ఆ నిషేధం వ‌స్తే, ఏపీలో స‌గం ఖాళీ!

ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అస్త‌వ్య‌స్తంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే ఏ మూల‌నుంచో ఊరూ పేరూ లేనివాడు ఓ క‌త్తి ప‌ట్టుకుని అమాంతం దాడిచేసిపోతాడు.. ఇదో పాత సినిమా డైలాగు. ఇది ఇప్పుడు న్న రాజ‌కీయ నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలికి అచ్చుగుద్దిన‌ట్టు న‌ప్పుతుంది. తీవ్ర‌నేరారోప‌ణ‌లు ఉన్న‌వారు వాస్త‌వానికి ప్ర‌జా ప్ర‌తినిధులు కావ‌డానికి వీల్లేదు. ఇది చ‌ట్టంలోనే ఉందా లేదా అనే చ‌ర్చ కంటే అస‌లు రాజ‌కీయ నాయ కునిగా ఎద‌గ‌డానికి ఆలోచ‌న‌లు చేసేవారు, న‌లుగురితో ప్ర‌చారం చేయించుకునేవారు త‌మ‌కు తాము వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌. పెళ్లిచూపుల్లో అబ్బాయి గురించి, అమ్మాయి గురించి వేయి ప్ర‌శ్న‌లు వేస్తు న్న‌ట్టే... ప్ర‌జ‌లూ త‌మ ప్ర‌తినిధిని అడ‌గ‌వ‌చ్చు. కానీ ఆ అవ‌కాశం ఎవ్వ‌రూ, ఎన్న‌డూ ఇవ్వ‌రు. కేవ‌లం పార్టీ అధి నేత‌లు, సీనియ‌ర్లు ఒక వ్య‌క్తిని త‌మ పార్టీ అభ్య‌ర్ధిగా అనుకుని ఎన్నిక‌ల్లో కోట్లు త‌గ‌లేసి గెలిపించు కుంటా రు. అదే కావాలి. ఆ త‌ర్వాత ఆ హేమా హేమీ ఎలాంటి ప‌నులు చేసినా, ఎంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ రించినా పార్టీ కార్యాల‌యం కాపాడేస్తుంది. అదుగో ఆ న‌మ్మ‌కంతోనే మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో అదే ధైర్యంతో ఓట్లు అడుగుతు న్నారు. ఇన్నాళ్ల‌కు ఓ వ్య‌క్తి అస‌లు ఇలాంటి చోద్యాలు చూడ‌ద‌ల్చుకోలేదంటూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు.  ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధిత్వానికి బొత్తిగ అన‌ర్హుడైన‌వాడు, ముఖ్యంగా సివిల్‌, క్రిమిన‌ల్ కేసుల్లో పీక‌ల్లోతు ఉండి కోర్టు ప‌క్షిగా మారిన వారికి ఎన్నిక‌ల్లో పోటీచేసే వీలు క‌ల్పించ‌వ‌ద్ద‌ని  కోరుతూ ప్రము ఖ న్యాయవాది అశ్వి నీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిం చింది. న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం. జోసెఫ్, హృషికేష్ రాయ్‌ తో కూడిన బెంచ్ కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్ కు నోటీసులుజారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్ తన 244వ నివేదికలో తెలిపిందని పిటిషనర్  కోర్టుకు తెలిపారు.  దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో సగానికి పైగా ప్రజా ప్రతినిధులు ఇంటి దారి పట్టాల్సిందే మరి. కార‌ణమేమంటే, ఇప్ప‌టికే కోర్టు కేసులు, ఈడి విచార‌ణ‌ల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆ స్థానానికి అన‌ర్హుడ‌న్న ముద్ర ప డింది. ఆయ‌న కోర్టుకు త‌న లాయ‌ర్ల‌ను పంపిస్తూ చాలాకాలం కేసుల‌కు కోర్టు హాజ‌రును త‌ప్పించుకుం టూ వ‌చ్చారు. అంత‌కు మించి జైలు జీవితం అనుభవించారు కూడా. అలాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లో ఉండ డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బ‌?, ఎంత‌సేప‌టికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్ రాజ‌కీయ‌నాయ‌కుల గురించి ప్ర‌స్తావి స్తున్న ప్ర‌జ‌లు, కోర్టులు, న్యాయ‌స్థానాలు మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న వ‌ర్తించ‌దా అని రాజ‌కీయ‌ప‌రిశీలకులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాభీష్టం మేర‌కే పాల‌న సాగిస్తు న్నారా లేదా అన్న‌దాని కంటే అస‌లు పాల‌కుడు స‌వ్య‌మైన‌వాడేనా అన్న‌ది కీల‌కం. ప‌రిపాల‌నా లోపాల కంటే ప్ర‌తినిధుల చ‌రిత్ర ఎంతో ముఖ్యం. నేర‌చ‌రిత్ర ఉన్న‌వారిని తెలిసీ ఎన్నుకోవ‌డం ప్ర‌జ‌ల‌కు ఆత్మా హుతితో స‌మాన‌మ‌న్నారు వెన‌క‌టికి  ఒక సీనియ‌ర్ నేతే అన్నారు.  ఇదే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్ర టిక్ రిఫార్బ్ రూపొందించిన గణాంకాలను పిటిషన్లో ప్రస్తావిం చారు. 2009 నుంచి క్రిమినల్ కేసులున్న‌ ఎంపీల సంఖ్య 100 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2019 సాధా రణ ఎన్నికల్లో గెలుపొందిన 539 మంది లోక్ స‌భ సభ్యుల్లో 233 మంది.. అంటే 43 శాతం మందిపై క్రిమినల్ కేసులు న్నాయని తెలిపారు. ఓ ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్ కేసులున్నట్టు వెల్లడిం చారని  కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.   ఇటీవ‌లికాలంలో ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న‌వారిలో అత్యాచారాలు, హ‌త్య‌లు, అత్యాచారాల‌కు  పాల్ప‌డిన వారు, కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డిన‌వారు కూడా పార్ల‌మెంటుకు వ‌స్తున్నార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. అస‌లు ఎన్నిక‌ల్లో పాల్గొనే ముందు ఎన్నిక‌ల క‌మిష‌న్ అలాంటివారి చ‌రిత్ర తెలిసి కూడా అనుమ‌తించ‌డ‌మే మి ట‌ని ప్ర‌శ్నించారు. అంత‌కుమించి ఆయా పార్టీలే వారికి మ‌ద్ద‌తునిచ్చి మ‌రీ  పంపిస్తున్నార‌ని ఆరోపిం చా రు.  అయితే, ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై మరిన్ని పరిమితులు విధించడం కష్టమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.  ఆర్టికల్ 19(2)లో  పేర్కొన్న భావప్రకటనా స్వేచ్ఛ పై రాజ్యాంగమే కొన్ని పరిమితుల ను కూడా విధించిందని కోర్టు తెలిపింది.  యూపీ ప్రభుప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రం పై మరిన్ని పరిమితులు విధిం చడం కష్టం.  ప్ర‌భు త్వం పై రాజకీయ కుట్రలో భాగంగానే రేప్ కేసు పెట్టా రని అప్పట్లో ఓ మంత్రి వ్యాఖ్యానిం చారు.  ఆ తర్వాత సదరు మంత్రి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రజా ప్రతినిధులు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి వాక్స్వా తంత్య్రంపై పరిమితులు విధించాలని పిటిషనర్ తరపు న్యాయ వాది కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని నవంబరు 15న పరిశీలిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్,నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 

అయ్యో పాపం రోజా మేడం అవుటై పోయారు!

అయిపొయింది,. మంత్రి రోజా నోటికి గట్టిగానే పని చెపుతున్నారు.అంతకు ముందు ఎలా ఉన్నా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె మాటల దూకుడు పెంచారు. అంతవరకు ఉన్న కొద్ది పాటి  కట్టుబాట్లను కూడా తెంచుకుని మరీ రెచ్చి పోయారు. ఏమి మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నామో తెలియకుండా, కనీసం స్థాయి బేధం అయినా, పట్టించుకోకుండా,   పోయి ప్రతిపక్షమ మీద విరుచుకు పడుతున్నారు.  అయినా, నోరు దాచుకోకుండా అంతలా కష్ట పడుతున్నా, చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆమెను,’గడప గడప’కు పరీక్షలో ‘ ఫెయిల్ చేశారు. పనితనం పెంచుకోక పొతే, పక్కన పెట్టక తప్పని హెచ్చరించారు‘గడప గడప’ పరీక్ష ఫెయిల్ అయిన ఏమ్మేల్యేల  ఫస్ట్ లిస్ట్’ లోని  27 ఎమ్మెల్యేలలో  మంత్రి ఆర్కే రోజా పేరు కూడా వుంది. అఫ్కోర్స్, ఆమెతో పాటుగా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు,  బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఉన్నారను కోండి, అది వేరే విషయం. కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పక్షం రోజుల్లోనే రోజాకు  రెండవ సారి వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా ఇదే ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించడంతో రోజా రాజకీయ భవిష్యత్ ఏమిటనే విషయంలో ఆమె సన్నిహిత వర్గాల్లో చర్చ మొదలైంది. చివరకు రోజా పరిస్థితి, ‘ఒక్క సారి మంత్రి చేయి గణనాథా, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ’ అన్న చందంగా మారుతుందా అన్న ఆందోళన ఆమె సన్నిహితుల్లో మొదలై నట్లు, చెపుతున్నారు.  నిజానికి, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. చివరకు అసెంబ్లీలో దూకుడు ప్రదర్శించి సంవత్సరం పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఒక విధంగా వైసీపీ ఫేస్ గా, జగన్ రెడ్డి, ఇన్నర్ సర్కిల్ లో ఒకరుగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలోనే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్ లోనే తనకు బెర్త్ ఖాయమన్న ధీమాతో, రోజా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోయారు. ఎంతవరకు నిజమో ఏమో కానీ, ప్రమాణ పత్రం తెచ్చుకుని బట్టీ పట్టారని కూడా అంటారు. అయితే  జగన్ రెడ్డి  రోజాకు తొలి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టారు. ఆ విధంగా, కలలలో తేలియాడుతున్న రోజా, జగనన్న ఇచ్చిన షాక్ కు ఖగుతున్నారు.అవాక్కయ్యారు అని  అంటారు.    ఇక అక్కడి నుంచి మంత్రి వర్గ విస్తరణ కోసం. ఇంకా తెలవారదేమి అంటూ  చకోరా పక్షిలా ఎదురు చూశారు. గుళ్లూ గోపురాలూ తిరిగారు. నోములూ వ్రత్రాలూ చేశారు. జ్యోతిషులను నమ్మి శాంతులు, హోమాలు గట్రా చేయించారు. ఒకటని కాదు, ఏమేమి చేయాలో అన్నీ చేశారు. చివరకు ఏ దేవుడు కరుణించాడో, ఏ ప్రభువు ఆశ్వీదరించారో, గానీ, ఆమె కల నెరవేరింది. జగనన్న కొంచెం ఆలస్యంగానే అయినా, రెండవ విడత, గత డిసెంబర్ లో చేపట్టిన మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలో ఆమెకు అవకాశం కల్పించారు. పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖను కేటాయించారు. శాఖ ఏదైతేనేం మంత్రి అయ్యానని ఆమె హ్యాపీహ్యపీస్ గా సంతోషంగా ఉన్నారు.  అయితే, మంత్రి పదవి వచ్చి ఇంకా నిండా ఆరు నెలలు అయినా నిండక ముందే,   పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెట్టిన, గడప గడపకు పరీక్షలో రోజా ఫెయిల్ అయ్యారని, స్వయంగా ముఖ్యమంతే అందరి ముందు ప్రకటించారు. రెండు నెలలు సమయమిచ్చి, ఈలోగా, పాస్ మార్కులు తెచ్చుకుంటే సరి, లేదంటే మంత్రి పదవి కాదు, ఎమ్మెల్యే టికెట్’కే భరోసా లేదని ఖరా ఖండిగా, చెప్పారు. దీంతో, మంత్రి పదవి మూడునాళ్ళ ముచ్చటేనా, అనే విషాదం యోగంలోకి రోజా  జరుకున్నారని అంటున్నారు. చివరకు ఎమౌతుందో, ఏమో కానీ, ప్రస్తుతానికి అయితే రోజా రాజకీయ జీవితం తెర మరుగయ్యే హెచ్చరికలు మాత్రం బలంగానే,వినిపిస్తున్నాయని, అంటున్నారు.ఆమె అభిమానులు  అయితే అయ్యో పాపం రోజా మేడం ..అవుటై పోయారు...అంటూ పాడుకుంటున్నారు.

