సోనియా గాంధీ ఫిర్ ఏక్ బార్ ?!

అవును. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సోనియా చెంతకు చేరుతుందా? మరోసారి, ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోక తప్పదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న బహుముఖ సంక్షోభం వెనక పైకి కనిపించే కోణం ఒకటైతే, అంతర్గతంగా వినిపిస్తున్నకథనం మరోలా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు కుటుంబేతరులకు అప్పగించేందుకు సోనియా గాంధీ ఎంత మాత్రం సుముఖంగా లేరు. అంతే కాదు, చివరకు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె మనసు అంగీకరించడం  లేదు. కూతురు మనమ్మాయే అయినా అల్లుడు మన వాడు కాదు, పైగా, అతగాడు మామూలోడు కూడా కాదు. నిజానికి, ఇప్పటికే పార్టీలో ఒక వర్గం వాద్రా కనుసన్నల్లో పనిచేస్తోందనే అనుమాన, భయాలు సోనియాను వెంటాడు తున్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంగా, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని సృష్టించి, తాత్కాలిక అనే ట్యాగ్ లైన్ తో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు అదే పద్దతిలోనే మరో మారు, అదే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలు వదిలితే, ఇక మళ్ళీ పార్టీని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం అయ్యే పని కాదని సోనియా గాంధీ చాలా గట్టిగా నమ్ముతారనేది ఎవరూ కాదనలేని నిజం. నిజానికి, ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఏ కుటుంబ పార్టీ కూడా పార్టీ పగ్గాలు కుటుంబ వ్యక్తులకు అప్పగించరు. అలాంటిది  ఒకసారి పార్టీ పగ్గాలు వదిలితే ఎమౌవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసు కున్న సోనియా గాంధీ, అందుకు అసలే ఇష్టపడరని అంటున్నారు.  రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత, పీవీ నరసింహ రావు, సీతారాం కేసరికి పార్టీ ప్రభుత్వ పగ్గాలు వదిలేసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టు పట్టినా ఆమె అది తమకు మోయలేని భారమే అయినా ఆ బరువు బాధ్యతలను నెత్తి కెత్తుకున్నారు. ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీ మనసు మార్చుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆశించారు. అయితే మూడేళ్లయినా, రాహుల్ తీరు మాలేదు. బాధ్యతలు లేని అధికారాలకు అలవాటు పడిన రాహుల్  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇప్పటిలానే, ఎప్పటికీ ‘అధినాయకుడు’ గా ఉండి పోయేందుకే నిర్ణయించుకున్నారు.  ఈ నేపధ్యంలో విధేయుడు అనుకున్న అశోక్ గెహ్లాట్ ను, అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే ఎన్నికకు ముందే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అఫ్కోర్స్, అది కూడా సోనియా స్క్రిప్ట్ లో భాగమనే వాదన మరొకటి ఉందనుకోండి అంది వేరే విషయం. గెహ్లాట్ తిరుగుబాటు, సోనియా  రాహుల్  స్క్రిప్ట్ ప్రకారం జరిగినా  గెహ్లాట్ స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కథ నడిపినా, సోనియా గాంధీ మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించే  అవకాశం లేదని, అంతర్గత వర్గాల వర్గాల సమాచారం.అందుకే మళ్ళీ మరోమారు రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే  రాగాలు మొదలయ్యాయని అంటున్నారు. అలాగే కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ఏకే అంటోనీ, ముకుల్ వాస్నిక్, ఖర్గే వంటి మరికొందరు ‘విధేయుల’ పేర్లు ప్రచారం లోకి వచ్చినా, చివరకు రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో మళ్ళీ  ఫిర్ ఏక బార్ సోనియానే పార్టీ చీఫ్ అంటున్నారు.  అయితే ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు శుభం కార్డు ఎప్పుడు, ఎలా పడుతుందో ... చూడవలసిందే అంటున్నారు.

ఐరాస భార‌త్ శాశ్వ‌త స‌భ్య‌త్వానికి లంక మ‌ద్ద‌తు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం కల్పించేందుకు శ్రీలంక మద్దతు తెలి పింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు విక్రమసింఘే ప్రస్తు తం జపాన్‌లో ఉన్నారు. మంగళవారం జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషితో జరిగిన సమావేశంలో, విక్రమసింఘే అంతర్జాతీయ వేదికపై జపాన్ శ్రీలంక అందించిన మద్దతును ప్రశంసించారు యుఎన్ భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వం కోసం జపాన్ మరియు భారతదేశం చేస్తున్న ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి ప్రభు త్వ సుముఖతను వ్యక్తం చేశార‌ని  రాష్ట్రపతి కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 21వ శతాబ్దపు భౌగోళిక-రాజకీయ వాస్తవికతలకు ప్రాతినిధ్యం వహించని యుఎన్‌లో శాశ్వత సభ్యునిగా స్థానానికి తగిన అర్హత ఉందని చెబుతూ భద్రతా మండలిని సంస్కరించడానికి భారతదేశం సంవత్సరా ల తరబడి చేస్తున్న ప్రయత్నాలలో ముందంజలో ఉంది. ప్రస్తుతం, యుఎన్ ఎస్‌సీ ఐదు శాశ్వత సభ్యు లు ప‌ది శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి, ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలా నికి ఎన్నుకోబడతాయి. ఐదు శాశ్వత సభ్యులు రష్యా, యుకె, చైనా, ఫ్రాన్స్, యుఎస్  ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేయ గలవు. సమకాలీన ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించేలా శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్నుకోబడిన నాన్-పర్మనెంట్ మెంబర్‌ గా భారతదేశం తన రెండేళ్ల పదవీ కాలం యొక్క రెండవ సంవత్సరంలో ప్రస్తుతం సగంలో ఉంది. కౌన్సిల్లో భారతదేశ పదవీకాలం డిసెంబర్‌లో ముగుస్తుంది, ఆ నెలలో దేశం శక్తివంతమైన యుఎన్ విభాగానికి  అధ్యక్షుడిగా కూడా అధ్యక్షత వహిస్తుంది. శనివారం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యుఎన్ జనరల్ అసెంబ్లీ 77వ సద‌స్సు  సాధారణ చర్చలో ప్రసంగిస్తూ, భారతదేశం గొప్ప బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. సంస్క రించబడిన బహుపాక్షికత కోసం పిలుపు - భద్రతా మండలి యొక్క సంస్కరణలతో దాని ప్రధాన భాగం  యుఎన్‌ సభ్యులలో గణనీయమైన మద్దతును పొందుతుంది, అతను చెప్పాడు. ప్రస్తుత నిర్మాణం కాలానుగుణంగా, అసమర్థంగా ఉందని విస్తృతంగా గుర్తించినందున ఇది అలా చేస్తుం ది. ఇది చాలా అన్యాయంగా భావించబడుతుంది, మొత్తం ఖండాలు, ప్రాంతాలు, వారి భవిష్యత్తును చర్చించే ఫోరమ్‌లో వాయిస్‌ని తిరస్కరించింది" అని ఎస్ జైశంకర్ చెప్పారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి అందించే సదుపాయాన్ని పొందేందుకు ద్వీపం  బిడ్ కు కీలకమైన శ్రీలంక రుణ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించడానికి జపాన్ సుముఖత వ్యక్తం చేసి న ట్లు అధ్యక్షుడు విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. రుణ పునర్వ్యవస్థీకరణకు షరతులతో కూడిన శ్రీలంకతో సిబ్బంది స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఐఎంఎఫ్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఏప్రిల్ మధ్యలో, ఫారెక్స్ సంక్షోభం కారణంగా శ్రీలంక అంతర్జాతీయ రుణ ఎగవేతని ప్రకటించింది. దేశం 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది, అందులో 28 బిలియన్ డాలర్లు 2027 నాటికి చెల్లించాలి. ఐఎంఎఫ్‌ రుణాలు భరించలేని దేశాలకు రుణాలు ఇవ్వదు, శ్రీలంక ముందస్తుగా సమగ్ర రుణ చికిత్సను చేపట్టాలి. చైనా ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి)తో పాటు భారత్‌, జపాన్ రెండూ  శ్రీలంకకు ప్రధాన రుణదాతలు. శ్రీలంక తన తరపున రుణ పునర్నిర్మాణ సదస్సును నిర్వహించడానికి జపాన్‌తో బ్యాంకింగ్ చేస్తోంది. శ్రీలంకలో ఆగిపోయిన జపాన్ ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని విక్రమ సింఘే సూచించినట్లు అధికారులు తెలిపారు.

