బార్ అండ్ రెస్టారెంట్ పార్టీయేనా?.. బీఆర్ఎస్ ను స్వాగతిస్తూ మద్యం పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించనున్న వేళ.. టీఆర్ఎస్  నేతలలో ఉత్సాహం ఉరకలేస్తున్నది. దసరా రోజు అంటే బుధవారం (అక్టోబర్ 5)న కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయన జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబరాలు జరుగుతున్నాయి.  కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సంబరాలు చేసుకుంటున్నారు. పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఈ ఆనందం వెర్రితలలు వేసింది. ఈ ఉత్సాహం గతి తప్పింది. వరంగల్ లో ఒక టీఆర్ఎస్ నేత కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయి ఏకంగా మద్యం బాటిళ్లు పంచారు. ఈ పని ఆయనేం రహస్యంగా చేయలేదు.  ఒక ట్రాక్టర్ ట్రాలీలో మద్యం సీసాలను తీసుకువచ్చి  నడి రోడ్డు మీద అదేదో సామాజిక సేవలా.. మద్యం సీసాలను పంచారు. అంతేనా మద్యంలోకి మంచింగ్ కోసం ఇంటికి తీసుకెళ్లి కూరొండుకోండన్నట్లు కోళ్లనూ పంచారు. ఈ పంపిణీ అంతా ఆయన వెనుక రెండు కటౌట్లను పెట్టుకుని మరీ చేశారు. ఇంతకీ ఆ కటౌట్లు ఎవరివో తెలుసా.. ఒకటేమో సీఎం కేసీఆర్ ది. రెండోది ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ ది. ఆయన పంపిణీ చేస్తున్న మద్యం బాటిళ్లు, కోళ్లను తీసుకోవడం కోసం జనం క్యూలో నిలుచున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. ఈ మద్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన టీఆర్ఎస్ నేత పేరు  రాజనాల శ్రీహరి. వరంగ్ కు చెందిన టీఆర్ఎస్ నేత.  తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడు సందర్భంగా వరంగల్‌కు చెందిన టీఆర్ఎస్‌ నేత రాజనాల శ్రీహరి.. తమ నేత కేసీఆర్‌ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ వరంగల్ చౌరస్తాలో సుమారు 200 మంది హమాలీ కార్మికులకు కోళ్లు, మద్యం సీసాలను ఉచితంగా పంపిణీ చేశారు. అధికార పార్టీ నేతే మద్యం పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అయితే   టీఆర్ఎస్‌ నేతలు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను సమర్ధిస్తున్నారు.  రాజనాల శ్రీహరి దసరా కానుకగా హమాలీలకు కోళ్లు, లిక్కర్ బాటిల్స్ ఇచ్చారని వెనకేసుకొస్తున్నారు.   అయితే విపక్షాలు, స్థానికులు మాత్రం రాజనాల శ్రీహరి చర్యను తప్పుపడుతూ.. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మద్యం పంపిణీ ఘటనతో ఆమె విమర్శలు సరైనవేననిపిస్తోందని అంటున్నారు.

రూసో, డీకాక్ బాదుడుతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం

సిరీస్ భార‌త్ గెల‌వ‌చ్చుగాక‌, చివ‌రి మ్యాచ్ లో మాత్రం రూసో, డీకాక్‌, మిల్ల‌ర్ సిక్స్‌లు, ఫోర్లు ఎలా కొట్టాలి, స్కోర్ ఎలా ప‌రుగు లెత్తిం చాల‌న్న‌ది చేసి చూపారు. భార‌త్ జ‌ట్టులో కింగ్ కోహ్లీ స్థానంలో వ‌చ్చిన సిరాజ్‌, రాహుల్ స్థానంలో వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇద్ద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. మ‌న‌వాళ్లు పేక‌ముక్క‌లు ప‌డిన‌ట్టు టాప్ ఆర్డ‌ర్ మొత్తం త‌క్కువ‌స్కోర్‌కే వెనుదిర‌గ‌డం ద‌క్షిణాఫ్రికా ఫీల్డింగ్‌లో ఎంత‌గా ప‌టిష్ట‌త ప్ర‌ద‌ర్శించింది స్ప‌ష్టం చేస్తుంది. చెప్పి వికెట్లు తీసిన‌ట్టు తీశారు. ఇండోర్‌లో జ‌రిగిన టీ20లో ద‌క్షిణాఫ్రికా 3 వికెట్ల న‌ష్టానికి 227 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 178కి ఆలౌట్ అయింది. చిత్ర‌మేమంటే ఈ మ్యాచ్‌లో రెండు జ‌ట్లు కెప్టెన్లు నిరాశ‌ప‌ర్చ‌డం. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ‌వూమా మ‌ళ్లీ విఫ‌ల‌మ‌య్యాడు. ఒక వంక డీకాక్ బాదుడు ఆరంభించ‌గానే మూడో ఓవ‌ర్లోనే బ‌వూమా కేవ‌లం 3 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. మొద‌టి ఆరు ఓవ‌ర్ల‌కి ఒక వికెట్ న‌ష్టానికి 48 ప‌రుగులు చేసింది. అక్క‌డి నుంచి రూసో, డీకాక్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తీ బౌల‌ర్‌ని సిక్స్‌లు, ఫోర్లు బాదారు. ఫీల్డింగ్ కూడా భార‌త్ అంతంత మాత్రంగానే సాగింద‌నాలి. క్యాచ్‌లు వ‌దిలారు, ఫీల్డింగ్ చాలా పేల‌వంగా అనిపించింది. ఏ బౌల‌ర్ చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేదు. సిరాజ్ మీద పెట్టుకున్న ఆశ‌లు పెద్దగా నెర‌వేర‌లేద‌నాలి. ద‌క్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్లోనే వంద ప‌రుగులు పూర్తి చేసుకుంది అప్ప‌టికి డీకాక్ అర్ధ‌సెంచ‌రీ చేశాడు. 14వ ఓవ‌ర్‌కి రూసో అర్ధ‌సెంచ‌రీ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్స్‌ల‌తో 50 ప‌రుగులు పూర్తి చేశాడు.13వ ఓవ‌ర్లో డీకాక్ చిత్రంగా ర‌నౌట్ అయ్యాడు. అప్ప‌టికి అత‌ను 43 బంతుల్లో 68 ప‌రుగులు చేశాడు. కానీ సిరాజ్‌ను, హ‌ర్ష‌ల్‌ను మ‌రో వంక రూసో చిత‌క‌బాదుతూనే జ‌ట్టు స్కోర్‌ను ప‌రుగులెత్తించాడు. 16వ ఓవ‌ర్ వేసిన చాహ‌ర్ 15 ప‌రుగులిచ్చాడు.18ఓవర్‌కి  రూసో సెంచ‌రీ  కేవ‌లం 48 బంతుల్లో పూర్తి చేశాడు. అందులో 8సిక్స్‌లు 7 ఫోర్లు ఉండ‌టం అత‌ని బ్యాటింగ్ ధాటిని తెలియ‌జేస్తుంది. చివ‌ర్లో వ‌చ్చిన డేవిడ్ మిల్ల‌ర్ చివ‌రి ఓవ‌ర్లో మూడు సిక్స్‌లు కొట్టి బౌల‌ర్ల‌ను బ‌య‌పెట్టాడు! ఇన్నింగ్స్ ముగిసే స‌మ‌యానికి రూసో సెంచ‌రీతో, మిల్ల‌ర్ 19 ప‌రుగుల‌తో అజేయంగా ఉన్నారు. ర‌న్ రేట్ 11.36 ఉంది.  228 ప‌రుగుల ల‌క్ష్యంతో రంగంలోకి దిగిన భార‌త్ ఇన్నింగ్స్‌ను రోహిత్‌, పంత్ ఓపెన్ చేశారు. ర‌బాడా వేసిన తొలిఓవ‌ర్ రెండో బంతికే కెప్టెన్ శ‌ర్మ వెనుదిరిగాడు. త‌ర్వాత వ‌చ్చిన అయ్య‌ర్ రెండో ఓవ‌ర్లో పార్న‌ల్ కి దొరికాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ కేవ‌లం 4 ప‌రుగులే! ఏదో శ‌నిప‌ట్టిన‌ట్టు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అలా పెవిలియ‌న్ దారి ప‌ట్టి ప్రేక్ష‌కుల‌ను, టీమ్ ఇండియా వీరాభిమానుల‌ను ఎంతో నిరాశ‌ప‌రిచారు. 5ఓవ‌ర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి 45 ప‌రుగులు చేసింది. మొన్న‌టి రెండు మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ స‌త్తాను ప్ర‌ద‌ర్శించిన సూర్య‌కుమార్ యాద‌వ్ రాగానే వ‌చ్చాడ్రా మ‌నోడు ఇర‌గ‌దీస్తాడు ఫో.. అనుకున్నారు. కానీ అలాగేమీ జ‌ర‌గ‌లేదు.ఊహించ‌నివిధంగా వెనుదిరిగాడు. అయితే మ‌రో వంక దినేష్ కార్తీక్ ధాటిగా ఆడుతూండ‌డంతో జ‌ట్టు స్కోర్ 7 ఓవ ర్ల‌లో 78కి చేరుకుంది. అదే ఓవ‌ర్లో డి.కె అవుట‌య్యాడు. అత‌ను 21 బంతుల్లో 46 ప‌రుగులు చేశాడు. 9ఓవ‌ర్ చాలా చిత్రంగా సాగింది. మ‌హారాజ్ వేసిన ఆ ఓవ‌ర్లో హ‌ర్ష‌ల్ రెండుప‌ర్యాయాలు ఒకే బంతికి అవుట‌వ‌డం త‌ప్పించుకున్నాడు. క్యాచ్ బ‌వుమా వ‌దిలేసేడు, ర‌న్ అవుట్ చేయ‌డంలో ఫీల్డ‌ర్ బంతి చేజార‌డంలో హ‌ర్ష‌ల్ బ‌తికిపోయాడు. భార‌త్ అలా ప‌డుతూ లేస్తూ ప‌ది ఓవ‌ర్ల‌కి  5 వికెట్లు కోల్పోయి 95 ప‌రుగులు చేసింది. ఇదే స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా 1 వికెట్ న‌ష్టానికి 96 ప‌రుగులు చేసింది. మ‌రి రెండు బంతుల‌కు భార‌త్ వంద ప‌రుగులు పూర్తి చేసింది. త‌ర్వాత హ‌ర్ష‌ల్ (17)వెనుదిరిగాడు. భార‌త్ 12 ఓవ‌ర్ల‌కు 7 వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. భార‌త్ ఇన్నింగ్స్ చివ‌రి ద‌శ‌లో ఉమేష్, ఛాహ‌ర్‌లో కాస్తంత బాగా ఆడారు. దీంతో 15 ఓవ‌ర్ల‌కి భార‌త్ స్కోర్ 142కి చేరుకుంది. అప్ప‌టికి చాహ‌ర్ 24, ఉమేష్ 9 ప‌రుగులు చేసారు. చాహ‌ర్ 17 బంతుల్లో 31 ప‌రుగులు చేసి 17 ఓవ‌ర్లో వెనుదిరిగాడు. త‌ర్వాత ఉమేష్ విజృంబించ‌డంతో భార‌త్ 19 ఓవ‌ర్ల‌కు 178 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా 49 ప‌రుగుల‌తో విజేత అయింది.  కాగా మొత్తం సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించి, అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్న స్టార్ బ్యాట్స‌మ‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ మ్యాన్ ఆవ‌ఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.