బొత్సపై జగన్ సీరియస్.. సమావేశంలో అందరి ముందే చిన్నబుచ్చిన వైనం

జగన్ రెడ్డి మరో సారి తన మంత్రివర్గ సహచరులలో కొందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఓ సీనియర్ మంత్రి కూడా ఉన్నారు. అయితే ఆయనను తప్పని సరిపరిస్థితుల్లో రెండో కేబినెట్ లో కూడా కొనసాగించినప్పటికీ.. ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకింత ఉక్కపోతకు గురి చేస్తూనే ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ ఆ మంతి అని చెబుతున్నారు.  బొత్స సత్యనారాయణను జగన్ తొలి కేబినెట్ లోకి తీసుకున్నారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బొత్సకు మరోసారి అవకాశం ఉండదనే అంతా భావించారు. అయితే కారణాలేవైనా ఆయన తన మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే పునర్వ్యవస్థీకరణలో బొత్సకు అప్రధానమైన శాఖను కేటాయించడం పట్ల ఆయన అప్పట్లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి విదితమే. తొలి కేబినెట్ లో రాజధాని వ్యవహారాలను చక్కపెట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక  శాఖ నిర్వహించిన బొత్సకు, పునర్వ్యవస్థీకరణలో ఆయనకు ఏమాత్రం ఇష్ఠంలేని విద్యా శాఖను జగన్ అప్పగించారు. అప్పట్లోనే తనను పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని బొత్స బహిరంగంగా కాకపోయినా.. తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే.  విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే విషయంలోనూ ఆప్పట్లో ఆయన జాప్యం చేశారు. శాఖ మార్పు కోసం జగన్ ను కలిసేందుకు అప్పట్లో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఎం అప్పాయింట్ మెంట్ దొరకలేదని కూడా అప్పట్లో పార్టీలో గుసగుసలు వినిపించాయి. వీటన్నిటికీ తగ్గట్లుగానే ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజులలో విద్యా శాఖ అధికారులు, బొత్సను పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుపోయారు. దాంతో  విద్యా శాఖలో ఏమి జరుగుతోందో, విద్యా శాఖ మంత్రికి తెలియని ఒక విచిత్ర పరిస్థితి అప్పట్లో నెలకొందని అంటునారు. మంత్రి ప్రమేయం లేకుండానే అప్పట్లో జీవోలు వచ్చేశాయి. ఈ విషయంలో అప్పట్లో బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మంత్రిగారి ఆదేశాలను అధికారులు అసలు పట్టించుకోని విచిత్ర పరిస్థితి అప్పట్లో విద్యాశాఖలో ఉండేది. పట్టిచుకోవడం లేదని అంటున్నారు.    రాష్ట్రంలో పాఠశాలల విలీనం ప్రక్రియను వెంటనే అపేయాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు. ఆ సమయంలోనే  మంత్రి రివ్యూ మీటింగ్ పెడితే, సగం మంది అధికారులు గైర్హాజరయ్యారు. ఇక వచ్చిన  సగం మంది మంత్రి ఆదేశాలు అక్కడే చెత్త బుట్టలో పడేసి చక్కా పోయారని సెక్రటేరియట్ వర్గాలు అప్పట్లో జోకులు కూడా వేసుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అప్పట్లో రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  సరే తరువాత తరువాత అదంతా సద్దుమణిగిందనుకుంటుంటే.. బుధవారం (సెప్టెంబర్ 28) జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో సీనియర్ మంత్రి అని కూడా చూడకుండా బొత్స ముఖం మీదే ఆయన పని తీరు బాగాలేదని జగన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసి చిన్నబుచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ‘ఓన్లీ మచ్ లౌడర్’ అనే ఈవెంట్స్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయిర్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ శిశోడియా, మరో 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో సీబీఐ చేర్చింది. వారిలో విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ శిశోడియాకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యుగు విజయ్ నాయిర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచడం తెలుగు రాష్ట్రాల్లోని నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు  రాజకీయ నేతలకు లింకులు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయ్ నాయిర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ తదుపరి అరెస్టు ఎవరిదై ఉంటుంది అనే ఆందోళనతో పలువులు ఉన్నారంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తోంది. బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ జరుగుతోందంటున్నారు. బినామీల పేరుతో అనధికారికంగా పెట్టుబడులు పెట్టి, నల్లధనాన్ని వైట్ చేసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు దొరికిందని అంటున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్కామ్ తో సంబంధాలున్న రాజకీయ నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోందని అంటున్నారు. అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన లావాదేవీలను బట్టబయలు చేసే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమై ఉన్నారనే తెలుస్తోంది. ఈ స్కామ్ తో లింకులు ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ సీఎం సతీమణి  భారతి   పేరు కూడా తెర మీదకు  వచ్చింది. అలాగే  హైదరాబాద్ లో ఉన్న పలువురి ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. ఈ కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సీబీఐ సోదాలు నిర్వహించింది. రామచంద్ర పిళ్లై వ్యాపార భాగస్వాములుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది. ఏపీలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తొలి అరెస్ట్ జరగడంతో తదుపరి ఎవరి వంతు వస్తుందో అనే ఆందోళన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నెలకొందని తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ప్రియాంక?!

కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. త్వరలోనే నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇదంతా ప్రతి పార్టీలోనూ మామూలుగా జరిగే వ్యవహారమే. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం మాత్రం ప్రత్యేకం. పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటుండటం, ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు మోస్తున్న సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం.. గాంధీ కుటుంబం వినా మరో వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్నిక గడువు సమీపిస్తున్న సమయంలో కూడా పార్టీ చీఫ్ విషయంలో ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక విషయంలో గందరగోళం రోజు రోజుకూ చిక్కనౌతోంది. పార్టీ అధినేత్రి ఏరి కోరి ఎంపిక చేసిన అభ్యర్థి గెహ్లాట్ నామినేషన్ వేయకుండానే తోక జాడించారు. తన వర్గానికి చెందిన వ్యక్తిని రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అంగీకరిస్తేనే అంటూ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసినంత పని చేశారు. ఆ తరువాత తమాయించుకుని సారీ చెప్పినా.. ఇక గెహ్లాట్ నమ్మే పరిస్థితి కాంగ్రెస్ అధిష్ఠానంలో కనిపించడం లేదు. కమల్ నాథ్ అనుకుంటూ ఆయనా ఆసక్తి చూపడంలేదు. దీంతో దిగ్విజయ్ సింగ్ పేరు తెరమీదకు వచ్చింది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజే గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రసకందాయంలో పడిందని అంటున్నారు. అసలు వాస్తవం చెప్పాలంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుంచీ ఆ పదవి ఖాళీగా ఉన్నదనే అనాలి.  అనివార్య పరిస్థితిలో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా, ఆమె గతంలోలా పకడ్బందీగా, కచ్చితంగా ఆ బాధ్యతలను నిర్వర్తించలేకపోయారనడంలో సందేహం లేదు.   ఇప్పుడు ఆ తాత్కాలిక బాధ్యతలు కూడా తన వల్ల కాదని సోనియా తేల్చేశారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె విశ్రాంతి కోరుకోవడం సహజమే. అందుకే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ ను అంగీకరింపచేయడానికి పార్టీ వర్గాలు, సీనియర్ నేతలు, ఆఖరికి సోనియా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే అనివార్యంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్డింది.  గాంధీ కుటుంబం   నుంచి కాకుండా బయటి వారిని ఎన్నుకోవాలన్న రాహుల్ సూచన మేరకు సోనియాగాంధీ గెహ్లాట్ ను ఎంపిక చేశారు. అయితే ఆయన తీరుతో ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబం బయటవారికి అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయానికి సోనియా వచ్చేశారని చెబుతున్నారు. దీంతో రాహుల్ ఎటూ సుముఖంగా లేరు కనుక ప్రియాంకకు ఆ బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులు, సీనియర్లు కూడా రాహుల్ కాకుంటే ఆమే ఆ పదవికి అన్ని విధాలుగా అర్హురాలని అంటున్నారు. ఆమెలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్నాయని చెబుతుంటారు. ప్రియాంక గాంధీ కూడా ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రత్యక్ష ఆందోళనల్లో సైతం పాలు పంచుకుంటున్నారు. దీంతో ఆమెకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.  దీంతో ప్రియాంక గాంధీ వాద్రా పేరు తెరపైకి వచ్చింది.  భారతీయసంప్రదా యం ప్రకారం ఆడబిడ్డకు పెళ్లయిన తర్వాత పుట్టింటి పేరు ఉండదని, అత్తంటి పేరే ఇంటిపేరు అవుతుందని, ఆమెను ఇంకెంత మాత్రం గాంధీ కుటుంబ సభ్యురాలిగా పరిగణించరాదని కాంగ్రెస్ ఎంపీ ఒకాయన  తాజాగా ట్వీట్ చేశారు. అంటే ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుని పగ్గాలు అప్పగిస్తే గాంధీ కుటుంబేతర వ్యక్తికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లౌతుందని ఆయన తాత్పర్యం. .మరోవైపు, పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్వేసేందుకు సీనియర్ నేత శశిథరూర్ సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా  తేలలేదు.రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వైపు పార్టీ అధిస్థానం మొదటి నుంచీ మొగ్గుచూపుతూ వచ్చింది.అయితే ఊహించని విధంగా రాజస్థాన్లో తలెత్తిన పరిణామాలతో అధ్యక్ష పదవికి గెహ్లాట్ అభ్యర్థిత్వం డోలాయ మానంలో పడింది. రాజస్థాన్లో తనఅనుచరగణానికే  నచ్చచెప్పలేనిగెహ్లాట్... పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు ఎలాచక్కబెడతారనే ప్రశ్నలు మొదలయ్యాయి. సీనియర్ నేత కమల్నాథ్ ఢిల్లీకిచేరుకున్న ప్పటికీ ఆయనఅధ్యక్షుడి పదవిపై పెద్దగామొగ్గుచూపడం లేదు.మరో సీనియర్ నేత దిగ్విజయ్సింగ్ సైతం పోటీకి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ఆచూతూచివ్యవహ రిస్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలనామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఇంకా సందిగ్ధత తొలగలేదు.  ప్రియాంకా గాంధీ యేతర కుటుంబ వ్యక్తిగా పరిగణించి ఆమెనే పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీలో దింపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇది ఉభయతారకంగా ఉంటుందని సోనియా కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ అధినేత్రిగా ఎన్నుకుందని చెప్పుకోవచ్చునూ, అలాగే పార్టీ పగ్గాలు కుటుంబం చేతి నుంచి జారిపోకుండా చూసుకోవచ్చునని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

బీజేపీకి ఎందుకీ ఆరాటం?

