దేశంలో నిరుద్యోగం, పేద‌రికం,అస‌మాన‌త‌ల‌దే రాజ్యం..ఆర్ ఎస్ ఎస్‌

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినప్పటికీ, దశాబ్దాలుగా భారత్‌ను అనాదిగా పీడిస్తున్న‌ నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు సమస్యలుగా కొనసాగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే  అన్నారు. భారతదేశం స్వావలంబన కోసం సానుకూలంగా ప్రయత్నించింది,  ఇటీవలి కాలంలో దేశం ఆర్థిక రంగం లో విజయం సాధించినప్పటికీ, కొన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని హోసబాలే అన్నారు. నవరాత్రి తొమ్మిది రోజుల తరువాత, మా దుర్గ విజయదశమి సందర్భం గా రాక్షసు లను సంహరించే విధానం, దేశం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సవాళ్ల వంటి దెయ్యాన్ని వదిలించుకోవాలి, వాటిలో ఒకటి పేదరికం, ఇది తక్షణమే తొలగించబడాలి. ఈ ఛాలెంజ్‌ని మనం గెలవాలన్నారు.ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశ్ జాగరణ్ మంచ్ (ఎస్‌జెఎమ్) దాని కొనసాగు తున్న స్వావలంబి భారత్ అభి యాన్  కింద నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ కార్యకర్త ప్రసం గించారు, ఇది యువత లో వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే ప్రయత్నం.మహాత్మా గాంధీ , లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వెబ్‌నార్ నిర్వహించారు.  దేశ జ‌నాభాలో  అనేక‌మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని, ఇది చాలా నిరాశాజనకంగా ఉందని హోసబాలే అన్నారు.  23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ. 375 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నార‌ని,  జూన్‌లో ప్రచురిత‌మైన లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగు లు ఉన్నారని, నిరుద్యోగిత రేటు 7.6% అని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త చెప్పారు. ప‌దేళ్ల‌ క్రితం దేశంలో 22శాతం ఉన్న పేదరికంతో పోలిస్తే గతకొన్నేళ్లలో పరిస్థితి మెరుగుపడిందని, ఇప్పుడు18 శాతం ఉందని ఆయన అన్నారు. 2020లో, తలసరి ఆదాయం సంవత్సరానికి రూ. 1.35 లక్షలుగా ఉంది, ఇది 2022 నాటికి రూ. 1.5 లక్షలకు పెరిగిందన్నారు. అయితే, దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరుద్యోగం, పేదరికం అనే సమస్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని, ఆర్థిక అసమానత ప్రాబల్యంపై దేశం దృష్టి పెట్టాల్సిన మరో ప్రధాన సమస్య అని ఆయన అన్నారు. దేశం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందడం విశేషం. కానీ భారతదేశ జనాభాలో అగ్రశ్రేణి ఒక శాతం మంది దేశ ఆదాయంలో ఐదవ వంతు (20%) కలిగి ఉన్నారు. అదే సమయంలో, దేశ జనాభాలో 50% మంది దేశ ఆదాయంలో 13% మాత్రమే కలిగి ఉన్నారు. ఈ ఆర్థిక అసమానత గురించి మనం ఆలోచించాలని హోసబాలే అన్నారు. భారతదేశంలోని పేదరికం, అభి వృద్ధి స్థితిపై ఐక్యరాజ్య సమితి చేసిన పరిశీలనలను ప్రస్తావిస్తూ, హోసబాలే ఇలా అన్నారు, భారత దేశం సందర్భంలో యుఎన్ నివేదిక ప్రకారం దేశంలోని అధిక భాగం ఇప్పటికీ స్వచ్ఛమైన నీరు, పోషకమైన ఆహారం అందుబాటులో లేదు. పేదరికం కూడా సమాజంలో ఉద్రిక్తతకు, విద్యా స్థాయి తక్కు వగా ఉండటానికి కారణం. ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమలు చేసిందని, ఆశిం చిన ఫలితాలు వస్తాయని భావించాలన్నారు. దశాబ్దాల లోపభూయిష్ట విధానాల ఫలితంగా గ్రామాల నుండి నగరాలకు పెద్ద ఎత్తున వలసలు వచ్చా యి. గ్రామాలు ఖాళీ కాగా, నగరాల్లో జీవితం నరకంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం నమూనా మార్పులు చేసేం దుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే, సవాళ్లు కొనసాగే విధానం, మరింత అవగాహన మరియు చైతన్యాన్ని కలిగించడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని హోసబాలే అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన స్వయంశక్తి భారత్  ప్రచారమే మహాత్మా గాంధీ, లాల్ బహ దూర్ శాస్త్రి వంటి నాయకులకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు.

ములాయం ఆరోగ్యం అత్యంత విషమం- ఐసీయూలో చికిత్స

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉంది. గత కొంత కాలంగా నారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.   ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో ములాయంకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆదివారం రాత్రి ములాయం ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఆయన కుమారుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్  ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వద్దకు వచ్చారు.   ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య అన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  ములాయం   మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారనీ, దానికి తోడు వయస్సుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయనీ  వైద్యులు తెలిపారు.   ములాయం సింగ్ యాదవ్ వరుసగా మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.  ప్రస్తుతం మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. నేతాజీ అని పిలవబడే ములాయం యాదవ్.. తొలిసారిగా 1967లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి బాలుడు మృతి

ఇప్పుడంతా ఎల‌క్ట్రిక‌ల్ బైక్ ల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్‌, డీజిల్ రేట్లు అమాంతం పెర‌గిపోవడంతో  మ‌ధ్య త‌ర‌గ‌తి వాళ్లంతా బ్యాట‌రీ బైక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ర‌క‌ర‌కాల మోడ‌ల్స్‌.. ర‌క‌ర‌కాల బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. పైగా పర్యావరణ హితం అంటూ ప్రభుత్వాలు కూడా ప్రకటనలతో ఊదరగొట్టేస్తున్నాయి. మామూలు బైకుల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్ ల ధర మరీ ఎక్కవ ఏమీ కాదనిపించేలాగే ఉండటం, అలాగు  డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గొడ‌వ లేక‌పోవ‌డంతో.. చార్జింగ్ స్కూట‌ర్లకు డిమాండ్ పెరిగింది. ఓలా లాంటి కంపెనీలు సైతం రంగంలోకి దిగ‌డంతో ఎల‌క్ట్రిక‌ల్ బైక్స్‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఇదే ఛాన్స్ అనుకొని.. ఊరూపేరు లేని సంస్థ‌లు సైతం బ్యాట‌రీ బైక్స్ త‌యారు చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. అయితే, వ‌రుస‌గా జ‌రుగుతున్న  ఘ‌ట‌న‌లు ఎల‌క్ట్రిక్ బైక్ అంటేనే ద‌డ పుట్టేలా చేస్తున్నాయి.  నాసిర‌కం త‌యారీ విధాన‌మో.. ఏమో కానీ ఈ మ‌ధ్య ఎల‌క్ట్రిక్ బైకులు బాంబుల్లా పేలిపోతున్నాయి. మంట‌ల‌తో త‌గ‌ల‌బ‌డుతున్నాయి. తాజాగా ఇటువంటిదే మరో సంఘటన ఎలక్ట్రిక్ వాహనాలంటేనే భయపడేలా చేసింది. మహారాష్ట్రలోని వసాయ్ ఈస్ట్ లోని రామ్ దాస్ నగర్ ప్రాంతంలో  ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఏడేళ్ల బాలుడు చనిపోయాడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 23న షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున అది ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షానవాజ్ కొడుకు షబ్బీర్ అన్సారీ తీవ్రంగా గాయపడి  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. షానవాజ్ అన్సారీ తన భార్య, కొడుకు, తల్లితో కలిసి రామ్ దాస్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో షానవాజ్ తన బైక్ బ్యాటరీ తీసుకుని హాల్ లో ఛార్జింగ్ పెట్టాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. హాల్ లో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో షానవాజ్ అన్సారీ ఉలిక్కిపడి లేచాడు. బయటకు వచ్చి చూసే సరికి షాక్ తిన్నాడు. తన ఏడేళ్ల కొడుకు షబ్బీర్ మంటల్లో చిక్కుకుని ఉన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, ప్రయోజనం లేదు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బ్యాటరీ పేలిపోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.  ఈ ఘటనతో ఎలక్ట్రిక్ బైక్ ల సేఫ్టీ పై మరోసారి  అనుమానాలు తలెత్తాయి.

అయ్యబాబోయ్.. మళ్లీ వర్షాలు!

తెలంగాణను వర్షాలు వదలనంటున్నాయి. మరోసారి మరో మూడు రోజులు రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రమట్టానికి 5.8 మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా జనం అనేక ఇక్కట్లు పడుతున్నార.లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాగులూ, వంకలూ పొంగి ప్రవహించాయి. భారీగా పంట నష్టం సంభవించింది. ఇక హైదరాబాద్ నగర వాసుల ఇక్కట్లైతే చెప్పనే అక్కర్లేదు. విశ్వనగరం కాస్తా విశ్వనరకంగా మారిపోయి.. ప్రజలు అవస్తలు పడ్డారు. భారీ వర్షాల బాధల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రాష్ట్ర ప్రజలు మంగళవారం (సెప్టెంబర్ 4) నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఆందోళనకు గురౌతున్నారు. దసరా పండుగ వర్షార్పణమౌతుందని దిగులు పడుతున్నారు.  

ఆలూమగల సవాల్.. గెలిచిందెవరో?

