175 స్థానాల్లోనూ మనమే గెలిచి తీరాలని జగన్ విస్పష్టంగా చెప్పారన్నారు. మనం 175 సీట్లు గెలుచుకోబోతున్నాం.. గెలిచే తీరుతాం  అంటూ సాగిన జగన్ ప్రసంగం ఎమ్మెల్యేల్ని హిప్నటైజ్ చేసినట్లు ఉందంటున్నారు. తాను చెప్పడమే కానీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ఛాన్సే జగన్ ఇవ్వలేదు.  మళ్లీ మీరు గెలవాలంటే ఇంటింటికీ వెళ్లి,  మీకు ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇంత లబ్ధి చేకూర్చాం  అని చెప్తే చాలు.. ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకూడదు అని ఆదేశించారు. ఓ 27 మంది ఎమ్మెల్యేలు ఆ పని చేయడం లేదని చెబుతూ వారి పేర్లు వెల్లడించి మరీ వారందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్. మరొకసారి చెప్పేది లేదు.. టిక్కెట్ ఇచ్చేది లేదు’ అని హెచ్చరించారు. జగన్ మాటల తీవ్రతకు బుర్ర గిర్రున తిరిగిందని, మైకం కమ్మినట్లైందని ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారంటున్నారు. టికెట్లకు అనర్హులని జగన్ చదివిన 27 పేర్లలో ఎక్కువ మంది మహా చురుకైన వారే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియోజకవర్గంలో చేయని పనిలేదు. ప్రత్యర్థుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కొడాలి నాని సింహం నోట్లో తలపెట్టేందుకైనా వెనుకాడరని తెలిసిందే.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షణం ఖాళీగా ఉండరు. అందరి కంటే ముందు గడప గడప కార్యక్రమం పూర్తిచేశారు. రాజకీయంగా ఇంత చురుకుగా ఉండే ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీఎం ఏ ప్రాతిపదికన అంచనా వేశారో తెలియదు. కేవలం గడప గడప తిరిగితేనే ఓట్లు పడతాయా అనేది తొంభై శాతం మంది ఎమ్మెల్యేల్లో మెదులుతున్న ప్రశ్న. గడప గడపకు వెళ్లి జనం సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నిళ్లు నమిలి వచ్చేస్తే ప్రయోజనం ఏమిటన్నది వారి సందేహం. ఈ ప్రశ్నలను, సందేహాలను జగన్ ముందు ఉంచలేక ఎమ్మెల్యేలు వారిలో వారు మధన పడుతున్నారు.   అన్ని ప్రతికూలతల మధ్యా సాహసించి గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను జనం వదలిపెట్టడం లేదు. తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఎక్కువ శాతం మందికి పథకాలు అంది, వారంతా జగన్ పట్ల కృతజ్ఞతగా ఉంటే ఇక ఎమ్మెల్యేల పాత్ర ఏమి ఉంటుంది?  వారు గడప గడపకు తిరగకపోతే వచ్చే ప్రమాదం ఏమి ఉంది?  ఎమ్మెల్యేలను చూసి జనం ఓటు వేయనప్పుడు, ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఎందుకు? అనే ప్రశ్నలు విన వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను అర్ధం చేసుకోకుండా సీఎం చేయిస్తున్న సర్వేలు, అంచనాలు మేలు చేస్తాయా అనేది వైసీపీ శ్రేణులు సైతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవం. ప్రజలు శాపనార్ధాలు పెడుతున్నారు. నిందిస్తున్నారు. కానీ జగన్ మాత్రం లబ్ధి పొందినవారు గంప గుత్తగా తనకే ఓట్లు వేస్తారని గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ విధమైన జగన్ తీరే ఎమ్మెల్యేలకు నచ్చడంలేదు. కాగా.. జగన్ పైకి కన్పించినంత అమాయకుడు కాదని, ఎన్నికల నాటికి ప్రత్యర్థులు అవాక్కయ్యేలా దెబ్బకొట్టడానికి అస్త్రాలు రెడీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలను ఆయన ఆంతరంగికులు సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. జగమొండి జగన్ కు అర్థం కాని మరో కీలకాంశం కార్యకర్తల్లో ప్రబలుతున్న అసంతృప్తి. ఈ మూడేళ్లలో వైసీపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఉపకారమేదీ లేదు. జగన్  విజయం కోసం వైసీపీ కార్యకర్తలు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకొని ఎందుకు పనిచేస్తారనే ప్రశ్న వస్తోంది. ఈ ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఎం ఆదేశాలకు, ఎమ్మెల్యేల ఆలోచనలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తన పథకాలు, బటన్ నొక్కుడు వల్ల సగానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలవడం ఖాయమని, మరోసారి అధికారం తథ్యమనీ జగన్ నమ్ముతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వెళ్లి, ప్రచారంచేసే పరిస్థితులు ఉండకపోవచ్చుననీ, పోలీసు భయం పోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు ఉధృతంగా ఉంటుందనీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. బాగా పనిచేసే వారిని, నిత్యం ప్రజల మధ్యే తిరిగేవారిని తప్పు పట్టి, జనానికి అందకుండా తిరిగే వారికి మంచి మార్కులు వేయడంలోనే జగన్ అంచనాలు సరిగా లేవని అర్ధమవుతోందని ఎమ్మెల్యేలు  వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ప్రభుత్వం సమస్య ఎదుర్కొంటోందా అనే ఆలోచన సీఎం చేయడం లేదని వీరి భావన. ధరల పెరుగుదల, దోపిడీ మాదిరిగా సాతుగున్న మద్యం, ఇసుక అమ్మకాలు, ఉద్యోగుల అసంతృప్తి, ఉపాధ్యాయుల ఆగ్రహం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన అవినీతి వంటి అంశాలను ప్రధానంగా జనం చర్చిస్తున్న విషయం జగన్ కు తెలుస్తోందా? ఆయనకు అర్ధమౌతోందా అని ప్రశ్నిస్తున్నారు.  ధరల పెరుగుదలతో జనం మండిపోతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిప్పు రాజేస్తున్నారు. జగన్ తీరుతో వైసీపీ కార్యకర్తల్లోనూ తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇవన్నీ గాలికి వదిలేసి పథకాలు మాత్రమే ఓట్లు తెస్తాయనుకొంటే పుట్టి మునగడం తధ్యం సామీ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు వ్యతిరేకత అంతా మీ మీదే సామీ.. మా మీద కాదు’ అని తన జగన్ పైనే  వారు సెటైర్లు వేసేదాకా వచ్చింది. అయినా  పరిస్థితి జగన్ కు ఎందుకు అర్ధం కావడం లేదో అర్ధం కావడం లేదని వారు జుట్టు పీక్కుంటున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో ఖర్గే, థరూర్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ అనివార్యమని తేలిపోయింది. ఆ పదవి కోసం పోటీ పడుతున్న నేతలెవరో కూడా తేలిపోయింది. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం నాడు ఇరువురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 30) ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశాయి. పార్టీ అధికారిక అభ్యర్థిగా మల్లికార్జన్ ఖర్గే నామినేషన్ దాఖలు చేయగా, ముందునుంచీ పోటీలో ఉంటానని చెబుతూ వస్తున్న శశిథరూర్ కూడా తన నామానేషన్ ను దాఖలు చేశారు. వీరిరువురూ వేరువేరుగా తమ తమ నామినేషన్ పత్రాలను పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. శశిథరూర్ పెద్ద సంఖ్యలో అభిమానులతో డప్పు వాయిద్యాల మధ్య పార్టీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ అధ్యక్ష ఎన్నిక అంతా పారదర్శకంగా ఫ్లా లెస్ గా జరుగుతోందని తాను భావించడం లేదన్నారు. అయితే మ్యాచ్ లోకి దిగిన తరువాత అక్కడ ఉన్న పిచ్ పైనే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. కాగా తాను పోటీ నుంచి విరమించుకునే ప్రశ్న, ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి విరమించుకుంటే తన క్యాడర్ ను నిరాశపరిచిన వాడినౌతానని అన్నారు. స్వేచ్ఛగా, సజావుగా పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కాగా అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన శశిథరూర్ పార్టీ నేతలలో అసమ్మతి వాదులుగా పేరుబడ్డ  జీ 23 నేతల్లో ఒకరు. పార్టీని ప్రక్షాళన చేయాలని  కోరుతూ సోనియాగాంధీని కోరిన  గులాంనబీ  ఆజాద్ , కపిల్ సిబల్, ఆనందశర్మ తదితరులలో శశిథరూర్ కూడా ఒకరు. ఇప్పటికే జీ23 నేతల్లో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ పార్టీని వీడి వెళ్లి పోయారు. పార్టీలోనే కొనసాగుతున్న శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీలో దిగారు.  ఇక కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గేకు మద్దతుగా దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 30) మళ్లికార్జున్ ఖర్గేతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఆ తరువాత తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఉదయం నుంచీ నాటకీయ పరిణామాలు సంభవించాయి. పార్టీ అధినేత్రి అశోక్ గెహ్లాట్ ను పార్టీ ముందుగా సోనియా గాంధీ అధ్యక్ష అభ్యర్థికి పోటీగా ప్రతిపాదించారు. ఆయన అందుకు సంభవించినా అనంతరం రాజస్థాన్ లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అనివార్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత పార్టీ పలువురి పేర్లు పరిశీలించింది. తొలుత కాంగ్రెస్ అధినేత్రి పరిశీలించిన పేర్లలో మల్లికార్జున్ ఖర్గే పేరు లేదు. దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ల పేర్లు పరిశీలించి దిగ్విజయ్ పేరును ఖరారు చేశారు. అయితే చివరి క్షణంలో దిగ్విజయ్ పోటీ నుంచి తప్పుకుని ఖర్గే తెరపైకి వచ్చారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరొందిన ఖర్గే మంచి వక్త, రాజ్యసభలో కాంగ్రెస్ గొంతు బలంగా వినిపిస్తారు.   h