రాను రాను బీజేపీకి భ‌జ‌న‌చేయించుకునే పిచ్చి బాగా ముదురుతోంది. వారికంటే గొప్ప రాజ‌కీయ‌వేత్త‌లు ఎవ్వ‌రూ లేర‌ని, దేశంలో మ‌త‌, సంప్ర‌దాయాల‌ను కాపాడే మ‌హాత్ములు ఇంకెవ‌రూ లేర‌ని భుజ‌కీర్తుల‌ కోసం మ‌హా తాప‌త్ర‌య‌ప‌డుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి ప్ర‌జాసంక్షేమం, పాల‌నా వ్య‌వ‌హారాల్లో శ‌భాష్ అనిపించుకుందామ‌నే కంటే ఇత‌రులు, ఇత‌ర అంశా ల్లోనే బాగా దృష్టిపెడుతోంది. పండ‌గ‌లు, పందిళ్ల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు. ఇది దుర్గాపూజ‌ల స‌మ‌యం గ‌నుక అర్జంటుగా బెంగాల్‌లో ప్ర‌పంచ ప్ర‌సిద్ధ దుర్గా పూజా విధానాన్ని ఆ మ‌హా కార్య‌క్ర‌మానికి అంత‌ర్జాతీయ యునెస్కోగుర్తింపు తెప్పిం చి ఆ కార్యక్ర‌మం త‌మ చేతుల‌మీదుగానే జ‌రిగింద‌ని న‌లుగురిచేతా అనిపించుకోవాల‌ని మ‌హా తాప‌ త్ర‌య‌ ప‌డుతోంది. ఈ విధంగా బెంగాల్ ప్ర‌భు త్వం ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసి ఈ విధంగా కూడా రాజ‌కీయాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించే య‌త్నాలు చేస్తోంది.  బెంగాల్ దుర్గా పూజలో కోల్పోయిన స్థలాన్ని తిరిగి పొందేందుకు బీజేపీ ఎలా ప్రయత్నిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ ఎస్‌) పశ్చిమ బెంగాల్‌లో బిజెపి బ్యానర్‌లో దుర్గాపూజ నిర్వ హించడానికి ఎప్పుడూ అనుకూలంగా లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) ఫిరాయింపు దారులు ముకుల్ రాయ్ (అతను ఇప్పుడు తిరిగి అధికార పార్టీలోకి వచ్చాడు), బిజెపికి చెందిన కైలాష్ విజయ వర్గియా మద్దతుతో, మమతా బెనర్జీ దుర్గామాత మంజూరు కోసం అధిగ మిస్తున్నట్లు కనిపించినందున పూజ ప్ర‌సాదంలోనూ కుంకుమ వేళ్లు ముంచడానికి అనుకూలంగా వాదించారు. హిందూ ఓట్ల ఏకీకరణకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు పూజలు చేశారు. అప్పటి కాలాలు వేరు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి కంటే 40 శాతం ఓట్లు, కేవలం నాలుగు సీట్లు తక్కువగా ఉన్న బిజెపి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 21 శాతంగా ఉన్న హిందూ ఓట్ల శాతం 2019 పార్లమెంటు ఎన్నికల్లో 57 శాతానికి పెరగడం, అది మరింతగా దూసుకుపోగలదన్న విశ్వాసాన్ని ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరికలను పట్టించుకోకుండా సైద్ధాంతిక సర్దుబాట్లకు సిద్ధమైంది. జై శ్రీరామ్ నినాదంతో ప్రమాణం చేసిన బిజెపి నాయకులు, కార్యకర్తలు బెంగాల్ దేవతలైన దుర్గా, కాళిని ఉర్రూతలూగిస్తూ కని పించారు. 2020లో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున, బిజెపి కోల్‌కతాలో  ఇతర ప్రాంతాలలో చాలా ఆర్భాటంగా దుర్గాపూజను నిర్వహిం చడమే కాదు, పూజా పండల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు, చాలా మంది కేంద్ర నాయకులు కనిపించారు. సాంప్రదాయ బెంగాలీ వస్త్రధారణలో ఉత్సవాల్లో చేరారు. లక్ష్యం స్పష్టంగా ఉంది: మమత ,ఆమె టీఎంసి బిజెపిపై ప్రయోగించిన 'బయటి వ్యక్తిస‌,  'హిందీ మాట్లాడే ప్రాంత‌ పార్టీ' ట్యాగ్‌లను తొల గించి ప్రజల హృదయాలను గెలుచుకోండి.  చివరికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అది ఫలించలేదు. బీజేపీ హిందూ ఓట్ల శాతం 7 శాతం (50 శాతానికి) పడిపోయింది, ఓట్లు టీఎంసీకి బదిలీ అయ్యాయి. బెంగాల్ ఓటర్లు బిజెపి హిందుత్వ భారీ ప్రచారానికి అనుకూలంగా లేరని స్పష్టమవుతోంది, ఇది వివిధ రూపాల్లో వ్యక్తమైంది. గత ఏడాది ఎన్నికలలో ఎదురుదెబ్బ తగలడంతో, దుర్గాపూజ నిర్వహణపై బీజేపీ నేతల ఆసక్తి క్షీణించింది. అయితే, ఈ ఏడాది, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇద్దరూ దాని కొనసాగింపులో వివే కాన్ని చూస్తున్నారు. అన్నింటికంటే, బెంగాల్ అతిపెద్ద పండుగగా, దుర్గా పూజ కమ్యూనిటీ లు,మతాల అంతటా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్దపీట వేసిన పూజలకు స్పాన్సర్‌గా, పోషకుడిగా బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయ త్నించినా ఫలితం లేకుండా పోయింది. మమత తన పార్టీ , ప్రభుత్వం నుంచీ కమ్యూనిటీ పూజల కు అన్ని రకాల సహాయాన్ని ఉపసంహరించుకుంటానని బెదిరించడం ద్వారా బీజేపీ కోసం తీసుకునే వారు లేకుండా చూసుకున్నారు. ఇది బిజెపిని వెనుకకు నెట్టినప్పటికీ, బెంగాల్‌లో దుర్గాపూజకు లభించే ట్రాక్షన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. కోల్‌కతా దుర్గా పూజను యునెస్కో తన 'ఇంట్‌యాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ' జాబితాలో చేర్చినందుకు మమత తన వంతుగా డోలు కొట్టారు. బిజెపికి, యునెస్కో గౌరవానికి దుర్గాపూజ ను ప్రతిపాదించడానికి మోడీ ప్రభుత్వం కూడా తన వంతు కృషి చేసిందని బెంగాల్ ప్రజ లకు గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది. బిజెపి ఎంపి మీనాక్షి లేఖి మాట్లాడుతూ, ఈ విజయంలో రాష్ట్ర ప్రభు త్వం పాత్ర లేదు. యునెస్కో ట్యాగ్ పొందడానికి దరఖాస్తులు ఇంతకుముందు కూడా చేశా రు. కానీ అవి తిరస్కరించబడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తాజా ప్రయత్నం జరి గింది, మాకు గుర్తింపు వచ్చింది. ఇది మాత్రమే కాదు, సెప్టెంబర్ 1న యునెస్కో ట్యాగ్‌పై మమత కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి కౌంటర్‌గా సెప్టెంబర్ 24న బీజేపీ కూడా వేడుకను నిర్వహించింది. కానీ తృణమూల్ ఈవెంట్‌లా కాకుండా, దుర్గా పూజకు గొప్పతనాన్ని అందించడానికి కళాకారులు, విగ్రహాల తయారీదారులు, ఢాకీలు (డ్రమ్మర్లు), తెరవెనుక పనిచేసే వారందరి కృషిని బిజెపి కార్యక్రమం గుర్తిం చింది. కోల్‌కతాలోని కొన్ని వారసత్వ రాజ్‌బరీ పూజల సభ్యులతో పాటు అలాంటి ముప్పై మంది వ్యక్తులను సత్కరించారు. ”పూజను తృణమూల్ కాంగ్రెస్ చూసే విధానం-ఆడదడవి మరియు ప్రదర్శన, డోల్స్, స్పాన్సర్‌షిప్ మొదలైన వాటిని భర్తీ చేయాలనే ఆలోచన ఉంది. బిజెపి సంప్రదాయాలు మరియు ఆచారాలకు కట్టుబడి ఉండాలని మరియు అసలు పూజ భాగాన్ని నొక్కి చెప్పాలని కోరుకుంది. టీఎంసి పాలనలో దుర్గాపూజ ఏ స్థాయికి తగ్గించబడిందో ప్రజలకు చూపించడానికి ఇది సరైన మార్గమ‌ని ప్రెసిడెన్సీ యూనివర్సిటీకి చెందిన సామాజిక శాస్త్రవేత్త , ఎమెరిటస్ ప్రొఫెసర్ ప్రశాంత రే చెప్పారు. ఈ సంవత్సరం, దుర్గా పూజ పూజారులు, ఆచారాలకు స్టిక్కర్లు వేసే వారి కనుబొమ్మలను పెంచడానికి మమత పుష్కలంగా అవకాశం కల్పించారు. పితృపక్షం (పంచాంగంలో అశుభమైనదిగా పరిగణించ బడుతుంది) సమయంలో అనేక పూజలను ప్రారం భించడం ద్వారా మమత చర్చను ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా అయిన బీజేపీ నేత సువేందు అధికారి, హిందూ మతం, సంప్రదాయాల గురించి మమతకు ఉన్న అవగాహనను ప్రశ్నించారు. కొన్ని పూజలను ప్రారంభించేందుకు అమిత్ షా కోల్‌కతాకు రావచ్చని బలమైన సంచలనం ఉంది, వాటిలో ఒకటి సెంట్రల్ కోల్ కతా లోని బిజెపి నాయకుడు సజల్ ఘోష్. మిథున్ చక్రవర్తి కూడా దక్షిణ దినాజ్‌పూర్‌లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి సుకాంత మజుందార్ పూజను ప్రారంభించేందుకు ఎగురుతూ వచ్చారు. బీజేపీ శిబిరంలో జరుగుతున్న దీన్ని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తు న్నారు. మమతా బెనర్జీ గతంలో అసంపూర్ణ శ్లోకాలను పఠించారు. ఇప్పుడు, పితృపక్ష సమ యంలో దుర్గాపూజ ప్రారంభోత్సవం ఖచ్చితంగా పెద్ద సమస్యగా మారనుంది. అది అమిత్ షా చూస్తా రని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఒకరు చెప్పారు.

గొంతు ఒణికింది.. పాట ఒలికింది..!

ప్ర‌బాస్‌,అనూష్కాలో, చెర్రీ కాజ‌లో ఇర‌వై ఎనిమిది వొంపులు తిరుగుతూ ఇంట్లో,పార్క‌లో, రోడ్డుమీదో, విదేశీ ప‌ర్వ‌తాల మీదో ఎగిరేనే ప్రేమ‌, ప్రేమించుకోవ‌డమే ప్రేమ కాదు. పండువ‌య‌సులోనూ క‌లిసి ఉండ టం, స‌ర‌దాగా ఉండ‌టం, బాధ‌ల్ని, స‌మ‌స్య‌ల్ని మ‌ర్చిపోతూ మాట్లాడుకోవ‌డం. ప్ర‌బాస్‌కి అనూష్క ఏం పాడినా, కాజ‌ల్ చెర్రీ కోసం ఏం మాట్లాడినా..ఓ పెద్దామె మాత్రం ఆస్ప‌త్రిలో మంచంలో ఉన్న భ‌ర్త‌కోసం పోర్చుగీస్ గీతం పాడింది! ప్రేమ ఓ గొప్ప‌భావ‌న‌. దాన్ని ఆక‌ళింపుచేసుకోవాలి. ప్రేమంటే సినిమాల్లో ప్రేమ కాదు. మ‌నిషిని మ‌నిషిగా చూడ్డం, గౌర‌వించ‌డం. జాతి, కుల‌, మ‌తాల‌కు, దేశ విదేశాల‌కు స‌రిహ‌ద్దులు చెరిపేసి ఒక్క‌టిగా చేయ‌గ‌లి గేది. అలా ఆ స్థాయిలో ఉండ‌గ‌లిగేవారిదే అస‌లు ప్రేమ‌. ఇద్ద‌రు ఒక్క‌ట‌యి జీవితాంతం క‌లిసి ఉండ డంలో ప్ర‌ద‌ర్శించే అనురాగాప్యాయ‌త‌లే ప్రేమ‌. పండు ముస‌లి వార‌యినా ఒక‌రికోసం ఒక‌రు అను కోవ డంలోని అద్బుతానందం అనంతం. దానికి లోకం స‌లామ్ అనే అంటుంది.  ఆస్ప‌త్రిలో అనారోగ్యంతో ఉన్న త‌న భ‌ర్త‌కు ఎప్పుడూ వినిపించే పాట‌నే వినిపిస్తూ అత‌నికి ఆస్ప‌త్రిలో ఉన్నాన‌న్న స్పృహ లేకుండా చేయ‌డానికి పెద్దావిడ మ‌ళ్లీ గొంతు స‌వ‌రించుకుంది. ల‌తామంగేష్క‌ర్ కాన క్క‌ర్లేదు.. ఒణుకుతున్న స్వ‌రంతో అత‌ని చేయి ప‌ట్టి రెండు నిమిషాలు పాడిన‌ట్టు చేసినా అది గొప్ప స్వాంత‌న‌నిస్తుంది. అది ప్రేమంటే. ఈ పెద్దావిడ త‌న 70 ఏళ్ల భ‌ర్త కోసం బ్రిజిల్ గీత ర‌చ‌యిత రాసిన పోర్చుగీసు గీతం..కోమో గ్రాండీ ఓమెని..అంటూ పాడింది. ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఎంతో ఆనందించాయి. ఆయ‌న‌కు మందులు, ఆస్ప‌త్రి ఇబ్బందుల త‌ల‌నొప్పి పోయి ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాడు.

ఇక మిగిలింది రాజే..!!