ఆలూమగల మధ్య సరదా సవాళ్లు సహజమే. అందులోనూ వెటకారానికి మారుపేరైన తూర్పు గోదావరి జిల్లాలో అయితే వీటికి కొదవే ఉండదు. అదిగో అలాంటి సరదా సవాలే కడియపు మండలానికి చెందిన లారీ ట్రాన్స్ పోర్టు ఓనరు వరదా వీర వెంకట సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు భార్య లావణ్య  చేసింది. పైగా అదేమీ ఇలాంటలాంటి సవాల్ కాదు. ఏకంగా తిరుపతి కొండ నడిచి ఎక్కాలనీ, అదీ మామూలుగా కాదు.. తనను భుజాలమీద ఎత్తుకుని ఎక్కగలరా? అంటూ సవాల్ చేసింది. సవాల్ కు సై అన్న సత్తిబాబు వెంటనే అందుకు ఉపక్రమించాడు. వెంటనే సత్తిబాబు భార్య లావణ్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు, వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు. పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని కొట్టి పారేయవద్ద్దు. వీళ్లదేం కొత్త జంట కాదు. వీరి వివాహం దాదాపు పాతికేళ్ల కిందట అంటే.. వీళ్ల ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు అయిపోయాయి. తాతా, అమ్మమ్మలు కూడా అయిపోయారు. వీళ్ల పెద్దల్లుడు తనకు మంచి ఉద్యోగం వస్తే అందరినీ తిరుమల తీసుకువస్తానని మొక్కుకోవడంతో అందరూ కలిసి దాదాపు 40 మంది బస్సులో వచ్చారు. అదిగో ఆ సందర్భంగానే నడకదారిలో వేగంగా మెట్లెక్కుస్తున్న సత్తిబాబుకు వారి భార్య ఈ సవాల్ విసిరింది.   

మిల్ల‌ర్ సెంచ‌రీ వృధా...సిరీస్ గెలిచిన భార‌త్‌

గౌహ‌తీ క్రికెట్ అభిమానుల‌కు ఆదివారం పండ‌గే పండ‌గ‌. ఇక్క‌డ జ‌రిగిన భార‌త్, ద‌క్షిణాఫ్రికా ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ-20 మ్యాచ్ లో సూర్య‌, కె.ఎల్‌.రాహుల్‌, శ‌ర్మ‌, డేవిడ్ మిల్ల‌ర్‌, డీకాక్ బౌల‌ర్లు బంతి వేయ‌డం మ‌ర్చిపోయేలా బాదేరు అనాలి. అంతా ఫోర్లు, సీక్స్‌ల వ‌ర్ష‌మే. భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 237 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా 3 వికెట్ల న‌ష్టానికి 221 ప‌రుగు లు చేసింది. భార‌త్ 16 ప‌రుగుల‌తో విజేత‌గా నిలవ‌డ‌మే గాక సిరీస్ కూడా కైవ‌సం చేసుకుంది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లో త‌న టీ20 కెరీర్‌లో 4000 ప‌రుగులు చేసిన సూప‌ర్ స్టార్‌గ నిలిచాడు.   టాస్ గెలిచినా భార‌త్‌కు ముందుగా బ్యాట్ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చింది ద‌క్షిణాఫ్రికా. భార‌త్ మొదటి 5 ఓవ‌ర్ల‌లో 49 ప‌రుగులు చేసింది. ఆట ఆరంభం నుంచే శ‌ర్మ‌, రాహుల్ ఇద్ద‌రూ దూకుడుగా ఆడారు. 6 ఓవ‌ర్ల‌కు భార‌త్ 50 ప‌రుగులు చేయ‌గా, ప‌ది ఓవ‌ర్ల‌కు 1 వికెట్ న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది. శ‌ర్మ 37 బంతుల్లో 43 ప‌రుగుల చేసి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత కోహ్లీ రాహుల్ తో క‌లిసి విజృంభించాడు. దీంతో భార‌త్ 11ఓవ‌ర‌లో వంద‌ప‌రుగులు పూర్తి చేసుకుంది. రాహుల్ 50 ప‌రుగులు 28 బంతుల్లో పూర్తిచేసాడు. రాహుల్ స్థానంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సూర్య రాగానే ద‌క్షిణాఫ్రికా ఫీల్డ‌ర్లు ఎంతో జాగ్ర‌త్త‌ప‌డ్డారు. వ‌స్తూనే దూకుడు ఆరంభిం చాడు. ఒక‌వేపు సూర్య‌, మ‌రోవంక కోహ్లీ ఇద్ద‌రు ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌ను ఉతికేరు. 15 ఓవ‌ర్ల‌కు భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. అప్ప‌టికే వారిద్ద‌రూ క‌లిసి 28 బంతుల్లో 71 ప‌రుగులు చేశారు. సూర్య వేగం పెంచి సిక్స్‌లు ఫోర్లు బాది కేవ‌లం 18 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ చేశాడు. 17వ ఓవ‌ర్లో పార్న‌ల్ ఓవ‌ర్లో సిక్స్ కొట్టి కోహ్లీ త‌న టీ20 కెరీర్‌లో 11వేల ప‌రుగులు పూర్తిచేశాడు. 18వ ఓవ‌ర్ వేసిన ఎన్గిడి 15 ప‌రుగులు ఇవ్వ‌డంతో భార‌త్ స్కోర్ 200 దాటింది అప్ప‌టికి సూర్య‌, కోహ్లీల పాట్న‌ర్‌షిప్ వంద ప‌రుగులు దాటింది.  19వ ఓవ‌ర్లో మొద‌టి బంతికి సూర్య వెనుదిరిగాడు. అతను 22 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు. కోహ్లీ, సూర్య 3 వ వికెట్‌కి  43 బంతుల్లో 102 ప‌రుగులు చేశారు. ఆ త‌ర్వాత దినేష్ కార్తీక్ చివ‌రి ఓవ‌ర్ బాద‌డంలో కోహ్ల అర్ధ‌సెంచ‌రీ పూర్తిచేయ‌లేక‌పోయాడు.  238 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కూడా అంతే అద్భుతం. ఎప్ప‌టిలాగా మొద‌ట కాస్తంత చ‌ప్ప గానే సాగింది. స్టార్ పేస‌ర్ అర్ష‌దీప్ వేసిన రెండో ఓవ‌ర్లోనే రెండు వికెట్లు సాధించాడు. ఇలా ఉండ‌గా మూడో ఓవ‌ర్ ఆరంభంలో మైదానంలో హ‌ఠాత్తుగా పాము క‌న‌ప‌డ‌టంతో కొంత‌సేపు ఆట‌నిలిచింది. ద‌క్షిణాఫ్రికా 5 ఓవ‌ర్ల‌కు 2 వికెట్లు కోల్పోయి 29 ప‌రుగుల చేఇంది. 6వ ఓవ‌ర్లో అర్ష్ 16 ప‌రుఉల ఇచ్చాడు. 7వ ఓవ‌ర్లో మ‌క‌ర‌మ్ పెవిలియ‌న్ దారి ప‌ట్ట‌డంతో డాషింగ్ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ వ‌చ్చాడు. అచ్చం కోహ్లీ, సూర్య‌ల్లానే మిల్ల‌ర్‌, డీకాక్ బౌల‌ర్ల‌ను చెండాడారు. మిల్ల‌ర్ అద్భుత ఇన్నింగ్స్ ప్ర‌ద‌ర్శించాడు. బౌల‌ర్ల‌ను అంద‌ర్నీ ఇద్ద‌రూ బాదుడే బాదుడు అనాలి. ఒక స‌మ‌యంలో వీరిద్ద‌రూ మ్యాచ్ ముగించేస్తార‌న్న అనుమానం రాక‌పోలేదు. అంత వేగంగా జ‌ట్టు స్కోర్‌ను ఎంచారు. 15 ఓవ‌ర్ల‌కు 143 ప‌రుగులు చేసింది. అప్ప‌టికే ఇద్ద‌రూ క‌లిసి వంద‌ప‌రుగులుచేశారు. డీకాక్ అర్ధ‌సెంచ‌రీ 39 బంతుల్లో పూర్తిచేశాడు. మ‌రో వంక మిల్ల‌ర్ మ‌రింత వేగం పెంచ‌డంతో జ‌ట్టు 18వ ఓవ‌ర్‌కే 175 ప‌రుగులు పూర్త‌య్యాయి. అప్ప‌టికి ఇద్ద‌రు క‌లిసి 129 ప‌రుగులు చేశారు. ముందు బాగా బౌల్ చేసిన యువ పేస‌ర్‌ని ఇద్ద‌రు చండాడారు. దాంతో అర్ష్‌దీప్ త‌న 4 ఓవ‌ర్ల‌లో ఏకంగా 62 ప‌రుగులిచ్చాడు. 19 ఓవ‌ర్లో అత‌ను ఏకంగా 26 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అప్ప‌టికి జ‌ట్టుస్కోర్ 200 దాటింది. మిల్ల‌ర్ 20 ఓవ‌ర్లో రెచ్చిపోయి ఆడాడు. అత‌ని ధాటికి స్పిన్న‌ర్ అక్ష‌ర్ ఏకంగా 20 ప‌రుగులు ఇచ్చాడు. మిల్ల‌రు కేవ‌లం 46 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేయ‌డంలో భార‌త్ ఫీల్డ‌ర్ల‌కు, బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కానీ అత‌ని అద్భుత బ్యాటింగ్ స‌త్తా వృధా అయింది. చివ‌ర‌గా మిల్ల‌ర్ 106, డీకాక్ 69 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచారు. ఇద్ద‌రూ క‌లిసి 4వ ఇకెట్‌కి 90 బంతుల్లో 174 ప‌రుగులు చేశారు!  ద‌క్షిణాఫ్రికా 20 ఓవ‌ర్ల‌లో 221 ప‌రుగులు చేసి 16 ప‌రుగుల తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ సామ‌ర్ధ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన సూర్య‌కుమార్ యాద‌వ్, మిల్ల‌ర్ల‌కు మ్యాన్ ఆఫ్ ద మ‌యాచ్ అవార్డు ఇచ్చారు. 