టిక్కెట్ మీద మ్యాచ్ టైమ్ త‌ప్పు.. హెచ్‌సిఏ పై కేసు న‌మోదు

భారత్- ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట ర్నేషనల్ స్టేడియంలో జరిగింది. సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన టిక్కెట్ల  అమ్మ కంలో జ‌రిగిన త‌ప్పిదాలు, తొక్కిస‌లాట‌ల విష‌యంలో ఇపుడు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సి ఏ) పై కేసు న‌మోద‌యింది. మ్యాచ్ ఏడింటికి మొద‌ల‌యింది. కానీ టిక్కెట్‌మీద మాత్రం మ్యాచ్ 7.30కి ప్రారంభ‌మ వుతుంద‌ని ముద్రించారు. దీనిపై ఆగ్ర‌హించిన ఒక యువ‌కుడు బేగంపేట పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.  ఎంతో కాలం త‌ర్వాత జ‌రిగిన మ్యాచ్‌కి పెద్ద సంఖ్య‌లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తి చూపి టికెట్ల‌కు ఎగ‌బ‌డ్డారు. ముందు ఆన్‌లైన్ లో అమ్మ‌కాలు అన్నారు. త‌ర్వాత విడిగా కూడా అమ్మ‌కాలు ఉన్నాయ న్నా రు. ఆన్‌లైన్‌లో కేవ‌లం గంట‌సేప‌ట్లోనే టిక్కెట్లు అమ్మ‌కాలు అయ్యాయ‌ని వార్త‌లు రావ‌డంతో క్రికెట్ అభి మానులు ఆగ్ర‌హించారు. త‌ర్వాత  అందులో స‌గ‌మే అయ్య‌య‌ని  త‌ర్వాత విడిగా అమ్మ‌కాలు  చేప‌ట్టారు. అయితే  ఇందులో కూడా  పొర‌పాట్లు జ‌రిగాయి.  టికెట్ల సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. తాజా ఫిర్యాదుతో హెచ్‌సీఏపై మొత్తం నాలుగు కేసులు నమో దు అయ్యాయి. టిక్క‌ట్ల‌మీద మ్యాచ్ స‌మ యం గురించి కూడా పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. టిక్కెట్ల స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస లాట లో చాలామంది గాయ‌ప‌డ్డారు. హెచ్‌సిఏ టిక్కెట్ల విక్ర‌యానికి త‌గిన ఏర్పాట్లు చేయ‌లేద‌ని, నియం త్రణా లోపాలున్నాయ‌ని చాలామంది ఇప్పటికీ మండిప‌డుతున్నారు. 

పీఎఫ్ఐ పై ఐదేళ్ల బ్యాన్

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాపై  కేంద్రం నిషేధం విధించింది.   పీఎఫ్‌ఐతోపాటు దాని అనుబంధ సంస్థలను కూడా ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం తక్షణమే అమలులోనికి వస్తుంది. పీఎఫ్ ఐ, దాని అనుబంధ సంస్థలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల పీఎఫ్ఐపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఈడీ వరుసదాడులు నిర్వహించిన సంగతి విదితమే. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తోందన్న ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. ఈ నెల 22న, మళ్లీ 27(మంగళవారం) దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ దాదాపు 300 మందిని అరెస్టు చేసింది. యూపీ, గుజరాత్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పీఎఫ్ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్ళలో జరిపిన సోదాలలో పలు కీలక పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశంలో ప్రముఖుల హత్యకు, రాష్ట్రాలలో హింసాత్మక ఘటనలకు పీఎఫ్ఐ కుట్రపన్నిందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలైన రిహబ్‌ ఇండి ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహబ్‌ ఫౌండేషన్‌ కేరళపై ఐదేండ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  దేశంలో హింస‌కు పీఎఫ్ఐ కుట్రపన్నిందని  బ‌య‌ట ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్ట‌డానికి పీఎఫ్ ఐ కుట్ర ప‌న్నిందని ఎన్ఐఏ పేర్కొంది.   ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సంగ‌తి తెలిసిన కొద్ది రోజు ల‌కే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేత‌లే ల‌క్ష్యంగా వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్టు తెలిపింది. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింద‌నీ, నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసిందనీ,  పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉందనీ ఎన్ఐఏ పేర్కొంది.

మరో మూడు రోజులు వానలే వానలు! నగరవాసులకు నరకయాతన తప్పదా?

తెలంగాణలో మరోమూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే గత రెండు రోజులుగా (సోమ, మంగళ వారాలు) కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైన సంగతి విదితమే. ఇప్పుడు మరో మూడు రోజులు(బుధ, గురు, శుక్ర) వారాలలో భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఇలా ఉండగా వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచామని పేర్కొంది. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఇలా ఉండగా వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఉండగా మంగళవారం నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు ఇక్కట్లు పడ్డారు. లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, ట్రూప్ బజార్, నాంపల్లి  తదితర ప్రాంతాల్లో భారీ కురిసిన భారీ వర్షానికి ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సోమవారం కూడా నగరంలో భారీ వర్షం కురిసన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జనం ఆందోళనకు గురౌతున్నారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి కేకే రాజీనామా.. కారణమదేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు  ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపించారు. అంతకు ముందే తన నిర్ణయాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు తెలియజేశారు. రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నప్పటికీ కేకే రాజీనామాకు కేంద్రం తీరు పట్ల అసంతృప్తే కారణమని అంటున్నారు. మీడియా పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆయనీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అలాగే కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా తన రాజీనామాతో తన అసంతృప్తిని, అసమ్మతినీ తెలియజేశారని అంటున్నారు. తన రాజీనామాకు ఎలాంటి రాజకీయ కారణాలు లేవని కేకే చెప్పినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఏకపక్ష విధానాలకు నిరసనగానే   ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని వదులుకున్నారని చెబుతున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిస్థితి పేరుగొప్ప-ఊరుదిబ్బగా మారిపోయిందన్న భావన ఆయన పలు సందర్భాలలో తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారంటున్నారు. ప్రెస్ కౌన్సిల్    ప్రతిపాదనలు,సిఫారసులను గానీ కేంద్ర ప్రభుత్వం ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేకే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా  పెయిడ్ న్యూస్‌పై ముఖ్య‌మైన అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించిన సంగతి విదితమే. మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు నిరసనగానే కేకే ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు

అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ ఔట్.. రాహుల్ వైపే అందరి చూపు!

కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది.  పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం బయటి వ్యక్తులకు అప్పగిస్తే ఏం జరుగుతుందన్నదానికి గెహ్లాట్ ఎపిసోడ్ ఒక ట్రయిలర్ మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. గెహ్లాట్ ఉదంతంతోనైనా రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆరంభమై నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న  పార్టీకి వీరవిధేయుడిగా ఇంత కాలం భావించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తిరుగుబావుటా ఎగురవేశారు. రాజస్ధాన్ సీఎంగా తన విధేయుడిని నియమించి తీరాల్సిందేనని భీష్మించారు. తన వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటూ బెదరించేలా వారిని ప్రోత్సహించారు. ఇదంతా తనకు తెలియకుండా జరిగిందని గెహ్లాట్ బుకాయిస్తున్నా ఆయన మాటలను అధిష్ఠానం నమ్మడం లేదు. సీఎంకు తెలియకుండా ఎమ్మెల్యేలు, అదీ ఆయన వర్గం ఎమ్మెల్యేలు ఇంత సీన్ క్రియేట్ చేయలేరంటున్నారు.  దీంతో అశోక్‌ గహ్లోత్‌పై అధిష్ఠానం కన్నెర్రజేసింది.   రాజస్థాన్‌ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభం తీవ్రరూపం దాల్చడానికి కారణమైన గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా   అవకాశం ఇవ్వకూడదని  నిర్ణయించింది. వాస్తవానికి ఆయన బుధవారం(సెప్టెంబర్28) పార్టీ అధ్యక్ష  ఎన్నికకు నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే  రాజస్థాన్ లో సంక్షోభం కొలిక్కి వచ్చాకే నామినేషన్‌ వేయాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆయన నామినేషన్ కార్యక్రమం వాయిదా పడింది. నిజానికి అనూహ్యంగా ఆయన ధిక్కారం   సోనియాగాంధీ,  రాహుల్‌గాంధీలకు ఊహించిన ఎదురుదెబ్బగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  సరిగ్గా మూడు రోజుల కిందట గెహ్లాట్   కోచిలో రాహుల్‌ గాంధీని కలిశారు. ఆయనతో  కలిసి  భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పట్ల తన విధేయతను ప్రదర్శించారు. అంతకు ముందు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యారు. ఆమె ఆదేశాల మేరకే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకుని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతానని మాటిచ్చారు. కానీ తిరిగి జైపూర్ వెళ్లిన వెంటనే ఆయన తన తిరుగుబావుటా ఎగురవేశారు. తన వర్గం ఎమ్మెల్యేలను అధిష్ఠానంపైకి ఉసిగొల్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికే కాకుండా అధ్యక్ష ఎన్నిక ముందు పార్టీలో కూడా సంక్షోభం ఏర్పడేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఆయనను పార్టీ అధ్యక్షుడిని చేస్తే అసలుకే మోసం వస్తుందని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. అలాగే సీడబ్ల్యుసీ కూడా పార్టీ అధ్యక్ష పదవికి ఆయన వద్దని సూచిస్తోంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ మరో విధేయ నేత కోసం గాలిస్తోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఆదివారం జరగాల్సిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం రద్దైంది.  తదుపరి సీఎంను నియమించే అధికారాన్ని సోనియాగాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేయాలన్న అధిష్ఠానం  ఆదేదాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. గెహ్లాట్ వర్గీయులైన 83 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సీఎల్పీ జరగలేదు. అయితే ఎమ్మెల్యేలు రాలేదు.  మాజీ ఉపముఖ్యమంత్రి, తమ ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌ను సీఎంగా నియమిస్తామంటే అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. తమలో ఎవరో ఒకరిని సీఎం చేయాలని కండీషన్ పెట్టారు. అదే రోజు అంటే ఆదివారం(సెప్టెంబర్ 26)  అర్ధరాత్రి దాటాకా స్పీకర్‌ సీపీ జోషీ నివాసానికి వెళ్లి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలు సమర్పించారు. రాజీనామాలు సమర్పించిన 83 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యేందుకు పరిశీలకులుగా వచ్చిన అధిష్టానం దూతలను మాకెన్‌, ఖర్గే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత సీఎం వర్గంలో కీలకమైన ఎమ్మెల్యేలు ప్రతా్‌పసింగ్‌ కచరియవాస్‌, మహేశ్‌ జోషీ, మంత్రి శాంతి ధరివాల్‌లు మకేన్, ఖర్గేలను సోమవారం (సెప్టెంబర్ 27) కలిశారు. సంక్షోభ పరిష్కారానికి వారు మూడు డిమాండ్లు చేశారు.  వాటిలో ప్రధానమైనది గెహ్లాట్ కు విధేయులుగా  ఉన్న తమలో నుంచే ఎవరినో ఒకరిని   సీఎంను ఎంపిక చేయాలన్నది. వారి డిమాండ్లను అధినేత్రి సోనియాకు నివేదిస్తామనీ, ఆమె నిర్ణయం తీసుకుంటారని అజయ్‌ మాకెన్‌ మీడియా సమావేశంలో తెలిపారు. ఆ వెంటనే మకేన్, ఖర్గేలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ సోనియాతో భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సోనియా ఢిల్లీ పిలిపించి సంక్షోభ నివారణ బాధ్యతలు అప్పగించారు.  రాజస్థాన్ సీఎంగా   పైలట్‌ అంగీకరించేలా గెహ్లాట్ వర్గీయులను ఒప్పించాలని సోనియా కమల్ నాథ్ కు చెప్పారు. ఇలా ఉండగా    ఎమ్మెల్యేలను రెచ్చగొట్టిన గెహ్లాట్ మాత్రం వారి తిరుగుబాటుతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.  సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు రాకపోవడం సరికాదని అంటున్నారు.  తాజా సంక్షోభానికి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే పార్టీ మాత్రం ఆయనదంతా డ్రామా అని భావిస్తోంది.  సీఎం అండ లేకుండా ఎమ్మెల్యేలు ఇంత రచ్చ చేయరని అంటోంది. ఓ వైపు  భారత్‌ జోడో యాత్ర జయప్రదంగా సాగుతూ కార్యకర్తలలో ఉత్తేజాన్ని నింపుతుంటే మరో పక్క  కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాము స్వయంగా ఎంపిక చేసి నిలబెడదామనుకున్న నేతే ధిక్కార స్వరం వినిపించడం పట్ల పార్టీలో ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబం చేతులు దాటితే పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందనడానికి ఇదే తార్కానమని అంటున్నాయి. ఆ పరిస్థితి రాకుండా నివారించడానికి  అధ్యక్షుడిగా తాము ఎంపిక చేయాలనుకున్న నాయకుడే ధిక్కార వైఖరి అవలంబించడంపై వారు ఆగ్రహంతో ఉన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. గాంధీ కుటుంబం చేతిలో పార్టీ పగ్గాలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి రాజస్థాన్‌ పరిణామాలే తార్కాణమని.. అందుచేత ఇకనైనా మనసు మార్చుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న ఒత్తిడి రాహుల్ పై పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒక దశలో పార్టీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ ను పోటీలోకి దించాలని సోనియా భావించినా ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదంటున్నారు. గాంధీ కుటుంబం బయటి వ్యక్తులు పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకుంటే ముందు ముందు కాంగ్రెస్ లో ఇటువంటి సంక్షోభాలు మరిన్ని సంభవించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఐక్యంగా ఉండాలన్నా, మరింత బలోపేతమై, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి దీటుగా నిలవాలన్నా రాహుల్ గాంధీ తన పంతం వీడి పార్టీ అధ్యక్ష పగ్గాలు అందుకోవాలని కోరుతున్నారు.  

షర్మిలపై జగ్గారెడ్డి కౌంటర్లు.. ఏపీలో జగన్ కు ముచ్చెమటలు!