 బిగ్ బాస్ షో లో అశ్లీల‌త‌... హైకోర్టు ఆగ్ర‌హం

ఒక టీవీ ఛాన‌ల్‌లో వ‌స్తున్న బిగ్ బాస్ షో యువ‌త‌ను ఎంతో ఆక‌ట్టుకుంటోంది. అయితే ఇప్ప‌టికి ఐదు సీజ‌న్లు పూర్తి చేసుకున్న ఈ షో మీద అస‌లు ఆరంభం నుంచే విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ  షో అశ్లీల‌త‌తో కూడింద‌ని, దీన్ని వెంట‌నే నిషేధించా లంటూ చాలామంది విమ‌ర్శ‌లు చేసారు. కానీ ఐదు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆరో ఎపిసోడ్ మ‌రింత దారుణంగా ఉంద‌ని చాలా అశ్లీలత చోటు చేసుకుం టోంద‌ని షోనీ నిలిపి వేయాల‌ని కోరుతూ  హైకోర్టులో పిల్ దాఖ‌ల‌యింది. దీనిపై విచార‌ణ‌ జ‌రిపింది. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయవాది శివ‌ప్రసాద్ రెడ్డి ఐబీఎఫ్ మార్గ‌ద‌ర్శ‌కాలు అస్స‌లు పాటించ‌డం లేద‌ని, నిర్లక్ష్యం చేశార‌ని వివరించారు. ఈ విష‌య‌మై హైకోర్టు  కూడా ఆగ్ర‌హించింది. ఈ సందర్భంగా 1970 లలో సినిమాల విష యాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరఫు న్యాయవాది దీనిపై స్పందించేం దుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసుల విష యాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. విచారణను అక్టోబరు 11కు న్యాయస్ధానం వాయిదా వేసింది.  బిగ్ బాస్ షో పై స్పందించడానికి కేంద్రం సమయం కావాలని కోరింది. ప్రతివాదులకు నోటీసులపై తదు పరి వాయిదాల్లో నిర్ణయిస్తామని  హైకోర్టు తెలిపింది.  ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసిందని ఒక  తెలుగు న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.  బిగ్బాస్ షో పై 2019లోనే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ రియాలిటీ షోలో అశ్లీలత, అసభ్యత, హింస ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ఈ  పిటిషన్ పై అత్యవసరంగా విచా రణ జరిపిం చాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ ను ప్రారంభిం చింది ఏపీ హైకోర్టు. ఇవాళ కూడ ఈ విషయమై  హైకోర్టు విచారణ‌ నిర్వహించింది.  బిగ్ బాస్ షో లో చోటు చేసుకుం టున పరిణామాలపై  సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ తనదైన శైలి లో విమర్శలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చూసేలా ఈ కార్యక్రమం లేదని నారా యణ విమర్శించారు. ఈ షో ను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ షోకి వ్యాఖ్యతగా వ్యవహ రిస్తున్న నటుడు నాగార్జునపై కూడ నారాయణ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.   గతంలో బిగ్ బాస్ షో ప్రసారమైన సమయంలో కూడా నారాయణ ఈ షోపై విమర్శలు చేశారు. ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయమై ఏం చేస్తుందని కూడా నారాయణ ప్రశ్నించారు. దేశంలోని పలు  భాషల్లో ఈ రియాల్టీ షో ప్రసారమౌతుంది. తెలుగులో ఆరో సీజన్ ప్రస్తుతం ప్రసారం అవుతుంది. 