దసరా రోజున ఏమి జరుగుతుంది?.. తెరాసలో ఉత్కంఠ

అక్టోబర్ 5, దసరా పండగ రోజు ఏమి జరుగుతుంది? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆ రోజున తెలంగాణ భవన్‌‌లో నిర్వహించే టీఆర్‌‌ఎస్‌‌ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి  సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, చేసే సంచలన ప్రకటన ఏమిటి? జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా ? కేసీఆర్ కుమారుడు, తెరాస ఉపాధ్యక్షుడు కేటీఅర్’ ను తెరాస అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? అనే విషయంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే చివరకు ఏమి జరుగుతుంది, అనేది మాత్రం ఎవరూ ఉహించలేక పోతున్నారు.  అదొకటి అలా ఉంటే, కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం వలన, ఆయన ఏమి అశిస్తున్నారు అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కేసేఆర్ వెంట నడచిన ప్రొఫెసర్ కోదండ రామ్ సహా అనేక మంది ఉద్యమ నాయకులు, కేసేఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు వెనక ఉదాత్త ఆశయాలు, లక్ష్యాలు ఉన్నాయని,అనుకోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ సంక్షోభం నుంచి బయట పడేందుకు కేసీఆర్ ఒక ఎత్తుగడగా జాతీయ పార్టీ ఏర్పాటు చర్చను తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ప్రజల్లో రోజుకు రోజుకు పెరుగతున్న వ్యతిరేకత నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే, ఈ ఎత్తుగడగా పేర్కొంటున్నారు. అంతేకాదు, తెలంగాణ అస్థిత్వవాదం పునాదిగా ఏర్పడిన తెరాస  జాతీయ పార్టీ గా ఎదగడం అయ్యే పని కాదనే అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తున్నారు.అంతే కాదు, తెలంగాణ వాదాన్ని వదిలేస్తే, తెరాస మనుగడ కూడా కష్టమవుతుందని అంటున్నారు. ఒక విధంగా, ముఖ్యమంత్రి కేసేఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని అంటున్నారు.  అలాగే, పండగ పూట నిర్వహిస్తున్న సమావేశంలో జాతీయ పార్టీకి సంబంధించి, కొంత చర్చ, ఒకటి రెండు తీర్మనాలు మినహా సంచలన ప్రకటన ఏదీ ఉండక పోవచ్చని కూడా అంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఒకటికి పదిసార్లు ఏకరవు పెట్టిన, దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణలో అమలవుతున్న పథకాల పాత పాటనే మళ్ళీ మళ్ళీ వినిపించే అవకాశం ఉండని అంటున్నారు. అదే విధంగా జాతీయ పార్టీ పేరున ఇప్పడు జరుగతున్న తతంగం అయితే కొనసాగుతుందని అంటున్నారు. అదొకటి అలా ఉంటే,  పండగ పూట నిర్వహించే తెరాస సమావేశంలో నిజంగా సంచలన ప్రకటన ఏదైనా ఉంటుందనుకుంటే, పార్టీ పగ్గాలు కొడుకు కేటీఆర్ కు అప్పగించడమే అవుతుందని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని ముందుగా ప్రకటిస్తే, ఇటు మీడియాలో, అటు పార్టీలో ఫోకస్ అంతా అటు మరలే ప్రమాదాన్ని  పసిగట్టే ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అంశాన్ని ముందుంచి అసలు విషయం నుంచి ఫోకస్ తప్పించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.నాయకత్వ మార్పిడిని ఎవరూ ప్రశ్నించకుండా, అదొక సహజ పరిణామంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తెర మీద జరుగతున్న తతంగం అంతా జాతీయ పార్టీ చుట్టూ తిరుగుతున్నా తెర వెనక జరుగతున్న కథ మాత్రం, ఎప్పటి నుంచో అనేక కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న కేటీఆర్ పట్టాభిషేకానికి మరో ముందడుగుగా భావించ వచ్చని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసేఅర్  శనివారం (సెప్టెంబర్ 1) వరంగల్  సభలో, కేంద్రం పై విమర్శల కంటే యువత పై ఎక్కువ ఫోకస్ పెట్టారని, దేశ భవిష్యత్ ను యువత కాపాడు కోవాలని  పిలుపు నిచ్చారని అంటున్నారు. అలాగే, ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి తమ వయసు 68 సంవత్సరాలని గుర్తు చేయడం కూడా అందుకేనని అంటున్నారు. అయితే,  జాతీయ పార్టీ ఏర్పాటు, విషయంలో ముఖ్యమంత్రి వెనకడుగు వేసినట్లు కాదని, అయితే, పండగ సమావేశం ప్రధాన లక్ష్యం మాత్రం  అది కాదని అంటున్నారు. అయితే, చివరకు ఏమి జరుగ్తుతుంది అనేది, వేచి చూడవలసి ఉంటుందని అంటున్నారు.

మంగళయాన్ క‌థ ముగిసిన‌ట్టేనా? 

భారతదేశం  ఆర్బిటర్ క్రాఫ్ట్ ప్రొపెల్లెంట్ అయిపోయింది.  దాని బ్యాటరీ సురక్షిత పరిమితిని మించి ఖాళీ అయింది, దేశ తొలి అంతర్ గ్రహమిషన్ 'మంగల్యాన్' ఎట్టకేలకు తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను పూర్తి చేసి ఉండవచ్చనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. రూ. 450 కోట్ల విలువైన మార్స్ ఆర్బిటర్ మిషన్ నవంబర్ 5, 2013న పిఎస్ ఎల్‌వి-సి25లో ప్రయోగించారు. ఎంఓఎం అంత రిక్ష నౌకను సెప్టెంబరు 24, 2014న దాని మొదటి ప్రయత్నంలో విజయవంతంగా మార్టిన్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం, ఇంధ నం మిగిలి లేదు. ఉపగ్రహ బ్యాటరీ ఖాళీ అయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వర్గాలు పిటిఐకి తెలిపాయి. లింక్ పోయింది. అయితే, ఇక్కడ ప్రధాన కార్యాలయం ఉన్న దేశ జాతీయ అంతరిక్ష సంస్థ నుండి అధికారిక సమాచారం లేదు. ఇస్రో ఎంఓఎం వ్యోమనౌకపై కక్ష్యలో విన్యాసాలు చేస్తూ గతంలో రాబోయే గ్రహణాన్ని నివారించడానికి దానిని కొత్త కక్ష్యలోకి తీసుకువెళ్లింది. కానీ ఇటీవల ఏడున్నర గంటల పాటు కొనసాగే గ్రహణాలతో సహా బ్యాక్-టు-బ్యాక్ గ్రహణాలు ఉన్నాయి, అధికారులు చెప్పారు, వృద్ధాప్య ఉపగ్రహంలో ఉన్న ప్రొపెల్లెంట్ అంతా వినియోగించబడిందని పేర్కొంది. శాటిలైట్ బ్యాటరీ కేవలం ఒక గంట మరియు 40 నిమిషాల గ్రహణ వ్యవధిని నిర్వహించడానికి రూపొందించబడింది కాబట్టి, సుదీర్ఘ గ్రహణం సురక్షిత పరిమితిని మించి బ్యాట రీ ని ఖాళీ చేస్తుందని మరొక అధికారి తెలిపారు. మార్స్ ఆర్బిటర్ క్రాఫ్ట్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు పని చేసిందని, దాని రూపొందించిన ఆరు నెలల మిషన్ జీవితానికి మించి పనిచేశారని ఇస్రో అధికారులు గుర్తించారు. ఇది తన పనిని పూర్తి చేసింది. గణనీయమైన శాస్త్రీయ ఫలితాలను ఇచ్చిం దని వారు చెప్పారు. మిషన్ యొక్క లక్ష్యాలు.. ప్రధానంగా సాంకేతికమైనవి , ప్రయాణ దశలో తగినంత స్వయంప్రతి పత్తితో పని చేయగల మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ రూపకల్పన, సాక్షాత్కారం  ప్రయోగాన్ని కలిగి ఉన్నాయి; మార్స్ కక్ష్య చొప్పిం చడం లేదా సంగ్రహించడం, మార్స్ చుట్టూ కక్ష్యలో దశ. వాతావరణ ప్రక్రియలు, ఉపరితల ఉష్ణోగ్రత వాతావరణ తప్పించుకునే ప్రక్రియపై డేటాను సేకరించే ఐదు శాస్త్రీయ పేలోడ్‌లను (మొత్తం 15 కిలోలు) తీసుకువెళ్లారు. మార్స్ కలర్ కెమెరా (ఎంసిసి), థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (టిఐ ఎస్‌), మార్స్ కోసం మీథేన్ సెన్సార్ (ఎంఎస్ ఎం ), మార్స్ ఎక్సోస్పిరిక్ న్యూట్రల్ కంపోజిషన్ ఎనలైజర్ (ఎంఇఎన్‌సిఏ)  లైమాన్ ఆల్ఫా ఫోటోమీటర్ (ఎల్ఏపి) అనే ప‌రిక‌రాలు ఉప‌యోగించారు. ఎంఓఎం ఖర్చు-ప్రభావం, తక్కువ వ్యవధిలో సాక్షాత్కారం, ఆర్థిక మాస్-బడ్జెట్, ఐదు భిన్నమైన సైన్స్ పే లోడ్ ల సూక్ష్మీకరణ వంటి అనేక అవార్డులతో ఘనత పొందిందని ఇస్రో అధికారులు సూచించారు. ఎంఓఎం తాలూకు అత్యంత దీర్ఘవృత్తాకార కక్ష్య జ్యామితి ఎంసిసి దాని సుదూర బిందువు వద్ద మార్స్ యొక్క 'పూర్తి డిస్క్' యొక్క స్నాప్ షాట్‌లను మరియు సమీప స్థానం నుండి సూక్ష్మ వివరాలను తీయడానికి వీలు కల్పించింది. ఎంసిసి వెయ్యి కంటే ఎక్కువ చిత్రాలను రూపొందించింది మార్స్ అట్లాస్‌ను ప్రచురించింది. ఇంతలో, రెడ్ ప్లానెట్‌కు ఫాలో-ఆన్ మంగళయాన్ మిషన్‌పై ప్రణాళికలు ఇంకా దృఢపరచబడలేదు. భవిష్యత్ మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం-2) కోసం ఇస్రో 2016లో అనౌన్స్‌మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్‌(ఏఓ)తో వచ్చింది, అయితే రాబోయే 'గగన్‌ యాన్', చంద్రయాన్-3తో అది ఇంకా డ్రాయింగ్ బోర్డులో ఉందని అధికారులు అంగీకరించారు. ఆదిత్య -ఎల్‌1 ప్రాజెక్ట్‌లు స్పేస్ ఏజెన్సీ  ప్రస్తుత ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. భవిష్యత్తులో ప్రయోగ అవకాశం కోసం అంగారక గ్రహం చుట్టూ తదుపరి కక్ష్య మిషన్‌ను కలిగి ఉండాలని ఇప్పుడు ప్రణాళిక చేయబడింది. సంబంధిత శాస్త్రీయతను పరిష్కరించడానికి మార్స్ చుట్టూ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం-2)లో ప్రయోగాలు చేయ డానికి భారతదేశంలోని ఆసక్తిగల శాస్త్రవేత్తల నుండి ప్రతిపాదనలు అభ్యర్థించబడ్డాయి. సమస్యలు మరియు విషయాలు. ప్రస్తు తానికి ఆమోదించిన జాబితాలో లేదని ఏఓ అన్నారు. ఎంఓఎం-2పై అప్‌డేట్ గురించి అడిగినప్పుడు ఒక సీనియర్ ఇస్రో అధికారి  చెప్పారు. పరిశోధన సంఘంతో విస్తృత సంప్రదింపుల ఆధారంగా మేము ప్రాజెక్ట్ ప్రతిపాదనలు మరియు పేలోడ్‌లను రూపొందించాలి" అని అధికారి తెలిపారు. ఇది ఇప్పటికీ డ్రాయింగ్ బోర్డ్‌లో ఉంది. అయితే మిషన్‌ను ఖరారు చేయడానికి మరికొన్ని వివరాలు అంతర్జాతీయ సహకారం అవసరమ‌న్నారు.