ఉచితాలకు ఈసీ ముకు తాడు

ఒకప్పటికీ ఇప్పటికీ రాజకీయాల రంగు, రుచి, వాసనా పూర్తిగా మారిపోయాయి.  ఒకప్పుడు సంక్షేమ పథకాలంటే, పేద, బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే, అది కూడా కూడు, గుడ్డ, నీడకు మాత్రమే పరిమితంగా ఉండేవి. కానీ, ఇప్పుడు అన్నీ ఉచితాలే. అందరికీ ఉచితాలే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు ముఖ్యమంత్రులు, వందల ఎకరాలున్న భూస్వాములకు కూడా  రైతు బంధు, ఉచిత విద్యుత్, వంటి పథకాలు అమలవుతున్నాయి.  అలాగే, రాజకీయ పార్టీలు సంక్షేమం పేరిట ఉచిత పథకాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకు ఆంధ్ర పదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా 85 శాతం మంది ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందుతోందని, ఇంతవరకు మీట నొక్కి ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో వేశామని అందుకే ప్రజలంతా తమకే ఓటు వేస్తారని, 175కి 175 సీట్లు గెలుచుకుంటామని చెపుతున్నారు.  ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉచితాలకు సంకెళ్ళు వేసే దిశగా మరో అడుగు ముందుకు వేసింది . నిజానికి, ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం కూడా ఉచిత వరాల విషయంలో హేతుబద్దత అవసరమని సూచించింది. కాగా తాజగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు, అందుకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటో పార్టీలు స్పష్టంగా ఓటర్లకు తెలియజేయాలని లేఖలో ఈసీ సూచించింది.  ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదాన్ని కొట్టిపారేయాలేమని ఈసీ అభిప్రాయపడింది. ఉచిత హామీలకు సంబంధించి అనుసరించాల్సిన ఒక ఉమ్మడి ఫార్మాట్‌ను ఈసీ.. పార్టీలకు పంపింది. అలాగే 2015 ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చిన వివరాలు అందించాలని ఈసీ కోరింది. వాటిపై ఈనెల 19 లోపు సమాధానం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయడానికి.. రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది. నిజానికి, సంక్షేమం గీత దాటి సంక్షోభంలోకి దారి తీస్తున్న పరిస్థితిలో ఉచితాల పై సమగ్ర చర్చ అవసరమని ఆర్థిక నిపుణులు ఏప్పటి నుంచో సూచిస్తున్నారు.

బీఆర్ఎస్.. కేసీఆర్ పాన్ ఇండియా మూవీ.. ఖర్చుకు తగ్గేదేలే

కేసీఅర్   జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఒక పాన్ ఇండియా మూవీలా విడుదల కాబోతోంది.   ఖర్చుకు తగ్గేదేలే అంటూ చేతికి ఎముక లేదన్నట్లుగా డబ్బులు వెదజల్లుతున్నారు.  నిర్మాత ఎక్కడా వెనకాడకుండా, రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట,పది రూపాయలు ఖర్చుపెట్టి, సినిమాను చాలా రిచ్ గా తీశారు. సెట్స్  కాస్ట్యూమ్స్ ఒకటనేమిటి 24 ఫ్రేమ్స్ లో లక్ష్మీదేవి గలగలు కనిపిస్తాయి. వినిపిస్తాయి. ఇంతవరకు, నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  హిస్టరీలో ఇలా చేతికి ఎముక లేదన్నట్లుగా ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమా తీసిన నిర్మాతను చూడలేదు. సహజంగా నటీనటులు, దర్శకులు సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాతను ఇలాగే పొగిడేస్తుంటారు. సరే, చివరకు ఆ సినిమా హిట్టా, ఫట్టా, నిర్మాత పరిస్థితి ఏమిటి, అనేది పక్కన పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ వేదిక కోసం చేస్తున్న సన్నాహాలు, సినిమా బాబుల డాబులను మించి పోతున్నాయని  అంటున్నారు.   ఇప్పటికే, దేశం మొత్తం చుట్టి వచ్చేందుకు దేశంలో ఏ పార్టీకీ లేని విధంగా రూ.80 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏకంగా ఛార్టర్డ్ ఫ్లైట్ ను సిద్ధం చేసుకున్నారు. ఇక ప్రకటనల ఖర్చు, టీవీ స్లాట్స్ కు ఎన్ని వందల  వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో లెక్క లేదు. అదిగో పైన ఆ నిర్మాత గురించి నటీ నటులు చెప్పినట్లు, చేతికి ఎముక లేదన్నట్లుగా, తగ్గేదే లే అంటూ దేశం మొత్తం ధూమ్ ..ధామ్..గా ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బుల మూటలు కదిలిపోతున్నాయి., అంటున్నారు.  కేసీఆర్ ను జాతీయ హీరోను చేసేందుకు కటవుట్లు, హోర్డింగులు, ఒకటనేమిటి దేశాన్ని  గులాబీ మయం చేసందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అదొకటి అలా ఉంటే కేసీఆర్  సొంత విమానంతో పాటుగా సొంతంగా జాతీయ స్థాయిలో ఒక రెండు టీవీ చానెల్స్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తునట్లు తెలుస్తోంది. కేసేఆర్ ఆలోచన చేస్తున్నారు అంటే అది ఆయిపోనట్లే. కేసీఆర్ ను ప్రధానిగా, కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఏ వీరభిమానో, రేపు ఈ జేబులోంచి ఓ వంద కోట్లు, ఆ ప్యాకెట్ లోంచి మరో వంద కోట్లుతీసి భక్తిగా సమర్పించుకుంటే, రెండేమి ఖర్మ ఏకంగా నాలుగు చానల్స్, స్టార్ట్ చేసినా చేస్తారు. కేసీఆర్ కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు, వీరాభిమానులు క్యూ కడుతున్నప్పుడు, ప్రభుత్వ విప్ వినయభాస్కర్ చెప్పినట్లు  ఛార్టర్డ్ ఫ్లైట్స్ టీవీ చానల్స్, పత్రికలు, ఫ్రీ పుబ్లిసిటీ అసలు ఇష్యూనే కాదు  అంటున్నారు. అయితే, కేవలం డబ్బులు కుమ్మరిస్తే జాతీయ నాయకుడు అయిపోతారా? అలా ఆనుకుంటే కేసీఆర్ ను తక్కువ చేయడం కాదు కానీ, ఆయనను మించిన కుబేరులు దేశంలో చాలా మందే ఉన్నారు. నిజమో కాదో తెలియదు గానీ  సోనియా గాంధీ కూడా ప్రపంచలోనే అత్యంత ధనిక  మహిళా రాజకీయ నాయకులలో ఒకరని ఒకప్పుడు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ  చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతి కనిష్ట స్థాయికి, 50 సీట్లకు పడి పడిపోయింది.  నిజమే రాజకీయాల్లో రాణించేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్స్, టీవీ చానల్స్, పత్రికలు, సొంత మీడియా అవసరమే కానీ, కేవలం డబ్బులనే నమ్ముకుంటే, ఏమవుతుందో చెప్పేందుకు హుజురాబాద్ అనుభవం ఒక్కటి చాలు వేరే ఉదాహరణలు అవసరం లేదు అంటున్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమం డబ్బులతో సక్సెస్ కాలేదు. నిజానికి  ఈ రోజు తెరాస ఖాతాలో ఉన్న సోమ్ముల్లో ఒక్క శాతం కూడా ఆ రోజు లేవని అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే కేసీఆర్ కు ఇవ్వన్నీ తెలియవా అంటే తెలియక కాదు అయినా, అయన తెగ్గేదేలే .. అంటున్నారని అంటున్నారు. అందుకే  కేసేఅర్ జాతీయ చిత్రం హిట్టా ..ఫట్టా అనేది అప్పుడే తేలదని అంటున్నారు.

ఉత్తుత్తి హామీలు కుదరవ్.. కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్తుత్తి హామీలు ఇచ్చేసి ఎన్నికల పబ్బం గడుపుకోవాలనుకునే పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చే ఉత్తుత్తి హామీలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కఠినమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలపై  అభిప్రాయాలు కోరుతూ దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలలో ముఖ్యమైదని ఉత్తుత్తి హామీలకు చెక్ పెట్టడం. పార్టీలు ఎన్నికల సమయంలో కేవలం వాగ్దానాలు చేసి ఓట్లు దండుకోవాలన్న యావతో వ్యవహరించడం తగదు. చేసిన వాగ్దానాలతో ఆ వాగ్దానాలు నెరవేర్చుందకు అయ్యే వ్యయం వివరాలను, వాటి కోసం నిధుల లభ్యత వంటి వివరాలన్నీ ఓటర్లకు తెలియజేయాలన్నది ఎన్నికల సంఘం చేసిన ముఖ్యమైన ప్రతిపాదన. వాగ్దానాల అమలు కోసం నిధులను  ఎలా సమకూరుస్తారు? ఎఫ్ఆర్‌బీఎం పరిమితులపై వాటి ప్రభావం ఎలా ఉంటుంది? మరిన్ని అప్పులను తీసుకొస్తారా? వంటి వివరాలను రాజకీయ పార్టీలు ఒక   ప్రామాణిక ఫార్మాట్ లో తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆ లేఖలో పేర్కొంది  