అదిరింది సారూ కేసీఆరూ.. కొత్త పార్టీ.. కోత్త ఫ్లైటు!

కొత్త ఇల్లు  కొత్త.. అంటూ  అదేదో సినిమాలో ఓ డైలాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితీ అలాగే ఉంది. అదిరింది సారూ..కేసీఆరూ..  కొత్త ఫ్లైటూ, కొత్త పార్టీ అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో పోస్టులు పెడుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తెరాస అధినేతగా, తెలంగాణ సీఎంగానే కాదు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుదామని ఉవ్విళ్లూరుతున్న నేతగా దేశంలో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే, ప్రతి మాటా ఒక రాజకీయ ఎత్తుగడే అన్నట్లుగా ఉంటుంది. కేసీఆర్ మాట్లాడినా సంచలనమే.. మౌనం వహించినా సంచలనమే అన్నట్లుంటుంది ఆయన వ్యవహార శైలి. ఎనిమిదేళ్లుగా తెలంగాణ సీఎంగా ఉన్న ఆయన.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఇక తనకు తిరుగులేదని అనుకున్నారో ఏమో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా రాష్ట్రంపై కంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఆయన చాలా రాష్ట్రాలు తిరిగేశారు. చాలా మంది నేతలతో భేటీ అయ్యారు. అవేమీ పెద్దగా కలిసి రాకపోయినా.. ఆయన తగ్గేదేలే.. అంటూ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయన చేస్తున్న ప్రతి ప్రయత్నం, ప్రతి చర్యా ఒక సంచలనమే అన్నట్లుగా సాగుతోంది. తన జాతీయ రాజకీయ ప్రవేశంలో భాగంగా దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటి వరకూ దేశంలో  ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది అనే చెప్పాలి. ఆ విమానం కొనుగోలు ఖర్చును ఐదారుగురు పార్టీ నేతలు భరించారని చెబుతున్నారు. దేశ ప్రధాని కూడా గతంలో అంటే 2014 ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రత్యేక విమానంలో సుడిగాలి పర్యటనలు చేశారు. అయితే అదేమీ పార్టీ ఆయన కోసం కొన్న విమానం కాదు. కానీ ఆయన సన్నిహితుడిగా పేరొందిన పారిశ్రామిక వేత్త సమకూర్చిన విమానం అది.  అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ జాతీయ రాజకీయ ప్రవేశం బీజేపీ ఏకగ్రీవ తీర్మానంతో జరిగింది. మరి కేసీఆర్ విషయంలో అలాంటిదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటి కింకా ఆయన ప్రాంతీయ పార్టీ అధినేతే.. అందుకే ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించి చక్రం తిప్పాలనుకుంటే అందుకు ఎవరి అనుమతులూ, ఏ పార్టీ తీర్మానం అవసరం లేదు. ఆయన నిర్ణయమే తెరాస నిర్ణయం. ఎందుకంటే ఆయనే తెరాస, తెరాసయే ఆయన. అది పక్కన పెడితే కేసీఆర్  గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ దేశ ప్రధాని అయినప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న తానెందుకు కాకూడదనుకున్నారో ఏమో .. ప్రధాని పీఠం లక్ష్యంగా గురిపెట్టు జాతీయ రాజకీయాలలోకి అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా కొత్త పార్టీనే స్థాపిస్తున్నారు. అందుకు ముహూర్తం ఖరారు చేసేశారు. దసరా రోజున ఆయన తన జాతీయ పార్టీని ప్రకటిస్తారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.   ఆ ప్రకటన తరువాత ఇక కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు ఉంటాయి. బాడుగ విమానాలు తన స్థాయికి సరిపోవనుకున్నారో ఏమో సొంతంగా విమానాన్ని కొనుగోలు చేసేయాలని నిర్ణయించారు. మోడీకి అదానీలా.. కేసీఆర్ కోసం విమానాలు సమకూర్చి పెట్టేందుకు బోలెడు మంది సదా సిద్ధంగా ఉంటారు. అయినా ఎందుకో కేసీఆర్ ఆ దిశగా ఆలోచించేందుకు ఇష్టపడలేదు.  పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత పేరు బయటకు వచ్చిన తరువాత.. అలాగే సొంత మనిషి అనుకున్న ఎంపీ సంతోష్ కూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన తరువాత మరెవరినీ దగ్గరకు తీయద్దు అనుకున్నారో ఏమో..  వాళ్లూ వీళ్లూ విమానాన్ని సమకూర్చి పెట్టేదేమిటి? సొంతంగా విమానాన్ని కొనేస్తే పోలా అని నిర్ణయించుకున్నారు.   అందుకే బాగుంది సారూ.. కేసీఆరూ అని అందరూ అనేలా కొత్త పార్టీ , కొత్త విమానంతో ఆయన జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్న మాట. విజయదశమి రోజునే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. చెడుపై మంచి గెలిచిన రోజు విజయదశమిగా ప్రతీతి. అటువంటి విజయదశమిని కేసీఆర్ తన కొత్త పార్టీ పేరు ప్రకటనకు ఎంచుకున్నారు. గత కొంత కాలంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన ఆయన ఆ యుద్ధం ఆరంభానికి విజయదశమిని ఎన్నుకున్నారని తెరాస వర్గాలు ఘనంగా చెబుతున్నాయి. కేసీఆర్ కు దైవ భక్తి మెండు. అందుకే ఆయన జాతీయ పార్టీ ప్రకటనకు ముందు శుక్రవారం (సెప్టెంబర్ 30) యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. పనిలో పనిగా గతంలో ప్రకటించిన విధంగా కేజీ 16 తులాల బంగారాన్ని స్వామివారికి సమర్పించి తన పసిడి మొక్కు తీర్చుకున్నారు. అలాగే తన కొత్త జాతీయ పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం  తీసుకున్నారు.  అలాగే శనివారం (అక్టోబర్1 ) వరంగల్   భద్రకాళి అమ్మవారిని దర్శించుకొనున్నారు. విజయదశమి రోజున పార్టీని ప్రకటించి కొత్త పార్టీ తరఫున తొలి బహిరంగ సభ కరీంనగర్ లో నిర్వహించనున్నారు. మొత్తం మీద కేసీఆర్ కొత్త పార్టీ లాంచింగ్ ను ఘనంగా, చాలా ఘనంగా చేయనున్నారు.  