షిండే గూటికి 3వేల‌మంది శివ‌సేన‌లు జంప్‌

ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ  త‌గిలింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన దాదాపు 3000 మంది శివసేన సభ్యులు ఆదివారం ఏకనాథ్ షిండే వర్గంలో చేరారు. దసరా ర్యాలీకి థాకరే వర్గం ఇటీవల బాంబే హైకోర్టు నుండి అనుమతిని పొందిన నేపథ్యంలో ఇది జరిగింది. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా ఉన్నందున పార్టీ సభ్యుల నిర్ణయం థాకరే వర్గానికి తీవ్ర నిరాశ కలిగించింది. మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే శివసేనకు చెందిన 39 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్‌కు పారిపోవడంతో జూన్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం విడిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు పెట్టుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. రాష్ట్రంలో కొన్నిరోజుల రాజకీయ గందరగోళం తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు .అతని పదవిని దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఏక్నాథ్ షిండే చేపట్టారు. అప్పటి నుండి, చట్టబద్ధమైన శివసేన ఏ వర్గంపై ఇరుపక్షాల మధ్య విభే దాలు ఉన్నాయి. పార్టీ వార్షిక దసరా ర్యాలీని ఎవరు నిర్వహిస్తారనే దానిపై ఇటీవల ఇరువర్గాలు కోర్టు హాలులో డ్రామాలో పడ్డా యి. ఈ ర్యాలీని నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి రెండు వర్గాలు వేర్వేరుగా లేఖలు సమర్పిం చాయి. అయితే, శాంతిభద్రతల ఆందోళనలను పేర్కొంటూ ముంబై పౌర సంఘం రెండు వర్గాలకు అనుమతి నిరాకరించింది. పౌర సంఘం అనుమతి నిరాకరించిన మరుసటి రోజే, బాంబే హైకోర్టు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి అక్టోబర్ 2 , అక్టోబర్ 6 మధ్య ర్యాలీని నిర్వ హించడానికి అనుమతిని మంజూరు చేసింది. అక్టోబర్ 5న ముంబైలోని దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం లోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై షిండే క్యాంప్ నాయకుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే సదా సర్వాంకర్ జోక్యానికి దరఖాస్తు చేశారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించకూడదని సర్వాంకర్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్ధవ్ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు పార్టీ గుర్తులు, ప్రామాణికతకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న తమ పిటిషన్లను విచారించి చివరకు వివాదంపై నిర్ణయం తీసుకునే వరకు కోర్టు స్టే విధించాలని కోరింది. ఈ అంశంపై హైకోర్టు ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే, అసలు శివసేనకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై జరుగుతున్న వివాదానికి ఆటంకం కలుగుతుందని సర్వాంకర్ అన్నారు. థాకరే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని వాస్త వాలు అటకెక్కాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. నగరంలోని దాదర్ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అయిన సర్వాంకర్, షిండే శివసేన ముఖ్య‌నేత అని పిటిషన్‌లో పేర్కొన్నా రు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన దాఖలు చేసిన పిటిషన్ నిజమైన శివసేన రాజకీయ పార్టీకి చెందినది కాదని తప్పుదారి పట్టించేది, తప్పుగా సూచించడ‌మ‌ని ఆయన పేర్కొన్నారు. పార్టీలోనే వివాదం ఉందని సర్వాంకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు, నిజమైన శివసేనకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై వివాదం ఉంది, ఈ సమస్య భారత ఎన్నికల సంఘం మరియు సుప్రీం కోర్టు ముందు కూడా పెండింగ్‌లో ఉందని దరఖా స్తు పేర్కొంది. సర్వాంకర్ దాఖలు చేసిన దరఖాస్తు ప్రకారం, ప్రస్తుత పిటిషన్‌లో ఉద్ధవ్ సేన శివసేనపై దావా వేయడానికి ప్రయ త్నిస్తోందని, శివాజీ పార్క్‌లో శివసేన వార్షిక దసరా ర్యాలీని నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఆగస్టు 30న తాను కూడా ముంబై మున్సిప‌ల్ కార్యాల‌యానికి దరఖాస్తు చేశానని సర్వాంకర్ తెలిపారు. శివసేన నుంచి మెజారిటీ మద్దతు ఏకనాథ్ షిండేకే ఉందని, ఉద్ధవ్ ఠాక్రేకు పార్టీలో ఎలాంటి మద్దతు లేదని పిటిషన్‌లో పేర్కొన్నా రు. శివాజీ పార్కు వద్ద ర్యాలీ నిర్వహించేందుకు గతంలో పార్టీ తరపున దరఖాస్తులు పెట్టేది తానేనని సర్వాంకర్ చెప్పారు. గతంలో, ఈ దరఖాస్తుదారు (సర్వంకర్) శివాజీ పార్క్ వద్ద ర్యాలీని నిర్వహించడానికి అనుమతి కోరుతూ బిఎంసి కి దరఖాస్తును దాఖలు చేసేవాడ‌ని అప్లికేషన్ పేర్కొంది. థాకరేకి చెందిన శివసేన దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించనున్న న్యాయమూర్తులు ఆర్‌డి ధనుక ,కమల్ ఖాటా లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు సర్వాంకర్ దరఖాస్తును ప్రస్తావించే అవకాశం ఉంది.