ఆదిపురుష్ పై కోర్టుకు వెళ‌తా...మిశ్రా

టాలీఉడ్ సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ ఏ ముహూర్తాన రాముడు వేషానికి అంగీక‌రించాడో గాని  ఆదిపురుష్ సినిమా ఇంకా రిలీజ్ కావ‌డానికి ముందు వ‌చ్చిన టీజ‌ర్  అత‌ని ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తోంది. ఈ సినిమాలో రావ‌ణుడుగా సైఫ్ అలీఖాన్ చేశాడు.  రావ‌ణుని  ఆహార్య‌మే దారుణంగా ఉంద‌ని అప్పుడే వ్య‌తిరేక‌త వెల్లు వెత్తుతోంది. ఇపుడు ప్ర‌తీనిమిషం మ‌రింత ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతున్నాయి. తాజాగా మ‌ధ్య‌ ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా అస‌లా సినిమాలో హ‌ను మంతుడిని కూడా లెద‌ర్ బెల్ట్ క‌ట్టుకున్న‌ట్టు చూపించ‌డం మీద విప‌రీత అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. ఇలాంటి అనేక అభ్యంత‌ర అంశా లున్నా య‌ని వాటిని సినిమా లోంచి తొల‌గించ‌కుంటే ముఖ్యంగా హ‌నుమంతుడిని అలా చూపిస్తే తీవ్ర ప‌రిణా మాలు ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌స్తుందని ఆయ‌న హెచ్చ‌ రించారు.  ప్ర‌భాస్‌, కృతీసన‌న్‌, ద‌ర్శ‌క‌కుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ టీజ‌ర్‌ను అయోధ్య‌లో  ఆదివారం విడుద‌ల చేశా రు. రామాయ‌ణం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, లంకేసుడిగా సైఫ్ ఆలీఖాన్ న‌టిం చారు. కాగా టీజ‌ర్ తాను చూశాన‌ని, చూసిన మేర‌కు రావ‌ణుడు, హ‌నుమంతుని పాత్ర‌ల ఆహార్యం అంగీ కార‌యోగ్యంగా లేద‌ని మిశ్రా విలేక‌రుల‌తో అన్నారు. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌దివిన రామాయ‌ణ గాధ‌ల్లో, చూసిన చిత్రాల్లోనూ హ‌నుమంతుడు చెవి రింగులు, చ‌క్క‌టి నొక్కుల జుత్తు, చేతిలో జండాతో ఆకాశంలో ఎగురుతూ పోతున్న దృశ్య‌మే క‌ళ్ల‌ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కానీ ఈ చిత్రంలో దారుణంగా లెద‌ర్ దుస్తుల్లో చూపించార‌న్నారు. ఇదంతా భార‌తీయుల‌, హిందువుల న‌మ్మ‌కాన్ని దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని ఆయ‌న ఆగ్ర‌హించారు.  చిత్రంలో అలాంటి అభ్యంత‌ర‌క‌ర అంశ‌లున్నాయ‌ని, వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని చిత్ర నిర్మాత ఓమ్ రౌత్‌కి లేఖ రాశాన‌ని మిశ్రా అన్నారు. సినిమా హాళ్ల‌లో ఇదే చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తే మాత్రం చ‌ట్ట‌ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని మిశ్రా హెచ్చ‌రించారు. గ‌తంలోనూ  కాళీ డాక్యుమెంట‌రీ చిత్రం మీద కూడా  మిశ్రా అభ్యంత‌రం వ్యక్తం చేశారు. మాత ఎల్‌జిబిటి జండా ప‌ట్టుకుని, మ‌రో చేత్తో సిగ‌రెట్టు తాగు తున్న‌ట్టు పోస్ట‌ర్లు పెట్ట‌డం మీద ఆయ‌న ఆగ్ర‌హించారు. అనేక‌మంది వ్య‌తిరేకించ‌డంతో రాష్ట్రంలో ఆ చిత్రాన్ని నిషేధించారు. 

విడ‌గొట్టి  సారీ చెబితే ఎలా డిగ్గీరాజా?

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు, చిన్నప్పుడు విడిపోవాల్సివ‌స్తుంది. చాలాకాలం త‌ర్వాత పెద్దాయ‌న వ‌చ్చి మిమ్మల్నివిడ‌గొట్టింది మా వాళ్లే.. అందుకు సారీ.. ఇపుడు ప‌రిస్థితులు మాత్రం మీరు తెచ్చుకున్న‌వి గ‌నుక మ‌మ్మల్ని కారకులు చేయ‌వ‌ద్దు.. అని, చేసిన త‌ప్పిదాన్ని అంగీకరించి వెళ‌తాడు.. ఇదో పాత తెలుగు సినిమా సీన్‌. కాంగ్రెస్ నాయ‌కుడు దిగ్విజ‌య్ సింగ్  తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న జ‌రిగిన ఎనిమిదేళ్ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి అలాంటి డైలాగ్ చెప్పి వెళ్లారు.  కాగా, కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్రలో భాగంగా ఈ నెల 18న ఆంధ్రా ప‌ర్య‌ ట‌న‌కు రానున్నారు. యాత్ర‌కు మ‌ద్దతునివ్వాల‌ని, ఎలాంటి అడ్డంకులు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకో వాల‌న్న సం దేశం ఇమిడి ఉంద‌నే అనుకోవాలి.  చెయ్యాల్సిందంతా చేసి త‌న్నుకు చావండి.. అన్న‌ట్టుగా ఉంది ఆంధ్ర‌, తెలంగాణ విభ‌జ‌న వ్య‌వ‌హారం. పైకి విడిపోయినా మ‌నం అన్న‌ద‌మ్ముల‌మే, మ‌న భాష తెలుగు భాషా. ఎన్టీఆర్‌, నాగేశ్వ‌ర్రావుల‌నే  మేమూ ప్రేమిస్తున్న‌దీను, మ‌న పాట తెలుగు పాట ..అంటూ భారీ డైలాగుల‌తో కేసీఆర్ అల్లాయ్ బ‌ల్లాయ్ కార్య క్ర‌మాలు చేప‌ట్టారు. కొత్త‌ల్లో అన్నీ అలానే ఉన్నాయి. క్ర‌మేపీ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది.  జ‌గ‌న్ ఆంధ్రాలో అధికారంలోకి రావ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం చేసుకున్న కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచీ నీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో విభ‌జ‌న అంశాల మీద మొండి ప‌ట్టుద‌లే ప్ర‌ద‌ర్శిస్తూన్నారు.   రెండు రాష్ట్రాలు ఇంకా విభ‌జ‌నాంశాల‌పై రావ‌ల‌సిన వాటిపై ఇంకా చ‌చ్చించుకోవాల్సి ఉందని సానుకూ లంగా స్పంది స్తేనే అన్నీ సాధ్య‌మ‌వుతాయ‌ని వారానికోసారి హెచ్చ‌రిస్తున్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో అన్ని స‌ర్దుకుపోతాయ‌ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేంద్రం అందుకు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌నీ హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ స్వ‌యంగా కేంద్రంలో అధికార పీఠం ద‌క్కించుకోలేక‌పోయింది. కానీ ఆ విభ‌జ‌న అంత మ‌న స్పూర్తిగా ఆనందించాల్సిన అంశం కాద‌ని ఇపుడు దిగ్విజ‌య్ సింగ్ వాపోవ‌డ‌మే హాస్యా స్ప‌దం.  భారత్‌కు భిన్నత్వంలో ఏకత్వం బలమని, ఇపుడు బీజేపీ ఏక‌త్వభావ‌న‌నే  విచ్చినం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆయ‌న క‌ర్నూలులో మాట్లాడుతూ రాష్ట్ర విభ జన ఏపీకి గాయం చేసిందని అంగీరిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ  చేపట్టిన భారత్ జోడో యాత్ర  మొదలై నెల రోజులు కూడా పూర్తి కాకుండానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యాత్ర గురించి  భయపడుతున్నాయని అన్నా రు. భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఏపీలో కాం గ్రెస్ ఖచ్చితంగా బలపడుతుందని దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తమ్ముడికే చిరు మద్దతు

చిరంజీవి.. రాజకీయంగా తన మద్దతు ఎవరికన్నది కుండ బద్దలు కొట్టేశారు. బీజేపీకి దగ్గరౌతున్నారనీ, కాదు కాదు ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారనీ, అసలు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం లేదనీ, సినిమాలే ఆయన ప్రపంచమనీ ఇలా ఇప్పటి దాకా ఎవరికి తోచిన బాష్యాలు వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చిరంజీవి తన మనసులో మాట ఏమిటో కొంచం తడబడుతూ అయినా స్పష్టంగా చెప్పేశారు. అదీ రాజకీయంగా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ క్రియోట్ చేస్తుందన్న అంచనాలున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ఈ రాజకీయ ప్రకటన చేసేశారు. చిరంజీవి తాను ఏ గట్టునున్నాడో చెప్పేశారు. రాజకీయాలకు దూరం అంటూనే తన మద్దతు ఎవరికో ప్రకటించేశారు. తమ్ముడి కోసమే తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. ఇంతకీ ప్రజారాజ్యం స్థాపించిన ఆయన ఆ తరువాత పరిణామాలలో పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయినా.. ఇప్పటికింకా ఆయన సాంకేతికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. అది నిజం. అయినా సరే ఆయన తన మద్దతు తమ్ముడికే ఉందని నిర్ద్వంద్వంగా ప్రకటిచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్  నిబద్ధత ఏమిటో తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునని అంటూ, పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు, రాష్ట్రాన్ని పాలించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని చెప్పారు.   అలాంటి అధికారాన్ని ప్రజలు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూనే తనదైన స్టైల్ లో పిలుపు నిచ్చేశారు. ప్రస్తుతానికి అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని పునరుద్ఘాటిస్తూనే ఏమో భవిష్యత్ లో జనసేనకు జై కొడతానేమో, ఆ పార్టీకి మద్దతు ఇస్తానేమో అంటూ తన రాజకీయ మార్గమేమిటన్నది వెల్లడించేశారు.   రాజకీయాలలో తానో గట్టున, తమ్ముడో గట్టునా ఉండటం కంటే అంటే తమ్ముడూ నేనూ రాజకీయంగా చెరోగట్టునా ఉండటం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్ కు హెల్ప్ అవుతుందని చిరంజీవి అన్నారు.  అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడిక తాను తన తమ్ముడి వైపే నిలబడతాననీ చెప్పకనే చెప్పేశారు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. చిరంజీవి జనసేన పార్టీపై ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు. దీంతో ఆయన జనసేన పట్ల అయిష్టతతో ఉన్నారన్న ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. వైసీపీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారన్న వార్తలూ వెల్లువెత్తాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టేశారు.

ప్రకోపించిన ఓమ్ రౌత్ పైత్యం.. ఆదిపురుష్ లో రావణుడి గెటప్ చూశారా?