అన‌గ‌న‌గా ఓ రాజు. ఆయ‌న అతిక‌ష్టంమీద రాజ‌యిన‌ప్ప‌టినుంచీ మ‌ళ్లీ ఛాన్స్ సంగ‌తి ఎలా ఉన్నా దండు కోవాలి, ద‌బాయించి పాలించాల‌న్న‌సూత్రాన్నే న‌మ్ముకుని కోరి కొంద‌రిని ద‌గ్గ‌రికితీసుకుని ఆ ప‌నుల్లో ఉండ‌డ్రా అయ్యా అని పంపాడు. వారు దొరికిన చోట‌ల్లా భ‌జ‌న‌లు, భోజ‌నాలు చేస్తూ అయ్య‌వారికి క‌డుపారా సంతోషం క‌లిగిస్తూండేవారు. అప్ప‌టికే ప్ర‌జ‌లు అస‌హ్యించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఏటి చేయాలి? అని ఆలోచించుకునే స‌మ‌యం ఇవ్వ‌కుండానే ఓ రాజుగారు కొంద‌రిని వెంట‌బెట్టుకుని రాజ ధానికి వ‌చ్చి జ‌నాన్ని, రాజుగారి అనుయాయుల్నీ హెచ్చ‌రించి మ‌రీ వెళ్లారు. అంతే రాజుగారికి మ‌రింత కోపం వ‌చ్చి రాత్రికి రాత్రే కొత్త రూల్స్ పెట్టి ప్ర‌జ‌ల్ని ఇబ్బందిపెట్ట‌డం ఆరంభించారు. ఎందుకొచ్చిన గోల ఈయ‌న కాదుగాని మొన్నొచ్చినాయ‌న్నే గ‌ద్దె ఎక్కి ద్దామ‌ని ఓ గ్రామంలో పంచాయితీ నిర్ణ‌యించింది. అదే త‌డ‌వుగా అన్ని గ్రామాలూ క‌లిసాయి. ఇక్క‌డ రాజుగారు ఏమ‌న్నా ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీనికి తోడు మంత్రి ని, సైన్యాధ్య‌క్షుడిని ఓ పాలి అలా తిరిగిరాండ్రా అని పుర‌మాయించారు.  వారు డాలు, క‌త్తి స‌ద్దుకుని గుర్రానికి ప‌నిచెప్పి బ‌య‌లుదేరారు. వారికి అరిటిప‌ళ్లు, నీళ్లు ఇచ్చి వ‌చ్చిన చోట‌ల్లా వారి మాట‌లు, వాక్చాతుర్యాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌లు వారి ప‌నులు చేసుకుంటూండి పోయారు. దొరా, ఈళ్లు మారిపోయార‌య్యా, మ‌నోళ్లు గాదు..! అన్నాడు సైన్యాధ్య‌క్షుడు.. అవునేమో అను కున్నారు మంత్రిగారు. మెల్ల‌గా జారుకుని రాజుగారి జ‌రిగిన‌దంతా చెప్పారు. ఆయ‌న ఆశ్చ‌ర్య‌ పోయారు. కానీ ఏమీ ఎరగ‌న‌ట్టు న‌టించి ..ఆళ్ల‌కి అలా చేయ‌మ‌ని నేనే సెప్పినాలే.. నీకెలా ఉంట‌దో చూద్దామ‌ని అలా జేసినా.. ఏమ‌నుకోద్దు. ఈసారి ఎడం చేతి వేపు ఎల్లండి ఆడ బాగానే ఉంటారు. అన్నారు ఈసారి మంత్రితో పాటు కొంద‌రు సైనికుల‌నూ పంపారు. ఆయ‌న్ను తిట్ట‌డం, కొట్ట‌డం చేస్తార‌నే భ‌యంతో! ఆ ముచ్చ‌టా అయింది.  రాజ‌ధాని న‌గ‌రంలో పేద్ధ బంగ్లాలో అంద‌ర్నీ పిలిచి మీటింగ్‌పెట్టారు రాజుగారు. స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల తీరు అన్ని వివ‌రించి ఇపుడేం చేయాలా అని ప్ర‌శ్నించారు. ఏమి చెబుతామ‌ని త‌ల గోక్కున్నారంతా. ఏది చెప్పినా చివ‌రి త‌న మాటే శాస‌నం రాజుగదా.. ఏం చెప్పిన విన‌డాయా.. ఎందుకు చెప్ప‌డ‌మ‌ని ఆయ‌నకే ఆ అవ‌కాశం ఇచ్చారంతా. ఒకే.. ఇంకా బాగా ప‌నిచేయండి.. ఆనంద ప‌ర్చండి.. మీరు కావ‌ల్సింది అడ‌గం డి.. అని విందుపెట్టి పంపించేరు. భుక్తాయాసం తీర్చుకుని ఇళ్ల‌కు వెళ్లారంతే.  మ‌ర్నాడు తాకీదులు వ‌చ్చాయి..మీ ప‌నేం బాగాలేదు ఉంటారా తీసేయాలా అని. అంతా కంగారుప‌డి ప‌రిగెట్టుకొచ్చారు రాజు గారి ద‌గ్గ‌రికి. నిన్న భోజ‌నం బాగుందా? అని అడిగి వంటోడిని రావ‌ద్ద‌న్నా అన్నారు రాజుగారు. మ‌న‌ప‌నీ అంతేనేమో అనుకునేలోగానే న‌లుగురికి తాకీదులు ఇచ్చారు. మీసంగ‌తేంది అని. వారు న‌వ్వున‌టించా రు. మీ సంగ‌తేంది అనుకున్నారు! తాకీదులు అందుకోవ‌డంలో సిద్ద‌హ‌స్తుడు ఇవ్వ‌డంలో ఆతృతా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నుకున్నారంతా. ఏమై న్పటికీ స‌త్య‌ద‌ర్శ‌నం అయిన త‌ర్వాత ప్ర‌జ‌లే రాజులు. మ‌నం కేవ‌లం సేవ‌కుల‌మే రాజా అన్నా రంతా. అయినా రాజు విన‌డం లేదు. మ‌ళ్లీ తిట్టి పం పారు. తిట్టించుకోవ‌డంలో వారికి ఆనంద‌ మేమోగాని బ‌రువు మోయ‌డానికి ప్ర‌జ‌లు స‌సెమిరా అంటున్నారు. మొన్నొచ్చి మీటింగ్ పెట్టినాయ‌న్నే క‌లుస్తు న్నారంతా. రాజుగారికి ఆ సంగ‌తి తెలిసి రెండు విభాగాల‌కు తాయిలాలు పంచారు. వారు ఆ క్షణం కాస్తంత ఆనం దించారు. కానీ తాయిలాల కంటే రోజూ ప్ర‌శాంతంగా తిండి, నిద్ర కావాల‌నుకున్నారు. రాజుగారికి విన్న వించుకు న్నారు.. ఆ రెండు త‌ప్ప మ‌రేమ‌యినా కోరుకోండి ..అని మంత్రిచేత చెప్పించారు.  కాలం మారింది, ప్ర‌జ‌లూ మార్పు ఆశిస్తు న్నారు ప్ర‌భూ.. మ‌నం మార‌డానికి టిక్కెట్లు కొన్నాను..హిమాల యాల‌కు వెళ దామ‌న్నారు మంత్రి సేనాప‌తీను. ఏమీ సేతురా నాయ‌నా.. అని ఈసారి త‌న‌కు త‌ప్ప అం ద‌రికీ తాకీదులు ఇచ్చారు. .ప‌క్క‌నే ఉండి ఇష్ట‌మొచ్చిన పాట‌లు పాడి వినిపించే సన్ని హితుడితో స‌హా! స‌ద‌రు స‌న్నిహితుడు రాజుగారు లెక్క‌ల్లో పూర్‌.. ఎవ‌రికి ఎన్ని తాకీదులు ఇస్తారో తెలుసుకోలేక పోతున్నా ర‌ని న‌వ్వుకున్నాడు.. గ‌దిలో గ‌ద్దె మీద కూచున్న ఒక్క‌డినే చూసి!

అలీ జనసేన వైపు చూస్తున్నారా?

సినీ నటుడు, కమేడియన్ అలీ జనసేన వైపు చూస్తున్నారా? ఆయన వైసీపీతో విసిగిపోయారా? అసలీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావడానికి ఆయన పేరుతో విడుదలైన ఒక ప్రకటనే కారణం. అసలు అలీ జనసేన పార్టీలో చేరుతానని కానీ, పార్టీ మారతానని కానీ ఎక్కడా ఎప్పుడూ అన్న సందర్భం లేదు. ఆ దిశగా ఎటువంటి ప్రచారం కూడా జరిగిన దాఖలాలు లేవు. అయినా హఠాత్తుగా ఆ అనుమానాలు కలిగేలా అలీ పేర ఒక ప్రకటన వెలువడింది. జగన్ మైనారిటీల కోసం ఎవరూ చేయనంతగా చేశారంటూ పొగడ్తల వర్షంతో వెలువడిన ఆ ప్రకటన అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ ప్రకటన నేపథ్యంలోనే అలీకి నామినేటెడ్ పోస్టు వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. సినీ నటుడు అలీకి ఇక ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఖాయమని వైసీపీ వర్గాలు అంటున్నాయి.   అమరావతి నుంచి అలీ పేరుతో విడుదలైన ప్రకటనలో   తాను జనసేనలో చేరడం లేదనీ, మైనారిటీల అభ్యున్నతి కోసం ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా జగన్ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే జగన్ ను మరోసారి సీఎం చేయడానికి తన వంతు కృషి తాను చేస్తాననీ అలీ పేర విడుదలైన ఆ ప్రకటన సారాంశం. పదవులు ఆశించి తాను వైసీపీలో చేరలేదననీ, జగన్ పట్ల అభిమానంతో ఆయనను సీఎం చేయాలన్న లక్ష్యంతో పార్టీలో చేరాననీ కూడా అలీ పేర విడుదలైన ఆ ప్రకటన పేర్కొంది. అంతా బానే ఉంది కానీ.. అసలు అలీ జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారన్న వార్తలు కానీ ప్రచారం కానీ ఇప్పటి వరకూ ఎక్కడా కనిపించలేదు. జనసేనాని నటించే ఓ సినిమాలో అలీ నటిస్తారన్న వార్త మాత్రం.. (అది నిజమో కాదో తెలియదు) బయటకు వచ్చింది. అది కూడా సినిమా వర్గాల నుంచి లీక్ రూపంలో బయటకు వచ్చినదే. జనసేనాని నటించే ఏ సినిమాలో అలీ నటిస్తున్నారన్న స్పష్టత కూడా లేదు. అది పక్కన పెడితే.. అలీ జనసేన పార్టీలో చేరతారని ఆయన స్వయంగా ఎక్కడా ప్రకటించలేదు. అసలు జనసేన ప్రస్తావనే ఇప్పటి వరకూ అలీ నోటి వెంట రాలేదు. అదేమీ లేకుండా అలీ పేరుతో.. ఒక ప్రకటన విడుదల కావడమే అన్ని వర్గాలలోనూ సందేహాలను రేకెత్తిస్తోంది.  వైసీపీ వర్గాలే ఆయన పేరుతో ఓ ప్రకటన విడుదల చేశాయా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి అలీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీలో చేరిన సందర్భంలోనే ఆయన ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న తన కోరికను జగన్ కు తెలియ జేశారు. పార్టీలో చేరే వరకూ ఓకే అంటూ వచ్చిన జగన్ ఆ తరువాత హ్యాండిచ్చారు. అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం రాకపోతేనేం..రాజ్యసభ పంపించడమో, కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వడమో చేస్తామంటూ ఆశ చూపి ఇంత కాలం అలీని ఆశల పల్లకిలో ఊరేగించారు. ఆ మధ్యలో ఓ సారి అలీని రాజ్యసభకు పంపించేస్తున్నారంటూ వార్తలు, వదంతులూ షికారు చేశాయి. ఆ సమయంలో అలీ కూడా ఇక రాజ్యసభ సీటు గ్యారంటీ అన్న ఆనందంతో సతీసమేతంగా జగన్ దర్శనం చేసుకుని వచ్చారు. ఆ సందర్భంలో కూడా ఓ వారంలో గుడ్ న్యూస్ చెబుతానంటూ జగన్ అలీని ఊరించారు. ఆ సంగతి అలీయే స్వయంగా మీడియాతో కూడా చెప్పారు. అప్పటి నుంచీ గోడమీద రేపు అని రాసి చూసుకుంటున్నట్లుగా ఆ వారం కోసం అలీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ వారం ఇంకా రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. ఈ మధ్యలో అలీకి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనీ, మరొకటనీ ప్రచారం జరిగినా అవేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే అలీ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీలో ఈ ఖంగారు. ఈ ప్రకటన అని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి అలీ వైసీపీ మధ్య బలమైన బంధం ఏమీ లేదు. అలీ రాజకీయంగా చురుకుగా ఉన్న సందర్భం ఏనాడూ లేదు. ఆయన గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీల మెట్లూ ఎక్కి పోటీ అవకాశం ఇస్తామన్న హామీని నమ్మే వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారనడంలో సందేహం లేదు. తీరా పార్టీలో చేరిన తరువాత పోటీకి అవకాశం లేదు.. ఏదో ఒకటి చేస్తామన్న హామీతో గత్యంతరం లేక పార్టీలో కొనసాగారే తప్ప అలీ వైసీపీలో చురుకుగా వ్యవహరించిందీ లేదు. జగన్ కు నచ్చేలా, ఆయన మెప్పు పొందేలా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిందీ లేదు. తన సినిమాలూ, తన షోలు చేసుకుంటూ.. పేరుకు పార్టీలో కొనసాగుతూ ఉన్నారంతే. అయినా వైసీపీ అలీ పార్టీ మారుతారేమోనని ముందుగానే ఊహించేసుకుని ఆయన పేర ప్రకటన విడుదల చేసేయడమే ఆ పార్టీలో ఖంగారు, ఎంతో కొంత జనాకర్షణ ఉన్న అలీ జారిపోతారన్న భయం కనిపిస్తోంది. అందుకే అలీ పేర జగన్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రకటన వెలువడిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఇక ఇంత వరకూ వచ్చింది కనుక కంటి తుడుపులా ఏదో ఒక పోస్టు అలీకి ఇచ్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఓ ఏడాదిన్నర కోసం నామమాత్రంగా ఓ నామినేటెడ్ పోస్టులో అలీని కూర్చోపెట్టేసి జగన్ మాట తప్పలేదు.. మడమ తిప్పలేదు అని అలీ చేతే అనిపించేయాలన్న ఆత్రం వైపీపీలో కనిపిస్తోందనడానికి అలీ పేరుతో విడుదలైన ప్రకటనే నిదర్శనమంటున్నారు.  