పిఎఫ్ఐ నిషేధంతో క‌ర్ణాట‌క‌లో వెలుగు చూసిన మైనారిటీల ఓట్లు

పిఎఫ్ఐ నిషేధం కర్ణాటక ఎన్ని కలలో మైనారిటీ ఓట్లను రాజ‌కీ య‌పార్టీల దృష్టిలో ఉంచుతుం ది. కొంతమంది విశ్లేషకులు బిజె పి నిషేధాన్ని అంచ నా వేస్తుం దని చెప్పారు, దేశ వ్యతిరేక శక్తు ల'పై సాధ్యమైనంత బలమైన చర్యతీసుకుంటామని పార్టీ ఇచ్చి న హామీని నిలబెట్టు కుంది. మైనారిటీ కమ్యూనిటీ గణనీయ మైన ఉనికిని కలిగి ఉన్న నిర్దిష్ట నియోజకవర్గాలలో ఇప్పటికీ సం బంధితంగా ఉన్న చట్ట విరు ద్ధం లేని దాని అసోసియేట్ రాజకీయ విభాగం ఎస్‌డిపిఐ, ఎన్నికలకు వెళ్లే కర్ణాటకలో పిఎఫ్ఐ  పై నిషేధం ఎన్నికల ప్రభావం రాజకీ యవర్గాల్లో చర్చకు దారి తీసిం ది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండి యా (పిఎఫ్‌ఐ)పై  దాని సహచరులపై ఆరోపించిన ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలరోజుల దూరంలో ఉన్న కర్ణాటకలో దాని రాజకీయ పరిణామాలను ఆసక్తిగా చూడవలసి ఉంది. ఇప్పుడు నిషేధించబడిన పిఎఫ్ ఐ దాని సహచరులతో పాటు రాజకీయ శాఖ అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) స్టూడెంట్స్ వింగ్ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్ ఐ) గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. రాష్ట్రంలో, ముఖ్యంగా కోస్టల్ బెల్ట్‌లో. ఎస్‌డిపి ఐవివిధ స్థానిక సంస్థలలో 300 మందికి పైగా ప్రజా ప్రతినిధులను కలిగి ఉంది మరియు అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. దాని మాతృ సంస్థపై నిషేధం ఎస్‌డిపి ఐని బలహీనపరుస్తుందా లేదా దాని ఓటరు బేస్‌ను మరింత పటిష్టం చేయగలదా అనేది చూడాలి. ఈ నిషేధాన్ని అనుసరించి ఎస్‌డిపిఐకి అనుకూలంగా ముస్లిం ఓట్లు మరింతగా కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉందని, కనీసం దానికి ఆధారం ఉన్న జేబుల్లోనైనా, ఇది కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారవచ్చని రాజకీయ వర్గాల్లో పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. మైసూర్ విశ్వవిద్యాలయంలోని రాజకీయ శాస్త్ర విభాగం చైర్‌పర్సన్ ముజఫర్ అస్సాదీ మాట్లాడుతూ, నిషేధం ఎస్‌డిపి ఐ ని ఓటు పునాదిని ఒక్క‌టి చేయడానికి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి నెట్టివేసే అవకాశం ఉందని, సంఘం  బాధ ఒక వాద నగా ఉంది. ఎస్‌డిపిఐ పోటీ చేసే స్థానాల్లో, ఇది ఎన్నికల ఫలితాలపై గొప్ప ప్ర‌భావం చూపుతుంది, ఎందుకంటే వారు హిందువు లకు వ్యతిరేకంగా ముస్లిం ఓట్లను విభజిస్తారని, ఇది బిజెపికి సహాయపడుతుందని మరియు కాంగ్రెస్‌పై ప్రభావం చూపు తుందని అస్సాది చెప్పారు.

5జీతో విద్యారంగానికి ఎంతో ప్రయోజనం: ధర్మేంద్ర ప్రధాన్

5జీ టెలికాం సేవలను ప్రారంభించడం విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా రూపొందించబడిన 'డిజి టల్ విశ్వవిద్యా లయం' అమలులో సహాయపడు తుందని ఆయన అన్నా రు. దేశంలో 5జీ టెక్నా లజీని అందుబాటులోకి తీసుకురావడం వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం పొం దుతున్న రంగాల్లో విద్య ఒకటి అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తెలి పారు. 5జీ టెలికాం సేవ లను ప్రారంభించడం విద్యా మంత్రిత్వశాఖ ద్వారా రూపొందించబడిన 'డిజిటల్ విశ్వవిద్యాలయం' అమలులో సహాయపడుతుం దని ఆయన అన్నారు. ఈ 5జీఆరంభంలో ప్రధాన లబ్ధిదారుల రంగాలలో విద్య ఒకటి అని కేంద్ర మంత్రి తెలిపారు. ఎందుకంటే, ఇప్పుడు, మేము డిజిట ల్ విశ్వవిద్యాలయాన్ని ఊహించుకుంటున్నం, వర్చువల్ ల్యాబ్‌ల కోసం వెళ్తున్నాం, వర్చువల్ ఉపాధ్యాయుల కోసం వెళ్తు న్నాం,  అన్నీరంగాల్లో మేము నాణ్యత‌ను అభివృద్ధి చేస్తే, వాటిని దేశంలోని మూల మూలల‌కు ఎలా పంపుతాము? చేరు కోలేని వారిని చేరుకోవడానికి 5జీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని ప్రధాన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై విద్యా మంత్రిత్వ శాఖ ప్రణాళికలపై మీడియాకి వివ‌రించారు. 5జీ సేవలను ప్రారంభించడంతో, భారతదేశం ప్రీమియర్ లీగ్‌లో చేరుతోందని, దీని వల్ల సామాన్యులు ఎంతో ప్రయో జనం పొందుతారని ప్రధాన్ చెప్పారు. డిజిటల్ ఎకానమీ, ఆరోగ్య‌ర‌క్ష‌ణ‌, విద్య‌  ఇతర రంగాలు 5జీ ప్రయోజనాలను చూస్తాయని ఆయన చెప్పారు. కొత్త 5జీ నెట్‌వర్క్ ఊహించ‌ని గొప్ప‌మార్పును సృష్టించబోతోంది. ఈ 5జీ రోల్‌అవుట్‌లో పేద వాడు ప్రధాన లబ్ధిదారుడవుతాడ‌ని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 22వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాన్ ఇక్కడ మాట్లాడారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, యూఓహెచ్ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ ఎన్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ బీజే రావు పాల్గొన్నారు. అంతకుముందు రోజు, మొబైల్ ఫోన్‌లలో అల్ట్రా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తామని హామీ ఇచ్చే 5జీ టెలిఫోనీ సేవలను ప్రధా ని ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2022 కాన్ఫరెన్స్‌లో అతను ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాడు. ఈ సేవలు వచ్చే రెండేళ్లలో దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. హైద‌రాబాద్ వ‌ర్సిటీ కాన్వొకేషన్‌ను ఉద్దే శించి ప్రధాన్ మాట్లాడుతూ, భారతదేశం అగ్రగామి ఆర్థిక సూపర్ పవర్‌గా ఎదగాలంటే, సమాజం విద్య ద్వారా తనను తాను సిద్ధం చేసుకోవాలని అన్నారు. 5జీ సేవలను ప్రారంభించడం గురించి ఆయన ప్రస్తావిస్తూ, భారతదేశం త్వరలో ఆర్థిక సూపర్ పవర్‌గా మారడంతో పాటు సాం కేతిక సూపర్ పవర్‌గా మారబోతోంది. దేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా, విజ్ఞాన ఆధారిత ఆర్థికవ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తు న్నదని, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశాన్ని ముందుకు తీసుకెళ్తాయని అన్నారు. మనం మరింత సంపద సృష్టికర్తలను సృష్టించాలి. ఉద్యోగార్థుల కంటే ఎక్కువ మంది ఉద్యోగ సృష్టికర్తలను సృష్టించాలని, అప్పు డే మన సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. భారతదేశం సైన్స్‌తో బలమైన అనుసంధానంతో చాలా పాత నాగరికత అని, కోవిడ్-19 మహమ్మారి భారతీయ జ్ఞాన వ్యవస్థలు,  భారతీయ జీవన విధానం ప్రపంచానికి అందిం చడానికి చాలా ఉన్నాయని ఆయన చెప్పారు.

అయ్యో!... రాముడిని కాదు.. గోవిల్‌ని!