ఢిల్లీ కేసులు.. తెలంగాణ లింకులు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు తీగ లాగితే కేసు మూలాలు తెలంగాణలో బయట పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ముఖ్యమంత్రి సమీప బంధువు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా, మరి కొందరు తెరాస బంధువర్గానికి చెందిన నాయకులు, వ్యాపార వేత్తలకు ఆ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)   హైదరాబాద్’లో పలుచోట్ల తనిఖీలు జరిపింది. కొందరికి నోటేసులు జారీ చేసింది. ఒక రిద్దరిని విచారించింది. కవిత, సంతోష్ సహా మరి కొందరు ముఖ్యులకు నోటీసులు వచ్చాయని, వస్తున్నాయని ప్రచారం నడుస్తోంది.ఈ నేపధ్యంలో ఏ రోజుకు ఆ రోజు ఏమి జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. అయితే ఈడీ అధికారులు ఎందుకనో గానీ, ఈ కేసులో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, సిసోడియా అరెస్టుకు రంగం సిద్దం మైందని  అయినా భయపడేది లేదని ప్రకటించి నెలరోజుల పైనే అయింది, అయినా. ఇంతవరకు సిసోడియా అరెస్ట్ జరగలేదు. కానీ, ముఖ్యమంత్రి కేజ్రివాల్ సన్నిహితుడు, విజయ్ నాయర్, మరో  మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఎవరి వంతు వస్తుందన్న సస్పెన్స్..సాగుతోంది.   అదలా ఉంటే నేషనల్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన లింకులు కూడా తెలంగాణలో బయట పడ్డాయి. ఈ కేసులో  కొందరు కాంగ్రెస్ నాయకులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్పటికే  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నాయకుదు మల్లి కార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులను విచారించిన, ఈడీ,. ఇప్పడు నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు ఇచ్చిన వారికీ నోటిసులు ఇచ్చింది. అయితే, వీరికి కుంభకోణంతో సంబంధం వుందా, లేదా అనేది స్పష్టం కాకున్నా నోటీసులు అయితే అందాయి. విచారణకు  తర్వత గానీ, అసలు విషయం తెలియదు.  కాగా, నోటీసులు అందుకున్న వారికి కేసు పూర్వాపరాలు వివరించేందుకు, కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి రావాలని సూచించింది.ఈ క్రమంలో  గురువారం( సెప్టెంబర్ 29) కొందరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.   కాగా, నోటీసులు అందుకున్నవారిలో,  మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ ,కేంద్ర మాజీ మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఉన్నారని తెలుస్తోంది.   ఢిల్లీ లికర్ కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులతో పాటుగా క్యాసినో కేసులో ఈడీ తెలంగాణ నాయకులను విచారించడం, రాజకీయ వర్గాల్లో  సంచలనంగా, మారింది. ఈడీ చూపు ఎప్పుడు ఎవరి మీద పడుతుందో, అనే ఆందోళన వ్యక్తమవుతోంది.రాజకీయ నేతల్లో భయం తొంగి చూస్తోంది.

ప్ర‌పంచ‌ రికార్డు కోసం భ‌యాన‌క సాహ‌సం!

ఒక‌మ్మాయి తాడు మీద న‌డుస్తుంటుంది, ఒక‌డు డ‌ప్పు కొడుతూ ఆమెను ఉత్సాహ‌ప‌రుస్తుంటాడు, ఒక పిల్లాడు బొచ్చ ప‌ట్టుకుని డ‌బ్బులు అడుగుతూంటాడు. ఇది సాధార‌ణంగా అనాదిగా రోడ్డుమీదా, ఇళ్ల‌ ద‌గ్గ‌రో అంద రం చూసే గొప్ప సాహ‌సం! దీనికే  మావా,,ఆ పిల్ల‌గాని కింద‌ప‌డితే ఏమ‌న్నా ఉందా!  అని తెగ ఆశర్యపోతూ కామెంట్లు చేస్తుంటారు. స‌ర్క‌స్‌లో గోళ్లు, కోపంలేని పులితో  ఒక  బ‌క్క‌ప‌ల‌చ‌ని  వ్య‌క్తి ఆడుతూంటాడు. అప్పుడూ అంద‌రి ఎక్స్‌ప్రెష‌న్  ఒక‌టే. కానీ రాఫెల్, అలెగ్జాండర్ చేసిన సాహ‌సం చూస్తే, వింటే గుండాగినంత ప‌నే అవుతుంది.  వాళ్లిద్ద‌రూ మ‌న‌కు తెలిసిన ఫీట్లకు మించి భ‌యాన‌క ఫీట్ చేశారు. ప్ర‌పంచ రికార్డు సాధించాల‌న్న త‌ప‌న తో వారిద్ద‌రూ ప‌సిఫిక్ మ‌హాస‌ముద్ర నైరుతి దిశ‌లోని తాన్నా దీవుల్లో నిప్పు న‌దులు వ‌స్తున్న యాస‌ర్ ప‌ర్వతం పైన 137 అడుగుల ఎత్తున ఒక చివ‌రి నుంచి మ‌రో చివ‌రికి తాడులాంటిది క‌ట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు న‌డిచారు! కింద ప్రాణం తీసే నిప్పుల న‌ది. ఏమాత్రం ప‌ట్టుద‌ప్పినా మ‌నిషి మిగ‌ల‌డు. నిప్పుగుండం మింగేస్తుంది. అలాంటి సాహ‌సం చేయ‌డానికి వారు ఎంత‌గా సాహ‌సించార‌న్న‌ ది ఆలోచి స్తే నే ఒణుకుపుడుతుంది.  వారి ఫీట్‌ని వీడియో తీసిన వ్య‌క్తి భ‌యంతో ఒణికిపోయాట్ట‌.  వాళ్లిద్ద‌రూ  త‌ల‌కు హెల్మెట్‌తో పాటు గ్యాస్ మాస్క్ పెట్టు కున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో తీసి మ‌ళ్లీ ధ‌రించారు. కింద నిప్పుల గుండం నుంచి వ‌చ్చే వేడి సెగతో ఊపిరాడని ప‌రిస్థితి. అయినా అంత‌టి క‌ఠిన ప‌రిస్థితుల్లోనూ బ్యాలెన్స్ త‌ప్ప‌కుండా తాడులాంటి దాని మీద న‌డ‌వ‌డానికి సాహ‌సించారు. అస‌లు వాల్కనోని చూస్తేనే భ‌య‌మేస్తుంది. పైగా దాని పైన న‌డ‌క అంటే ప్రాణంపోయినంత ప‌నే. ఏ క్ష‌ణాన ఏం చూడాల్సివ‌స్తుందో అని ప్రేక్ష‌కులు కొంద‌రు చాలా మంది క‌ళ్లు మూసుకున్నారు. వెనుక నిప్పు క‌ణిక‌లు పేలుతూంటే అవి మీద ప‌డి ఎక్క‌డ ప‌డిపోతానేమో న‌ని భ‌య‌ప‌డిచ‌చ్చాన‌నుకోండి అన్నాడు  రాఫ‌ల్‌. 