కొత్త పార్టీ వచ్చేస్తోంది ముహూర్తం ఖరార్

తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయ ప్రస్థానం ఒక ప్రహసనంగా ఆగుతోంది.నిజానికి ముఖ్యమంత్రి మనసులో ఏముందో, ఏమి లేదో కానీ, ఇంచు మించుగా సంవత్సర కాలంగా, సాగుతున్న, జాతీయ సన్నాహాలు, ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు ఆన్నట్లు సాగుతున్నాయి. నిజానికి, 2018 ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్, జాతీయ యాత్ర మొదలైంది. అయితే, ఎన్నికలు ముగిసి అధికారం తిరిగి హస్తగతం అయిన తర్వాత, ఎందుకనో ఆ ఆలోచన అటకెక్కింది.  కానీ, హుజూరాబాద్ ఓటమి తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి, జాతీయ ఆలోచనలను తెర మీదకు తెచ్చారు. ఇక  అప్పటి నుంచి ఒక చేత్తో కేంద్రంతో యుద్ధం చేస్తూ మరో చేత్తో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, అదేమిటో కానీ, ఆయన జాతీయ రాజకీయాల ఆలోచన ఆయనకు అచ్చిరాలేదో ఏమో కానీ, ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి ఆలోచనతో ఎన్ని రాష్ట్రాలు తిరిగినా, ఎవరిని కలిసినా, ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడి కెళితే అక్కడ చుక్కెదురైంది.   ఇక లాభం లేదనుకున్నారో ఏమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్ మార్చారు.  ఫ్రంట్’లేదు టెంట్ లేదంటూ జాతీయ పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చారు. పార్టీ వేదికలు, బహిరంగ్ సభల్లో జాతీయ పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. పెట్టాలా .. వద్దా అంటూ ప్రశ్నించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, చప్పట్లో ఆమోదం తెలిపారు. అయితే,   రాజకీయ పండితుల మొదలు సామాన్య ప్రజల వరకు, కేసీఆర్ జాతీయ ఆలోచనలు ముడి పడేవి కాదనే అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసేఆర్ జాతీయ రాజకీయాల చర్చను సజీవంగా ఉంచడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.నిజానికి పార్టీ పేరు రిజిస్టర్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ, బీఆర్ఎస్ ( భారతీయ రాష్ట్ర సమితి/ భారతీయ రైతు సంఘటన) పేరును అయితే ప్రచారంలోకి తెచ్చారు.  ఆ ప్రయత్నాలలో భాగంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ప్రజలు,ప్రజా ప్రతినిధులు, తెలంగాణలో కేసీఆర్ అద్భుత పాలన చూసి మురిషి, ముగ్దులవుతున్నారని,  తమ రాష్ట్రంలోనూ, కేసీఆర్ పాలన కావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.  కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత పత్రికలలో కథలు, కథనాలు ప్రచురించారు. అయితే, కేసీఆర్ సొంత పత్రికలో వచ్చిన తప్పుడు కథనాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఖండించడమే కాకుండా, ఆ రెండు పత్రికలను తగల పెట్టి  నిరసన తెలిపారు. మహారాష్ట్ర రైతులు అయితే, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తమ నోట్లో మట్టి కొట్టారని, మేడిగట్టు బ్యాక్ వాటర్’తో తమ పంట పొలాలు నీట మునిగి పోతున్నాయని మండిపడుతున్నారు. అలాగే, పెట్టుబడి పెట్టి కర్ణాటక, గుజరాత్ తదిర  బీజేపీ పాలిత రాష్ట్రాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలను ప్లాన్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘీలా ఇటీవల్ హైదరాబాద్ వచ్చి వెళ్ళింది అందుకేనని అంటున్నారు.      అయితే, అదెలాగున్నా, ముఖ్యమంత్రి కేసేఆర్ మాత్రం జాతీయ రాజకీయాల విషయంలో, తగ్గేదే..లే’ అంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన ఉంటుదని ముందు నుంచి ప్రచారం జరుగతున్న విధంగా, అక్టోబర్ 5న దసరా రోజున, జాతీయ పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసేందుకు, రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజున పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండాను ఖరారు చేస్తారని, అంటున్నారు.  అయితే, ఇది ఎంతవరకు ముడిపడుతుందనే విషయంలో మాత్రం ఎవరి అనుమానాలు వారికున్నాయని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ సన్నిహితునిగా పేర్కొంటున్న, విజయ్ నాయర్’ ను ఆయనతో పాటుగా, ఆయనకు సన్నిహితునిగా భావిస్తున్న, మద్యం వ్యాపారి, సమీర్ మహేంద్రను ఎన్ఫోర్స్మెంట్  డైక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటుగా తెరాస కీలక నేతలు కొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి, వాయిదా వేసుకున్న జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తాన్ని మళ్ళీ ముందుకు తెచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి, నిన్నటి వరకు కూడా తెరాస నాయకులే, దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉండదనే సంకేతాలు ఇచ్చారు. అసలు దసరాకు జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని ఎవరు చెప్పారని, మీడియా చర్చల్లో ఎదురు ప్రశ్నించారు.కానీ ఇంతలోనే, మళ్ళీ ఫార్మ్ హౌస్’నుంచి దసరా ముహూర్తం ఖరారైందని ప్రచారం మొదలైంది. అందుకే, ఈ ముహూర్తానికి జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు పార్టీ వర్గాలే వ్యక్త పరుస్తున్నాయి.  నిజానికి గతంలో ఇలా ఒకే రోజున మంత్రి వర్గ సమావేశం, అదే రోజున తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసన సభ పక్షం, పార్టీ కార్యవర్గ  విస్తృత స్థాయి సమావేశం ఒకే రోజున నిర్వహించిన సందర్భాలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే, చివరకు అదేమీ లేకుండా, ఆ రోజు వచ్చి వెళ్ళింది. కానీ, అంతకు మించి ఏమే జరగలేదు.   సో .. ఇప్పుడు అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు - ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది.దీంతో మళ్ళీ మరోమారు, జాతీయ పార్టీ ప్రకటన మీద ఉహాగానాలు ఉపందుకున్నాయి. కానీ, చివరకు ఏమవుతుంది? అసలు ఈలోగా, ఇంకేమి జరుగుతుంది? ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కాం అరెస్టులు హైదరాబాద్ చేరుకుంటాయా? ఈడీ ఎవరి తలుపు తడుతుంది?  ఇవవ్నీ జరిగినప్పుడు కానీ, జరిగింది అనుకోవడానికి లేదు. అందుకే, రాజకీయ విశ్లేషకులు అంతవరకు అన్నీ ఊహాగానాలే, అంటున్నారు.

రెచ్చిపోయిన అర్ష్‌దీప్‌, సూర్య‌, రాహుల్ .. భారత్ విజ‌యం

ఇటీవ‌ల టీమ్ ఇండియా విజ‌యానికి కీల‌క‌పాత్ర వ‌హిస్తు న్న డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ సూర్య‌ కుమార్ యాద‌వ్, ఓపెన‌ర్ కె. ఎల్‌. రాహుల్ స‌మ‌యోచిత బ్యాటింగ్ ప్రావీణ్యం క‌లిసి భార‌త్‌కు సునాయాస విజ‌యాన్ని అందించాడు. తిరువ‌నంత‌పురంలో దక్షిణా ఫ్రికాతో జ‌రిగిన టీ-20లో భార‌త్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొద‌ట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల లో 8 వికెట్ల న‌ష్టానికి 106 ప‌రుగులుచేసింది. భార‌త్ బౌల‌ర్లు అర్ష‌దీప్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. కాగా భార‌త్ 16.3 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి విజ‌యం సాధించింది. ఫామ్‌లో దూసుకు పోతున్న సూర్య‌ కుమార్ యాద‌వ్ తో క‌లిసి ఓపెన‌ర్ కె.ఎల్‌. రాహుల్ రెచ్చిపోయారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను సునాయా సంగా ఆడు కున్నారు. రాహుల్ 51 ప‌రుగులు 56 బంతుల్లో చేసి, సూర్య‌కుమార్ 33 బంతుల్లో 50 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచారు.  వీరి ద్ద‌రూ 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులుచేశారు.  మొదట బ్యాట్ చేసిన ద‌క్షిణాఫ్రికాకు తొలి ఓవ‌ర్ నుంచే క‌ష్టాలు మొద‌లయ్యాయి. దీప‌క్ చాహ‌ర్ తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. రెండో ఓవ‌ర్‌లో అర్ష్‌దీప్ తానేమీ త‌క్కువ‌తిన‌లేద‌ని విజృంభించి డీకాక్‌, ర‌సోల్‌, మిల్ల‌ర్ వికెట్ల తీసి జ‌ట్టుని, ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచి అమితానందాన్నిచ్చాడు. అద్భుత ఇన్‌స్వింగ్‌తో డీకాక్ వంటి ఎంతో అనుభ‌వం ఉన్న బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అలానే చాహ‌ర్ కూడా రెచ్చిపోయాడు. వీరిద్ద‌రి బౌలింగ్ ధాటిని ఎదుర్కొన‌లేక ద‌క్షిణాఫ్రికా పేక‌ముక్క‌ల్లా వికెట్లు కోల్పోవ‌డంతో 2.3 ఓవ‌ర్ల లోనే కేవ‌లం 9 ప‌రుగుల‌కు 5 వికెట్లు కోల్పోయింది. ఇంత‌టి దారున‌మైన బ్యాటింగ్‌ను ప్రేక్ష‌కులు ద‌క్షిణాఫ్రికా నుంచి ఎన్న‌డూ ఊహించ‌లేదు. మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా 5 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 30 ప‌రుగులే చేసింది. అయితే ఒక ఎండ్‌లో మాక్ర‌మ్ ఎంతో జాగ్ర‌త్త‌గా ఆడుతూ జ‌ట్టు స్కోర్‌ను ముందుకు తీసికెళ్లాడు. కానీ 8వ ఓవ‌ర్లో హ‌ర్ష‌ల్ కి దొరికి పోయాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు 42 ప‌రుగుల‌కు చేరుకుంది. మ‌క్ర‌మ్ 25 ప‌నుగులు చేశాడు. 9వ ఓవ‌ర్లో సీనియ‌ర్ స్పిన్నర్ అశ్విన్ వ‌చ్చి ప‌రుగులు ఇవ్వ‌కుండా మైడిన్ చేయ‌డంతో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు మ‌రింత కంగారెత్తారు. 10 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి ద‌క్షిణాఫ్రికా 6 వికెట్ల న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. అప్ప‌టికి ర‌న్ రేట్ 4.86 ఉంది. అక్ష‌ర్ వేసిన 12వ ఓవ‌ర్లో ద‌క్షిణాఫ్రికా 50 ప‌రుగులు పూర్తి చేసింది. 15 ఓవ‌ర్లు పూర్త‌య్యే స‌రికి 4.20 ర‌న్‌రేట్‌తో 6 వికెట్ల న‌ష్టానికి 63 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. పార్న‌ల్ చ‌క్క‌గా బ్యాట్ చేస్తున్నాడ‌నుకుంటుండ‌గానే 16వ ఓవ‌ర్లో అక్ష‌ర్‌కి దొరికిపోయాడు. పార్న‌ల్ 37 బంతుల్లో 24 ప‌రుగులు చేశాడు. కాగా 19 ఓవ‌ర్ వేసిన అర్ష‌దీప్ 14 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 7 వికెట్ల న‌ష్టానికి 100 ప‌రుగులు పూర్తి చేసుకుంది. చివ‌రి ఓవ‌ర్లో మహారాజ్ వెనుదిర‌గ‌డంతో ద‌క్షిణాఫ్రికా 5.26 ర‌న్ రేట్‌తో 8 వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులే చేయ‌గ‌లిగింది.  109 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన భార‌త్ కూడా తొలి ఓవ‌ర్ల‌లో త‌డ‌బ‌డింది. పార్న‌ల్ వేసిన రెండో ఓవ‌ర్లోనే కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ కేవ‌లం9 ప‌రుగులే. త‌ర్వాత 7 వ ఓవ‌ర్లో ఊహించ‌ని వ‌ధంగా కింగ్‌కోహ్లీ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. అప్పుడు హీరో సూర్య‌కుమార్ రంగంలోకి దిగాడు. అత‌ని రాక‌తో, మ‌రో ఎండ్‌లో కె.ఎల్‌. రాహుల్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ప‌రుగుల వ‌ర‌దే సృష్టించాడు. ఇద్ద‌రూ ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను బాదుడే బాదుడు. రాహుల్ ఎంతో తెలివిగా నిల‌క‌ డ‌గా ఆడి ఇన్నింగ్ నిల‌బెట్టాడు. మొద‌టి ప‌ది ఓవ‌ర్ల‌లో భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 47 ప‌రుగులు చేయగా, 15 ఓవ‌ర్ల‌కు 91 ప‌రు గులు చేసింది. 13 ఓవ‌ర్‌కి రాహుల్, సూర్య 3వ వికెట్‌కి 39 బంతుల్లో 51 ప‌రుగులు చేశారు. అక్క‌డి నుంచి మ‌రింత రెచ్చి పోయారు. దీనికి తోడు ద‌క్షిణాఫ్రికా ఫీల్డింగ్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో లేక‌పోవ‌డం కూడా క‌లిసి వ‌చ్చింది. 16వ ఓవ‌ర్లో భార‌త్ వంద ప‌రుగులు పూర్తి చేసింది. ర‌బాడా వేసిన ఆ ఓవ‌ర్లో కెప్టెన్ బ‌హుమా క్యాచ్ వ‌దిలేయ‌డం కొంత ఇబ్బందిపెట్టింది. అయితే అప్ప‌టికే ఆట వారి చేతిలోంచి వెళిపోయింది గ‌నుక కెప్టెన్ పెద్ద‌గా బాధ‌ప‌డిన‌ట్టు క‌న‌ప‌డ‌లేదు. మొత్తానికి భార‌త్ 16.4 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌స్టానికి విజ‌యం సాధించింది. కె.ఎల్. రాహుల్ 56 బంతుల్లో 51 ప‌రుగులు చేయగా, డాషింగ్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ 33 బంతుల్లోనే 50 ప‌రుగులుచేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 3వ వికెట్‌కి 65 బంతుల్లో 93 ప‌రుగులు జోడించి జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర‌పోషించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మార‌దా?