మ‌న‌దేశంలో భ‌క్తికి, వీరాభిమానానికి అంతే ఉండ‌దు. అది పెద్ద తెర‌మీద చూసినా, బుల్లి తెర‌మీద చూసినా..రాముడు రాముడే, కృష్ణ‌డు కృష్ణ‌డే...అది ఎన్టీ రామారావ‌యినా.. అరుణ్ గోవిల్ అయినా! మ‌న‌సులో ముద్రప‌డితే బ‌య‌ట పంచె లాల్చీతో ఎన్టీ రామారావు క‌న‌ప‌ డినా, ప్యాంట్ ష‌ర్టుతో గోవిల్ క‌నిపించినా మాన‌వా వ‌తారాల్లో క‌ళ్ల‌ముందు క‌న‌ప‌డు తున్నార‌ నుకుంటారేగానీ వాళ్ల‌ని న‌టులు గా మాత్రం అనుకోరు. అదీ వీరా భిమానానికి రుజువు. అది విప‌ రీత భ‌క్తి అంటే.. అదే గొప్ప న‌టు డికి అరుద‌యిన గౌర‌వం అంటే.  ఎన్టీరామారావు పూర్వం ఓ సిని మాలో కృష్ణుడు వేషం వేసి సెట్‌ లోంచి బ‌య‌టికి రాగానే నిజం గానే దేవుడు న‌డిచి వ‌స్తున్నా డ‌ని  సెట్ బ‌య‌ట ఉన్న వాళ్ల‌తో కొంద‌రు అమాంతం పొర్లు దండాలు పెట్టేర‌ని విన్నాం. స‌రిగ్గ అలాంటిదే అరుణ్ గోవిల్‌కీ జ‌రిగిం ది. ఓ పెద్దావిడ రాముడు ఇలా మోడ్ర‌స్ డ్ర‌స్‌లో క‌నిపించ‌డంతో అమాంతం టీవీ రాముడు గుర్తొచ్చి మోక‌రిల్లి దండం పెట్టింది! ఇంత కంటే వీరాభిమానులు ఎక్క‌డ‌న్నా ఉంటారా? అభిమానానికి భాష‌కీ సంబంధం లేదు. ఎన్టీఆర్ పాత సినిమాలు 80ల్లో చూసిన ఉత్త‌రాది రాజ‌కీయ‌నాయ‌కులు ఈయ‌నేనా ఆయ‌నా అన్నార‌ట‌! బుల్లి తెరపై రామానంద్ సాగ‌ర్ రామాయ‌ణ వ‌చ్చి ద‌దాపు 35 ఏళ్ల‌యింది. కానీ దాని ప్ర‌భావం ఇప్ప‌టికీ జ‌నాల్లో ఉంది. రాముడు  అంటే గోవిల్ అనే భావ‌న ఇప్ప‌టికీ ఉత్త‌రాదిన బాగా ఉంది. ఆయ‌న ఆ త‌ర్వాత పెద్ద‌గా సీరియ‌ల్స్‌లో క‌న‌ప‌డ‌క‌ పోయినా అంత‌కు ముందు వేసిన‌వి చూసినా ఆయ‌న్ని మాత్రం రాముడ‌నే అనుకుంటారు. కొండ‌క‌చో అలానే పిలుస్తున్నార‌ట‌! రామాయ‌ణం ప్ర‌భావం ఆ స్థాయిలో ఉంది. ఇప్ప‌టికీ! నిజంగానే అంత అద్భుతంగ తీశారు, న‌టులు అంతే అద్భుతంగా చేశారు. రాముడు, సీత‌తో పాటు ప్రేక్ష‌కులు ప్ర‌యాణం చేశార‌నొచ్చు. అంత‌గా ఆక‌ట్టుకుంది ఆ సీరియ‌ల్‌.  అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిక‌లియా సీత‌గా, సునీల్ ల‌హ్రి ల‌క్ష్మ‌ణుడిగా చేశారు. 1987-88 కాలంలో వ‌చ్చిన సీరియ‌ల్ ఆ త‌ర్వాత లాక్‌డౌన్ స‌మ‌యంలో 2020లో తిరిగి ప్ర‌సార‌మ‌యిన‌పుడు అంతే స్థాయిలో అంద‌రి ఆద‌ర‌ణా పొందింది. ఆయ‌న కుటుంబ స‌మేతంగా వెళుతూండ‌గా న‌లుగురు వారిని చూసి అడుగో రాముడు అన్నారు. అంతే వెంట‌నే వెళ్లి ఓ మ‌హిళ అత‌ని పాదాల ద‌గ్గ‌ర మోక‌రిల్లి న‌మ‌స్క‌రించింది. మ‌రుక్ష‌ణం ఆమె భ‌ర్త కూడా అదే భ‌క్తిపూర్వ‌కంగా న‌మ‌స్క‌రించాడు! అరుణ్ , అత‌ని భార్యా ఎంత వారిస్తున్నా వారు పాదాభివంద‌నాన్ని మాన‌లేదు. ఆ త‌ర్వాత రాముడి పాత్ర త‌న‌కు ఆ సీరియ‌ల్లో రావ‌డం కేవ‌లం అదృష్ట‌మ‌ని, అది అంద‌రి మ‌న‌సును ఆక‌ట్టుకోవ‌డం న‌న్ను అభిమానించ‌డ‌మూ జీవితంలో మ‌రువ‌న‌ని గోవిల్ అన్నా డు. అంత‌కుముందు అత‌ను సినిమాల్లోనూ చేశాడు. కానీ రామాయ‌ణం దెబ్బ‌కి ఆ సినిమా ఛాన్సులు పోయాయిట‌. రాజ‌కీ యాల్లోకి గ‌త ఏడాడే వ‌చ్చాడు. ఇంత పాప్యుల‌ర్ న‌టుడిని క‌మ‌ల‌నాథులే వ‌ల వేసి ప‌ట్టారు. జై శ్రీ‌రామ్ అనేది కేవ‌లం నినాదం కాద‌ని అది మ‌న సంస్కృతికి చిహ్న‌మ‌న్నాడు గోవిల్‌. 

తెలంగాణాకు ఎన్జీటీ షాక్‌...రూ.3,800 కోట్లు జ‌రిమానా

దక్షిణాది రాష్ట్రంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో భారీ అంతరాలు ఉన్నాయని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృ త్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయడంలో విఫలమైనందుకు తెలంగాణ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.3,800 కోట్ల జరిమానా విధించింది. దక్షిణాది రాష్ట్రంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో భారీ అంతరాలు ఉన్నా యని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ నేతృత్వం లోని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణులైన సభ్యులు ఎ సెంథిల్ వేల్, అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం, పర్యావరణ పున రుద్ధరణ కోసం ఉపయోగించబడే కాలుష్యం చెల్లించే సూత్రంపై రాష్ట్రం బాధ్యతను లెక్కించాలని పేర్కొంది. సుపరిపాలన కోసం స్వచ్ఛమైన గాలి, నీరు, పరిశుభ్రత మరియు పర్యావరణాన్ని అందించడం ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని బెంచ్ పేర్కొంది, కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి రాష్ట్రం తన రాజ్యాంగ బాధ్యత నుండి తప్పించుకోలేదని పేర్కొంది. తెలంగాణ చెల్లించాల్సిన మొత్తం పర్యావరణ పరిహారాన్ని గణిస్తూ, ద్రవ వ్యర్థాలు లేదా మురుగునీటి శుద్ధిలో అంతరం కోసం మొత్తం రూ.3,648 కోట్లు, ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడంలో రాష్ట్ర వైఫల్యానికి పరిహారం  రూ.177 కోట్లు అని బెంచ్ పేర్కొంది. మొత్తం పరిహారం రూ. 3,825 కోట్లు లేదా చెప్పాలంటే, రూ. 3,800 కోట్లు, తెలంగాణ రాష్ట్రం రెండు నెలల్లో ప్రత్యేక రింగ్-ఫెన్స్డ్ ఖాతాలో జమ చేయవచ్చు, ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం నిర్వహించబడుతుంది వినియోగించ బడుతుంది. పునరుద్ధరణ చర్యల కోసం" అని బెంచ్ పేర్కొంది. ఇంకా, మురుగునీటి నిర్వహణ పునరుద్ధరణలో మురుగునీటి శుద్ధి మరియు వినియోగ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి సౌకర్యాల పూర్తి సామర్థ్యాల వినియోగాన్ని నిర్ధారించడానికి వ్యవస్థలు లేదా కార్యకలా పాలను అప్‌గ్రేడ్ చేయడం, మల కోలిఫాం, సెట్టింగ్‌లతో సహా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటివి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో సరైన మల మురుగు మరియు బురద నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం, ఎగ్జిక్యూషన్ ప్లాన్‌లో అవసరమైన వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడం .వదిలేసిన‌ సైట్‌ల నివారణ వంటివి ఉంటాయి, బెంచ్ తెలిపింది. పునరుద్ధరణ ప్రణాళికలు తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా సమయానుకూలంగా అమలు చేయబడాలి మరియు ఉల్లంఘనలు కొనసాగితే, అదనపు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత పరిగణించబడుతుంది, గ్రీన్ ప్యానెల్ జోడించబడింది. ప్రతి ఆరు నెలలకో సారి పురోగతి నివేదికలను దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్, 2016 ఇతర పర్యావరణ అంశాలను పాటించ డాన్ని ఎన్‌జీటీ పర్యవేక్షిస్తోంది.

సూర్య‌కుమార్ ఆట తీరు న‌చ్చింది...పేస‌ర్ పార్నెల్‌

ఐసిసి టీ-20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్‌2 ర్యాంక్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, గత 12 నెలల లేదా అంతకు ముందు పొట్టి ఫార్మాట్‌లో భారత అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కుడిచేతి వాటం ఆటగాడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టీ-20 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు - 21 ఇన్నింగ్స్‌లలో 180.29 స్ట్రైక్ రేట్‌తో 732 పరుగులు చేశాడు - ఇంకా మూడు నెలలు ప్రపంచ కప్ మిగిలి ఉంది. శిఖర్ ధావన్ 2018లో 147 స్ట్రైక్ రేట్‌తో 17 ఇన్నింగ్స్‌లలో 689 పరుగులు చేసిన తర్వాత అత్యుత్తమంగా ఉంది. విరాట్ కోహ్లి 2016లో 13 ఇన్నింగ్స్‌ల్లో 641 పరుగులు చేశాడు, అయితే అతని స్ట్రైక్ రేట్ 140 మాత్రమే. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో కదులుతున్న బంతికి ఇరు జట్ల బ్యాటర్లు పోరాడారు - దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 106 పరుగులు చేయగలిగింది, వారి ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌కి ఔట్ కాగా, భారత్ అత్యల్ప స్కోరు (17/1) నమోదు చేసింది. టీ-20 పవర్‌ప్లేలో సూర్యకుమార్ కేవలం 33 బంతుల్లో మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో అజేయంగా 50 పరుగులు చేశాడు. గౌహతిలో రెండవ టీ-20 కి ముందు, దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్ వేన్ పార్నెల్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ  టీ-20 బ్యాటర్ల లో సూర్యకుమార్ ఒకడని అంగీకరించడంలో ఎటువంటి సందేహం లేదని ప్ర‌శంసించాడు. అత‌ని ఆట తీరు, ప‌రుగులు తీయ‌డంలో ప్ర‌త్యేక‌త, షాట్స్‌లో కొత్త‌ద‌నం ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని పార్నెల్ పేర్కొంటూ, ప్ర‌స్తుతం టీ.20ల్లో సూర్య ప్ర‌పం చ ప్ర‌ముఖ బ్యాట‌ర్ అని అన్నాడు.  ఎడమచేతి మీడియం పేసర్ పార్న‌ల్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ, సూర్యకుమార్ మైదానం చుట్టూ స్కోర్ చేయగల సామర్థ్యం తో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడన్నాడని,  బౌలర్లను భారీ షాట్ల‌తో భ‌య‌పెట్ట‌డం, ప్రతి బంతిని అది వచ్చినట్లుగా తీసుకోవ డానికి ప్రయత్నించడం మాత్రమేనని నేను భావిస్తున్నాడు. ఇదో టెక్నిక్‌. అది సూర్య‌లో ఉంద‌న్నాడు. మీకు తెలుసా, అతను మంచి షాట్లు ఆడటానికి స‌రిగ్గా స‌రిపోతాడని అనుకున్నాన‌ని, అతను నిజంగా చాలా అందమైన షాట్‌లు ఆడాడ‌ని  అన్నాడు. గత రెండు నెలలుగా గ‌మ‌నిస్తున్నాను. అతను ఖచ్చితంగా మంచి క్రికెట్ ఆడుతున్నాడని సూర్య‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ పార్న‌ల్‌. తిరువనంతపురంలో జరిగిన మొదటి టీ20 లో దక్షిణాఫ్రికా నిరాశపరిచిన బ్యాటింగ్ ప్రదర్శన గురించి అడిగినప్పుడు, ముఖ్యం గా పవర్‌ప్లేలో వారు తమ ఇన్నింగ్స్‌లో మొదటి మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయారు, ఇది కష్టమైన వికెట్ అని, భారతదేశం పరిస్థితులను ఉపయోగించుకుందని పార్నెల్ చెప్పాడు. బాగా. అయితే, ఆల్ రౌండర్, సిరీస్‌ లోని మిగి లిన రెండు మ్యాచ్‌లలో బలంగా తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు.