నేష‌న‌ల్ హెరాల్డ్‌కేసు...గీతారెడ్డి, రేణుకాచౌద‌రీల‌కు ఈడీ పిలుపు

నేషనల్ హెరాల్డ్ కేసు లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ అమ‌లు చేస్తు న్న రాజ‌కీయ వ్యూహాలు అంతుచిక్క‌డం లేదు. ఒక‌వంక పార్టీలోకి అంద‌రినీ ఆహ్వానిస్తూనే, అందుకు భారీ కార్య‌క్రమాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తూనే మ‌రోవంక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి నిద్ర‌లేకుండా చేస్తోంది. నేష‌ న‌ల్ హెరాల్డ్ కేసులో ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ప‌లుమార్లు ఈడీ పిలిచి విచారిం చారు. ఇపుడు తాజాగా తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కుల‌కు పిలుపు వ‌చ్చింది.  అక్టోబర్ 11, 12 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ నోటీ సులు అందుకున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ రావాల్సిందిగా పిలుపిచ్చింది. టీ కాంగ్రెస్ నేతలు షబ్బీర్అలీ  గీతారెడ్డి , అంజన్ కుమార్ యాదవ్ , సుదర్శన్‌రెడ్డి , రేణుకాచౌదరి , అనిల్‌కుమార్ తదిత రు లు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ ఆడిటర్లతో భేటీ కానున్నారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ గాంధీలను ఈడీ  అధికారులు విచారించిన విషయం తెలిసిందే.  కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు చేస్తున్న ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగు లు ప్రత్యర్ధి పార్టీలకు అర్ధం కావడం లేదు. ఓవైపు ఆపరేషన్‌ ఆకర్షణ పేరుతో ఇతర పార్టీల నేతలకు వల వేస్తూనే మరోవైపు ఈడీ కొరడాను ఝుళిపిస్తోంది. బీజేపీ వలలో చిక్కని నాయకులు, కమలం వైపు చూడ ని పార్టీల నేతలపై కొత్త ఆస్త్రాన్ని ప్రయోగిస్తోందనే విమర్శలు కాంగ్రెస్  శ్రేణుల నుంచి వినిపిస్తు న్నాయి. ఇప్పటికే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ (టీఆర్ ఎస్‌) నేతలపై ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోప ణలతో ఈడీ ని ప్రయోగిస్తున్న కేంద్రం .. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను వదలడం లేదు. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్‌ హెరాల్డ్ కేసులో  ప్రస్తుతం కీలక నాయకు లకు ఈడీ నోటీసులు  జారీ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. తెలంగాణలో ఓ వైపు లిక్కర్‌ స్కాంపై సోదాలు జరుగుతున్న సమయంలోనే ఐదుగురు కాంగ్రెస్‌ నేతల కు ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్త హాట్‌ టాపిక్‌గా మారాయి. గతంలో మంత్రులుగా పనిచేసిన ముగ్గురి తో పాటు ఇద్దరు ఎంపీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న గీతారెడ్డి, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్‌ రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు అక్టోబర్‌ 10వ తేదిన విచారణకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని కోరడం జరిగింది.

డబ్బు కొట్టు పవర్ పట్టు.. కాసులే కేసీఆర్ అజెండానా?