రామాయ‌ణంలోని రావ‌ణాసురుడు ఎలా ఉంటాడు?.. 'భూకైలాస్‌', 'సీతారామ క‌ల్యాణం' సినిమాల్లో విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ధ‌రించిన పాత్ర మాదిరిగా ఉంటాడు. బాపు తీసిన 'సంపూర్ణ రామాయ‌ణం'లో మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు త‌ర‌హాలో ఉంటాడు. మ‌న‌కు రావ‌ణుడంటే.. ఆ సినిమాల్లో క‌నిపించిన రావ‌ణుడే! నుదుటిన శివ‌నామం, త‌ల‌పై పొడ‌వాటి కిరీటం, భుజాన గ‌ద‌, ఛాతీని క‌ప్పివేసే భారీ ఆభ‌రణాలు, ప‌ట్టు ధోవ‌తి.. ఇదీ రావ‌ణుని ఆహార్యం! కానీ 'ఆదిపురుష్‌'లో మ‌నం చూసిన రావ‌ణుడు మ‌న ఊహ‌ల్లోని రావ‌ణునికి పూర్తి భిన్నంగా ఉన్నాడేంటి?  పొడ‌వుగా పెరిగిన గ‌డ్డం, లెద‌ర్ జాకెట్‌! రావ‌ణుడు ఇలా ఉంటాడా? రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్‌'. శ్రీ‌రామునిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్, ల‌క్ష్మ‌ణునిగా స‌న్నీ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'ఆదిపురుష్' టీజ‌ర్ చూసిన వాళ్ల‌కి మ‌తిపోయింది. ప్ర‌ధానంగా రావ‌ణుడు, ఆంజ‌నేయుడి రూపాలు చూసి వాళ్లు షాకైపోతున్నారు. ఇప్ప‌టికే అనేక భార‌తీయ భాష‌ల్లో రామాయ‌ణ గాథ ఆధారంగా ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వాటి వ‌ల్ల‌ భార‌తీయుల హృద‌యాల్లో సీతారాములు, రావ‌ణుడు, ఆంజ‌నేయుల రూపాలు ఎలా ఉంటాయ‌నేది ముద్రించుకుపోయింది.  వాటికి భిన్నంగా 'ఆదిపురుష్' మూవీలో రావ‌ణుడి ఆహార్యం క‌నిపించేస‌రికి అందరూ  విస్తుపోతున్నారు. 'భూకైలాస్‌'లో, 'సీతారామ క‌ల్యాణం'లో రావ‌ణాసురునిగా విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. రావ‌ణుని క్యారెక్ట‌ర్‌కు ఆయ‌న హీరో ఇమేజ్ క‌ల్పించారు. రావ‌ణుడు ఇలాగే ఉంటాడ‌నేలా ఆయ‌న రూపం మ‌న మ‌న‌సుల్లో హత్తుకుపోయింది. అలాగే బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయ‌ణం' చిత్రంలో రావ‌ణునిగా విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు న‌ట‌న‌నూ, ఆయ‌న రూపాన్ని మ‌నం మ‌ర‌వ‌గ‌ల‌మా! కానీ లంకేశ్ అనే రావ‌ణునిగా 'ఆదిపురుష్' టీజ‌ర్‌లో సైఫ్ అలీఖాన్‌ను చూస్తే.. ఇద‌స‌లు రామాయ‌ణ క‌థ ఆధారంగా తీస్తున్న సినిమాయేనా, లేక రామాయ‌ణాన్ని త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లు మార్చి ఓమ్ రౌత్ సొంత పైత్యం ప్రదర్శిస్తున్నాడా అన్న అభిప్రాయం క‌లుగుతోంది. 'ఆదిపురుష్' టీజ‌ర్ చూశాక‌.. భార‌తీయుల జీవితాల్లో ఒక భాగ‌మైన రామాయ‌ణాన్నీ, అందులోని పాత్ర‌ల‌నూ త‌మ ఇష్టం వ‌చ్చిన రీతిలో చూపించడం క‌రెక్టేనా? అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమం వేదికగా ఓమ్ రౌత్ ను నిలదీస్తున్నారు. ఆ టీజ‌ర్‌లో రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్.. గుబురుగా పెరిగిన పొడ‌వాటి గ‌డ్డం, ద‌గ్గ‌ర‌గా క‌త్తిరించిన త‌ల‌పై జుట్టు, ఒంటికి లెద‌ర్‌తో చేసిన జాకెట్ ధ‌రించి, నీలి క‌ళ్ల‌తో క‌నిపించాడు. పురాణ పురుషుడైన‌ రావ‌ణుడు ఎలాంటి దుస్తులు ధ‌రిస్తాడ‌నేది మ‌న‌కు క‌చ్చితంగా తెలీక‌పోవ‌చ్చు కానీ.. ఇప్ప‌టికే ప‌లు సినిమాల ద్వారా ఆయ‌న కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయనేది మ‌న మ‌న‌సుల్లో ఒక స్థిర‌మైన ముద్ర‌ప‌డి ఉంది. ఆ ఊహ‌ల‌కు, ఆ న‌మ్మ‌కాల‌కు ఏమాత్రం సంబంధంలేని రీతిలో రావ‌ణుడిని డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ చూపిస్తున్నాడ‌ని అర్థ‌మైపోతోంది. అస‌లాయ‌న ఏ రామాయ‌ణ గ్రంథం ఆధారంగా 'ఆదిపురుష్' తీస్తున్నాడో చెప్పాల‌ని అనేక‌మంది ప్ర‌శ్నిస్తున్నారు. అలా ప్ర‌శ్నిస్తున్న‌వారిలో 'కేజీఎఫ్' ఫేమ్ మాళ‌వికా అవినాశ్ కూడా ఉన్నారు. రామాయ‌ణాన్ని స‌రిగా అధ్య‌య‌నం చేకుండా 'ఆదిపురుష్‌'ను తీశారంటూ ఓమ్ రౌత్‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. రీసెంట్‌గా ఓ ట్వీట్‌లో ఆమె, "లంక‌కు చెందిన రావ‌ణుడు శివ‌భ‌క్తుడైన ఓ బ్రాహ్మ‌ణుడు. 64 క‌ళ‌ల్లో ప్ర‌వీణుడు. వైకుంఠానికి ర‌క్ష‌ణ‌గా ఉండే జ‌య (విజ‌య‌) ఓ శాపం కార‌ణంగా రావ‌ణునిగా జ‌న్మించాడు. ఇత‌ను (ఆదిపురుష్ లంకేశుడు) ట‌ర్కీకి చెందిన నిరంకుశుడు కావ‌చ్చేమో కానీ రావ‌ణుడు మాత్రం కాదు! మ‌న రామాయ‌ణం/ చ‌రిత్ర‌ను త‌ప్పుగా చూపించ‌డాన్ని బాలీవుడ్ మానుకోవాలి. లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడూ విన‌లేదా?" అని ఆమె రాసుకొచ్చారు. 'ఆదిపురుష్' మూవీ ద్వారా ఓమ్ రౌత్ రామాయ‌ణాన్నీ, దాని స్ఫూర్తినీ వ‌క్రీక‌రిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. స్వేచ్ఛ ముసుగులో భార‌తీయులంద‌రూ ఆరాధించే రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రిస్తే ఊరుకొనేది లేద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. దేశ‌ ప్ర‌జ‌ల నాగ‌రిక‌తో ఒక భాగ‌మైన రామాయ‌ణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తున్న‌ప్పుడు చాలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి కానీ, ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎలా తీస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  కాగా, కోట్లాదిమంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒక‌టైన‌ 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ‌య్యాక.. అద‌స‌లు లైవ్ యాక్ష‌న్ సినిమాలాగా లేద‌నీ, ఓ యానిమేష‌న్ సినిమాలా ఉంద‌నీ అనేక‌మంది కామెంట్స్ చేస్తున్నారు.  వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కూడా క్వాలిటీతో లేద‌నీ, సినిమా ఓ వీడియో గేమ్‌లాగా క‌నిపిస్తోంద‌నీ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

బాలు విగ్రహంపై అభ్యంత‌ర‌మేమిటి?

అభిమానులు నాయ‌కుల విగ్ర‌హాలు పెట్టుకోవ‌డం మామూలే. మ‌ర‌ణించిన నాయ‌కుల ప‌ట్ల త‌మ ఆరాధ నా భావాన్ని వ్య‌క్తం చేయ‌డానికి అన్ని సంద‌ర్భాల్లోనూ పూజ‌లు చేయ‌డం, పూల‌దండ‌లు వేయ‌డం, పాలాభిషేకాలు చేయ‌డం ప‌రిపాటి. ఉత్త‌రాది మాట ఎలా ఉన్నా ద‌క్షిణాదిన మ‌రీ ఎక్కువే. కానీ విప‌క్షాలు వాటిని ప‌డ‌గొట్ట‌డాలు, గొడ‌వ‌లు సృష్టించ‌డాలూ జ‌రుగుతున్నాయి. ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందిన గాయ‌ కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం విగ్ర‌హాన్ని తొల‌గించి అభిమానులను ఆగ్ర‌హానికి గురిచేశారు.  బీపీ మండ‌ల్ విగ్ర‌హం వివాదం ముగియ‌క‌ముదే ఎస్పీ విగ్ర‌హాన్ని గుంటూరులో మున్సిప‌ల్ సిబ్బంది తొలగించారు. అనుమ‌తి లేద‌ని తొల‌గించ‌డంపై అభిమానులు మండిప‌డుతున్నారు. గుంటూరులో అనేకానేక విగ్ర‌హాలకు అనుమ‌తి లేదు. అయినా వాటి జోలికి వెళ్ల‌కుండా బాల‌సుబ్ర‌మ‌ణ్యం విగ్ర‌హానికి అభ్యం త‌రం చెప్ప‌డం వెనుక ఆంత‌ర్య‌మేమిటి.  ప్రజా సంఘాలు, కళాకారుల సంఘాలు తమ వద్దకు రాకుండా దూరం అవుతున్నారనే భావంతో దగ్గరకు చేర్చుకునేందుకు వైసీపీ నేతలు అనుసరిస్తున్న ఎత్తుగడని వారు భావిస్తున్నారు. బీపీ మండల్ విగ్ర హం విషయంలో ఎలాంటి రాజకీయం అమలు చేశారో.. ఇప్పుడు ఎస్పీ బాలు విగ్రహం విషయంలో కూడా అదే రకమైన రాజకీయాన్ని అధికారపార్టీ నేతలు ఉపయోగిస్తున్నారు. గుంటూరు, లక్ష్మిపురం సెంటర్‌లోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద కళాదర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ బాల సుబ్రహ్మమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ గత రాత్రి విగ్రహాన్ని తొలగిం చి పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పెట్టారు. ఈ ఘటనపై సినీ కళాకారుల సంఘాలు  మండి పడ్డాయి. బలసుబ్రహ్మణ్యంకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ కళాదర్బార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి.. కేసీఆర్ కొత్త పార్టీపై షర్మిల సెటైర్లు

తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలలాగే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధినేత్రి కూడా అంతం కనిపించని పాదయాత్ర సాగిస్తున్నారు. ఆమె పాదయాత్రకు ప్రజా మద్దతు సంగతి ఎలా ఉన్నా.. ఆమె అధికార పక్షం నేతలు, తెరాస అధినేత కేసీఆర్ ఆయన కుటుంబ  సభ్యులే లక్ష్యంగా చేస్తున్న విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ విమర్శలపై చర్చ జరుగుతోంది. ఆమె పరిధి మీరి విమర్శలు చేస్తున్నారంటూ తెరాస నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఊరుకున్నారే కానీ... ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి, ప్రతి విమర్శలు చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఆమె తండ్రి వైఎస్ఆర్ పార్టీని ఇప్పటికీ తమ నేతగా చెప్పుకునే కాంగ్రెస్ మాత్రం షర్మిల కాంగ్రెస్ పై చేసిన విమర్శలను గట్టిగా తిప్పి కొట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక్కరే ఇప్పటి వరకూ షర్మిల విమర్శలకు గట్టిగా రిటార్డ్ ఇచ్చారు. తెలంగాణ వ్యతిరేకిగా వైఎస్ ను నిత్యం విమర్శించే టీఆర్ఎస్ మాత్రం షర్మిల విమర్శలను కనీసం గట్టిగా ఖండించేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. తాజాగా షర్మిల కేసీఆర్ దసరా రోజున ప్రకటించనున్న జాతీయ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటించనున్న కొత్త పార్టీ బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) కాదనీ అది బార్ అండ్ రెస్టారెంట్ సమితీ అంటూ అభివర్ణించారు.   రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపు లేని కేసీఆర్ తగుదునమ్మా అంటూ జాతీయ పార్టీ పెట్టడమేమిటని విమర్శించారు.  బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని విమర్శలు గుప్పించారు. మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో సోమవారం( అక్టోబర్ 2) నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె కేసీఆర్ కొత్త పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.  సీఎం కేసీఆర్‌ తనను తాను మహాత్మాగాంధీతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని, కేసీఆర్‌లా గాంధీజీ  దొంగ దీక్షలు చేయలేదన్నారు. కోట్లాది మంది ఉద్యమం, వందల మంది ఆత్మబలిదానాలు, త్యాగాల ఫలితమే తెలంగాణ ఆవిర్బావమని షర్మిల చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం తానే తెలంగాణ తీసుకువచ్చానని చెప్పుకుంటున్నారనీ, రాష్ట్రాన్ని కుటుంబం జాగీరుగా మార్చుసుకున్నారని దుయ్యబట్టారు.  తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కుటుంబం ఎప్పుడైన లాఠీ దెబ్బలు తిన్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇంట్లో ఎంత మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని నిలదీశారు. 