ఆస్ప‌త్రులు దేవాల‌యాలు, డాక్ట‌ర్లు దేవుళ్లు అనేది అనాదిగా ఉన్న భావ‌న‌. ఏ ప్రాంత‌మైనా ఎక్క‌డ‌యినా డాక్ట‌ర్ల‌కు ప్ర‌జ‌లు ఇచ్చే గౌర‌వం అది. ప్రాణ‌దాతులుగానే భావిస్తారు. వారు చెప్పిన‌ట్టే అన్ని చేస్తారు. ఆస్పత్ర‌ల ప‌రిస్థితి బావున్నా, బాగోక‌పోయినా, బొత్త‌గా అన్యాయంగా ఉన్నా సామాన్యులు అంత‌గా ప‌ట్టించుకోరు. కార‌ణం అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణ‌ర‌క్ష‌ణ క‌ల్పించేది, అందుకు న‌మ్మ‌కంగా నిలుస్తా య‌ని ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్ల ప‌ట్ల అంద‌రి న‌మ్మ‌కం. కానీ కాల‌క్ర‌మంలో ఆ న‌మ్మ‌కం దెబ్బ‌తింటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మెరుగుకు డాక్టర్ల పై నిఘా లేదా వారి ఫోన్లలో జి పి ఎస్ ట్రాకర్లు మాత్రమే సరిపోదు వైద్యు ల ప్రవర్తన తీరులో  మార్పు రావాలి.  డాక్ట‌ర్లు కూడా ధ‌నార్జ‌న పిచ్చిలో ప‌డి ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో కంటే ప్రైవేటు ప్రాక్టీస్‌మీద‌నే ధ్యాస పెట్ట‌డం సామాన్యుల పాలిటి దుర‌దృష్టంగా మారింది. ప్ర‌భుత్వాస్ప‌త్రుల ప‌రిస్థితులు దెబ్బ‌తిన‌డానికి ఇదో కార ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ స్థాయివారు ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్న‌ది ప్ర‌భుత్వ ఆస్ప త్రుల మీద‌నే. కానీ అవి కాల‌క్ర‌మంలో మౌలిక స‌దుపాయాలుకూడా స‌వ్యంగా క‌ల్పించ‌లేని స్థితికి జారిపో వ‌డం వారికి ప్రాణ‌సంక‌టంగా మారింది. అన్ని ప్రాంతాల్లోనూ ప్ర‌బుత్వాస్పత్రులు, డాక్ట‌ర్ల తీరులో పెద్ద‌గా అంత‌రం లేకుండా పోయింది. రోగుల‌ను నిర్ల‌క్ష్యంగా చూడ‌టం ఎక్కువ‌యింద‌ని రోగుల బంధువులే ఫిర్యాదులు చేయ‌డం, కొన్నిప్రాంతాల్లో ఏకంగా పోలీసు కేసులు పెట్ట‌డం కూడా జ‌రిగింది. ఇది ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుక‌న్నామ‌ని చెప్పే ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్టే. కానీ ఆ ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఏవో కుంటిసాకులు చెప్ప‌డం త‌ప్ప ఇద‌మిద్ధం గ‌ట్టి ప్ర‌య‌త్నాలేవీ చేయ‌డం లేదు.  ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అక్కడి వైద్యులు పట్టించుకోరు. రోగి బాధను తెలుసుకునే ప్రయత్నం కూడా కనీసం చేయరు.. పైగా మాకు తెలుసు మీరేంటి చెప్పేదంటూ రోగి తన రోగ లక్షణాలు చెప్పుకునే అవకాశం ఇవ్వరు. సందేహాల నివృత్తి మాటే ఉండ దు. రోగి తన బాధ చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. వైద్యులు పట్టించుకోరు సరి కదా..మేం చేసింది చేస్తాం  మీ సందేహాలు అనుమానాలు తీర్చాల్సిన అవసరం లేదు.  మేము చేయా ల్సింది  చేస్తాం దిక్కు న్న చోట చెప్పుకోండి అంటూ రోగిపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.   అంద‌రి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసిన ఇటీవ‌లి క‌రోనా స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వాస్ప‌త్రులు ప్ర‌భుత్వాల ప్ర‌చారం కంటే అద్బుతంగా ఏమీ లేవు. వాస్త‌వానికి రోగి బంధువుల‌ను కూడా ఉండేందుకు అనుమ‌తిం చ‌క పోవ‌డం దారుణం. రోగి మ‌ర‌ణిస్తే మృత‌దేహాన్ని బంధువుల‌కు అప్పగించ‌డంలోనూ సిబ్బంది వ్య‌వ హ‌రించిన ప‌ద్ధ‌తి ఊహించ‌లేనిద‌ని చాలామంది రోగులు ఆస్ప‌త్రి సిబ్బందిపై తిర‌గ‌బ‌డ‌టం అనేక ప్రాం తాల్లో జ‌రిగింది. మ‌రీ చిత్ర‌మేమంటే, ఒకరికి ఇవ్వాల్సిన మృత‌దేహాన్ని మ‌రో కుటుంబానికి ఇవ్వ‌డం! ఇది ప్ర‌భుత్వాస్ప‌త్రుల నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ట‌గా చెప్పాలి. ప్ర‌చారంతో ఊద‌ర‌గొట్టే ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇలాంటి విష‌యాల్లో ఎంతో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి స‌మా ధానం గాని, వివ‌ర‌ణ గానీ ఆయా ఆస్ప‌త్రివ‌ర్గాల నుంచి రాలేదు, వ‌స్తుంద‌న్న ఆశా లేదు.  కోరోనా సమయం క్రిటికల్ కేర్ లో ఉన్న డాక్టర్ ఆ రోజు కాక  వారం రోజులకు వచ్చేవాడని  రోగి  పరిస్థితి అర్ధం చేసుకుని ఒక్కొక్క రు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చా రని అసలు ఏ  చికిత్చ చేసారో కూడా తెలియని చికి త్స‌ రోగులకు అందించారు.? అన్నది ప్రశ్నా ర్ధకం గా మారింది. కొందరు  ప్రభుత్వ డాక్టర్లు నేరుగా తమ క్లినిక్ కు రావాలాని ఈ శస్త్రచికిత్చ చేయమని  తమ క్లినిక్ లో 4౦ వేలు  ఆపైన ఎంతైనా అవ్వచ్చని చెపు తూ రోగిని నిలివు దోపిడీ చేస్తున్నారు.  ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరే షన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సర్జరీ తరువాత సమస్యలు వచ్చాయని రోగి అంటున్నా అలాగే ఉంటుంది అంటూ చెప్పిన సమాధానం ప్రాణాలకు డాక్టర్ వెలకట్టిన తీరు బాధ్యత రాహిత్యం సిబ్బంది ప్రవార్తనా తీరు విస్మయం కలిగిస్తోంది సగటు మధ్య తరగతి వారిపట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకింత నిర్లక్ష్యం.?  గ్రామీణ‌ప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ప‌రిస్థితులు వ‌ర్ణ‌నాతీతం. అనాదిగా ఈ ప్రాంతాల్లో రోగుల‌ను చేరేం దుకు రోడ్డు సౌక‌ర్యం కూడా లేక‌పోవ‌డం విచార‌క‌రం. రోగులను త‌ర‌లించ‌డం కూడా డోలీలో జ‌రుగుతోంది. శాసన సభలో ఏళ్ల తరబడి ప్ర‌జారోగ్యం గురించి  విప‌క్షాలు గొంతు చించుకున్నా,  ఎం ఎల్ ఏ నిధులు రావు ఎం పి నిధులు రావు సగటు గిరిజనుల గోడు ప్రభుత్వాలకి కనపడదు వినపడదు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం దేశ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రా లలో ఒకే డాక్టర్ సరిగా లేని వైద్య సిబ్బంది. సిబ్బంది కొరత, మండులకోరత ,అత్యవ సరమైన సమయం లో చేయాల్సిన చికిత్చకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించారు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్,లో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూర్ జిల్లలో మహారాష్ట్రా, తమిళనాడు, రాజస్థాన్, కేరళ, అస్సాం, జమ్మూ కాశ్మీర్లలో సైతం ఇదే దుస్థితి నేల కొనడాన్ని తీవ్రంగా  తప్పుపట్టింది. ఒకవైపు నిధులు లేవని రాష్ట్రాలు అంటుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహించాల్సిన బాధ్యత  రాష్ట్రాలదే అని కేంద్రం  అందం మీరంటే మీరంటు సగటు మధ్యతరగతి వర్గానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేసాయని అన డంలో ఏమాత్రంసందేహం లేదు. 

వెంకన్న దేవునికి జగనన్న అవమానం...అందుకేనా ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ ‘రెడ్డి’ ది ఏ కులం? ఏ మతం? ఇలా ప్రశ్నించడం, ‘సభ్య’ సమాజానికి  సమంజసం అనిపించక పోవచ్చును, కానీ, ఎంత కాదనుకున్నా, కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన కులం ఏమిటి? ఆయన మత విశ్వాసం ఏమిటి? అనే అంశం చర్చకు వస్తూనే వుంది. వస్తూనే ఉంటుంది కూడా. ముఖ్యంగా, ఇతర మతస్తుల, ముఖ్యంగా మెజారిటీ మతస్తులు, హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి లేదా ఆయన కుటుంబ సభ్యులు ప్రవర్తించి నప్పుడు, తప్పయినా, ఒప్పయినా ఇంకేదైనా, ముఖ్యమంత్రి  మత విశ్వాసాలు తప్పని సరిగా చర్చకు వస్తూనే ఉంటాయి. అందులోనూ  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందూ దేవాలయాల పై వరుస దాడులు పెరిగాయి. దేవీ, దేవతల విగ్రాహాలు ద్వంసం చేసే దురాగతాలు పెరిగి పోయాయి. రథాలను దుండగలు తగల బెట్టారు. మరో వంక క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు మహా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ప్రతి రోజూ వినిపిస్తూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందంటే, క్రైస్తవులకు ప్రత్యేక దేశం కావాలనే, డిమాండ్ వరకు వెళ్ళింది. ఇదంతా ముఖ్యమంత్రి ప్రోత్సాహం, ప్రోద్బలంతో సాగుతోందా లేదా అనేది పక్కన పెడితే, జరుగతున్న పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి మత  విశ్వాలు చర్చకు రావడం తప్పు కాదు. వస్తాయి, వస్తూనే ఉంటాయి.  నిజానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,అయన కుటుంబ మత విశ్వాసాల గురించి ఎవరికీ, ఎలాంటి సందేహం అవసరం లేదు.  ఇందుకు సమబందించి జగన్ రెడ్డి తల్లి   విజయమ్మ బైబిల్ సాక్షిగా, చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో చాలా కాలం క్రితం, ఒక ఇంటర్వ్యూలో ఆమెను ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఆమె ఏ మాత్రం తడబాటు లేకుండా, “మాది క్రైస్తవ కుటుంబం. ఏసు ప్రభువు ఒకడే దేవుడు అని నమ్మే క్రైస్తవ ధర్మాన్ని, మా కుటుంబం దేవుని వాక్కుగా విశ్వసిస్తుంది. కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యాలు అన్నీ, క్రైస్తవ ధర్మం ప్రకారమే జరుగుతాయి” అని స్పష్టంగా చెప్పారు. అంతే కాదు, రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) కానీ, జగన్  కానీ, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, రాజకీయ అవసరాల కోసం హిందూ దేవాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందువుల పండగలు, పబ్బాలలో మొక్కుబడిగా మాత్రమే పాల్గొంటారని నిర్మొహమాటంగా తెగేసి చెప్పారు. అంతే కానీ, క్రైస్తవ ధర్మాన్ని మాత్రం ఆ క్షణంలో కూడా మరవరని విజయమ్మ అంతే స్పష్టంగా చెప్పారు. విజయమ్మ చెప్పిన సత్య్యాన్ని పక్కన పెట్టినా, కళ్ళ ముందు జరుగతున్న పరిణామాలు  జగన్మోహన్ రెడ్డికి, ఆయన  కుటుంబానికి,“ఏసు దేవుడు ఒక్కడే దేవుడు”, ఇతర మతాలను, ఇతర దేవుళ్ళను వారు వారు విశ్వసించరు అనే నిజం, వారి చర్యలలో స్పష్టంగా దర్శనమిస్తూనే వుంది. అందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. జగన్ రెడ్డి చాలా సందర్భాలలో మాటకు ముందో మారు, చివరో మరో మారు దేవుని ప్రస్తావన చేస్తారు. దైవ స్తుతి చేస్తారు. అయితే, అమాయకంగా, హిందువులు ఎవరైనా, ఆయన ప్రస్తావించిన, దేవుడు, ముక్కోటి దేవతలు ఆరాధించే,  వెంకన్న దేవుడనో, కనకదుర్గమ్మ తల్లనో, అనుకుంటే, అది పొరపాటే అవుతుంది. ఆయన పగటి పూట పలవరించినా, రాత్రులలో కలవరించినా ‘ఏసు’ దేవుని నామమును మాత్రమే పలుకుదురు. మరో, దేవున్ని మనసులోకి రానీయరు. ఆలాగే ఆయన రాత్రులలో నేరుగా దేవునితో మాట్లాడినా, ఏసు దేవునితోనే మాట్లాడతారు కానీ , పక్కనే ఉన్నారు కదా అని మంగళగిరి పానకాల స్వామితోనో, మన వైజాగ్’ కు దగ్గరగా ఉన్నారని  సింహాద్రి అప్పన్నతోనో మాట్లాడరు. ఆయన ఏసు ప్రభువునే ధ్యానిస్తారు, ఏసు ప్రభువునే ఆరాధిస్తారు. ఏసు ప్రభువుతోనే మాట్లాడతారు. కలలో అయినా, ఆయన, ఏ ‘హిందూ’ దేవుడిని దేవుడినిగా గుర్తించరు. ముక్కోటి హిందూ దేవీ దేవతలలో ఏ ఒక్కరి పేరూ పొరపటున అయినా  ఉచ్చరించరు. అయితే, ఇప్పడు ఇదంతా ఎందుకంటే, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, నుదుటున బొట్టు లేదని, అయన వెంట వారి సతీమణి రాలేదని, లేరనీ, సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, ఇప్పుడు మళ్ళీ మరో మారు ముఖ్యమంత్రి మత విశ్వాసాల విషయం చర్చకు వచ్చింది.  నిజానికి ముఖ్యమంత్రి తమ మత విశ్వాసాలను పాటిస్తే, ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇతర మత విశ్వాసాలను, ముఖ్యంగా హిందువుల విశ్వాసాలు, ఆచార, వ్యవహారాలను అగౌరవ పరిచే విధంగా, ముఖ్యమంత్రి ప్రవర్తన, సర్కార్ తీరు ఉంటున్నాయనేదే హిందూ ధార్మిక సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణ. ప్రస్తుత విషయానికే వస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా వస్తోంది. నిజానికి, దేవుని కార్యానికి అనే కాదు, హిందూ ధర్మం,ఆచార, వ్యవహారాల  ప్రకారం పెళ్లి, పేరంటం ఏదైనా, తల్లి తండ్రులు, పెద్దలు, పిల్లలు ఎవరైనా  దంపతులకు దంపతులే బట్టలు పెడతారు. అంతేకానీ, ఇలా ఒంటరిగా వచ్చి బట్టలు పెట్టడం ఉండదు. అలాంటిది, ఆ దేవ దేవునికి ముఖ్యమత్రి ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించడం,అపచారం. అవమానం. హిందువుల మనోభావాలను కించపరిచే, అపరాధం. నిజమే, ఏసు నాథుని తప్ప మరో దేవుని పేరును ఉచ్చరించడమే మహా పాపమని, ‘సెక్యులర్’ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భావిస్తే భావించ వచ్చును, అది వారి విశ్వాసం. అలాటప్పుడు, ముఖ్యంత్రి అయినా, మనసు చంపుకుని మొక్కుబడి తంతుగా కార్యక్రమలో పాల్గొనడం ఎందుకు?   ఇంచక్కా దేవాదాయ శాఖ మంత్రి దంపతులకో, లేదా మరో మంత్రికో ఆ కార్యం అప్పగిస్తే, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కాదా? ముఖాన బొట్టు పెట్టుకోవలసిన అవసరం ఉండదు కదా?  ఇలా, తమ మనస్సును కష్ట పెట్టుకొంటూ, కోట్లాది హిందువుల మనోభావాలను కించే పరచడం అవసరమా? ఇదే ఇప్పడు హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ముఖ్యమంత్రిని అడుగుతున్న ప్రశ్న.