ఇండోనేషియా ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిస‌లాట‌..127 మంది మృతి

ఆట‌ను ఆట‌గానే ఆస్వా దించాలి. వీరాభిమానం ఉండ‌వ‌చ్చు. ప్లేయ‌ర్ల‌ మీద‌, జ‌ట్టు మీదా అభి మానం అతిగా ఉంటే ప్ర‌మాదాల‌కు దారి తీస్తుం ద‌నేదానికి ఉదా హ‌ర‌ణే ఇండోనేషియా సంఘ‌ట‌న‌. తూర్పుజావాప్రావిన్స్‌లో శ‌నివారం రాత్రి జ‌రిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జ‌ట్టు వీరాభిమానులు రెచ్చిపోయి పిచ్ మీద‌కి చొర‌బ‌డ‌టంతో పెద్దెత్తున తొక్కిస‌లాట జ‌రిగి 127 మంది మృతి చెందారు. అరేమా ఫుట్‌బాల్‌క్ల‌బ్‌  పెర్సెబయ సురబయ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, ఓడిపోయిన జట్టు మద్దతుదారులు పిచ్‌పైకి చొరబడ్డారు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, తొక్కిసలాట,  ఊపిరాడకుండా పోయింది. దీంతో అనేక‌మంది ప్రాణాలు కోల్పోయార‌ని, గాయ‌ప‌డ్డార‌ని ఈస్ట్ జావా పోలీసు చీఫ్ నికో అఫింటా విలేకరులతో చెప్పారు. స్థానిక వార్తా ఛానెల్‌ల నుండి వచ్చిన వీడియో ఫుటేజీలో ప్రజలు మలాంగ్‌లోని స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకుపోతున్నట్లు మరియు బాడీ బ్యాగ్‌ల చిత్రాలను చూపించారు. ఇండోనేషియా టాప్ లీగ్ బీఆర్ ఐ లిగా 1 మ్యాచ్ తర్వాత ఒక వారం పాటు ఆట లను సస్పెండ్ చేసింది, పెర్సెబయా 3-2తో గెలిచింది.  ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియే షన్ (పిఎస్ ఎస్ ఎ) తెలిపింది. గతంలో ఇండోనేషియాలో మ్యాచ్‌లలో ఇబ్బందులు తలెత్తాయి, క్లబ్‌ల మధ్య బలమైన పోటీ కొన్నిసార్లు మద్దతుదారుల మధ్య హింసకు దారితీసింది.

రాహుల్ గాంధీలో కొత్తకోణం ... గమనించారా?

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ । నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।।  “ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షము నొందకుండా, కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న మునితో సమానం” అట్టి వానిని స్థిత ప్రజ్ఞుడు అందురు.  ఇంకా కొంచెం తేలిగ్గా అరంయ్యేలా చెప్పుకోవాలంటే, “కష్టాలలో కుంగి పోక , సుఖాలలో పొంగి పోక, పరమానంద స్థితిలో జీవితం సాగించడమే ! స్థిత ప్రజ్ఞత. అంటే కష్ట సుఖాలను ఒకలా చూసే పరిపక్వ మానసిక స్థితిని, ... స్థిత ప్రజ్ఞత అంటారు.  కష్ట సుఖాలను సమ దృష్టితో చూచే వారిని. స్థిత ప్రజ్ఞుడు అంటారు. ఈ మాటలు ఎక్కడో  విన్నట్లు ఉన్నాయి కదూ.. అవును, యుద్ధ భూమిలో శ్రీ కృష్ణ  పరమాత్మ, అర్జనుని కార్యోన్ముఖుని చేసినేదుకు, బోధించిన, ‘గీత’ లోని శ్లోక మిది.  అయితే, ఇప్పడు ఈ శ్లోకం, దాని అర్థ తాత్పర్యాలు గుర్తుకు తెచ్చింది మాత్రం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గత వారం పది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఏమేమి జరిగాయో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, దేశం అంతా చూసింది. విస్తు పోయింది. ఓ వంక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక క్రతువు ఒక ప్రహసనంలా సాగుతోంది.  మరో వంక, అధ్యక్ష ఎన్నిక, పర్యవసానంగా రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ సృష్టించిన సంక్షోభం, అధిష్టానానికి, అంటే, సోనియా, రాహుల్, ప్రియాంక త్రయానికి సవాల్ విసిరింది. మరో వంక, ఈ పరిణామాలతో అసలే అంతంత మాత్రంగా మిణుకు, మిణుకు మంటున్న కాంగ్రెస్ భవిష్యత్ మరింతగా మసకబారింది. వందేళ్లు నిండిన కాంగ్రెస్ దీపం కొడిగట్టి ఆరిపోయే స్థితికి చేరిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితిలోనూ కాంగ్రెస్ ఆశాజ్యోతి రాహుల గాంధీ తామరాకు మీద నీటి బొట్టులా తనకేమి పట్టనట్లు. అదసలు తనకు సంబందించిన విషయమే కాదన్నట్లు, అలా తన దారిన తాను, భారత జోడోయాత్ర దారిలో నడచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు.  నిజానికి  ఆయన ఏదో అలా నిర్వికారంగా నడుచుకుంటూ వెళ్లిపోలేదు. ఓ వంక ఢిల్లీలో, జైపూర్ లో కాంగ్రెస్ నాయకులు కిందా మీద అవుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ, ఇంచక్కా పిల్లలలతో  ఫుట్బాల్ ఆడుతూ,  పసి పిల్లలను ఎత్తుకుని ముద్దాడుతూ, అమ్మాయిలకు హగ్గులిస్తూ,వాళ్ళను వీళ్ళను పలకరిస్తూ, పరిహాసమడుతూ అలా నవ్వుతూ సాగిపోయారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటని ఎవరెవరో ఆందోళన చెందుతున్నారు. ఎవరెవరో  రాజకీయ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. అయినా రాహుల్ గాంధీ  అదేమీ పట్టకుండా చక్కని స్థిత ప్రజ్ఞతను చూపారు.  సరే, రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర వలన కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రయోజనం జరుగుతుంది?  పూర్వ వైభవ స్థితి సిద్ధిస్తుందా? వంటి ప్రశ్నలను పక్కన పెడితే, రాహుల్ గాంధీ యాత్ర ఆయనలోని మరో కోణాన్ని, అయితే చూపించింది.

గెహ్లాట్ గేమ్ ప్లాన్ సక్సెస్ ఇక పైలట్ కు నో ఛాన్స్!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ యువ నాయకుడు, సచిన్ పైలట్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయన ఇక ఆ ఆశ వదులుకోవలసిందేనా? ఇక ఆయనకు ముఖ్యమంత్రి పదవి రానట్లేనా? అంటే ఆ రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పండితులు అవుననే అంటున్నారు.  నిజానికి  2018 ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ విజయానికి పైలట్టే ప్రధాన కారణం. పీసీసీ అధ్యక్షుడిగా ఐదేళ్ళు పార్టీని ముందుండి  నడిపించింది పైలట్.  కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చింది పైలట్. కానీ, చివరకు ముఖ్యమంత్రి పదవి పైలట్ కు చిక్కినట్లే చిక్కి చేజారి పోయింది. అధినాయకత్వం ఆయన్ని కాదని, అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిని చేసింది. సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితం చేసింది ఇక అప్పటి నుంచి పైలట్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆడుతున్న రాజకీయ క్రీడలో పావుగా మిగిలి పోయారు. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అద్గిష్టానానికి తమ అసంతృప్తిని తెలియ చేసినా, రాహుల్, ప్రియాంక జోక్యం చేసుకుని బుజ్జగించడంతో సర్దుకున్నారు. అధిష్టానం జోక్యంతో పైలట్ వర్గానికి చెందిన కొద్ది  మందికి మంత్రి పదవులు అయితే దక్కాయి, కానీ, ముఖ్యమంత్రి కావాలనే పైలట్ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది.  అయితే, అనుకోకుండా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రావడం, పార్టీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను, అభ్యర్ధిగా నిర్ణయించడంతో, పైలట్ లో మళ్ళీ ఆశలు చిగురించాయి.అయితే  అంతలోనే మళ్ళీ నీరుగారి పోయాయి. ముఖ్యమంత్రి కుర్చీ ఎట్టి పరిస్థితిలో పైలట్ కు దక్కకుండా చేసేందుకు  అశోక గెహ్లాట్  ప్లే చేసిన ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా ట్రిక్ ‘ఇటు పైలట్’ను అటు అధిష్టానాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.  నిజమే కావచ్చును, అశోక్ గెహ్లాట్ అనుకున్నది సాధించిన తర్వాత సోనియాకు క్షమాపణలు చెప్పి, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలో లేదో నిర్ణయించే అధికారం ఆమెకే వదిలేశారు. అయితే  once bitten twice shy అన్నట్లుగా ఒక సారి గెహ్లాట్  ‘విధేయత’ రుచి ఏమిటో చూసిన సోనియా గాంధీ, ఇప్పటికిప్పుడు మళ్ళీ, గెహ్లాట్ మాట నమ్మి, పైలట్ ను ముఖ్యమంత్రిని చేసే సాహసం చేస్తారా అంటే చేయరనే పరిశీలకులు అంటున్నారు. నిజానికి గేహ్లోట్, ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల ద్వారా  అధిష్టానానికి, చాలా స్పష్టంగా  తనతో గేమ్స్ వద్దని చెప్పకనే చెప్పారు.   అయితే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రెండు రోజుల్లోనే సోమియా గాంధీ  రాజస్థాన్ పరిణామాలపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆయన  ఆ మాట చెప్పి రెండు కాదు మూడు రోజులు అయింది కానీ  ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. నిజానికి, ఇప్పటి కిప్పుడు సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి గెహ్లాట్ ను తొలిగించి పైలట్ కు పట్టం కట్టే పరిస్థతి కనిపించడం లేదు. మరో వంక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చక పోవచ్చని అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికలు అయ్యే వరకు పైలట్ కు కుర్చీ యోగం  లేనట్లే అంటున్నారు. ఎన్నికల తర్వాత, అంటారా అప్పుడు రాజెవరో రెడ్డి ఎవరో ... అసలు కాంగ్రెస్ పార్టీ  మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో .. చెప్పలేమని అంటున్నారు.