డబ్బుకు లోకం దాసోహం, ఈ సామెతను ఎవరు నమ్ముతారో, ఎవరు నమ్మరో ఏమో, కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం,అదే నమ్మకంతో జాతీయ రాజకీయాల్లో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు.  ముందడుగు వేస్తున్నారు. చేతిలో కాష్ ఉంటే కొండమీది కోతినే కాదు, ఢిల్లీ  పీఠంపై అధికారాన్నికూడా ఇట్టే పట్టేయచ్చని చాలా గట్టిగా నమ్ముతున్నారు.  నిజం. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేదుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ప్రధానంగా డబ్బు కేంద్రంగానే సాగుతున్నాయన్నదే అందరి మాటగా వినిపిస్తోంది.   ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ రాజకీయాలో ఎంట్రీ ఇచ్చేందుకు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో ఎన్ని కొట్లో ఏమో తెలియదు  కానీ, చాలా కాస్ట్లీ డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం, ఢిల్లీలో  భారీ శాలరీతో పీఆర్వోను నియమించారు. జాతీయ పత్రికలు, మీడియాలో పెద్ద ఎత్తున పెయిడ్ ఆర్టికల్స్, ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. అఫ్కోర్స్, అదంతా ప్రభుత్వ ఖాతా నుంచే వెళుతున్నా, సొమ్ములు ఎవరివి  అయినా ముఖ్యమంత్రి కేసేఆర్, జాతీయ రాజకీయాల్లో డబ్బు మీద నడిచే ఆలోచనతోనే అడుగులు వేస్తున్నారని పరిశీలకు విశ్లేషిస్తున్నారు.  నిజానికి,జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టాలనే ఆలోచనకు అంకురార్పణగా తీర్మానం చేసిన తెరాస 21వ ప్లీనరీ సమావేశంలోనే, తెరాస ఖజానా గురించి కూడా కేసీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. నోట్ల కట్టల లెక్కలు చెప్పారు. పార్టీ బ్యాంక్ ఖాతాల్లో రూ.800 కోట్ల వరకు ఉన్నాయి, ఇతర ఆస్తులు, వడ్డీలు, ఇతర ఆదాయాలు, వస్తున్న విరాళాలు కలుపుకుంటే, పార్టీ సంపద రూ. 1000 కోట్లకు దాటిపోతుందని బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు, ఒక్కసారి పిలుపిస్తే మరిన్ని వందల వేల కోట్లు వచ్చిపడతాయని, భారీ విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని కూడా కేసీఆర్ చెప్పారు. ఇదంతా కూడా జాతీయ పార్టీ పెట్టేందుకు తెరాసకు సొమ్ముల కొరత లేదని చెప్పేందుకు చేసిన ప్రయత్నంగానే పరిశీలకులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఇతర ప్రాంతీయ పార్టీలను ఆకట్టుకునేందుకే కేసీఆర్ తెరాస ఖజానా తలుపులు తీసి, సంపదను దేశం ముందు పరిచారు.  ఇక అక్కడి నుంచి దేశంలో తమ ప్రతిష్టను పెంచుకుకునేందుకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి, కేసీఆర్ ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఇలా అనేక రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలకు నిందులు సమకూర్చి రాజకీయ బేరసారాలు సాగిస్తున్నారని అంటున్నారు. గతంలోనూ ఏపీలో వైసీపీకి, యూపీలో ఎస్పీకి ఇలా అనేక ప్రాంతీయ పార్టీలకు వందల కోట్ల రూపాయల మేర ఎ న్నికల  నిధులను  సమకూర్చారు. ఈ మధ్య కాలంలోనూ  త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, గుజరాత్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరపింది కూడా అందుకే అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  మరోవంక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాలలో తమ రాజకీయ పలుకుబడిని పెంచుకునేందుకు, ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ సరిహద్దులలో ఉత్తరాది రాష్ట్రాల రైతులు సంవత్సరం పైగా సాగించిన ఆందోళనలో చనిపోయిన పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులకు, దేశ సరిహద్దులలో చనిపోయిన సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో మొదలు దేశ వ్యాప్తంగా, జాతీయ, ప్రాంతీయ పత్రికలో తెలంగాణ ప్రభుత్వ పథకాల  ప్రచారం కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.  ఇక ప్రస్త్తుతానికొస్తే, దసరా పండగ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ ‘బంగారు’ తెరాస నిధులు, ఆర్థిక స్థోమత పై మరో మారు చర్చ మొదలైంది. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా తిరిగేందుకు, ఏకంగా రూ. 80 కోట్లతో సొంత చార్టెడ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేయాలని కేసీఆర్ నిర్ణయంచారని అంటున్నారు. అంతే కాదు, జాతీయ పార్టీ లాంచ్ కవరేజ్ కోసం దేశంలో ప్రధాన టీవీ చానల్స్ అన్నిటిలో, ఏకంగా స్లాట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అదే నిజమైతే, జాతీయ రాజకీయాల విషయం ఎలా ఉన్నా, రాష్ట్ర రాజకేయాల్లో మాత్రం సంచలనమే అవుతుంది. మరోవంక, ఇప్పటికే కేసీఆర్ కుటుంబ అవినీతిపై వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని అంటున్నారు.

విద్యార్ధి కానుక బ్యాగులు చిరిగి పోయాయి!