దేశ్ కీ నేతా కేసీఆర్ ప్రచారం పట్ల ‘మహా’ రైతుల ఆగ్రహం

దేశ్ కీ నేత అనిపించుకోవాలన్న అత్యుత్సాహంతో కేసీఆర్ నేల విడిచి చేస్తున్న సాము బూమరాంగ్ అయ్యింది. తెలంగాణ అభివృద్ధిని జాతీయ పత్రికలు మీడియాలో కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనంతో పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేసి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ఉత్సాహంతోనే పక్కనున్న మహారాష్ట్ర రైతులు కూడా  కేసీఆరే ప్రధాని కావాలని, జాతీయనేతగా ఉండాలని కోరుతున్న ట్టు ఒక వార్త  తెలంగాణకు చెందిన ఒక దినపత్రికలో ప్రచురితమైంది.  ఆ వార్తే ఇప్పుడు కేసీఆర్ బిల్డప్ నంతా ఒక్క సారిగా కుప్పకూల్చేసింది. తాము కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకోవడం లేదనీ, అసలు కేసీఆర్ వల్ల తమకు వీసమెత్తు ఉపయోగం లేకపోగా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తీవ్రంగా నష్టపోయామనీ మహారైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా కాళేశ్వరం కారణంగా తాము భూములు కోల్పోయామనీ, ఇంత వరకూ తెలంగాణ తమకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని వారు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం కారణంగా మహారాష్ట్రలోని  15 గ్రామాల రైతులు పంటలు పండిం చు కోలేకపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు నష్టపోయిన తమకు తెలంగాణ ప్రభుత్వం కనీసం పరి హారం కూడా ఇవ్వలేదని వారంతా వాపోయారు. కేసీఆర్ పనితీరుతో తీవ్రంగా నష్టపోయిన తాము ఆయన్ని ఎలా సమర్థిస్తామని మండిపడ్డారు. నష్టపరిహారం కోసం కోర్టుకు వెళతామని హెచ్చరించారు. తాము కేసీఆర్ ను జాతీయ నేతగా ఆహ్వానిస్తు న్నట్లుగా వచ్చిన వార్తలోని ఫొటోలు తమవే కానీ వాటిని ఫేస్ బుక్ లోంచి తస్కరించి ఆ వార్తకు వాడుకు న్నారని వారు ఆరోపిస్తున్నారు.  కేసీఆర్ ప్రచారం కోసం తమ ఫొటోలను తమ అనుమతి లేకుండా వాడుకోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తెలం గాణాకు చెందిన ఆ వార్తాప‌త్రిక త‌మ అభిప్రాయం తెలుసుకోకుండానే తమ ఫొటోలు వేసి తామేదో కేసీఆర్ కు ఆహ్వానాలు పలుకుతున్నట్లు, బ్రహ్మరథం పడుతున్నట్లు వార్తలు ప్రచురించి ప్రచారం చేసుకోవడమేమిటంటూ మండి పడుతు న్నారు.  తెలంగాణా, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో  సిరోంచ తాసీల్దా రు కార్యాల‌యం వ‌ద్ద   రైతులు నిర‌స‌న తెలియ‌జేస్తూ ఆ వార్తాప‌త్రిక కాపీల‌ను  త‌గుల‌బెట్టారు.  వాస్త‌వానికి, తాము కేసీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోర‌నే లేద‌ని, అస‌లు కేసీఆర్ ఆశ‌ల‌కి, కంటున్న క‌ల‌ల‌కి త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌నివారు కుండబద్దలు కొట్టారు. సదరు పత్రికలో వచ్చిన వార్తతో తమకు ఇసుమంతైనా సంబంధం లేదని స్పష్టం చేశారు.   మహారాష్ట్ర రైతుల నిరసనతో జాతీయ రాజకీయాలంటూ దూకుడు ప్రదర్శిస్తున్న కేసీఆర్ పరువు జాతీ యస్థాయిలో మంటగలిసిందని బీజేపీ వారు సంబరపడుతున్నారు. కర్నాటక రైతు లు కూడా కేసీఆర్ చేసుకుంటున్న ఇటువంటి ప్రచారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు  ఆ రాష్ట్రా నికి చెందిన నాయ కులు చెబుతున్నారు.  కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు ఇతర రాష్ట్రాల రైతుల నుంచి ఆగ్రహా వేశాలు వ్యక్తం కావడంతో ఆయన జాతీయ రాజకీయాల వైపు ఆయన అడుగులు ఎలా ముందుకు పడతా యన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు తొలగించండి.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాల మధ్య విభేదాలు కోర్టు మెట్లెక్కాయి. ఆప్ నేతలపై సక్సేనా పరువు నష్టం దావా వేశారు. ఆ దావాలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సక్సేనాకు ఊరటనిచ్చాయి. అయితే ఆప్ నేతలు మాత్రం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి అవినీతిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులుగా తమపై ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు.  తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ నేతలపై వేసిన పరువు నష్టం దావాలో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ కు ఊరట కలిగేలా ఇచ్చిన ఆ మధ్యంతర ఉత్తర్వులలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు, వీడియోలు, ట్వీట్లను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలనీ ఆప్ నేతలను  ఆదేశించింది. తనను కించపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, జాస్మిన్షా లపై పరువునష్టం దావా వేశారు. తనకు కించపరిచేలా ఉన్న, తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులు, వీడియోలు తొలగించాలని వారిని ఆదేశించాలని సక్సేనా ఆ పిటిషన్ లో కోరారు. అలాగే తన పరువుకు నష్టం కలిగించినందుకు ఆప్ నేతలు ఐదుగురూ తనకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా సక్సేనా ఆ డిఫమేషన్ దావాలో కోరారు.   అయితే ఆ తీర్పు పట్ల ఆప్ నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే న్యాయస్థానం ఇచ్చినది మధ్యంతర ఉత్తర్వులేనని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు తీసుకునే నిర్ణయాలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు విరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులదేనని, ఆ బాధ్యతను తాము ఎన్నడూ విస్మరించజాలమనీ పేర్కొన్నారు. తాము లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై చేసిన ఆరోపణలు ఆ కోవలోనివేనని కోర్టుకు తెలిపినట్లు ఆప్ నేతలు చెప్పారు. తాము చేసిన ఆరోపణలపై  స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేయాలని, అందుకు భిన్నంగా ఆయన ఏ తప్పూ చేయనప్పుడు దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు. 

లాప్‌టాప్ ఆర్డ‌ర్ చేస్తే బ‌ట్ట‌ల స‌బ్బులు వ‌చ్చాయి!

ఇప్పుడంతా ఆన్‌లైన్ వ్యాపార‌మే. తినే ప‌దార్ధాలు, వ్యాపార వ‌స్తువులు, లాప్‌టాప్‌లు, కంప్యూట‌ర్లు కూడా ఫ్లిప్ కార్ట్ వంటివాటిలో బుక్ చేసి తెప్పించుకుంటున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి గంట‌ల త‌ర బ‌డి వెత‌క‌డం, కావ‌ల‌సిన వ‌స్తువుని వెతికి తెచ్చుకోవ‌డం అనేది స‌మ‌యంతో కూడిన ప‌ని. చాలామంది ఆ స‌మ‌యం వెచ్చించ‌లేక‌నే ఆన్‌లైన్‌లో కొనుగోలుకే ఇష్ట‌ప‌డుతున్నారు. ఫ్లిప్ కార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకో వ‌డం, కావ‌ల‌సినవి ఆర్డ‌ర్ చేసుకుంటే పెద్ద‌గా శ్ర‌మ‌ప‌డ‌కుండానే ఇంటికే అన్ని చేర‌డం ఈ రోజు ల్లో ప‌రిపాటి అయింది. అయితే ఈ ర‌ద్దీ ఎక్కువ‌యింది. క‌నుక ఎవ‌రు ఏమి తెప్పించుకుంటున్నార‌న్న‌ ది కాస్తంత గ‌మ‌నించుకోవాలి. డెలివ‌రీ బాయ్ ఇచ్చి వెళ్లిన చాలాసేప‌టికి చూసుకుంటే మీరు ఆర్డ‌ర్ చేసిన‌ది కాకుం డా మ‌రోటి ఉండావ‌చ్చు! అవును అదే జ‌రిగింది య‌శ‌స్వీ శ‌ర్మ‌కి.  అహ్మ‌దాబాద్ ఐఐ ఎం విద్యార్ధి య‌శ‌స్వీ శ‌ర్మ‌. త‌న తండ్రికి లాప్ టాప్ కొనాల‌నుకున్నాడు. ఈమ‌ధ్య బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ అని ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. స‌రే త‌క్కువ‌లో వ‌స్తుంద‌ని య‌శ‌స్వీ లాప్ టాప్ బుక్ చేశాడు.  అదే రోజు య‌శ‌స్వీ తండ్రి ఆ ప్యాక్‌ను అందుకున్న‌ట్టు య‌శ‌స్వీకి ఫ్లిప్ కార్ట్ మెసేజ్ వ‌చ్చింది. ఓకే అనుకున్నాడు ఈ కుర్రాడు. తీరా పాకెట్ విప్పి చూస్తే ఇంటిల్ల‌పాదీ ఆశ్చ‌ర్య‌పోయారు. లాప్ టాప్‌కి బ‌దులు  అం దులో బ‌ట్ట‌లు ఉతికే స‌బ్బులు ఉన్నాయి!  ఇదేందిరా నాయ‌నా! అనుకున్నారు. ఫ్లిప్ కార్ట్ కి బుక్ చేస్తే ఎన్నడూ ఇలా జ‌ర‌గ‌లేదే అనుకున్నారు.  పైగా ఏద‌యినా వ‌స్తువు తెచ్చినా డెలివ‌రీ బాయ్ దాన్ని ఆ అడ్రస్లో ఉన్న‌వారి  చేత తీయించి చూసి ఓకే అనుకునే వెళుతూంటారు. కానీ ఈసారి మాత్రం ఇలా జ‌రిగిం దనుకున్నారు య‌శ‌స్వీ కుటుంబంలో అంతా.  బ‌హుశా, డెలివ‌రీ బాయ్ ప‌ని ఒత్తిడిలోనో, త్వ‌ర‌గా ప‌ని ముగించుకోవాల‌నుకునో హ‌డావుడిలో ఒక‌రిది మ‌రొకరికి ఇచ్చాడేమో అనీ అనుకున్నారు. కానీ అలా జ‌ర‌గ‌డానికి వీలేలేదు. ఎందుకంటే య‌శ‌స్వీ తండ్రి అందుకున్న ప్యాకెట్ మీద అడ్ర‌స్ వాళ్ల‌దే ఉంది! మ‌రి ఇదెలా జ‌రిగింది. మూడు నాలుగు రోజుల త‌ర్వాత దీన్ని గురించి ఫిర్యాదు చేశారు. జ‌రిగిన న‌ష్టానికి డ‌బ్బు చెల్లించ‌డానికి ఫ్లిప్‌కార్ట్  ఓకే అనేసింది. కానీ చిత్ర‌మేమంటే, ఈ స‌బ్బులు బుక్ చేసిన‌వారు ఇంకెంత కంగారుప‌డుతూంటారో. వారికి లాప్ టాప్ వెళ్లి ఉంటే, అక్క‌డ దాని అవ‌స‌రంలేని బామ్మ‌లు ఉంటే ప‌రిస్థితి ఏమిటి?!