చింత‌కాయ‌ల విజ‌య్ ఇంటికి పోలీసులు ...ప్ర‌శ్నించింది పిల్ల‌ల్ని

సాయింత్రం చీక‌టిప‌డేవేళ  ఇంటిముందు పోలీస్ జీప్ ఆగింది...న‌లుగురు  పోలీసులు  ఇంట్లోకి  వెళ్లి ఫ‌లానా వ్యక్తి ఎక్క‌డ అని ఆ ఇంటావిడ‌ని ప్ర‌శ్నిస్తారు. వారి పిల్ల‌ల్ని బెదిరిస్తారు.. మీ నాన్న ఎక్క‌డ్రా.. అని... ఇది ఓ సినిమా సీన్‌. స‌రిగ్గా  ఇలానే జ‌రిగింది ఉత్త‌రాంధ్ర  న‌ర్సీప‌ట్నంలో. తెలుగుదేశం సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడి కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ ఇంటికి వెళ్లి, ఆయ‌న లేక‌పో వ‌డంతో ఆయ‌న ఎక్క‌డికి వెళ్లారు, ఎప్పుడు వ‌స్తార‌ని ఆయ‌న పిల్ల‌ల్ని పోలీసులు ప్ర‌శ్నించారు. కాగా, చింత‌కాయ‌ల విజ‌య్‌ని విచార‌ణ‌కు ర‌మ్మ‌ని  ఏపీ సీఐడీ పోలీసులు నోటీస‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏ కార‌ణం చేత నో ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ బ్రాంచ్‌కి వెళ్లిన‌ట్టు లేదు. కానీ పోలీసులు మాత్రం చాలా దురుసుగానే వ్య‌వ‌హ‌రిం చార‌ని ఆరోప‌ణ‌లు వినవ‌స్తున్నాయి. ఇంట్లో లేని వ్య‌క్తి  గురించి  ఇంట్లో ఉన్న‌పెద్ద‌వారిని ప్ర‌శ్నించాలి. వారు స‌రిగా స‌మాధానం ఇవ్వ‌లేద‌ని భావిస్తే, ఆ వ్య‌క్తిని వ‌చ్చి క‌ల‌వ‌మ‌ని హెచ్చ‌రించి వెళ్లాలి. కానీ ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. పిల్ల‌ల్ని బెదిరించి వెళ్ల‌డం ఏమిటి అని తెలుగు దేశం విరుచుకుప‌డుతోంది. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ నేత అయ్యన్నపాత్రుడు కుటుంబపై మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరి స్తోంది. గతంలో నర్సీపట్నంలో అయ్యన్న ఇంటిపై ఇలాగే దాడిచేశారు. రాష్ట్రంలో రోజుకో సీఐడీ కేసు, వారానికో అరెస్టు తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు మరేమీ చెయ్యడం లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఇదంతా అధికార ప‌క్షం ప‌నిగ‌ట్టుకుని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గా చేయనిస్తోంద‌న్న ప్ర‌చారం బాగా ఉంది. ఇప్ప‌టికే పాల‌నాప‌రంగా, ప్ర‌జాభిమానం దృష్ట్యా ప్ర‌తిష్ట కోల్పోయిన జ‌గ‌న్ స‌ర్కార్ ఇలాటి వాటికీ వెనుకాడ‌ద‌న్న అభిప్రాయాలే వ్యక్త‌మ‌వుతున్నాయి. విప‌క్షాన్ని వీల‌యిన‌పుడ‌ల్లా వేధించ‌డానికి, ఇర‌కాటం లో ప‌డేయ‌డానికే జ‌గ‌న్ స‌ర్కార్ పూనుకుంది.  మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి తనయుడు, టీడీపీ యువనేత చింతకాయల విజయ్ ఇంట్లోకి పోలీసు లు దోపిడీదొంగల్లా చొరబడడాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఖండించారు. విజయ్ ఇంట్లో చిన్న పిల్లలను, పనివాళ్లను భయ భ్రాంతులకు గురిచేసేలా సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. ఐదేళ్ల వయసున్న పసిపిల్లను పోలీసులతో భయపెట్టే నీచమైన స్థితికి జగన్ రెడ్డి దిగజారాడని చంద్రబాబు విమర్శించారు.   నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన సీఐడీ పోలీసులు డ్రైవర్ పై దాడి చేయ డం ఎందుకని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కేసులు, విచారణల పేరుతో ప్రతిపక్ష నేతలపైకి పోలీసులను రౌడీల్లా ఉసిగొల్పుతున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ప్రతిపక్షానికి ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ విభాగాన్ని అడ్డంపెట్టుకుని వేధింపులతో పాలన సాగించడం సిగ్గుచేటని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇలా చ‌దువుతూంటే ముస‌లాడినైపోతా!

పిల్ల‌ల‌కి పాల‌బువ్వ పెట్టినంత సులువుగాదు చ‌దివించ‌డం, రాయించ‌డం. అదో క‌ళ‌. దానికి నైపుణ్యం మాటెలా ఉన్నా మ‌హాఓర్పూ ఉండాలి. పిల్ల‌ల్ని వాళ్ల ఇష్టానికి వ‌దిలేసి మ‌ధ్య మ‌ధ్య‌లో చ‌దువు మీద‌కి దృష్టి మ‌ళ్లేలా చేయాల్సిందేనంటారు విద్యావేత్త‌లు. అంతేగాని తల్లిదండ్రుల నియ‌మ‌నిబంధ‌న‌లు, స్కూల్లో టీచ‌ర్ల బెత్తం పెత్త‌నం అస్స‌లు ప‌నికిరావు. ఎందుకంటే బాల్యం వాళ్ల‌ది.. పాఠం చెప్పేవారికి, త‌ల్లిదండ్రుల‌కీ ఆ ద‌శ అయిపోయింది. అంచేత సీరియ‌స్‌గా చెప్ప‌డం అస్స‌లు కుద‌ర‌దు. వారితో స‌ర‌దాగా ఆడుతూనే హోంవ‌ర్క్ చేయించాలి. లేక‌పోతే ఇదుగో ఈ బుడ‌త‌డిలా పెద్ద మాటే అనేస్తారు. త‌ర్వాత ఆశ్చ‌ర్యానికి అంతే ఉండదు. పిల్లాడిచేత రాయించ‌డానికో, హోమ్‌వ‌ర్కే చేయించ‌డానికి ఆమె నానా అవ‌స్థాప‌డుతోంది. వాడు మాట విన‌డం లేదు. ఇంకా ఎంత చ‌దివిస్తావు, రాయిస్తావ‌ని ఎదురు ప్ర‌శ్న వేసేంత‌గా లోలోప‌ల బాధ‌ప‌డ్డాడు. వాడికి బ‌య‌టికి వెళ్లి ఆడాల‌నుంది, కుక్క‌పిల్ల తోక లాగాల‌నుంది, మ‌ట్టిలో ప‌రిగెత్తాల‌ని ఉంది, ప‌క్కింటి చింటూగాడి చొక్కాలాగి ఏడిపించాల‌నుంది.. అస‌లు వాడికి చాలా ప‌నులున్నాయి.. ఈవిడేమో వ‌ద‌ల‌దాయ‌!  పిల్ల‌ల‌కు క‌బుర్లు చెబుతూనే, పాట‌లు పాడుతూనే చ‌దివించ‌డం నేర్చుకోవాలి. త‌ల్ల‌యినా, తండ్ర‌యినా పిల్ల‌ల్ని ఎలా చ‌దివించాలో నేర్చుకోవాలి. అంటే మ‌ళ్లీ బాల్యంలోకి వెళ్లాలి, వాళ్ల‌మ్మ‌, నాన్న‌లు ఎలా చేశారో గుర్తు చేసుకోవాలి. అప్పుడుగాని మీ బ‌బ్లూగాడి చేత రాయించ‌గ‌లిగేది, చ‌దివించ‌గ‌లిగేది.  లేక‌పోతే వీడెవ‌డో గాని గ‌ట్టి మాటే అనేశాడు... ఇంత చ‌దువుతూ పోతే ముస‌లాడిన‌యిపోతా!  అని!!  మ‌రి ఇప్ప‌టి చ‌దువు అలా ఏడిచింది మ‌రి... అంతా మాన‌సిక ఒత్తిడిని బ‌హూక‌రిస్తోంది!