ఒకే ఒక్కడు..!

ఆవిర్భావ క్షణం నుంచి ఆఖరి క్షణం వరకు.. ఒకే ఒక్కడు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన చరిత్ర ఉన్న పార్టీలు ఎన్నో ఉండవేమో. అరుదుగా అలాంటి పార్టీలు కొన్నిఉన్నా, అవి అనామక పార్టీలే, అయ్యుంటాయి కానీ  చరిత్ర సృష్టించిన పార్టీలు అయితే కాకపోవచ్చును. కానీ, మరి కొద్ది గంటల్లో కాలగర్భంలో కలిసిపోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆవిర్భావ క్షణం నుంచి చివరి వరకు కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఒక్కరే, పార్టీ అధ్యక్షునిగా కొనసాగారు. అందుకే, ఏక వ్యక్తి సారధ్యంలో పుట్టి,. పెరిగి. కాలగర్భంలో కలిసి పోయిన పార్టీ తెరాస తప్ప మరొకటి ఉండదేమో. అంటున్నారు. కానీ, అది పూర్తి సత్యం కాదు.   నిజమే, ఎక్కడి దాకానో వెళ్ళ కుండానే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, ఆయన చేతుల మీదుగానే వెళ్ళిపోయింది. అలాగే, మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీ వంటి మరి కొన్ని పార్టీలు కూడా ఉంటే ఉండవచ్చును. కానీ, తెరాసకు అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.  అందుకే తెరాసను ఆ పార్టీల గాటన కట్టడం సమంజసం కాదు, కుదరని వ్యవహారం అని  పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే  రాజకీయంగా చూసినప్పుడు కేసీఆర్, చిరంజీవి మధ్య తూకం కుదరదని అంటున్నారు. చిరంజీవి పార్టీ ఒక ఫ్లాఫ్ చిత్రం. కానీ, తెరాస  తెలంగాణ సాధించిన పార్టీగానే కాకుండా, వరసగా రెండు సార్లు ప్రజలు ఆదరణతో అధికారం చేపట్టిన పార్టీ. తెరాస ఆవిర్భావానికి చారిత్రక నేపధ్యం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల వేదికగా, ఉద్యమ పార్టీగా పుట్టిన తెరాస సుమారు పుష్కర కాలం పైగా ఉద్యమ బాటలోనే నడిచింది. ఆరు పదుల తెలంగాణ కలను సాకారం చేసింది.  సుమారు 1200 మందికి పైగా యువకుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సరే   అలాంటి పార్టీ ఇలా అర్ధాంతరంగా కనుమరుగై పోవడం ఒక విధంగా అనూహ్య పరిణామం.  నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకనో ఏమో కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే, కేసేఆర్, ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు. ఉద్యమ పార్టీని ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసేఆర్ రాష్ట్ర రాజకీయ గతినీ మార్చి వేశారు. ఉద్యమ వాసనలు  లేకుండా ఉద్యమ ఆనవాళ్ళు కనిపించకుండా, ఉద్యమ గీతం వినిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళు నిండినా  అమరవీరుల స్థూపం ఇంకా పూర్తికాలేదు. సగం మంది అమరవీరుల చిరునామాలే చిక్కలేదు. అమరవీరుల కుటుంబాలకు ఇవ్వవలసిన గౌరవం, పరిహారం ఇంతవరకు అందనే లేదు. ఇక ఇప్పుడు ఏకంగా తెరాసకు వీడ్కోలు పలికేందుకు  ముహూర్తం ఖరారు చేశారు.  అదలా ఉంటే తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడి పడిన తెరాస చరిత్ర పుటల్లో చేరిపోవడం అందరినీ కాకున్నా కొందరిని బాధిస్తోందని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం, చీమలు పెట్టిన పుట్టలో విషనాగులు చేరినట్లు  తెరాసలో ఉద్యమ ద్రోహులు చేరిన నేపధ్యంలో, తెరాస కనుమరుగు కావడమే మేలని అంటున్నారు.

బీజేపీ బాణం ఎవ‌రికి గాయం?

రాజ‌కీయాల మ‌లుపు ఊహించ‌నివి, చిత్ర విచిత్ర‌మైన‌వీను. ఎవ‌రు ఎవ‌ర్ని చెట్టెక్కిస్తారు, ఎవ‌రు ఎవ‌ర్ని ద‌గ్గ‌ర‌కుచేర్చుకుంటారు, ఎవ‌రు ఎవ‌ర్ని దూరం చేసుకుంటార‌న్నది ఇద‌మిద్ధంగా ఫ‌లానా కార‌ణ‌మ‌ని చెప్పడం బ‌హు క‌ష్ట్ హై. ఇక్క‌డ సాగినా సాగ‌క‌పోయినా కేంద్రంలో తేల్చుకుంటాన‌ని ఒంటికాలిమీదా లేస్తుంటారు. ఎన్నాళ్లీ ప్రాంతీయ‌ త‌త్వం.. ఇక సాగిద్దాం కేంద్రంతో తాడో పేడో అన్న ఉత్సాహంతో ఉర‌క‌లూ వేస్తుంటారు. ఇపుడు ఉర‌క‌లు వేస్తూ ఢిల్లీలో కొత్త పార్టీతో హ‌ల్ చెల్ చేయించాల‌న్న ధోర‌ణితో   తెగ హడావుడి పడుతున్న టిఆర్ఎస్ అధినేత తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. కేసీఆర్ ఢిల్లీ క‌లలు పండించుకోవ‌డానికి ఓ పార్టీ అవ‌స‌రం గ‌నుక బీఆర్ ఎస్ అంటూ టీఆర్ఎస్ కే జాతీయరంగు పులి మారు. ఇపుడు ఆయ‌న మ‌రింత ఠీవీగా న‌డ‌వ‌డానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుక్కార‌ణం బీజేపీ వారితో లోపాయ కారి ఒప్పందాలు జ‌రిగాయ‌న్న ఆరోపణలను ఎదుర్కొంటుండడమే. అస‌లు టీఆర్ ఎస్ రెండోప‌ర్యాయం అధికారంలోకి రావ‌డ‌మే బీజేపీ స‌హాయ‌స‌హ‌కారాల‌తోన‌ని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్‌గా మారింద‌న్న అభిప్రాయాలు ఢిల్లీ నుంచి పటాన్ చెరు వ‌ర‌కూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల కేంద్రం మీద, బీజేపీ మీద టీఆర్ ఎస్ అధినేత‌, నేత‌లు ఎంత విరుచుకుప‌డుతున్నా బీజేపీ మాత్రం న‌వ్వుకుంటోంది, అరకొరగా ప్రతి విమర్శలు చేస్తోందే కానీ గ‌ట్టిగా, దీటుగా తెరాస నేతల నోళ్లు మూయించేలా వ్యవహరించడం లేదు. ఇందుకు కార‌ణం వారికి కావ‌ల్సింది తెలంగాణాలో పాగా వేయ డం, అందుకు టీఆర్ ఎస్ కంటే కాంగ్రెస్ ను  అడ్డు తొల‌గించుకోవ‌డం ముఖ్యం. తెలంగాణలో కాంగ్రెస్ బ‌లం పుంజుకోవ‌డంతో పాటు కాస్తంత దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో తెరాస కంటే కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకూ బీజేపీ ప్రథమ తాంబూలమిస్తోంది. తెలంగాణాలో పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో కొంద‌రు నాయ‌కుల‌ను వాగ్ధాటి ఉన్న‌వారిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మీద దాడి చేయ‌డం జ‌రుగుతోంది. కానీ టీఆర్ ఎస్ ప‌ట్ల మాత్రం అంత ఘాటు ప్రేలాప‌న‌లేవీ లేవు. పైకి తిడుతున్న‌ట్టు క‌న‌ప‌డుతున్నా, లోలోప‌ల సారీ మావా.. అన్న సామెత‌గా సాగుతోంది టీఆర్ ఎస్‌, బీజేపీ దోస్తానా.  ఎంఐఎంని గ‌ట్టిగా టీఆర్ ఎస్ తిట్ట‌లేన‌ట్టే, బీజేపీ మ‌రింతగా ఈడీ దాడులు టీఆర్ ఎస్ మీద ప‌రుగులెత్తించ‌డ‌మూ లేదు. వేడి త‌గ్గించి ఏదో తూతూ మంత్రంలా ఎవ‌రూ అవమానించ‌కుండా బీజెపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. దక్షిణాది లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పాగా వేయాలంటే, బీజేపీ ఇపుడు కావ‌ల‌సింది కేసీఆర్ లాంటి నాయ‌కుడే.  టీఆర్ ఎస్‌కి, ప్ర‌త్యేకించి కేసీఆర్‌కి కావ‌ల‌సింది తెలంగాణాలో కాంగ్రెస్ అడ్డంకి తొల‌గించుకోవ‌డ‌మే. అం దుకే ఇక్క‌డ బీజేపీని తిడుతున్నా ఆన‌క బీజేపీ భ‌జ‌న మాత్రం చేస్తోంది  టీఆర్ ఎస్‌. ప్రాంతీయంగా అలాగే కమలం పార్టీకి కూడా  కాంగ్రెస్‌  గెల‌వ‌కుండా చేయ‌డానికి ఇక్క‌డ బ‌ల‌మున్న నాయ‌కులు, పార్టీ అవ‌స‌రం గుర్తించింది గ‌నుక నే బీజేపీ కేసీఆర్‌ను ఎన్నుకుంది. దీని వ‌ల్ల కేసీఆర్‌కి క‌లిగే ప్ర‌యోజ‌నం ఎలా ఉన్నా,  బీజేపీ మాత్రం ఎంతో ల‌బ్ధిపొందుతుంది. అన్నిటికీ మించి ఎదుటివాడి మీదకు పక్కవాడి భుజం మీంచి తూటా పేల్చాలనే వ్యూహాన్నే ఇరు పార్టీలూ అనుసరిస్తున్నాయి. బీజేపీ నిజంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజృంభించి అధికారంలోకి వ‌స్తే, టీఆర్ఎస్ మీద కంటే కాంగ్రెస్ మీద భారీ విజ‌యంగానే భావిస్తుంది. కేంద్రంలో అధికారమంటూ నేల విడిచి సాము చేస్తున్న కేసీఆర్ మాత్రం ఇక్క‌డ పార్టీ ప‌రి స్థితిని ఇప్ప‌టికే  ప్ర‌శ్నించే అభిమానుల‌కు, ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు  న‌మ్మ‌కంగా గ‌ట్టి స‌మాధా నం ఇవ్వ‌లేక‌పోతున్నారు.