గదిలో స్విచ్ వేస్తే వరండాలో లైట్ వెలుగుతుంది. ఆ రెండింటికీ ఉన్న కనెక్షన్ అలాంటిది మరి. అలాగే తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను విమర్శిస్తే.. ఆ విమర్శలు నేరుగా జగన్ కు తగులుతున్నాయి.  జగన్, షర్మిలల మధ్య ఉన్నది అన్నా చెళ్లెళ్ల బంధం మరి. జగన్ కు సీఎం పదవి ఇవ్వాలని నేనూ సంతకం చేశానంటూ జగ్గారెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేరుగా జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన కోరిక మేరకే సంతకాల సేకరణ జరిగిందని జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షిననీ అన్నారు. దాంతో గతంలో సంతకాల సేకరణ వాస్తవమే కానీ, ఆ విషయం జగన్ కు తెలియదంటూ అప్పట్లో  జగన్ సన్నిహితులు ఇచ్చిన వివరణలన్నీ అవాస్తవమని జగ్గారెడ్డి మాటలతో తేలిపోవడంతో ఇప్పుడు ఏపీలో జగన్ ఒకింత ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారనే చెప్పాలి.  వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల  కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో కనీసం ఆయనకూ క్లారటీ ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని ఆరోపణలు గుప్పించారు. మామూలుగానే జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్. ఆయన విమర్శలు చాలా ఘాటుగా ఉంటాయి. అటువంటి జగ్గారెడ్డికి షర్మిల తనను కేటీఆర్ కోవర్ట్ అంటూ విమర్శించడంతో ఆయనకు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది.  దాంతో జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణలో షర్మిల రాజకీయ శక్తి కానే కాదని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు షర్మిల కంటే.. ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టిగా తగిలాయి. జగ్గారెడ్డి వైఎస్ మరణించన నాటి సంగతులను ప్రస్తావించారు. వైఎస్ మరణించినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలూ తదుపరి ముఖ్యమంత్రి విషయంపైనే దృష్టి పెట్టారనీ, కుటుంబ పెద్ద మరణించిన బాధ వారిలో ఇసుమంతైనా కనిపించలేదనీ చెప్పారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని కూడా చెప్పారు. వైఎస్ మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి వెళ్లి తాము ఏడ్చామే తప్ప ఆయన కుమారుడూ, కుమార్తెలలో బాధ అన్నది ఇసుమంతైనా కనిపించలేదన్నారు. వైఎస్ మరణించిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ సంతకాలు పెట్టించిన వారిలో తానూ ఉన్నాననీ, సంతకాలు సేకరించమని తమకు ఆదేశాలు వచ్చాయనీ అన్యాపదేశంగా జగన్ ను ఉద్దేశించి ఆయన చెప్పారు. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలే సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. షర్మిల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్ దుర్మరణం పాలైన విషాద సమయంలో, ఇంకా అంత్యక్రియలు కూడా జరగకుండానే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలతో నాడు జగన్ పై సీఎం పదవి కోసం సంతకాలు సేకరించిన మాట వాస్తవమేనని తేలిపోయిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగ్గారెడ్డి మాటలు వాస్తవమేనని చెప్పేందుకు గతంలో వైఎస్ మరణం నాటి సంఘటనలను వివరిస్తూ నటుడు చిరంజీవి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ప్రసంగంలో చిరంజీవి వైఎస్ అంత్యక్రియలు జరగకుండానే జగన్ సీఎం కావాలంటూ కొందరు సంతకాల కార్యక్రమం చేపట్టారనీ, అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న తనను కూడా సంతకం పెట్టాల్సిందిగా కోరారనీ వెల్లడించారు. అప్పుడు తాను వారికి అది సబబు కాదనీ, విషాద సమయంలో రాజకీయం కోసం, పదవుల కోసం వెంపర్లాడటం తగదనీ చెప్పానని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడంతో జగ్గారెడ్డి, షర్మిలల మధ్య విమర్శల యుద్ధంలో జగన్ కు గాయాలు తప్పడం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  

వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? గన్నవరం నియోజకవర్గంలో విపరీతంగా జరుగుతున్న చర్చలను గమనిస్తే ఔననే అనిపించక మానదు. వంశీ రాజకీయవైరాగ్యానికి దారి తీసిన పరిస్థితులపై కూడా ఈ సందర్భంగా గన్నవరం నియోజవర్గంలో ఓ చర్చ యెడతెగకుండా సాగుతోంది.   జగన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు.  ఆ నిర్ణయం సరికాదంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంపై ఓ సారి పునరాలోచించాలంటూ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే వంశీ సూచించారు. అయితే దీనిపై జగన్ నుంచి స్పందన లేదు సరికదా.. పలువురు వైసీపీ నాయకులు మంత్రులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు సహేతుకమైనదేనంటూ పోటీలు పడి మరీ ప్రకటనలు గుప్పించారు. చివరాఖరుకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ కూడా తన భర్త పేరుపై ఉన్న హెల్త్ వర్సిటీ మార్పును స్వాగతించారు. మరోవైపు   జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  నిరసన వ్యక్తం చేశారు.    ఇప్పటికే   జగన్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి.. వైయస్ఆర్ పేరు పెట్టారని అంటున్నారు. దీంతో అసలు పంచాయతీ అంతా   జగన్ వర్సెస్ ఆ  సామాజికి వర్గం అన్నట్లుగా తయారైందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.    ఇంకోవైపు..  2019 ఎన్నికల్లో   జగన్ హావా   తట్టుకొని వల్లభనేని వంశీ.. గన్నవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.   ఆ తర్వాత కారణాలేమైనా.. వైసీపీ గూటికి చేరారు... అక్కడితో ఆగకుండా   టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై వంశీ విమర్శలు గుప్పించారు.. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీలోని వారంతా మీడియా ముందుకు రావడం ఆ విమర్శలను ఖండించారు.. ఆ తరువాత వల్లభనేని వంశీ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చంద్రబాబు ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పారు. అయితే అప్పటికే వల్లభనేని వంశీకి పూడ్చలేని నష్టం జరిగింది. ఇటు నమ్ముకున్న వైసీపీలో కూడా వర్గ రాజకీయాల కారణంగా ఆయనకు ఉక్కపోత ఆరంభమైంది.   గన్నవరం నియోజకవర్గంలో అధికార ఫ్యాన్ పార్టీలో గ్రూప్‌ల రాజకీయం.. వంశీ కి పొమ్మనకుండా పొగపెట్టేసింది.  వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం.. అటు యార్లగడ్డ వెంకట్రావు వర్గం.. ఇటు దుట్టా రామచంద్రరావు వర్గం.. హోరా హోరీగా పోటాపోటీ పడుతున్నాయి. ఒకానొక దశలో ఈ నియోజకవర్గ పంచాయతీ కాస్తా సీఎం జగన్ సతీమణి వైయస్ భారతి వరకూ వెళ్లింది.   ఆ క్రమంలో వైయస్ భారతి శివగామి తరహాలో సెటిల్‌మెంట్ చేసి... ఇరు వర్గాల వారిని టండా టండా కూల్ కూల్ చేశారనే ఓ టాక్ సైతం   వైరల్ అయింది. దీంతో గన్నవరం పంచాయతీ   సద్దుమణిగింది.  ఇక వల్లభనేని వంశీని ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో ఓడించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వంశీపై గెలిచే అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. ఆ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ప్రస్తుత విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. కానీ ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు  ఆసక్తి చూపడం లేదని  సమాచారం.  మరోవైపై టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన వంశీకి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంతా దుట్టా, యార్లగడ్డ వర్గాలు చేసేస్తున్నాయని సమాచారం. ఆ క్రమంలో ఇన్ని తలనొప్పుల మధ్య ఎన్నికల్లో పోటీ చేసే కంటే.. రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేస్తే... బెటర్  అని వంశీ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా? లేదా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిపోతోంది. కానీ ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి దాదాపు వచ్చేసినట్లేనని ఆయన సన్నిహితులు బాహాటంగానే చెప్పడం కొసమెరుపు. 