పిల్లాడి పుట్టిన‌ రోజుకి, బ‌డిలో చేరేడ‌నో బంధువుల‌తోపాటు చుట్టుప‌క్క‌ల‌వారూ కానుక‌లు ఇస్తుండ‌డం ఒక అన‌వాయితీ. వారికి అదో ఆనందం. ఇచ్చేది బాగా ఆలోచించే ఇస్తారు.. చిన్న‌పిల్ల‌ల‌కి ఇస్తున్నామ‌న్న ధోర ణిలో. అవి వీల‌యినంత కాలం ఉప‌యో గిస్తారు. డ్ర‌స్‌, బ్యాగ్‌, మ‌రేదయినా వ‌స్తువు, క‌నీసం జామెట్రీ బాక్స్ అయినా. చిత్ర‌మేమంటే, ఆంధ్రాలో ప్ర‌భుత్వం  ఆర్భాటానికి ఇచ్చిన వ‌స్తువులు ఆ వెంట‌నే పాడ యి పోవడం గ‌మ‌నిస్తు న్నాం. విద్యార్ధుల‌కు విద్యాకానుక‌గా ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు బ్యాగుల‌ను  కానుక‌గా ఇచ్చింది. కానీ వాటి నాణ్య‌త విష‌యంలో ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. విద్యార్థుల‌కు కానుక‌లు ఇచ్చి వారికి ఎంతో మ‌ద్ద‌తునిస్తున్నామ‌ని శ‌భాష్ అనిపించుకోవాల‌న్న ఆతృతే త‌ప్ప వాస్త‌వానికి అందులో ఏమీ లేదు. ప్ర‌చార ఆర్భాటాల‌కు చేసే కానుక ఉత్స‌వాలు ఇలానే ఉంటాయి. కోట్లు త‌గ‌లేసి బ్యాగులు ఇచ్చారు. క‌నీసం వాటి నాణ్య‌త‌ను పరిశీలించే జాగ్ర‌త్త తీసుకోలేదు. ఎవ‌రికో పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్టు ఇచ్చి కాయితాల‌మీద కాంట్రాక్టులు జ‌రిపేసి నాణ్య‌త విష‌యానికి గాలికి వ‌దిలేశా ర‌ని విమర్శ‌కులు అంటున్నారు. చిత్ర‌మేమంటే, ఆ బ్యాగులు క‌నీసం మూడు నెల‌ల‌న్నా స‌రిగా లేవు. అపుడే చిరిగిపోయి పిల్ల‌లు మ‌ళ్లీ పాత బ్యాగ్‌ల‌ను మోస్తున్నారు.  మ‌రి వంద‌కోట్లు ఎటుపోయిన‌ట్లు? ఐదుపుస్త‌కాలు, జామెట్రీబాక్స్‌, టిపిన్ బ్యాక్స్ పెట్టుకోవ‌డానికే ప‌నికి రాని బ్యాగులు ఇచ్చి ప్ర‌యోజ‌న‌మేమిట‌ని విద్యార్థుల త‌లిదండ్రులు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ప్ర‌చార ఆర్భా టం కోస‌మే ఈ కానుక ఇవ్వ‌డాలు నిర్వ‌హించార‌న్న‌ది బ‌య‌ట‌ప‌డింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పక్కన పడేసి, సొంత డబ్బుతో బ్యాగులు కొనుక్కోవాల్సిన పరి స్థితి ఏర్పడింది. నాసిరకం బ్యాగులు విద్యాకానుకను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాడయిన‌ బ్యాగులను వెంటనే మార్చాలని, పాఠశాలల వారీగా వివరాలు సమర్పిం చాలని తాజాగా పాఠ శాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 10లోగా వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించ‌డం హాస్యాస్ప‌దం. ముందు లేని జాగ్ర‌త్త ఇపుడు వెంట‌నే స్పందించి వాటి స్థానంలో మ‌ళ్లీ కొత్త‌వి ఏర్పాటు చేయాల‌న్నది అనాలోచిత‌మే అవుతుంది. అదేదో ముందే నాణ్య‌త విష‌యంలో కాస్తంత జాగ్ర‌త్త తీసుకున్నా ప్ర‌భుత్వానికి ప‌రువుద‌క్కేది. కానీ నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రించేవారికి నాణ్య‌త మాట గుర్తుకు వ‌చ్చి న‌ట్లు లేద‌ని విమ‌ర్శ‌కులు అంటున్నారు.  ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 47లక్షల మంది విద్యార్థులు చదువుతారని పాఠశాల విద్యా శాఖ అంచనా వేసింది. ఆ మేరకు విద్యాకానుకలు కొనుగోలు చేసింది. మొత్తం రూ.931 కోట్లు ఖర్చు చేసిన ట్లు ప్రకటించింది. అయితే, విద్యాకానుకలో ఇచ్చే బ్యాగులు, బెల్టులు, బూట్లు, సాక్సుల వారీగా ఒక్కోదానికి ఎంత వెచ్చించిందనే విషయాన్ని మాత్రం బయటకు వెల్లడించలేదు. ప్రభుత్వం అంచనా వేసినంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేదు. అంచనాలకు భిన్నంగా చాలా మంది ప్రైవేటుపాఠశాలల బాట పట్టారు. దీంతో చివరికి 41,24,139 మందికి మాత్రమే విద్యా కానుక లు పంపిణీ చేసింది. విద్యార్థు లకు మూడు సైజుల్లో బ్యాగులు అందజేసింది. 1 నుంచి 4 తరగతుల విద్యార్థులకు చిన్నవి, 5 నుంచి 7 తరగతులకు వారికి మీడియం సైజు, 8 నుంచి 10 తరగతుల వారికి పెద్ద బ్యాగులు పంపిణీ చేసింది. కానీ చాలా ప్రాంతాల్లో బ్యాగులు, సాక్సులు, షూలు కూడా అధ్వాన్నంగా ఉన్నాయ‌న్న వార్త‌లే విన‌బ‌డుతు న్నాయి. ఇపుడు వీట‌న్నింటికీ కొత్త వి ఏర్పాటు చేయ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. అలాంట‌పుడు వారి విద్యార్ధి కానుక ఏ మేర‌కు ప్ర‌జోప‌యోగం అవుతుందో జ‌గ‌న్ స‌ర్కార్ వివ‌రించాలి. 

దసరా తరువాత మోగనున్న మునుగోడు నగారా.. ?

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీ కంటే ప్రజలలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశమేదైనా ఉందంటే అది మునుగోడు ఉప ఎన్నికే. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు, ఆ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతోంది అన్న ఉత్కంఠ మూడు ప్రధాన పార్టీల నేతలూ, కార్యకర్తలలోనే కాదు.. రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలందరిలోనూ నెలకొని ఉంది. అయితే నవంబర్ లో ఉప ఎన్నిక ఉంటుందన్న అంచనాలు చాలా కాలం నుంచీ ఉన్నప్పటికీ.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారికి అందిన సమాచారం మేరకు దసరా తరువాత ఏ క్షణంలోనైనా మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అంటే ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా ఉప ఎన్నిక  ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక ఎర్పాట్ల వివరాలు తెలియజేయాల్సిందిగా కోరిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఏడాది చివరిలో గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల అసెంబ్లీలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే వాటితో పాటే మునుగోడు ఉప ఎన్నిక కూడా జరుగుతుందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇక మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా కారణంగా అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను అసెంబ్లీ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేశాననీ, రాష్ట్రంలో తెరాసనున దీటుగా ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకే ఉందని ఆయన అంటున్నారు.   రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను అనివార్యం చేయడం ద్వారా వ్యూహాత్మకంగా పావులు కదిపిందని అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించిన నాటి నుంచీ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపింది. మునుగోడులో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరాస ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కాంగ్రెస్ క్యాడర్ లో నిరుత్సాహం నిండుతుందన్నది కూడా బీజేపీ వ్యూహమని అంటున్నారు. అయితే రాజగోపాలరెడ్డి రాజీనామా అనంతరం అనూహ్యంగా బీజేపీ వెనుకబడి తెరాస, కాంగ్రెస్ లు పుంజుకున్నాయని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఊహించిన విధంగా రాజగోపాలరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ క్యాడర్ కమలం గూటికి చేరలేదు. అంతే కాకుండా రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్లు బిగించే విషయంలో రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ ప్రజలలో ఆగ్రహాన్ని నింపాయని అంటున్నారు. రాజగోపాలరెడ్డికే మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే కష్టమేనని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనను ఆ బాధ్యతకు దూరంగా ఉంచి ప్రచార బాధ్యతలను కేంద్ర నాయకులకు అప్పగించిందని చెబుతున్నారు. మొత్తం మీద దసరా తరువాత మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుందన్న స్పష్టత రావడంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టీ అటువైపే మళ్లింది. 