లార్డ్స్ పెవిలియ‌న్ లా   దుర్గా పూజా మందిరం

భార‌త్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌(బిసిసిఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోని పెవిలియ‌న్ ప‌ట్ల ఇష్టం ఇంకా త‌గ్గ‌లేదు. కోల్‌క‌తాలో మిథాలీ సంఘం వారు ఏర్పాటు చేసిన దుర్గాపూజ మందిరం అచ్చం లార్డ్స్ పెవిలియ‌న్‌లానే ఉన్న‌ది. దీన్ని మంగ‌ళ‌వారం గంగూలీ ఆరంభించాడు.  ప్ర‌పంచ క్రికెట్ మ‌క్కాగా పేర్కొనే ఇంగ్లండ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ తో  బీసీసీఐ అధ్య‌క్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌కు గొప్ప అనుబంధం ఉన్న‌ది. 2002 ఇంగ్లండ్‌, భార‌త్ సిరీస్‌లో చివ‌రి మ్యాచ్ అక్క‌డ భార‌త్ అద్బుత విజ‌యం సాధించింది. ఆ ఆనందంలో గంగూలీ అక్క‌డి పెవిలియ‌న్ నుంచి మ్యాచ్  చివ‌రి క్ష‌ణాలు ఆస్వాదిస్తూ, విజ‌యం సాధించిన వెంట‌నే టీష‌ర్ట్ విప్పి గాల్లోకి తిప్పుతూ త‌న అమితానందాన్ని ప్రేక్ష‌కు ల‌కు, క్రికెట్ వీరాభిమానుల‌కు తెలియ‌జేయ‌డం ఎప్ప‌టికీ ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో అప్ప‌టి సూప‌ర్ స్టార్ యువ‌రాజ్ సింగ్, మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ తో క‌లిసి ఇంగ్లండ్ బౌల‌ర్లను ధీటుగా ఎదుర్కొన డం ఇప్ప టికీ క్రికెట్ వీరాభిమానులు మ‌రువ‌లేరు. ఇంగ్లండ్‌లో ఆ జ‌ట్టు మీద‌నే  భార‌త్   లార్డ్స్లో చివ‌రి మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవ‌సం చేసుకోవ‌డం క్రికెట్ చ‌రిత్ర‌లో చెప్పుకోద‌గ్గ అంశం. కెప్టెన్ గంగూలీ  ఆ విజ‌యానందాన్ని అత్యంత ఆహ్లాదంతో, విజ‌య‌గ‌ర్వంతో  లార్డ్స్ బాల్క‌నీ నుంచి  ప్ర‌క‌టించ‌డం ఎప్ప‌ టికీ గుర్తుండిపోతుంది.  గంగూలీ భార‌త్ త‌ర‌ఫున 113 టెస్టులు ఆడి 7,212 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 13 అర్ధ సెం చ‌రీలు ఉన్నాయి. బౌలర్‌గానూ ఎంతో ప్ర‌తిభ ప్ర‌ద‌ర్శించి 32 వికెట్లు తీశాడు. ఓడీఐల్లో మాజీ కెప్టెన్ గంగూలీ 311 మ్యాచ్‌ల్లో 11,363 ప‌రుగులు చేశాడు. అందులో 22 సెంచ‌రీలు ఉన్నాయి.

ఎన్ ఐ ఏ దాడుల్లో  2047 డాక్యుమెంట్  ల‌భ్యం

ఇటీవ‌ల ఎన్ఐఏ సోదాల్లో పిఎఫ్ఐ కి సంబంధించిన బాంబుల త‌యారీ, మిష‌న్ 2047 ప‌త్రాలు ల‌భ్య‌మ‌ య్యాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు తెలిపారు. అయితే పి ఎఫ్ ఐ పై కేంద్రం నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి, రాజ్యాంగంలో పేర్కొన్న పౌర‌హ‌క్కుల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మేన‌ని పి ఎఫ్ ఐకి చెందిన సోష‌ల డ‌మోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేర్కొన్న‌ది.  కానీ దేశంలో ఎన్ ఐ ఏ చేప‌ట్టిన దాడుల్లో అనేక ప్రాంతాల్లో తీవ్ర‌వాదులతో పి ఎప్ ఐకి  సంబంధాలు ఉన్నట్టుగా రుజువు చేయ‌గ‌ల ప‌త్రాలు ల‌భించాయ‌ని అధికారులు తెలిపారు. ముప్ప‌య్యేళ్ల క్రితం స్థాపిం చిన పి ఎఫ్ ఐ దేశంలో యువ‌త‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు వారికి తీవ్ర‌వాద శిక్ష‌ణ‌ను కూడా ఇస్తోంద‌ని, వారిని దేశంలో అశాంతి ప్రేరేపించేందుకు ఉప‌యోగించుకోవ‌డానికి సిద్ధ‌ప‌రుస్తోంద‌న్నది దాడుల్లో వెల్ల‌డ‌యిందని ఎన్ ఐఏ అధికారులు తెలిపారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కూ దేశం మొత్తం మీద 300 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలిపారు.  దేశంలో చాలా ప్రాంతాల్లో జ‌రిగిన దాడుల స‌మాచారాన్ని ప‌రిశీలించిన త‌ర్వాత‌నే ఈ సంస్థ వాస్త‌వ కార్య క‌లాపాలు మ‌రింత తెలిశాయ‌ని, అందువ‌ల్ల‌నే సంస్థ‌పై నిషేధ నిర్ణ‌యం తీసుకున్నట్టు అధికారులు తెలి పారు. దేశంలో త్వ‌ర‌లో భారీ బాంబు దాడుల‌కు ఈ సంస్థ శిక్ష‌ణ‌లో ఉన్న‌వారు సిద్ధ‌మ‌యిన స‌మా చారం అందిన మీద‌ట‌నే దాడులు చేప‌ట్టారు. ముఖ్యంగా పి ఎఫ్ ఐ నాయ‌కుడు మొహ‌మ్మ‌ద్ న‌దీమ్ ను ఉత్త‌ర ప్ర‌దేశ్ బారాబంకీలో ప‌ట్టుకుని అత‌ని వద్ద ల‌భించిన కీల‌క ప‌త్రాలతో  దేశంలో దాడుల‌కు సిద్ధ ప‌డిన సంగ‌తి వాస్త‌వ‌మేన‌ని తేలింది. ఐఇడి ఎలా త‌యారు చేయాలి, ఎలా ఉప‌యోగించాల‌నే అంశా లపై ప్ర‌త్యేక  శిక్ష‌ణ గురించిన డాక్యుమెంట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పి ఎఫ్ ఐ నాయ‌కుడు ఖాద్రా వ‌ద్ద ల‌భించా య‌ని అధికారులు తెలిపారు.  ఇదిలా ఉండ‌గా, దేశంలో ప్ర‌జార‌క్ష‌ణ ప‌ట్ల కేంద్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందని విప‌క్షాలు విరుచుకు ప‌డుతున్నాయి. కేవ‌లం ప్ర‌చార ఆర్భాటం, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, అధికార కాంక్ష త‌ప్ప బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం, ర‌క్ష‌ణ గురించి నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నాయి. ఎన్ ఐ ఏ దాడులతో దేశం లో అనేక ప్రాంతాల్లో సంఘ‌విద్రోహ‌శ‌క్తులు బ‌లోపేతం అవుతున్నార‌న్న‌ది వెలుగులోకి వ‌చ్చింది. కానీ వారికి విదేశాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌డం, దేశంలో దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌ డ‌టం చివ‌రి నిమిషంలోనే అవి బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల ప్ర‌జ‌లు ఎంతో ఆందోళ‌న‌ప‌డుతున్నారు.   ఇదిలా ఉండ‌గా, దేశంలో త‌మ సంస్థ‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం దాడులు చేప‌ట్ట‌డం ఒక డ్రామాగా పి ఎఫ్ ఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. తీవ్ర‌వాద వ్య‌తిరేక కేసుల‌ను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకునే ఎన్ ఐఏ, ఆర్దిక నేరాల సంబంధించి ప‌నిచేసే ఈడీ రెండు కీల‌క సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌మ చెప్పుచేత‌ల్లో పెట్టు కుంద‌ని ఆరోపించింది.  

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. వైసీపీకి మరణశాసమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఏ సామాజిక వర్గాన్ని జనానికి దూరం చేసి లబ్ధి పొందుదామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం చేకూరలేదు, ఆ లబ్ధి ఒనగూరలేదు సరి కదా.. మూడేళ్ల జగన్ పాలనలో మూటగట్టకున్న అపఖ్యాతి అంతా ఒకెత్తు అయితే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మరొక ఎత్తు అన్నట్లుగా మారింది. పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల మనోభావాలనూ దెబ్బతీశారు. ముఖ్యమంత్రి కనుక ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకరిద్దరు మంత్రులూ, నలుగురైదుగురు ఎమ్మెల్యేలూ, మరి కొంత మంది వైసీపీ నేతలూ ట్వీట్ల ద్వారానో, మీడియా మందు మాట్లాడారేమో కానీ.. వైసీపీలో అత్యధికులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యార్లగడ్డ రాజీనామా, వల్లభనేని వంశీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ నిర్ణయంపై పునరాలోచించాలని  జగన్ కు సూచించడం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ధిక్కరించి మరీ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్  ఒక సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయనో మహానుభావుడు, యుగపురుషుడు. తెలుగు వాడిని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన వ్యక్తి. రాజకీయ నాయకుడిగా ఆయన సమాజిక వైద్యం చేశారు. ఆయన రాజకీయ ప్రవేశం వరకూ వెనుకబడి ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవడానికి సోపానమయ్యారు. మధ్య తరగతి జీవులకు బతుకు భరోసా అయ్యారు. పేదవారికి నోటికాడ అన్నం ముద్దగా మారారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కు అన్ని వర్గాలలోనూ అభిమానులున్నారు. దైవాంశ సంభూతుడిగా ఆరాధించే వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మరణశాసనం రాసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల మాట పక్కన పెడితే ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం తరువాత జగన్ గ్రాఫ్, వైసీపీ గ్రాఫ్ గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందంటున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సటీ పేరు మార్పు అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటున్నారు. జగన్ ఆశించినట్లుగా సామాజిక వర్గాల వారీగా మద్దతు, వ్యతిరేకతగా విడిపోలేదనీ, జనం ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనీ నిఘావర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారని తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నదని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం వెనుక ఈ జిల్లాలలో వీచిన అనుకూల పవనాలు ఉన్నాయనీ, ఇప్పుడవి వ్యతిరేక పవనాలుగా కాక వ్యతిరేక ప్రభంజనంలా మారే అవకాశం ఉందనీ నిఘావర్గాలు చెబుతున్నాయి. బీసీలను ఒక సామాజిక వర్గానికి దూరం చేయాలన్న దురాలోచనతో తీసుకున్న హెల్త్ వర్సిటీ మార్పు బూమరాంగ్ అయ్యిందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బీసీలలోనే ఎక్కువగా ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం పట్ల ఆగ్రహం, వ్యతిరేకతా వ్యక్త మౌతోందంటున్నారు. ఇప్పుడు నష్ట నివారణ కోసం ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామంటూ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా అది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందమే అవుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.