హ‌ర్యానా ప్ర‌భుత్వానికి  ఎన్‌జీటీ షాక్‌

చెత్త‌బుట్ట‌లో ప‌డేయాల్సిన చాక్లెట్ క‌వ‌ర్ బ‌య‌ట‌ప‌డేసింది పింకీ, వాళ్ల‌న్న సిగ‌రెట్ పీక కింద‌ప‌డేసేడు. అంతే వాళ్ల‌మ్మ తిట్టింది, మామ్మ‌గారు అలా ప‌డేయ‌కూడ‌ద‌న్నారు, పోనీలేద్దూ చిన్న‌పిల్ల‌న్నారు నాన్న‌. కానీ హ‌ర్యానా ప్ర‌భుత్వం చేసింది మ‌రీ చాలా చెప్ప‌లేనంత పెద్ద త‌ప్పు గ‌న‌క జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ (ఎన్‌జిటీ) మొట్టికాయ‌ల‌తో పాటు భారీ జ‌రిమానా విధించింది.   గురుగ్రామ్ డంపింగ్ యార్డును హ‌ర్యానా ప్రభుత్వం 2017లో ఒక చైనాకంపెనీకి  నిర్వ‌హ‌ణా  బాధ్య‌త‌ను అప్ప‌గించింది. కానీ ఆ సంస్థ నిర్ల‌క్ష్యం చేసింది. ఫ‌లితంగా చెత్తను కాల్చిన‌పుడు వెలువ‌డే పొగ‌తో గాలి క‌లుషిత‌మ‌యింది. ఈ కార‌ణంగా చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లు అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. అంతే కాకుండా అక్క‌డ‌కి ద‌గ్గ‌ర్లోనే ఉన్న అభ‌యా ర ణ్యంలోని జంతువులకు కూడా ప్రాణ‌హాని ఉంద‌ని ఎన్‌జీటీ అభిప్రాయపడింది. ఈ కార‌ణంగా హ‌ర్యానా ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్య‌ధోర‌ణిని నిర‌సిస్తూ ఎన్‌జీటీ ఆ రాష్ట్ర ప్ర‌భు త్వంపై రూ.100 కోట్లు జ‌రిమానా విధించింది.  ఎన్‌జీటీ ఈ విధంగా ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఇది మొద‌టి సారి కాదు. ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కూడా షాక్ ఇచ్చింది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో ప‌ర్యావ ర‌ణ అనుమ‌తులు ఉల్లంఘించింది. ఈ కార‌ణంగా ఎన్‌జీటీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.120 కోట్లు జ‌రిమానా వేసింది. ఇదేవిధంగా, ప‌ర్యావ‌ర‌ణం సంబంధించి ఎలాంటి అనుమ‌తులు లేకుండా క‌ట్టిన మూడు ప్రాజె క్టుల‌కే కూడా జ‌రిమానా విధించింది. పురుషోత్త‌ప‌ట్నం ప్రాజెక్టుకు రూ.24.56కోట్లు, ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు రూ.24.90 కోట్లు, చింత‌ల‌పూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు ఎన్‌జిటీ  జ‌రిమానా విధించింది. 

దుబాయ్‌లో ఉద్యోగావ‌కాశం.. అంత‌లో క‌బ‌ళించిన మృత్యువు

పుట్టుక‌తోపాటు మ‌ర‌ణాన్ని గౌర‌వించాలంటారు త‌త్త్వ‌వేత్త‌లు. వారికేం ఇలాంటివి ఎన్న‌యినా చెబు తారు.. ఒక‌రు దూర‌మయిన బాధ‌ను భ‌రించేవారికి తెలుస్తుందంటారు సామాన్యులు.  ఇంట్లో ఒక‌రు మ‌ర‌ణం వ‌ల్ల దూర‌మ‌యితే ఆ వ్య‌ధ జీవితాంతం పెను భారంగా మారుతుంది. మ‌రీ ముఖ్యంగా త‌మ‌ను భ‌విష్య‌త్తులో ద‌గ్గరుండి చూసుకోవాల్సిన కొడుకుని మృత్యువు అమాంతం తీసికెళిపోతే ఆ త‌ల్లిదండ్రుల వ్య‌ధ వర్ణ‌నా తీతం. తెలంగాణా రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ కె.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కుమారుడు 23 ఏళ్ల అభిజిత్ కార్డియాక్ అరెస్ట్‌తో మ‌ర ణించాడు.  వ‌రంగ‌ల్ ఎన్ఐటీలో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ బీటెక్ చేసిన అభిజిత్ వ‌చ్చే నెల‌లో దుబాయ్‌లోని ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది.  రూ.58 లక్షల జీతంతో ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో.. అభిజిత్  ఆకస్మిక మృతి ఆ కుటుంబాన్ని క‌ల‌చివేస్తోంది.  అంతా సంతోషకరంగా కొనసాగుతున్న తరుణంలో విధి వక్రీకరించింది. అభిజిత్ రెడ్డి ఛాతీలో ఇబ్బం దికి గురయ్యాడు. కుప్పకూలిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు వెంటనే సీపీఆర్ చేశారు. అనం తరం వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటిం చారు. కార్డియాక్ అటాక్ తో ఆయన చనిపోయినట్టు తెలిపారు.  మరోవైపు కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం యువత అనేక కారణాల వల్ల ఒత్తిడు ల‌కు లోన‌యి హార్ట్ అటాక్ కు గురవుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో  భార‌తీ పే పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

నిర‌స‌న‌, వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డానికి రాజ‌కీయ‌పార్టీలు, నాయ‌కులు అనేక మార్గాలు వెతుకుతున్నారు. ఇపుడు కొత్త‌గా పోర్ట‌ర్లువేసి మ‌రీ చెబుతున్నారు. ట్వ‌ట్ట‌ర్లు, మీడియా స‌మావేశాల్లో తిట్ట‌డం  కంటే ఇద యితే రాష్ట్ర‌మంతా తెలు స్తుంద‌న్న కొత్త ఆలోచ‌న‌ను అనుస‌రిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఈ త‌ర‌హా తీవ్ర వ్య‌తిరేక‌త‌ను  ప్ర‌ద ర్శించ‌డం ఇదే మొద‌టిసారి.  ఇది మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణం గ‌తంలో చంద్ర బాబునాయుడు వియ్ డోంట్ వాంట్ ఎన్టీఆర్  అని అన్నారంటూ అప్ప‌టి ఆంగ్ల ప‌త్రిక క‌టింగ్‌తో  వైసీపీ  పోస్ట‌ర్లు వేసింది.  ఇపు డు  టీడీపీవారికి అలాంటి ప్ర‌చారంతో వైసీపీ, జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రువును బ‌జారున పెట్టడానికి అవ‌కాశం ల‌భించింది. అందుకే పోటీగా టీడీపీ నేత‌లు భార‌తీ పే అనే పోస్ట‌ర్లు అంటిస్తున్నా రు. క‌ర్ణాట‌కాలో కాంగ్రెస్ పే టీఎంకు పేర‌డీగా పే సీఎం పోస్ట‌ర్లు వెలిసాయి.  అదే విధంగా  టీడీపీ నేతలు భారతీపే అనే పోస్టర్లు అంటిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పేటీఎంకు పేర డీగా పేసీఎం పోస్టర్లు తెచ్చి నలభై శాతం కమిషన్లు యాక్సెప్ట్ చేస్తార న్నట్లుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా వైరల్ అయింది.  ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నిందితుడిగా చిక్కిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడు వాస్త‌వానికి స్కాం సొమ్మంతా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన  ఒక సంస్థ‌లో పెట్టార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీని మీద టిడీపీ నాయ కులు విరుచుకుప‌డ్డారు. ముఖ్యమంత్రికి తెలియ‌కుండానే ఇదంతా జ‌రుగుతోందా అని టీడీపీ నాయ‌ కులు నిల‌దీశారు. కానీ ప్రభుత్వంనుంచి ఎలాంటి అలికిడీ లేక‌పోవ‌డ‌మే ఆ అనుమానాన్ని బ‌ల‌ ప‌రి చింది.  పైగా ఆ సొమ్మును జ‌గ‌న్ భార్య భార‌తి చెల్లించాల‌ని డిమాండ్ చేయ‌డ‌మేనా  మ‌రి ఈ  భార‌తీ పే పోస్ట‌ర్ల ల‌క్ష్యం!  రాజ‌కీయాల్లో ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవ‌డం ప‌రిపాటి. కానీ లిక్క‌ర్ స్కామ్‌లో బ‌య‌ట‌ప‌డిన పేర్ల‌లో జ‌గ‌న్ భార్య భార‌తి పేరు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డంతో ఈ త‌ర‌హా పోస్ట‌ర్ల‌కు ఊత‌మిచ్చింద‌నాలి. ఒక పార్టీ మీద బుర‌ద జ‌ల్లేట‌పుడు త‌మ పార్టీ ప‌రిస్థితిని ప‌రిశీలించక‌పోవ‌డం వైసిపీ చేసిన త‌ప్పు. త‌మ పార్టీ వ్య‌వ హారాల‌న్నీ ఎంతో చ‌క్క‌గా, ఎలాంటి అవినీతికి పాల్ప‌డనివారితో సాగిపోతోంద‌ని భావించి ఇత‌ర పార్టీల మీద దుమ్ము జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం అర్ధ‌ర‌హితం. 