అభిమానం ఖ‌రీదు అక్ష‌రాలా రూ.24 వేలు!

ప్ర‌తీవారికి ఒక అభిమానన‌టుడో, క్రీడాకారుడో ఉంటారు. అభిమానం వేలంవెర్రిగాకుండానే ఉండాలి. స్థాయి మించి వెర్రిగా మారితేనే తెలీకుండా ఎంతో న‌ష్టం చేసుకుంటారు. ఆ న‌టుడు, ఆ క్రీడాకారుడూ బాగానే ఉంటారు, ఓ ఫోటోనో, ఆటోగ్రాఫో, న‌వ్వో ప‌డేసి వెళిపోతారు. ఆన‌క ఆలోచించిచూస్తే న‌ష్ట‌పోయేది మాత్రం ఈ  వీరాభిమానే. అందువ‌ల్ల ఏద‌న్నాస‌రే హ‌ద్దులు మీర‌కూడదంటారు. కానీ  రాహుల్ రాయ్ మాత్రం  హ‌ద్దులు చాలా మీరేడు! అస్సాం కుర్రాడు రాహుల్ రాయ్‌కి కింగ్ కోహ్లీ అంటే ప‌డి చ‌చ్చేంత ఇష్టం. అస‌లు స‌చిన్‌,  కోహ్లీల‌కు ఇ లాంటి వీరాభిమానులే ఉన్నారు, ఉంటారు. ఎంత అభిమానం, ప‌చ్చి అంటే కింగ్ కోసం అస్సామీ కుర్రా డు ఏకంగా 23 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు!  అదుగో అలా ఆశ్చ‌ర్య‌ప‌డ‌వ‌ద్దు.. అదంతే.. కోహ్లీయా మ‌జాకా..!   మొన్న గౌహ‌తీలో మ్యాచ్‌కి టీమ్ ఇండియా వ‌చ్చిన‌పుడు కోహ్లీని చూడాల‌ని బోర్జార్ ఎయిర్‌పోర్ట్‌కి రాహుల్ రాయ్ వెళ్లాడు. అక్క‌డ క‌ల‌వ‌లేక‌పోయాడు, టీమ్ వెళ్లే బ‌స్సు వెంట‌బ‌డ్డాడు.. కోహ్లీ క‌ళ్ల‌లో ప‌డాల‌ని..అన్ని య‌త్నాలూ విఫ‌ల‌మ‌య్యాయి. స్టేడియంలోకి వెళ్లేముందు కూడా ప్ర‌య‌త్నించాడు. కానీ సెక్యూరిటీ అస్స‌లు ద‌రిదాపుల్లోకి వెళ్ల‌నీయ‌లేదు.  గౌహ‌తీలో క‌ల‌వ‌కుంటే ఆ త‌ర్వాత ముంబై, ఢిల్లీ వెళ్లి క‌ల‌వ‌డం మ‌రీ దుర్ల‌భం అనుకున్నాడు. వెంట‌నే అత‌నికి ఓ మెరుపు ఆలోచ‌న‌వ‌చ్చింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లోనే తాను ఒక గ‌ది బుక్ చేసుకుంటే ఎలా అని. ఇది విన‌డానికి చిత్రంగా ఉంటుంది గాని ప్ర‌య‌త్నించి సాధించాడు. అయితే అందుకు అత‌నికి త‌ల‌కు మించిన భార‌మే అయింది. కోహ్లీ ఉన్న హోట‌ల్లో ల‌క్కీగా ఓ గ‌ది ఖాళీగా ఉండ‌డం రాహుల్ భ‌గ‌వంతుడు ద‌య అనుకున్నాడు. అయితే హోట‌ల్ వారు మాత్రం రూ.23,400 క‌ట్ట‌మ‌న్నారు.  డబ్బు కాదు కింగ్ కోహ్లీని ద‌గ్గ‌రగా చూడటం, వీల‌యితే ఒక మాట‌, మ‌రీ వీల‌యితో ఓ సెల్ఫీ అనుకుని ధైర్యం చేశాడు.   అక్క‌డ చాలాసార్లు పేరుపెట్టి పిలిచాడు, నాలుగ‌యిదు సార్లు త‌ర్వాత కింగ్ చూశాడు.. వీడెవడ్రా న‌న్ను పిలుస్తున్నాడ‌నుకుని చూశాడు.. ఎవ‌రో అభిమాని అనుకున్నాడే గాని వీడు దారుణ‌మైన వీర వీరాభిమాని అన్న సంగ‌తి తెలియ‌దు. మొత్తానికి కింగ్ ద‌గ్గ‌రికి వెళ్లి రెండు మాట‌లు మాటాడి, ఒక సెల్ఫీ తీసుకున్నా డు. కోహ్లీ ఎంతో అభిమానంగా మాట్లాడాడ‌ట‌. రాహుల్ ఆనందానికి అంతే లేదు.   భార‌త్ ఆ మ్యాచ్ గెలిచింది.. రాహుల్ ఇంటికెళ్లితే మ‌రి వాళ్ల కుటుంబం ఏమ‌న్న‌దో మాత్రం తెలియ లేదు!

అలిపిరి ప్రమాదం నుంచి బాబును దేవుడు కాపాడిందిందుకేనేమో?!

ప‌రిస్థితులు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. కాలంతోపాటు ప‌రిస్థితులు మారుతుంటాయి. ఇవాళ్టి అవాంతరం కొంత‌కాలం త‌ర్వాత గొప్ప భ‌విష్య‌త్ మార్గాన్ని సూచించ‌వ‌చ్చు. ఊహించ‌నివి జ‌రుగుతూంటాయి. కొన్ని అనుభ‌వంలోకి వ‌స్తాయి..ఏమ‌యిన‌ప్ప‌టికీ ధైర్య‌వంతులు, స‌మాజ సంక్షేమాన్నిమ‌న‌సా వాచా ఆశించేవారే ఆ వెలుగులో ముంద‌డుగు వేయ‌గ‌ల్గుతారు. వారే మార్గ‌ద‌ర్శ‌కులు అవుతున్నారు. ఇందుకు కాలం క‌ల్పించే అడ్డంకులు, బాధ‌లు, ఇబ్బందులు, ప్ర‌మాదాలు ఏవీ లెక్క‌లోకి రావు, ఏవీ అడ్డుకోలేవు. ఇది ఏదో మాట‌లు చెప్ప‌డం కాదు, ఇది వాస్త‌వం. ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ తెలుగు దేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు విష‌యాన్నే తీసుకోవ‌చ్చు.  సరిగ్గా 19 ఏళ్ల కిందట.. అక్టోబర్ 1, 2003న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పెను ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. నక్సల్స్ పకడ్బందీ ప్రణాళికతో జరి పిన క్లెమోర్ మైన్ దాడిలో చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ఆయన తిరుమల వెళు తుండగా అలిపిరి వద్ద జరిగింది. సంఘటన జరిగిన ప్రదేశం, పేలుడు ధాటి చూసిన వారంతా  ఆ ప్రమా దం నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారంటే అది కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి మహిమే అన్నారు. మంచి నాయ‌కుడిని ఎవ‌రూ దూరం చేసుకోవాల‌నుకోరు, తెలుగు ప్ర‌జ‌లంతా ఆయ న్ను కోర‌కు న్నారు.. ఆయ‌న మ‌ళ్లీ ఎంతో ఆరోగ్యంగా, రెట్టింపు ఉత్సాహంతో జ‌నాల్లోకి  వ‌చ్చారు. అంతటి ప్రమాదం నుంచి భగవంతుడు తనను ఎందుకు కాపాడాడంటే.. సమాజం కోసం, తెలుగు రాష్ట్రం కోసం తాను చేయాల్సిన పని ఇంకా ఉందనే భావిస్తున్నానని అప్పట్లో చంద్రబాబు కూడా అన్నారు. అంతటి ప్రమాదం నుంచి వెంకటేశ్వరుడు చంద్రబాబును ఎందుకు కాపాడారో.. చంద్రబాబును ప్రాణా లతో కాపాడిన కారణమేమిటో 2014లో అందరికీ అర్ధమైంది. రాష్ట్ర విభజనతో జీరోగా మిగిలిపోయిన విభజి త ఆంధ్రప్రదేశ్ ను  నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకే నని.. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం  చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలూ తేటతెల్లం చేశాయి. దేవ తల రాజధాని ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా నిర్మించే గురుతర బాధ్యత చంద్రబాబుపై ఆ భగవంతుడే ఉంచాడా అని పించక మానదు. భద్రాచలంలో రామాలయ నిర్మాణం కోసం రామదాసును రాముడే ఆశీర్వదించాడం టారు.  రాముడి ఆశీశ్సులతో ప్రజా సహకారం తీసుకుని రామాలయ నిర్మాణానికి ఉపక్రమించిన రామదాసు    ఎన్ని కష్టాలు ఎదుర్కొన వలసి వచ్చిందో చరిత్ర చెబుతోంది. అలాగే  అమరావతి నిర్మాణానికి పూను కున్న చంద్రబాబుకూ అవాంతరాలు ఎదురౌతున్నాయి. దేవతల కార్యాన్ని పూర్తి చేసే క్రమంలో రాక్ష సులు అడ్డంకులు సృష్టించడం పురాణాల కాలం నుంచీ వస్తున్నదే. రామాయణ ఇతిహాసం చెప్పే విషయం అదే. ఆ అవాంతరాలన్నీ అధిగమించి చివరకు అనుకున్నది సాధించడమే నాయకుడి లక్ష ణం. ఇప్పుడు అమరావతికి అడుగడుగునా ఎదురౌతున్న అవాంతరాలు రాక్షస మూకల అడ్డంకులు పెరుగుతున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం అకుంఠిత దీక్ష‌తో పోరాడుతూనే ఉన్నారు.  మంచికి ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రు సాయ‌ప‌డుతూనే ఉంటారు.. ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో దేవ‌త‌లు సాయ ప‌డ్డారు. చంద్ర‌బాబు అమ‌రావ‌తి నిర్మాణానికి వేసుకున్న ప్ర‌ణాళిక‌లు అన‌తికాలంలో కార్య‌రూపం లోకి రావాల్సింది. కానీ ప‌రిస్థి తులు మారాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయాన్ని ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది.  ప్ర‌జ‌లు తెలీకుండానే గొప్ప దార్శనికుడి నాయకత్వాన్ని కాదనుకున్నారు వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. వస్తూనే చంద్ర‌బాబు విజ‌న్‌ని దెబ్బ‌తీసింది. ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టి, ఆరంభించి కొన‌సాస్తున్న ప‌థ‌కాలన్నీ నిర్ల‌క్ష్యం చేసి కేవ‌లం రాజ‌కీయ లబ్ధి, స్వార్ధం కోసమే పాలన సాగిస్తోంది.  దీంతో రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడింది. ప్రజలు కష్టాల పాలవుతున్నారు.   ప్ర‌జ‌లు కేవ‌లం మూడేళ్ల కాలంలోనే వైసీపీ కుతంత్రాల‌ను తెలుసుకున్నారు. రాజ‌ధాని నిర్మాణ ప్రాజెక్టును ఎంత‌గా భ్ర‌ష్టుప‌ట్టిస్తున్న‌దీ గ్ర‌హించారు. దీంతో ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా భ్రష్టుపట్టిందో వారికి గ్రహింపునకు వచ్చింది. మళ్లీ చంద్రబాబు దార్శనికతే రాష్ట్రాన్ని కాపాడుతుందన్న భావనకు వచ్చారు. అందుకే గడప గడపకూ తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ గడప గడపలోనూ నిలదీస్తున్నారు. అంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం పాల‌నా తీరు, జగన్ పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హార‌శైలీ అన్నిటికీ జనం తిర‌స్కారాన్ని బ‌హుమ‌తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల స్వయంగా జగన్ చేయించుకున్న సర్వే పలితాలే తేటతెల్లం చేశాయి.   ఉందిలే మంచీకాలం ముందు ముందునా.. అంద‌రూ సుఖ‌ప‌డాలి.. అంటూ  ఆంధ్రా ప్ర‌జ‌లు పాడుకుం టూన్నారు.