కాంగ్రెస్ ఇప్పుడు అన్నా, చెల్లి పార్టీ..జె.పి.న‌డ్డా

జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్తో పోటీ ప‌డుతున్న‌ప్ప‌టికీ, వాస్త‌వానికి కాంగ్రెస్ జాతీయ‌, భార‌త్ స్థాయి నుంచి అన్నాచెల్లెలి పార్టీగా దిగ‌జారిందని బీజేపీ అధ్య‌క్షుడు జె.పి.న‌డ్డా వ్యాఖ్యానించారు. గురువారం భువ నేశ్వర్లో బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ,జ‌మ్ములో  నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో స‌మాజ్‌ వాది పార్టీ, బీహార్‌లో ఆర్జేడీ, ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, ఒడిషాలో బీజెడీ, తెలంగాణాలో టీఆర్ ఎస్ వంటి కుటుంబ పాలితపార్టీల‌తో పోరాడుతోంద న్నారు. క‌నుక దేశంలో జాతీయ‌పార్టీ స్థాయి క‌లిగి న‌ది, ఆ  విధంగా పిల‌వ బ‌డుతున్న పార్టీ కేవ‌లం త‌మ బీజేపీ యేన‌ని అన్నారు.  బీజేపీ పార్టీ బ‌ల‌గం 18 కోట్ల‌మంది అని, లోక్ స‌భ‌లో 302 మంది ఎంపీలు, రాజ్య‌స‌భ‌లో 92 మంది ఎంపీలు. 1,394 మంది ఎమ్మెల్యేలు, సుమారు 120 మంది మేయ‌ర్లు ఉన్నార‌న్నారు. దేశ వ్యాప్తంగా భారీ అభిమానుల సంఖ్య‌తో విస్త‌రించింద‌ని,  ఇంత‌టి శ‌క్తివంత‌మైన పార్టీ ప్ర‌పంచంలోనే లేద‌ని న‌డ్డా అన్నారు. ఒడిసాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ బీజేడీ ప్ర‌భుత్వం పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయి ఉంద‌ని, 2024లో తిరిగి అధి కారం లోకి  న‌వీన్ రావ‌డం దుర్ల‌భ‌మ‌ని అన్నారు.  రాష్ట్రంలో పీఎం ఆవాజ్ యోజ‌న ప‌థ‌కానికి బిజూ ప‌క్కా ఘ‌ర్ అని పేరు మార్చి ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుంటు న్నార‌ని, ఇంత‌కంటే దారుణం మ‌రోటి ఉండ‌ద‌ని ఎద్దేవా చేశారు. అధికార బీజేపీపార్టీకి చెందిన ముగ్గురు మం త్రుల పై అవినీతి, హ‌త్యారోప‌ణ కేసులు ఉన్నాయ‌ని గుర్తు చేశారు.  జ‌గ‌న్నాధ దేవాల‌యం గురించి ప్ర‌స్తావి స్తూ , ఆ దేవాల‌యానికి సంబంధించిన నిధులు ఇక్క‌డ ఉండ‌టం కూడా అంత సుర‌క్షితం కాద‌ని న‌డ్డా అన్నారు. అస‌లు ర‌త్న‌భండార్ తాళాలు మారుతాళాలు న్నాయ‌ని కొంద‌రు పేర్కొన‌డాన్ని ప్ర‌స్తావించారు. 

 ష‌మీ, గిల్ జ‌ట్టులో ఉండాలి...వెంగ్‌స‌ర్కార్‌

జస్ప్రీత్ బుమ్రా , రవీంద్ర జడేజా  టోర్నమెంట్‌కు దూరంగా ఉండవచ్చనే వార్తల తర్వాత  టీ 20 ప్రపం చ కప్‌లోకి  వెళ్లడం భారత్‌కు ఇబ్బందిగా మారింది. టీ 20  ప్రపంచకప్  ప్రారంభానికి ముందే భారత్‌కు రెండు షాక్‌లు తగిలినట్లు తెలుస్తోంది. జట్టును ప్రకటించక ముందే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఔట్ కాగా, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా వెన్ను గాయం కారణంగా తప్పుకునే అవకాశం కనిపి స్తోంది. ఈ టోర్నమెంట్ కోసం భారతదేశం తమ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్, కీలకమైన ఆల్ రౌండర్ లేకుం డానే వెళుతుంది. అయితే, జట్టులో అర్హత ఉన్న మరికొంత మంది ఆటగాళ్లను భారత్ వదిలిపెట్టి ఉండవచ్చని  భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కర్ అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, టీ 20 ప్రపంచ కప్ జట్టులో లేకపోవడం చాలామంది మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచింది, వీరిలో బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మాన్ గిల్,  యువ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ చూసి  అతన్ని ఎంచుకుంటాన‌న్నాడు. అతను 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తు న్నాడు. మీరు ఇప్పుడు అతన్ని తీసుకోవాలి, మీరు కానీ అతన్ని ఎన్నుకోలేరు. 130కి.మీ బౌలర్ అవు తాడ ని వెంగ్‌సర్కార్ అన్నాడు. శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు, అతను తప్పుకున్నాడు. మహ్మద్ షమీ, శుభ్‌మాన్ గిల్ కూడా జట్టులో ఉండాలి.  గిల్ ఎంతో ఆకట్టుకున్నాడు. అత‌ని ఇటీవ‌లి ఆట  సామర్ధ్యం చాలా బాగుంద‌న్నాడు భార‌త్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్‌.  ఉమ్రాన్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపి ఎల్‌)  చివరి దశలలో  2022 టోర్నమెంట్ అంతటా తల తిప్పాడు, అరుదుగా 145కి.మీ కంటే తక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు మరియు క్రమం తప్పకుండా 150కి.మీ మార్కును దాటాడు. 2022 సీజన్‌లో అతని ప్రదర్శన అతనికి భారత జట్టుకు పిలుపు నిచ్చిం ది, అయితే 22 ఏళ్ల అతను తన చిన్న అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఆకట్టుకోవడంలో విఫలమ య్యాడు. 2022 ఆసియా కప్‌లోనూ ఉమ్రాన్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని గతంలో భారత సెలక్షన్ కమిటీకి కూడా నేతృత్వం వహించిన వెంగ్‌సర్కార్ అన్నాడు. వికెట్ ఫ్లాట్,  గడ్డి లేని దుబాయ్‌లో బౌన్స్ లేని చోట మీకు ఫాస్ట్ బౌలర్లు అవసరం. మీరు మీడియం పేసర్లను కలిగి ఉంటే, మీరు చుట్టుముట్టబడతారు. పేస్‌లో బ్యాటర్‌లను ఓడించగల ఫాస్ట్ బౌలర్లు మీకు కావాల‌ని వెంగ్‌స‌ర్కార్ అన్నాడు.