క్యాసినో కేసులో ఈడీ విచారణకు తెరాస ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణకు హాజయర్యారు. ఈడీ కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంగళవారం (సెప్టెంబర్ 26) విచారించారు. ఈ కేసులో పలురంగాలతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాలలో క్యాసినో కేసు సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో క్యాసినో సూత్రధారి చీకోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ అతడి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలకు ప్రమేయమున్నట్లు ఈడీ నిర్థారణకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు రాజకీయ నాయకులకు ఈ కేసులో ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు. అలా నోటీసులు అందుకున్నవారిలో తెరాస ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ మంగళవారం(సెప్టెంబర్ 26) విచారించి ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. క్యాసినో కేసు ఉభయ తెలుగురాష్ట్రాలలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాలలోనూ అధికార పార్టీకి చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందన్న వార్తలు అప్పట్లో మీడియాలో హల్ చల్ చేయడంతో హై ప్రొఫైల్ కేసుగా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది

విభజన సమస్యల పరిష్కారం.. పురోగతి పూజ్యం.. నామ్ కే వాస్తేగా సమావేశాలు!

ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు, అపరిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎడతెగకుండా సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం నిర్వహిస్తున్న సమావేశాలలో పురోగతి నత్తనడకను తలపిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశా కీలక సమావేశం నిర్వహించింది. మంగళవారం (సెప్టెంబర్ 27)  జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సోమేష్ కుమార్, సమీర్ శర్మ ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల నుంచీ ప్రతినిథి బృందాలు హాజరయ్యాయి.  ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశం కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ భ‌ల్లా నేతృత్వంలో జరిగంది. ఈ సమావేశంలో చర్చకు రూపొందించిన అజెండాలో 14 అంశాలను పొందుపరచగా వాటిలో పలు అంశాలు అసలు చర్చకే నోచుకోలేదని తెలియవచ్చింది. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్యా తరచూ వివాదానికి కారణమౌతున్న విద్యుత్ బకాయిల అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకే నోచుకోలేదని అధికార వర్గాల ద్వారా తెలిపింది. అంతే కాక చర్చ జరిగిన అంశాలలో కూడా ఇరు రాష్ట్రాల మధ్యా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం నిష్ఫలంగానే ముగిసిందని ఆ వర్గాలు తెలిపాయి. అంటే ఈ సమావేశం కూడా గత సమావేశాల లాగే ఏ సమస్యకూ పరిష్కారం చూపకుండానే ముగిసింది. తెలుగు రాష్ట్రాల సీఎస్ లు, వారి బృందాలూ కూడా తమ వాదనలకే కట్టుబడి ఉండటం, ఎదుటి వారి వాదనను వినే పాటి ఓపిక, ఆసక్తి కనబరచకపోవడంతో సమావేశం ఏ ప్రయోజనం లేకుండానే, ఏ పరిష్కారం కనుగొనకుండానే ముగిసిందని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా మరో మారు సమావేశం అయ్యే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా ఎటువంటి స్పష్టతా లేదని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.సమావేశంలో చర్చకు వచ్చిన ఏ అంశంపైనా కూడా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర అంగీకారం కుదరలేదు.  ఇక ఈ సమావేశంలో ఏపీ రాజధాని నిర్మాణం కోసం నిధులు కావాలని కోరగా ఇప్పటికే విడుదల చేసిన నిధుల వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పిన తరువాతనే ఏపీ వినతిని పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.   మొత్తం మీద విభజన సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతీ లేకుండానే కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు ముగుస్తుండటం పట్ల ఇరు రాష్ట్రాలలోనూ అసంతృప్తి వ్యక్తమౌతున్నది. విభజన చట్టంలో స్పష్టంగా ప్రస్తావించిన అంశాలను కూడా అమలు చేయలేకపోవడం కేంద్రం నిర్లక్ష్య వైఖరికీ, ఇరు రాష్ట్రాల మధ్యా సమస్యల పరిష్కారంలో మోడీ సర్కార్ చిత్తశుద్ధి లేమికీ నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వర్షం పడితే ‘అ’భాగ్యనగరమే!

అవే అవస్థలు, అవే సమస్యలు, అవే కష్టాలు, అవే ఇబ్బందులు..  చినుకు పడితే చాలు భాగ్యనగరం ప్రజలు తాము అభాగ్యులం అన్న భావనలోకి జారిపోయే పరిస్థితి.  రోడ్లు చెరువలు అవుతాయి. ఇళ్లళ్లో మోకాలి లోతు నీరు నిలిచిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో వర్షం పడిన ప్రతి సారీ ఇదే పరిస్థితి. నాలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలే ఇందుకు కారణమనీ, వాటిపై ఉక్కుపాదం మోపుతామనీ ప్రతి సారీ ప్రభుత్వం చెబుతూనే ఉంటుంది. తరువాత అంతా మామూలే. వాన పడిందంటే అవే ఇబ్బందులు, అవే కష్టాలు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి అంటూ గప్పాలు కొట్టుకోవడమే తప్ప చినుకు పడితే ఆ విశ్వనగరం కాస్తా విశ్వనగరంగా మారిపోతున్నా పట్టించుకోరు అన్న విమర్శలు నగరవాసుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు, డ్రైజేజీలు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలలో జీహెచ్ఎంసీ ఘనంగా  మీ పన్నులతో జరుగుతున్న అభివృద్ధి అని అర్ధం వచ్చేలాంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. అయితే ఆ అభివృద్ధి గొప్పతనం బండారం ఒక వర్షం పడితే చాలు బయటపడిపోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే భాగ్యనగరం సోమవారం సాయంత్రం మరో సారి అనుభవించింది. సోమవారం సాయంత్రం భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో విశ్వనగరం చిగురుటాకులా వణికింది. నగరంలోని పలు ప్రాంతాలలో ఓ రెండు గంటల వ్యవధిలో సగటున ఆరు సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. గంటల తరబడి కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, దసరా పండుగ షాపింగ్‌ కోసం వాహనాలతో బయటకు వచ్చిన వారు నరకయాతన అనుభవించారు. సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, మలక్‌పేట్‌, కోఠి, మొజాంజాహి మార్కెట్‌, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉప్పల్‌, రామంతాపూర్‌, సరూర్‌నగర్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, గన్‌ఫౌండ్రీ, మెహిదీపట్నం, గణాంకభవన్‌, ఆసి్‌ఫనగర్‌, అల్కాపురి కాలనీల్లో 7 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది.   నాంపల్లిలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి  మూసారాంబాగ్‌ వంతెన నీట ముని  ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.  

అసెంబ్లీ ఎన్నికల తర్వాత హస్తం గూటికి తెరాస !