 థ‌రూర్‌కి  నో అంటున్న తెలంగాణా కాంగ్రెస్ 

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ బ‌రిలో మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ నిలిచారు. అయితే అధిక శాతం కాం గ్రెస్ వాదులు ఖ‌ర్గే రావాల‌ని కోరుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కులు, అభిమానులు కూడా ఖ‌ర్గే వైపే మొగ్గు చూపుతున్నారు. శ‌శిథ‌రూర్ ఇక్క‌డికి ప్రచారం కోసం వ‌చ్చిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ రేవంత్ రెడ్డి ఆ స‌మావేశానికి డుమ్మా కొట్ట‌డ‌మే తెలంగాణా కాంగ్రెస్ నాయ‌కుల అభిప్రాయం బ‌య‌ట ప‌డింది.  అయితే పార్టీ ప‌ద‌వి ఏక‌గ్రీవం చేయ‌డం ఇష్టంలేక‌నే ఆయ‌న స్వ‌తంత్రంగా రంగంలోకి దిగి పోటీ  త‌ప్ప‌నిస‌రి చేశారు. మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప‌ట్ల పార్టీకి  ఉన్న న‌మ్మ‌కం ఆయ‌న్ను అభ్య‌ర్ధిని చేసింది.  అయితే ప్ర‌స్తుతం పార్టీ ప‌ద‌వి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇద్ద‌రూ త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో ప్ర‌చారం చేసుకోను  వీలు క‌ల్పించారు. క‌నుక ఖ‌ర్గేను పార్టీ ప్ర‌తినిధిగానే చూడ‌న‌క్క‌ర్లేద‌ని  కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న‌ది.  కాగా, థరూర్ మాత్రం త‌మ మ‌ధ్య విభేదాలు వ‌దిలేసి అంద‌రం ఒక్క‌టిగా బీజేపీని ఎదుర్కొవ‌ల‌సిన అవ‌స రం ఉంద‌ని అన్నారు. దీన్ని ఖ‌ర్గే కూడా స‌మ‌ర్ధించారు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను పార్టీ ప‌ద‌వికి పోటీ ప‌డుతు న్న అభ్యర్ధిగా చూడ‌టం త‌ప్ప ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లో త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.  మ‌రో వంక కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఖ‌ర్గేను పార్టీ ప‌ద‌వికి పోటీచేస్తున్న అభ్య‌ర్ధిగానే చూడాల‌ని, అంతే  త‌ప్ప సోనియా ఆస‌క్తి చూపుతోంద‌ని ఆయ‌న కోసం ప్ర‌త్యేకించి ప్ర‌చారాలు చేయ‌డాలు, ఓటింగ్ కోసం కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి చేయ‌డం వంటివి చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఏఐసిసి ప్ర‌త్యేకంగా  అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకుల‌ను హెచ్చ‌రించింది.  ఏమైన‌ప్ప‌టికీ, బీజేపీ పాల‌నా విధానాల‌ను, ప్ర‌త్యేకించి రైతాంగానికి విరుద్దంగా చేప‌ట్టిన చ‌ట్టాల‌ను వ్య‌తి రేకించి రైతంగానికి న్యాయం జ‌రిగేట్టు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని భార‌త్ జోడో యాత్ర సాగాల‌ని  కాంగ్రెస్ నేత  జైరామ ర‌మేష్ అన్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ చేప‌ట్టిన యాత్ర చివ‌రి ద‌శ‌లో సోనియా గాంధీ, ఖ‌ర్గే కూడా పాల్గొనే అవ‌కాశం ఉంది. రైతాంగానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ఖ‌ర్గే రాహుల్‌కు మ‌ద్ద‌తునీయాల‌ని ర‌మేస్ ఆకాంక్షించారు. 

కేటీఆర్’కు పట్టాభిషేకం.. హరీష్ రావుకు..?

ఇప్పటి కిప్పుడు కాకపోయినా,మరో రెండు మూడు నెలల్లో, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మునిగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, విజయ దశమి ‘జాతీయ’ ప్రకటన తర్వాత కేసీఆర్, రాష్ట్రంలో కంటే ఢిల్లీలో, కాదంటే ఇతర రాష్ట్రాల పర్యటనలలోనే ఎక్కువగా ఉంటారనే సంకేతాలు స్పష్ట మవుతున్నాయి. అందు కోసమే ఆయన ప్రత్యేకంగా ‘ఛార్టర్డ్ ఫ్లైట్’ ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా అధికార పార్టీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా తెరాస నాయకులలో చర్చ మొదలై నట్లు తెలుస్తోంది.  నిజానికి ముఖ్యంత్రి కేసీఆర్, గాంధీ జయంతి రోజు ప్రగతి భవన్లో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల సమావేంలోనే, ఈ మేరకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు, ఇతర రాష్ట్రాలలో కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని ముఖ్యమంత్రి సూచించినట్లు వార్త లొచ్చాయి. ఈ నేపద్యంలో, కొందరు ‘ముఖ్య’ నేతలను ఇక్కడి బాధ్యతల నుంఛి తప్పించి, జాతీయ బాధ్యతలు అప్పగిస్తారా? లేక  ఇక్కడి బాధ్యతలు అలాగే ఉంచి, అదనపు బాధ్యతలుగా ఇతర రాష్ట్రాల బాధ్యతలను అప్పగిస్తారా అనే చర్చ పార్టీలోనే కాకుండా,  రాజీకీయ, మీడియా వర్గాల్లోనో  జరుగుతోంది. ఇందుకు సంబదించి పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థ తాత్పర్యాలు, నానార్దాలు చాలానే ఉంటాయని అన్నారు. అలాగే, ఇప్పడు, ముఖ్యమంత్రి పార్టీ నేతలు జాతీయ బాధ్యతలకు సిద్ధం కావాలని సంకేత మాత్రంగా చేసిన వ్యాఖ్యల వెనక ప్రత్యేక అర్థం ఏమైనా ఉందా, అంటే, ఉందనే అంటున్నారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి మాటల్లో అలాంటి అర్థాలు ఉన్నా, లేకున్నా నిజంగా సీరియస్’గా జాతీయ రాజకీయాల్లో ముందుకు పోవాలంటే, అదొక్క కేసీఆర్ వల్లనో మరొకరి వల్లనో అయ్యే పనికాదు. ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది చాలా త్యాగాలు చేయవలసి ఉంటుందని, ముఖ్యంగా తెరాస పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి, ఇంకా పార్టీలో మిగిలున్న హరీష్ రావు వంటి ముఖ్య నేతలు త్యాగాలకు సైతం సిద్దం కావాల్సి ఉంటుందని అంటున్నారు.  ఇప్పటికే ఢిల్లీ రాజకీయలలో సంబంధాలున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత మాజీ ఎంపీలతో పాటుగా సంస్థాగత నిర్మాణంలో,. సంస్థాగత వ్యవహారాలనుచక్క పెట్డంలో గట్టి పట్టున్న ట్రబుల్ షూటర్’ హరీష్ రావు  వంటి వారి అవసరం జాతీయ పార్టీకి ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్’కు అన్ని విధాలనమ్మిన బంటుగా ఉండే మేనల్లుడు హరీష్ రావుకు స్థాన చలనం ఉండే అవకాశాన్ని కొట్టి వేయలేమని అంటున్నారు.  అదొకటి అలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్, జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆటోమేటిక్’గా ప్రస్తుతం సెకండ్ ఇన్ కమాండ్’ గా ఉన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, కే.తారక రామ రావు, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే, ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలో బిజీ అయిన తర్వాత, అవసరాన్ని బట్టి, ముఖ్యమంత్రి పదవి కూడా కేటీఆర్ కు  అప్పగించే అవకాశాలను కాదనలేమని అంటున్నారు. అదే జరిగితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే, ప్రశ్న రాకుండా, ముందుకుసాగి పోయే అవకాశం ఉంటుందని, అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిని మాత్రం అంత తేలిగ్గా అదీ కుమారుడు కేటీఆర్’కే అయినా ఇవ్వరని వదులుకోరని అంటున్నారు.  నిజానికి, 2018లో తెరాస రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ పట్టాభిషేకం గురించి మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, ఒకటి రెండు సందర్భాలలో ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయి. అయినా  అదేమీ జరగలేదు. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు కేసీఆర్ మానసికంగా సిద్ధమయ్యారని, రాజకీయ సమీకరణాలను సరి చూసుకుని కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, జాతీయ రాజకీయ వ్యుహలకు సమాంతరంగా వ్యూహ రచన సాగుతోందని అంటున్నారు. అందులో భాగంగా కూడా కొందరు ‘ముఖ్య’ నేతలకు జాతీయ బాధ్యలు అప్పగించి, పక్కకు తప్పించవచ్చని అంటున్నారు.అదే నిజమైతే, అధికార మార్పిడి, అంత సులభంగా జరిగిపోతుందా, లేక ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో  ప్రస్తావించిన విధంగా తెలంగాణ షిండే తెర మీదకు వస్తారా, సంక్షోభం తలెత్తుతుందా,అనే కోణంలోనూ చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీ కోసం రెండు టీవీ చానెళ్లు!

కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని ఆయన చేతలు చెప్పకనే చెబుతున్నాయి. థర్డ్ ఫ్రంట్, ప్రత్యామ్నాయ కూటమి, కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి.. ఆ తరువాత కాంగ్రెస్ ను కలుపుకునైనా సరే బీజేపీయేతర కూటమి ఇలా గత కొంత కాలంగా అన్ని రకాలుగానూ కసరత్తు చేసిన కేసీఆర్ అవేవీ కలిసి రాకపోయేసరికి ఏకంగా తానే ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు ముహూర్తం ఖరారైపోయిన తరువాత ఆ పార్టీ గురించి ఆయన చేస్తున్న, చేసిన కసరత్తులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.వాటిలో ప్రధానమైనది తన జాతీయ రాజకీయ పార్టీకీ, జాతీయ రాజకీయాలలో తన ప్రవేశానికి పెద్ద ఎత్తున ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా రెండు చానెళ్లు ప్రారంబించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆ చానెళ్లు పని చేస్తాయంటున్నారు. వాటిలో ఒకటి హిందీ చానెల్ కాగా, మరొకటి ఇంగ్లీష్ చానల్. కేవలం ప్రాంతీయ మీడియాను నమ్ముకుంటే.. తనకూ, తన పార్టీకి జాతీయ స్థాయిలో మైలేజీ ఉండదని బావించిన కేసీఆర్ తానే స్వయంగా చానల్ ప్రారంభించాలనీ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఈ రెండు చానెళ్లూ తన జాతీయ రాజకీయాలను విస్తృతంగా ప్రచారం చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు పని చేస్తాయని ఆయన చెబుతున్నారు. వీటిని పార్టీ ఆవిర్బావాన్ని ప్రకటించే దసరా రోజునుంచే ప్రారంభించే అవకాశాలున్నాయని తెరాస వర్గాలు చెబుతున్నాయి. అయితే అదెంత వరకూ నిజమన్నది నిర్ధారణ కావలసి ఉంది. ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో హిందీ, ఇంగ్లీషు బాషల్లో టీవీ చానెళ్లు ప్రారంభించనున్నట్లు కేసీఆర్ స్వయంగా ధృవీకరించలేదు. ఇప్పటికే ప్రకటనల రూపంలో జాతీయ మీడియాలోనే కాకుండా, అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ మీడియాలోనూ పెద్ద ఎత్తున తెలంగాణ ‘మోడల్’ అభివృద్ధి అంటూ ప్రచారం చేయించుకున్న కేసీఆర్, ఇప్పుడు సొంతంగా తన కొత్త జాతీయ రాజకీయ పార్టీ కోసం భారీ ఎత్తున రెండు చానెళ్లను ప్రారంభించడం అంటే.. పక్కా వ్యూహంతో, పకడ్బందీ ప్రణాళికతో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నారనే అర్ధమౌతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఉద్యమ వార్తల ప్రచారానికి ఆయన నమస్తే తెలంగాణ పత్రికను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రచారం ద్వారానే ప్రజలలోకి వేగంగా వెళ్లగలమని కేసీఆర్ మొదటి నుంచీ విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన తన కొత్త పార్టీని వేగంగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకే మన దేశం, మన చానెల్ అన్నట్లుగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో రెండు చానెళ్లను ప్రారంభించేందుకు అన్ని సన్నాహాలూ పూర్తి చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ జాతీయ చానెళ్ల ద్వారా కేసీఆర్ జాతీయ అజెండా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు, దేశానికే ‘మోడల్’ అన్న గుర్తింపు పొందేలా అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఈ చానళ్ల సహకారంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాలలో తన జాతీయ పార్టీకి మద్దతు దారులను పెంచుకోవడం, ప్రతి రాష్ట్రం నుంచీ తన పార్టీ రంగంలోకి దిగేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.  

ఆర్ ఎస్ ఎస్ కామెంట్ కేంద్రంపై ఎక్కుపెట్టిన‌దేనా?

ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి పేదరికం, నిరుద్యోగం, అసమానతలపై ఎర్ర జెండాలు వేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. సామాజిక సవాళ్ల గురించి సంఘ్ ఎప్పుడూ ఆలో చిస్తుంద‌ని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు.  స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) కార్యక్రమంలో భారత దేశ పేదరికం, నిరుద్యోగం అసమానతలను ఎత్తిచూపుతూ ఆర్ ఎస్ ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి, అవి  బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వా న్ని లక్ష్యంగా చేసుకున్నాయి.  బిజెపి అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, హోసబాలే చెప్పినదానిపై పార్టీకి ప్రత్యేక వైఖరి లేదని, అయితే సాధారణమైన కొన్ని సవాళ్లను ఆయన నొక్కిచెప్పారని, కాంగ్రెస్‌కు చెందిన కొం దరు నాయకులు - ఇది ఎదుగుదలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.  భారత్ జోడోయాత్ర  ప్రభావాన్ని చూడండి. దేశాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజంలో విషాన్ని వ్యాపింపజేసే వారు నేడు తమ పరిధిని పెంచుకోవడానికి పేదరికం, నిరుద్యోగం అసమానతలను లేవనెత్తు తున్నారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ హిందీలో  ట్వీట్ చేశారు. బీజేపీ సైద్ధాంతిక గురువు, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత చేసిన ప్రకటన ప్రాముఖ్యతపై రాజకీయ నిపుణు లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సహచరుడు, రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ దీనిని బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శగా పరిగణించడం లేదు. ఆర్‌ఎస్‌ఎస్ తరచుగా బీజేపీకి మనస్సాక్షిగా వ్యవహరిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో కూడా, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు భారతీయ కిసాన్ సంఘ్ మరియు భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిమాండ్ లు, నిరసనలు చేసేవ‌ని ఆయన అన్నారు. కానీ, మరొక రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ "హోసబాలే చెప్పినది చాలా స్పష్టంగా ఉంది, అయితే ఆర్ ఎస్ ఎస్‌ లేదా బీజేపీ నాయ కులలో ఒక వర్గం విభేదిస్తున్నారా అనేది బహిరంగ ప్రశ్న అని అన్నారు. ఎస్జెఎం వెబ్‌నార్‌లో, హోసబాలే పేదరికాన్ని వధించవలసిన రాక్షసుడితో పోల్చా డు. ఇక్కడ నివసిస్తున్న 20 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. దాదాపు 23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.375 ఆదాయం పొందుతున్నారు. నిరుద్యోగిత రేటు కూడా 7.6 శాతం వద్ద చాలా బాధ కలిగిస్తోంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం ఉంది, అయితే పెరుగుతున్న అసమానతలను కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలోని మొదటి  ఆరు ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం  ఒకదానిలో ఒకటిగా ఉన్నప్పటికీ,  అంతా బాగానే ఉందని మేము చెప్పలేము. భారతదేశంలోని జనాభాలో ఒక శాతం మంది  దేశ సంపదలో 20 శాతం కలిగి ఉండగా, 50 శాతం మంది వద్ద 13 శాతం సంపద ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఈ ఆర్థిక అసమానత గురించి మనం ఏదైనా చేయాలి. జనవరిలో, సంఘ్-అనుబంధ ఎస్ జె ఎం, ఏడు ఇతర మితవాద సంస్థలతో కలిసి, స్వావలంబి భారత్ అభియాన్ (ఎస్ బి ఏ) ను ప్రారంభించింది, ఇది 2030 నాటికి  దేశాన్ని నిరుద్యోగ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం నాటి కార్యక్రమం, 'స్వావలంబన్ కా శంఖనాద్స‌, ఎస్ బి ఏ బ్యానర్‌లో నిర్వహించబడుతున్న ఈవెంట్‌ల శ్రేణిలో భాగం. పేదరికం, అసమానత, నిరుద్యోగంపై హోసబాలే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అగర్వాల్  ఈ సవాళ్లను ప్రధానమంత్రి స్వయంగా ప్రసంగాలలో లేవనెత్తారని అన్నారు. ఒక సామాజిక సంస్థగా, ఆర్ ఎస్ ఎస్‌ తన స్వంత ప్రత్యేక చొరవను కలిగి  ఉంది, ఈ సమయంలో వ్యాఖ్య లు చేసింది, ఎప్పుడూ సామాజిక సవాళ్ల గురించి ఆలోచిస్తుంది. అయితే ఇది ఆర్‌ఎస్ఎస్ చేసిన విమర్శ లేదా స్థానం మార్పు కాదని ఆర్థిక వ్యవహారాల బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్  కార్యకర్త కూడా  అయిన  హోసబాలే ప్రసంగాన్ని పౌరుల భాగస్వామ్యం  ద్వారా పేదరికాన్ని మరింత ఎలా తగ్గించవచ్చనే నేపథ్యంలో చూడాలని అన్నారు, ఎందుకంటే ప్రభుత్వం మాత్రమే ప్రతిదీ చేయ గలదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.  ప్రభుత్వ పథకాలు  ఎంత  బాగా పని చేస్తున్నాయో ఉదాహరణలను అందించారు, అయితే, పరిమిత సమయంలో పేదరికాన్ని తగ్గించలేము. మరింత స్వావలంబన అవసరం మరియు స్వావలంబి భారత్ అభియాన్  ఆ  దిశలో ఎలా ముందుకు వెళ్లా లనే  దానిపై  దృష్టి పెడుతుంది. ప్రతిపక్షం పనికిమాలిన వివాదాన్ని సృష్టిస్తోందని  సంఘ్ కార్యకర్త పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ తరచుగా స్వయం-విశ్వాసాన్ని సమర్ధిస్తారు, ఇది మరింత ఉపాధి కల్పనకు దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్‌లో, రాబోయే 25 సంవత్సరాల వరకు ప్రజలు స్థానిక వస్తువులను ఉపయో గిస్తే, దేశం నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సమయంలో దేశం స్తబ్దు గా ఉండలేదు, తప్పనిసరిగా ఆత్మనిర్భర్ (స్వయం-ఆధారపడాలి) అని  నొక్కి చెప్పాడు. పేదరికం, అసమానతలపై ఆందోళనలు లేవనెత్తినప్పటికీ మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమా లను హోసబాలే ప్రశంసించారని వర్మ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, అతను నిరుద్యోగం వెనుక ఉన్న కారణాలలో ఒకటిగా పేద స్థాయి విద్యను సూచించాడు మరియు దానిని పరిష్కరించడానికి జాతీ య విద్యా విధానం ప్రవేశపెట్టబడింది. ఆ కోణంలో చూస్తే ఆయన వ్యాఖ్యలను ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలుగా చూడకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.