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. సిద్ధాంత రాద్ధాంతాలను పక్కన పెట్టి 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏకమయ్యేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రెండు రోజుల క్రితం హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఐఎన్ఎల్డీ బహిరంగ సభ వేదికగా  చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీల నేతలు, కాంగ్రెస్, వామ పక్షాలతో కలిసే ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.  ఈ సమావేశంలో కీలక భూమిక పోషించిన, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధ్యక్షుడు, నితీష్ కుమార్, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్, నాల్గవ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడే కూటమి మాత్రమే బీజేపీని ఓడించగలుగుతుందని, స్పష్టం చేశారు. బీజీపే, బీజేపీ యేతర పార్టీల ఏక  కూటమి ఒక్కటే ఉంటుందని మూడవ కూటమి వలన ప్రయోజనం ఉండదని  అది వృధా ప్రయాసే అవుతుందని, తెగేసి చెప్పారు. జేడీయు, ఆర్జేడీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ తో కలిసి సాగుతాయని మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాలని పిలుపు నిచ్చారు.  ఇప్పటికే కాంగ్రెస్ తో కలిసున్న ఎన్సీపీ, శివసేన, డిఎంకే, జేఎంఎం, ఆర్జేడీలతో పాటుగా, కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉన్న ఇతర పార్టీలు కుడా కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు సుముఖంగా ఉన్నాయని  నితీష్ కుమార్ పేర్కొన్నారు.  నితీష్ కుమార్ ఇక్కడ తెరాస పేరు ప్రస్తావించక పోయినా  ఇటీవల కేసీఆర్, పాట్నా వెళ్లి నితీష్ కుమార్ తో చర్చలు జరిపిన నేపధ్యంలో ఆయన పిలుపు ఇచ్చిన పార్టీలలో తెరాస కూడా ఉండవచ్చని అంటున్నారు.  అంతే కాదు  కాంగ్రెస్ ఫ్రంట్ కు బ్ఫ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ అంతకు ముందే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలు అన్నీ ఒకటిగా పోటీచేయాలని, అందుకు కాంగ్రెస్ సహకరించాలని కోరారు. అంతే కాదు విపక్షాలను ఏకం చేయడంలో సోనియా గాంధీ చొరవ చూపాలని లాలూ, నితీష్ విజ్ఞప్తి చేశారు. అందుకు సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారని, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల విషయం చర్చిద్దామని హామీ ఇచ్చినట్లు నితీష్ మీడియాకు తెలిపారు.  సరే  విపక్ష పార్టీలన్నీ నిజంగా ఒకటవుతాయా? మోడీని ఓడిస్తాయా? మోడీ చేతిలో ఓడి పోతాయా? అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర, థర్డ్ ఫ్రంట్’/ప్రాతీయ పార్టీల కూటమి అంటూ చాలా కాలంగా, చాలాచాలా ప్రయత్నాలు చేస్తున్న, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఏమి చేస్తారు. జాతీయ రాజకీయాలలో ఏ గట్టునుంటారు? కాంగ్రెస్ తో చేతులు కలుపుతారా? సొంతగా జాతీయ పార్టీ పెట్టి, ఎన్నికల  అనంతరం సమయానుకూల నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా సాగుతోంది.  అయితే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు, కేసీఆర్ కు ఎలాంటి అభ్యతరం లేక పోయినా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపే విషయంలో అయన ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారని అంటున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగి  అవసరం అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి, బీహర్ తరహాలో తెరాస,కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటు చేసి, ఆపైన లోక్ సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సారధ్యంలోని జాతీయ కూటమిలో చేరాలనే, ‘ఉభయ తారక’ ఆలోచన చేస్తున్నారని. అంటున్నారు. నిజానికి ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో ఆయన ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఒక వర్గం తెరాసతో పొత్తు వైపు మొగ్గు చూపుతుంటే,మరో వర్గం పొత్తు వద్దని గట్టిగా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస ఇంటి మీద కాకి కాంగ్రెస్ గూటి మీద వాల రాదని కండిషన్ పెట్టారు. అయితే, ఇప్పటికే  కాంగ్రెస్, తెరాస ఒకటే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును దృష్టిలో ఉంచుకుని, పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిస్తోంది. అయితే ఏది ఏమైనా, జాతీయ రాజకీయ అవసరాల కోసం తెరాస కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగానే కనిపోస్తోందని జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు సూచిస్తున్నాయి. అయితే అది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందా, తర్వాత అన్నదే ప్రశ్నగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

పిఎఫ్ ఐ చొర‌బాటు.. ఎన్ ఐ ఏ వైఫ‌ల్యామేనా? 

దేశంలో హింస‌కు విద్రోహులు భారీ ఏర్పాట్ల‌తో పూనుకోవ‌డం, ఇటీవ‌ల నిఘా సంస్థ‌ల ద‌ర్యాప్తుల్లో బ‌య‌ట ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలో భారీ పేలుళ్లు చేపట్ట‌డానికి పీఎఫ్ ఐ కుట్ర ప‌న్నింద న్న‌ది ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధాని మోదీ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సంగ‌తి తెలిసిన కొద్ది రోజు ల‌కే బీజే పీ ఆర్ ఎస్ ఎస్ నేత‌లే ల‌క్ష్యంగా వ్యూహ ర‌చ‌న జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే  ఆ సంస్థకి సం బంధించి దేశంలో అనేక న‌గ‌రాల్లో ప‌ట్ట‌ణాల్లో ఎన్ ఐఏ ద‌ర్యాప్తు చేప‌ట్టి చాలామంది అనుమానితుల‌ను అదుపులోకి తీసుకుంది  నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింద‌ని తెలిసింది. నవరాత్రి ఉత్సవాల్లో భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ హిట్‌ లిస్టులో దర్యాప్తు సంస్థ అధికారులు సైతం ఉన్న ట్టు సమాచారం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. సంబంధిత కార్యాల యాల దగ్గర భద్రతను పెంచారు. కొద్దిరోజుల క్రితం అంటే బీహార్‌లోని పాట్నానగర పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు పీఎఫ్ ఐ కుట్ర పన్నిందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ ఏ) దర్యాప్తులో వెల్లడైంది. పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఇటీవల ఎన్ఐఏ, ఈడీ చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఏడాది జులై లో ప్రధాని మోదీ పాట్నా పర్యటన సందర్భంగా పీ ఎఫ్ఐ సభ్యులు దాడికి విఫల యత్నం చేశారని దర్యాప్తులో తేలింది. ప్రధానిపై దాడి చేసేందుకు పీ ఎఫ్ఐ పలువురు కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చింద‌ని వెల్లడైంది. ప్రధానితోపాటు యూపీలోని పలు వురు ప్రముఖులపై దాడికి పీఎఫ్ఐ మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నారని తేలింది. ఎన్ఐఏ, ఈడీలు దేశ వ్యాప్తంగా  15 రాష్ట్రాల్లో సోదాలు జరిపి వంద మందిని అరెస్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా, దేశ‌ర‌క్ష‌ణ బాధ్య‌తల విష‌యంలో బీజేపీ స‌ర్కార్ పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని, విదేశీ శ‌క్తు లు దేశంలో  స్లీప‌ర్‌సెల్స్‌తో దాడుల‌కు దిగే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇవాళ ఏకంగా పీఎంను హ‌త‌మార్చేందుకు కుట్ర‌పూనే స్థాయిలో విస్త‌రించ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచే స్తోంద‌ని  విరుచుకుప‌డ్డాయి. దేశంలో  ప్ర‌జాసంక్షేమంతో పాటు ప్ర‌జా ర‌క్ష‌ణ‌ విష‌యంలోనూ కేంద్ర ప్ర‌భు త్వం, హోంమంత్రిత్వ‌శాఖ‌ మ‌రింత చొర‌వ‌చూపాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అంటున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో పీ ఎఫ్ ఐ విస్త‌రించ‌డం దాడుల‌కు సిద్ధ‌ప‌డ‌టం కేవ‌లం ర‌క్ష‌ణ రంగ వైఫ‌ల్యం గానే చూడాల్సి వ‌స్తుంద‌ని,  చివ‌రి నిమిషాల్లో దాడులు చేసి  కొంద‌రిని అదుపులోకి తీసుకున్నంత మా త్రాన ఎంతో జాగ్త‌త్త‌లు తీసుకు న్న‌ట్లు కాద‌ని వివ్లేష‌కులు అంటున్నారు. విదేశీ సంబంధాలు, పాల‌నాప‌ర ప్ర‌గ‌ల్భాలు ప్ర‌చారం చేసుకోవ డంతో కాలం గ‌డిపేయ‌డం కాకుడా వాస్త‌వంగా దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాన్ని ప‌ట్టించుకోవాల‌సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని విప‌క్షాలు కేంద్రాన్ని హెచ్చ‌రిస్తున్నాయి. 

జగన్ సర్కార్ కు ఇక కౌంట్ డౌన్?!

జగన్  సర్కార్ పూర్తికాలం కొనసాగే పరిస్థితి లేదా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,  వైసీపీ అధినేత జగన్  తీరుతో ఆ పార్టీలోని పలువురు ప్రస్తుత ఎమ్మెలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? వైసీపీ అధినేత జగన్ కు గుణపాఠం చెప్పేందుకు   కాడి పడేసి, ఎవరిదారి వారు చూసుకుంటారా?   వైసీపీ సర్కార్ ను మైనార్టీలో పడేసేందుకు చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తున్నారా? అంటే.. అలాంటి పరిణామాలేవో జరుగుతున్నట్లే అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్లో మూడున్నరేళ్ళుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అధినేతపై అసంతృప్తి ఒక్క సారిగా బయటపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక పక్కన అనాలోచిత ఆర్థిక నిర్ణయాలు, కనిపించని అభివృద్ధి.. అప్పుల ఊబి ఇత్యాది కారణాలతో జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబు కుతుండటం..  ఆ ఆగ్రహం నేరుగా  వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను జనం నిలదీసేవరకూ వెళ్లడంతో  ప్రజల్లోకి వెళ్లాలంటేనే వైసీపీ నేతలు భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉంది. అదే సమయంలో విపక్ష నేతలకు జనం నిరాజనాలు పడుతుంటడంలో వైసీపీ ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్ భూతద్దంలో కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే  గతంలో సుమారు 20 మంది ఎమ్మెల్యే జగన్ పై నిరసనగళం ఎత్తారు. అలాగే  రెండోసారి మంత్రి వర్గంలో చోటు దక్కని ఆశావహులైన మరి కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యారు. ఒక దశలో బహిరంగంగానే తమ నిరసన గళం వినిపించారు. అప్పటికి ఏదో ఆ పరిస్థితి సద్దుమణిగినా ఇక ముందు  సందర్భం, అవకాశం దొరికినా తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు అసంతృప్తులు వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వీటికి తోడు ఏపీకి ఒకే ఒక్క అమరావతి రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగాపార్టీ అధినేత ఒత్తిడితో అనివార్యంగా పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించాల్సిన పరిస్థితిలో ఉండటం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, క్యాడర్ లో అసంతృప్తిని ద్విగుణీకృతం చేస్తున్నదని పార్టీ వర్గాలే అంటున్నాయి.  ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడానికి జగన్ తీసుకున్న నిర్ణయం ఆయనను ఇక ఎంత మాత్రం సహించలేమనీ, ఆయన అరాచకానికి ఈ నిర్ణయం పారాకాష్ట అని పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అంటున్నారు. జగన్ వీర విధేయుడిగా పేరొందిన కొడాలి నాని కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిర్ణయం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా.. జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ మౌనం వహించడాన్ని ఈ సందర్బంగా పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఇలా ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా అధినేత తీరు పట్ల అసంతృప్తితో రగిలి పోతున్నారంటున్నారు. అంతే కాకుండా జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులకు సరైన గుర్తింపు లేకపోవడం.. వారి ఆదేశాలను అధికారులు ఇసుమంతైనా లెక్క చేయని పరిస్థితి ఉండటంతో వారంతా రగిలిపోతున్న పరిస్థితి ఉందంటున్నారు. ఇలాంటి కారణలతోనే వైసీపీలో  తిరుగుబావుటా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.   ఇక వైఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ బృందం ఇచ్చిన నివేదిక, తాను స్వయంగా నియమించుకున్న మరో టీం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లో 100 మంది పనితీరు బాగోలేదు. వారిలో 80 మంది వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్సే లేదంటున్నారు. అలా ఏమాత్రం గెలిచే అవకాశం ఉండదనే వారికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని జగన్ స్పష్టంగా చెప్పడం కూడా వారిలో అసంతృప్తికి, ఆవేదనకు కారణం అయింది. అందుకే వైసీపీలో ఉంటే టికెట్ ఎలాగూ రాదు కనుక అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనో లేదా బీజేపీలోనో చేరేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు చేసుకుంటున్నారంటున్నారు. అలా ఆ 80 మంది ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేయడం ఖాయమని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవినేని ఉమ  అంటున్నారు. తిరుగుబాటు చేసేందుకు సమాయత్తం అవుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో జగన్ పడ్డారని ఆయన అంటున్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 50 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగలేదు. గతంలో ఎన్టీఆర్ సర్కార్, పీవీ ప్రభుత్వం 50 శాతానికి పైగా ఓటు బ్యాంకును సంపాదించుకున్నాయి. అయితే.. అవి పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగలేదు. అలాగే 50 శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా పూర్తి కాలం అధికారం చెలాయించే పరిస్థితులు లేవంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు సందర్భాలలో అన్నారు. ఈ విశ్లేషణలు, అభిప్రాయాల నేపథ్యంలోనే   వైసీపీ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హాయ్‌! ..పింకీ!

క్లాసులోకి వెళ్ల‌గానే మిన్నీ పుస్త‌కాలు తీసింది, చంటీ బ్యాగ్‌లోంచి లెక్క‌ల హోంవ‌ర్క్‌నోట్స్ తీశాడు, రెండు బెంచీల అవ‌త‌ల కూచున్న మ‌రో పిల్ల బ్యాగ్ తెర‌వ‌గానే హ‌లో అటూ ఏకంగా పాము ప‌ల‌క‌రిం చింది.. అంతే పిల్ల భ‌యంతో గ‌ట్టిగా అరిచింది! అస‌లు పుస్త‌కాల బ్యాగ్‌లోకి పెన్సిళ్లు, ర‌బ్బ‌ర్ల‌తో పాటు జామెట్రీ బాక్స్ ఉంటుందేగాని పాముగారు ఎలా వ‌చ్చార‌బ్బా అని అంతా భ‌యంతో కూడి ఆశ్చ‌ర్యంతో బ్యాగ్ వేపే చూస్తుండిపోయారు. అంత‌లో హెడ్ మాస్ట‌ర్‌కి తెలిసి ప‌రుగున వ‌చ్చారు. ఏమ‌యిందో అని. ఎందుకు అంద‌రూ అలా అరుస్తున్నా ర‌న్నారు. అంత‌లో బ్యాగ్‌లో పాము సంగ‌తి చెప్పేరు. ఆయ‌న నోరెళ్ల‌బెట్టారు. అవునా..! అన్నారు.  వెంట‌నే పాముల న‌ర్స‌య్య‌లాంటి హీరోకి ఫోన్ చేశారు. ఆయ‌న మెరుపు వేగంతో వ‌చ్చాడు. ఆయన మ‌రో మాస్ట‌రు స‌హాయంతో బ్యాగ్‌ని నెమ్మ‌దిగా స్కూలు కి కొంత దూరం తీసికెళ్లి  బాగా చెట్లు ఉన్న ప్రాంతంలో బ్యాగ్‌ని పూర్తిగా తెరిచి అలా ప‌డేశారు. అంతే అందులో అప్ప‌టిదాకా విశ్రాంతి తీసుకుంటున్న కోబ్రా కాస్తా ఎందుకు విసిగిస్తార‌ని ఠ‌పీమ‌ని త‌లెత్తి చూసింది. మాస్టారు క‌ర్ర‌తో క‌నిపించేస‌రికి అది కాస్తా చెట్ల‌లోకి పారిపోయింది. అది చిన్న‌ది కాదు ..కాటేస్తే ప్రాణాలే పోయేవి. పిల్ల అదృష్ట‌వంతురాలు అన్నా రంతా!  మ‌ధ్య‌ప్ర‌దేశ్ షాజాన్‌పూర్ బ‌దోనీ స్కూల్లో జ‌రిగింది ఈ  సంఘ‌ట‌న‌. మ‌రంచేత పిల్ల‌లూ, పుస్త‌కాలు పెట్టే సుకుని బ్యాగ్‌ని త‌గిలించుకోవ‌డం కాకుండా ముందే బ్యాగ్‌ని శుబ్భ‌రంగా దులిపి మ‌రీ పుస్త‌కాలు స‌ర్దుకోండి. లేదంటే క్లాస్‌రూమ్‌లో అంద‌రూ భ‌యంతో ప‌రిగెట్టాల్సి వ‌స్తుంది. బీ కేర్ ఫుల్!  అంత భ‌య‌ ప‌డాల్సిన స‌మ‌యంలోనూ ఓ కుర్రాడు వీడియో తీశాడు. అది ఇపుడు వైరల్ అయింది.